-
‘సితారా.. సింగర్గా ట్రై చేయ్’
కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు రద్దవ్వడంతో మన సెలబ్రెటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే అనూహ్యంగా దొరికిన లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. ఇక కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సూపర్స్టార్ మహేశ్ బాబు తన పిల్లలు సితార, గౌతమ్లతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో మహేశ్ చేస్తున్న అల్లరికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక చాలా ఆక్టీవ్గా ఉండే సితార గతంలో ‘భరత్ అనే నేను’ సినిమాలోని అరరే ఇది కలలా ఉన్నదే అనే సాంగ్ను ఆలపించింది. చాలా ఎనర్జటిక్గా పాడిన ఈ పాట నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. సితార పాడిన పాటకు సంబంధించిన పాత వీడియోను నమ్రత తాజాగా తన ఇన్స్టాలో తిరిగి పోస్ట్ చేస్తూ ‘నాన్న కూతురు’ అనే కామెంట్ను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని గంటల వ్యవధిల్లోనే లక్షకు పైగా వ్యూస్ రాగా వేలల్లో లైక్స్ వచ్చాయి. ‘సింగర్గా ట్రై చేయ్ లిటిల్ ప్రిన్స్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram Daddy’s girl !! #MemoryTherapy❤️ One for each day💕💕💕 @sitaraghattamaneni A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 7, 2020 at 7:42am PDT చదవండి: మార్పుని అలవాటు చేసుకోవాల్సిందే భారతీయుడు ఆగలేదు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మహేష్ పుట్టిన రోజున పక్కా..!
భరత్ అనే నేను సినిమాతో సూపర్హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల డెహ్రాడూన్లో కాలేజ్ ఎపిసోడ్కు సంబంధించిన చిత్రకరణ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. బర్త్డే కానుకగా ఫస్ట్లుక్ రిలీజ్ చేయటం పక్కా అని తెలుస్తోంది. మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను 2019 ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘భరత్ అనే నేను’ రాజకీయ నేతలకు కనువిప్పు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘భరత్ అనే నేను’కమర్షియల్, సందేశాత్మక చిత్రమని, రాజకీయ నేతలకు ఈ చిత్రం కనువిప్పు కలిగించిందని సూపర్స్టార్ కృష్ణ, మహేష్బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత, వైఎస్సార్ సీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు (బంగారయ్య) అన్నారు. అశోక థియేటర్ ఆవరణలో శనివారం రాత్రి రాజమహేంద్రవరం నగర సూపర్స్టార్ కృష్ణ, మహేష్బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చిత్రం శత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గీతం ఫిలిమ్స్ శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ భరత్ అనే నేను చిత్రానికి మహేష్బాబు, దర్శకుడు కొరటాల శివ పిల్లర్లుగా, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అభిమానులను మూలస్తంభాలు అభివర్ణించారు. అభిమానులందరికీ అన్నయ్య కృష్ణ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పమన్నారని తెలిపారు. చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో శత దినోత్సవాలు ఉన్నప్పటికీ ఇక్కడికే వచ్చానని తెలిపారు. మరిన్ని సందేశాత్మక, సామాజికపరమైన సినిమాల్లో మహేష్బాబు నటిస్తారని తెలిపారు. ఏపీఐసీసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ చిత్రం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంచలనం అయిందన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ ఇష్ణా ఎంటర్టైన్మెంట్స్ అధినేత భరత్ చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటించిన ‘అంతరికరణ శుద్ధి’ సుబ్బారావు మాట్లాడుతూ కోనసీమలో పుట్టి, నగరంలో చదువుకుని, వృత్తి రీత్యా హైదరాబాద్లో ఉంటున్న రాజశేఖర్ అనే నేను.. శుభోదయం సుబ్బారావు అంటూ అభిమానులను అలరించారు. అనంతరం శేషగిరిరావు కేక్ను కట్ చేసి, డిస్ట్రిబ్యూటర్స్కు, ఎగ్జిబిటర్స్కు మెమెంటోలను అందజేశారు. వికలాంగులకు వీల్చైర్లు అందజేశారు. జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అనుశ్రీ సత్యనారాయణ, వానపల్లి గౌరీశంకర్, సురేష్ మూవీస్ రమేష్, మణికంఠ ఫిలిమ్స్ సత్తిబాబు, బుచ్చిరాజు, అశోక థియేటర్ అధినేత రాజబాబు, మేనేజర్ గెడ్డం శ్రీను, రౌతు రవీంద్ర, ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, మహేష్బాబు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పండగ చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్
టాలీవుడ్లో ప్రస్తుతం ఓ చిత్రం వందరోజులు ఆడటం గగనంగా మారిపోయింది. ఈ దశలో మొన్నీమధ్యే రామ్ చరణ్ ‘రంగస్థలం’ విజయవంతంగా 100 డేస్ పూర్తి చేసుకోగా.. ఇప్పుడు భరత్ అనే నేను కూడా ఆ ఫీట్ను సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నేటితో వంద రోజులు పూర్తి చేసేసుకుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నేడు చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్ల వద్ద సందడి నెలకొంది. డైరెక్టర్ కొరటాల శివ గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే ఈ పొలిటికల్ డ్రామాను బ్లాక్బస్టర్గా నిలబెట్టింది. సీఎం రోల్లో మహేష్ బాబు నటన, ప్రధాన పాత్రల నటన, దేవీ మ్యూజిక్ ఇలా అన్ని అంశాలు చిత్రానికి కలిసొచ్చాయి. రికార్డు స్థాయిలో చిత్రం కలెక్షన్లు రాబట్టింది కూడా. భరత్ అనే నేను 100 డేస్ పూర్తి చేసుకోవటం, 25వ చిత్రం కోసం మహేష్ లుక్ ఛేంజ్, మేడమ్ టుస్సాడ్లో మహేష్ విగ్రహం ఏర్పాటు, ...ఇలా అన్ని ఒకదాని వెంట ఒకటి జరిగిపోతుండటంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. 100 days since Bharat has arrived as the C.M. Thank you Superstar @urstrulymahesh garu, director @SivaKoratala garu and the entire cast&crew for giving a blockbuster #BharatAneNenu. Thanks to our dearest fans for all the love that you have shown to the film. #BharatAneNenu100Days pic.twitter.com/tJHbyQ4pQk — DVV Entertainment (@DVVEnts) 27 July 2018 -
ఇదేం సినిమా కథ కాదు...
