-
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా షాకిచ్చారు.ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతిస్తున్న‘సిఖ్స్ ఫర్ జస్టిస్’అనే సంస్థ నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ నిధులు స్వీకరించారనే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు గవర్నర్ సోమవారం(మే6) సిఫారసు చేశారు.ఆమ్ఆద్మీపార్టీకి సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి ఆప్కు 16 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయన్న ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ విచారణకు ఆదేశించినట్లు గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వరల్డ్ హిందూ ఫెడరేషన్ అశూ మోంగియా ఇచ్చినట్లు తెలిపారు. -
బెంగళూరు కేఫ్ టెర్రరిస్టులు ఎలా దొరికారంటే?
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడు గుర్తుంది కదా..! మార్చి 1, 2024న బెంగళూరు వైట్ఫీల్డ్లోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే ఉగ్రవాద ఘటనలకు చాలా రోజులుగా బ్రేక్ పడ్డ తర్వాత ఈ ఘటన జరగడం అందరినీ షాక్కు గురి చేసింది. ఈ కేసులో నిందితులు తాము చేసిన ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. పక్కాగా ప్లాన్ చేసి తప్పించుకున్నారు ముసావీర్ హుసేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహ.. ఇద్దరు ఉగ్రవాద శిక్షణలో ఆరితేరారు. పక్కాగా స్కెచ్ వేసి బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ను ఎంచుకున్నారు. ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలన్నది వీళ్ల కుట్ర. రెక్కీల తర్వాత మార్చి 1, శుక్రవారం రోజున తమ ప్లాన్ అమలు చేశారు. రామేశ్వరం కేఫ్లో బాంబు పేలగానే జారుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేశారు. సిసి టీవీ ఫుటేజ్ సేకరించిన NIA.. నిందితుల జాడ చెప్పిన వారికి పది లక్షల బహుమానం ప్రకటించింది. అబ్బో.. ఎన్ని జాగ్రత్తలో.? బెంగళూరు నుంచి బయటపడ్డ నిందితులిద్దరూ.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాంబు అమర్చిన హుస్సేన్ షాజీబీ (30), తెర వెనక మాస్టర్మైండ్ మథీన్ థాహ (30) తమ ఆహార్యాన్ని మార్చేశారు. పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సిమ్ కార్డులు మార్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. కొత్త పేర్లు చెప్పి లాడ్జ్లు తీసుకున్నారు. వీలైనంత వరకు తక్కువ ఖరీదు ఉండే మాస్ ఏరియాల్లో.. పోలీసు గస్తీ ఎక్కడయితే తక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు మాత్రమే ఎంచుకున్నారు. స్కాన్ చేసి చెల్లించే UPI పేమెంట్ ఎక్కడా చేయలేదు, కేవలం నగదు మాత్రమే చెల్లించి భోజనం, కావాల్సిన వస్తువులు కొన్నారు. ఓ జిరాక్స్ సెంటర్లో ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్లను సేకరించిన వీరిద్దరు.. వాటితో ఫేక్ ఐడెంటిటీ కార్డులను తయారు చేసి వాడారు. వీరికి ఎప్పటికప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు సమకూరేవని దర్యాప్తులో తేలింది. చిక్కరు.. దొరకరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్కు వచ్చిన నిందితులు అక్కడ ఒక హోటల్లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. ఒకసారి ఒక పని మీద వాడిన సిమ్ను వెంటనే మార్చేవారు. అలా 35 సిమ్కార్డులను చేతిలో ఉంచుకున్నారు. ఒక్కో పనికి ఒక్కో సిమ్ చొప్పున వాడడం పక్కనబెట్టడం. పని పూర్తి కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా ఈ సిమ్ కార్డులన్నీ నకిలీ అడ్రస్లు ఉపయోగించి సేకరించినవే. కొన్ని తమిళనాడు పేరుతో ఉన్నవయితే.. మరికొన్ని మహారాష్ట్ర, ఢిల్లీలోని ఫేక్ అడ్రస్లు, ఆధార్లతో సేకరించిన సిమ్ కార్డులు. ఈ సిమ్లను వినియోగించినా.. వీళ్ల ఆచూకీ NIA పసిగట్టలేకపోయింది. ఏ చిన్న ఆధారం దొరికినా.. తప్పుడు అడ్రస్ల కారణంగా దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. ఆడింది ఆట.. పాడింది పాట హోటల్లో రూం తీసుకునేటప్పుడు రిజిస్టర్లో తమ పేర్లు కాకుండా నకిలీ పేర్లు రాశారు. కొన్ని సార్లు పొరపాటున అసలు పేరు రాసి కొట్టివేసి నకిలీ పేర్లు రాశారు. పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వస్తున్నామని, చెన్నెకు వెళుతున్నామని.. ఇలా తోచిన కారణాలను హోటల్ సిబ్బందికి చెప్పారు. నకిలీ ఆధార్ కార్డులు చూపారు. స్థానికంగా వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తూ జల్సా చేశారు. కోల్కతాలో మూడు హోటల్స్లో ఎప్పటికప్పుడు మకాం మార్చారు. చిన్న కారణంతో చిక్కారు మకాం మార్చుతూ పశ్చిమబెంగాల్లోని చాంద్నీ అనే ప్రాంతానికి వచ్చిన వీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వీళ్లిద్దరిలో ఒకరు వాడుతున్న మొబైల్ కింద పడడంతో ఫోన్లో స్పీకర్ పాడయింది. దీన్ని రిపేర్ చేయించేందుకు.. ఫోన్లోని సిమ్ కార్డు తీసేసి.. దగ్గరలోని రిపేర్ షాప్ మైక్రోమాజిక్ ఇన్ఫోటెక్ అనే చిన్న మొబైల్ షాప్కు తీసుకెళ్లారు. ఫోన్ను పరిశీలించిన మొబైల్ షాపు మెకానిక్.. స్పీకర్ పని చేస్తుందా లేదా అని తెలియడానికి షాప్ కీపర్ తన దగ్గరున్న సిమ్ను ఫోన్లో వేసి రిపేర్ చేశాడు. అప్పటికే IMEA నంబర్పై నిఘా పెట్టిన NIA అధికారులు.. సిమ్ వేయగానే దాని ఆధారంగా అడ్రస్ కనిపెట్టారు. ఈ సారి మాత్రం పక్కాగా ఒరిజినల్ అడ్రస్ దొరికింది. మొబైల్ లొకేషన్ను సంపాదించిన అధికారులు.. కొన్ని గంటల్లోనే చాంద్నీ ప్రాంతానికి చేరుకున్నారు. షాప్ కీపర్ ఇచ్చిన విలువైన సమాచారంతో నిందితుల జాడ పట్టేశారు. వేర్వేరు హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, ఎన్ఐఏ బృందాలు సేకరించారు, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
‘ఎన్ఐఏ’పై దాడి.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
కలకత్తా: పశ్చిమబెంగాల్లో వేసవితో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచార వేడి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందంపై తూర్పు మిడ్నపూర్లో స్థానికులు దాడి చేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆదివారం(ఏప్రిల్ 7)న జల్పాయ్గురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఎన్ఏఐ బృందంపై దాడి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పనేనని ఆరోపించారు. తృణమూల్ నేతలకు రాజ్యాంగం, శాంతిభద్రతలు ఏవీ పట్టవని ఆరోపించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, స్వయానా సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఎన్ఐఏ ఉన్నతాధికారులను బీజేపీ నేతలు వెళ్లి కలిసిన తర్వాతే తమ పార్టీ నేతలకు బాంబు పేలుడు కేసులో నోటీసులు వచ్చాయని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. అవసరమైతే బీజేపీ నేతలు ఎన్ఐఏ పోలీసు అధికారులను కలిసిన వీడియో కూడా విడుదల చేస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల ముందు టీఎంసీ నేతలను అరెస్టు చేసేందుకు ఎన్ఐతో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎన్ఐఏ స్పందించింది. అభిషేక్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఇదీ చదవండి.. తిరువనంతపురం ఫైట్.. కేంద్రమంత్రిపై ఈసీకి ఫిర్యాదు -
ప్రచార హోరు.. ‘తృణమూల్’పై ప్రధాని మోదీ ఫైర్
కలకత్తా: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. తూర్పు మిడ్నపూర్లో ఎన్ఐఏ అధికారులపై టీఎంసీ కార్యకర్తల దాడిని ప్రధాని ఖండించారు. ఆదివారం జల్పాయ్గురిలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.‘వారి పార్టీ అవినీతి నేతలను స్వేచ్ఛగా వదిలేయాలని తృణమూల్ భావిస్తోంది. దర్యాప్తు సంస్థలు వస్తే వారిపైనే దాడి చేస్తారు. శాంతిభద్రతలను నాశనం చేయడానికి టీఎంసీ కంకణం కట్టుకుంది. వారికి రాజ్యాంగంతో పని లేదు’ అని విమర్శలు గుప్పించారు. తూర్పు మిడ్నపూర్లో ఎన్ఐఏ అధికారులపై దాడులు జరిగిన మరునాడే ప్రధాని స్పందించడం చర్చనీయంశమైంది.కాగా, ఇది ఎన్ఐఏ అధికారులపై జరిగిన దాడి కాదని వాళ్లు తూర్పు మిడ్నపూర్లోని భూపతినగర్ గ్రామ వాసులపై చేసిన దాడి అని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఇదీ చదవండి.. మరో పదేళ్లు హేమమాలినీనే ఎంపీ -
ఎన్ఐఏ అధికారులపై దాడి.. గవర్నర్ ఆగ్రహం
