జోడి కుదిరింది

Mahesh Babu Pooja Hegde - Sakshi

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్‌ అనే నేను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్‌ బాబు తరువాత వంశీ పైడిపల్లి దర్శకత‍్వంలో తన సిల్వర్‌ జూబ్లీ సినిమాను చేయనున్నాడు. ప్రముఖ నిర్మాతలు అశ్వనిదత్‌, దిల్‌ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయ్యింది.

మహేష్ బాబు నెక్ట్స్‌ సినిమాలో తాను హీరోయిన్‌గా నటించబోతున్నట్టుగా పూజా హెగ్డే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. మహేష్ బాబు, వంశీ పైడిపల్లిలతో కలిసి నటించనున్నందుకు ఆనందంగా ఉంది. అందరం కలిసి ఓ అందమైన సినిమా మీకందించేందుకు ఎదురుచూస్తున్నాం అంటూ ట్వీట్‌ చేశారు పూజ. పూజ హెగ్డే ట్వీట్‌పై స్పందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి తనతో కలిసి వర్క్‌ చేయటం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top