సినిమాల ప్రభావంతో యువత పడుతున్న దారుల గురించి విరివిరిగా చర్చలు జరుగుతున్న సమయంలో.. ఓ ఎన్నారై యువకుడి ప్రయత్నం తెరపైకి వచ్చింది. విద్యాదానానికి మించింది లేదని బలంగా నమ్మిన ఆ 20 ఏళ్ల యువకుడు ఓ సినిమా ప్రేరణతో చేసిన ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నమే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. సృజన్ నేపథ్యం.. అమెరికాలోని మేరీల్యాండ్, జర్మన్టౌన్లో తెలుగు దంపతులకు సృజన్ కోనేరు జన్మించాడు. ప్రస్తుతం పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఐఎస్(మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) కోర్సు అభ్యసిస్తున్నాడు. తల్లి ఏడాదిన్నర క్రితం పాంక్రియాటిక్ కేన్సర్తో కన్నుమూశారు. మాతృదేశంలోని విద్యా వ్యవస్థలో మార్పులు రావాలన్నది ఆమె కోరిక. దానిని నెరవేర్చేందుకు ఈ ఎన్నారై యువకుడు కదిలాడు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ సాయం తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషికి తన ఆలోచనను వివరించాడు. ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించటం, సోషల్ రెస్పాన్స్బిలిటీస్(సామాజికి బాధ్యత)పై అవగాహన కల్పిస్తానని, అందుకు అనుమతించాలని కోరాడు. అతని ఆలోచన నచ్చిన సీఎస్ జోషి కూడా అందుకు అనుమతిచ్చారు. తన ప్రయత్నానికి వేదికగా శంషాబాద్ దగ్గర్లోని సిద్ధాపురం గ్రామం.. జిల్లా పరిషత్ హైస్కూల్ను సృజన్ ఎంచుకున్నాడు. ‘రెగ్యులర్ తరగతులకు ఏ మాత్రం భంగం కలగకుండా నా ప్రయత్నాన్ని మొదలుపెట్టా. మొదట్లో నేను ఆంగ్లం మాట్లాడుతుంటే విద్యార్థులు సిగ్గుపడేవారు. వాళ్ల నేపథ్యం.. పరిస్థితులు నాకు అర్థమయ్యాయి. అప్పటి నుంచి వారిలో తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాక.. క్రమంగా నాకు దగ్గర అవ్వటం ప్రారంభించారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపటమే ముఖ్యమని భావించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టా. క్రమక్రమంగా వాళ్లు ఆంగ్లంలో మాట్లాడటం మొదలుపెట్టారు. చాలా సంతోషంగా ఉంది’ అని సృజన్ చెబుతున్నాడు. ఈ ఎన్నారై అందరిలా కాదు... ‘20 ఏళ్ల యువకుడు. టీచింగ్లో ఎలాంటి అనుభవం లేని వ్యక్తి. పైగా ఎన్నారై. అయినా సొంత గడ్డపై మమకారంతో చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందించదగ్గ విషయం. విద్యార్థులు అతని పాఠాల కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మణివర్థన్ రెడ్డి సృజన్పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం వారాంతం నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తున్న సృజన్.. ఈ నెలాఖరులో ఈ ‘ఎంపవర్మెంట్ బియాండ్ ఎడ్యుకేషన్’ ప్రాజెక్టు పూర్తి రిపోర్టును అందించేందుకు సిద్ధమవుతున్నాడు. తన ఈ ప్రయత్నం ద్వారా మరికొందరు ఎన్నారైల్లో కదలిక తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని, తద్వారా మాతృభూమికి ఎంతో కొంత మేలు జరగుతుందని సృజన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మహేష్ అభిమాని... అన్నట్లు సృజన్ సూపర్స్టార్ మహేష్ బాబుకు అభిమాని అంట. అంతేకాదు భరత్ అనే నేను చిత్రంలోని కాన్సెప్ట్(ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం)తోనే ప్రేరణ పొంది తాను ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టానని సృజన్ చెబుతున్నాడు కూడా. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇదే సిద్దాపురం గ్రామాన్ని గతంలో మహేష్ దత్తత తీసుకున్నారు కూడా.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement