వచ్చాడయ్యో.. సామి! | Sakshi
Sakshi News home page

వచ్చాడయ్యో.. సామి!

Published Thu, Feb 1 2018 12:19 AM

Pooja Hegde to join hands with director Vamsi Paidipalli - Sakshi

ఇతరులకు మంచి చేయాలనుకుంటే దేవుడే దిగి రావక్కర్లేదు. మంచి మనసు ఉంటే చాలు. ఆలాంటోడు సీయం పవర్‌తో ప్రజలను పాలిస్తే రాష్ట్రం బాగుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భరత్‌ అనే నేను’లో హీరో మహేశ్‌బాబు ఇలాంటి పాత్రే చేస్తున్నారు. శ్రీమతి డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. సీయం భరత్‌ పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నారు.

ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలోని ‘వచ్చాడయ్యో సామి’ అనే సాంగ్‌ను రికార్డ్‌ చేశారు చిత్రబృందం. ఈ పాటను కైలాష్‌ ఖేర్‌ పాడారు. ఈ సంగతలా ఉంచితే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న సినిమాలో పూజా హెగ్డేను కథానాయికగా తీసుకున్నారు. ‘‘మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు పూజా.

Advertisement
Advertisement