‘సీఎం భరత్’కు కేటీఆర్ ఫిదా
‘భరత్ అనే నేను’ సినిమా చూసిన తెలంగాణ ఐటీ మంత్రి
సాక్షి, హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో పొలిటికల్ నేపథ్యంతో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా మహేష్ అదరగొట్టారు. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో దీనిపై రాజకీయ నాయకుల్లో సైతం ఆసక్తి రేపుతోంది. ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ సినిమా చూడాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ‘భరత్ అనే నేను’ సినిమాను తిలకించారు. మహేష్, కొరటాల శివతో కలిసి ఈ సినిమాను చూసిన కేటీఆర్.. సీఎం భరత్కు ఫిదా అయిపోయాడు. సినిమా చాలా బాగుందని కితాబిచ్చారు. స్నేహితుడు మహేష్తో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేశానని ట్విటర్లో తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సెషన్లో మహేశ్బాబు, ఇతర యూనిట్తో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు.
మంత్రి కేటీఆర్కు సూపర్ స్టార్ మహేష్ బాబుతోపాటు చిత్రయూనిట్ ధన్యవాదాలు తెలిపింది. విలువైన సమయాన్ని కేటాయించి, 'భరత్ అనే నేను' సినిమాను చూసినందుకు, తమ చిత్రాన్ని ప్రశంసించినందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Some more pics from the interactive session with @urstrulyMahesh and @sivakoratala pic.twitter.com/ccOaJXiluH
— KTR (@KTRTRS) April 25, 2018
You guys are in for a surprise!
Did an interactive session with good friend @urstrulyMahesh and director @sivakoratala on being in public life and the movie ‘Bharat Ane Nenu’ a movie which I personally enjoyed 👍 pic.twitter.com/lF4XqnT7ve
— KTR (@KTRTRS) April 25, 2018