కోల్కతా : యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులపై జరిగిన దాడిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఖండించారు. ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలను బెదిరించే ఇటువంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని, వాటిని పరిష్కరించాలని బోస్ పేర్కొన్నారు. పరిస్థితులను ఎదుర్కోవడంలో వేగంగా, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఈ రకమైన ‘గూండాయిజం’ సరైంది కాదని పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2022లో బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు మరణించడంపై ఎన్ఐఏ అధికారులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా బాంబు పేలుడు ఘటనకు సంబంధం ఉన్న మిడ్నాపూర్ జిల్లా భూపతినగర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మోనోబ్రోటో జానా, అతని సహచరులను అదుపులోకి తీసుకున్నారు. తిరిగి వస్తున్న ఎన్ఐఏ అధికారులపై స్థానికులు దాడి చేశారు.అధికారుల వినియోగించిన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక అధికారి గాయపడ్డారు. Another example of lawlessness in West Bengal under Mamata Banerjee government A team of NIA officers, which went to Bhupatinagar in East Medinipur District of West Bengal, to arrest two TMC leaders, were targeted More than 100 villagers, not only stopped the NIA team from… pic.twitter.com/aJWWSEOsh2 — Organiser Weekly (@eOrganiser) April 6, 2024 -
kolkata: ‘ఎన్ఐఏ’ బృందంపై దాడి.. ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ మేదినీపూర్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులపై శుక్రవారం(ఏప్రిల్ 5) అర్ధరాత్రి స్థానికులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన ఘటనపై సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ‘అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పాపెట్టకుండా వస్తే ఏం చేయాలో మేదినిపూర్ భూపతినగర్ వాసులు కూడా అదే చేశారు. అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎన్ఐకు అనుమతి ఉందా. ఎన్ఐఏకు ఏం అధికారం ఉందని ఇలాంటివి చేస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలపై అందరూ కలిసి పోరాడాలి’ అని మమత పిలుపునిచ్చారు. కాగా,2022 బాంబు పేలుడు కేసు దర్యాప్తు నిమిత్తం భూపతినగర్ వెళ్లిన ఎన్ఐఏ పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగారు. బాంబు పేలుడు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కలకత్తా వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారమిచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. ఎన్ఐఏ పోలీసులపై దాడి అత్యంత దారుణ ఘటన అని బెంగాల్ బీజేపీ ఖండించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని బీజేపీ నేతలు ఆరోపించారు. బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును తృణమూల్ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ఇదీ చదవండి.. తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ -
khalistani Terrorists: నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) మంగళవారం విస్తృతంగా సోదాలు జరుపుతోంది. పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లోని 30 చోట్ల ఎన్ఐఏ పోలీసులు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్లోని మోగా జిల్లాలోని బిలాస్పూర్ గ్రామంలో, ఫర్దికోట్లోని ఓ వ్యాపార వేత్త ఇంట్లోనూ ఎన్ఐఏ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఖలిస్తానీ టెర్రరిస్తులు, లోకల్ మాఫియా మధ్య బలపడుతున్న నెట్వర్క్లను చేధించేందుకే విస్తృత సోదాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాల ద్వారా తెలిసింది. సోదాల ద్వారా టెర్రస్టులకు చెందిన నగదు సీజ్ చేయడం, వారి ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వాటిని అటాచ్ చేయడం వీలవుతుందని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి.. గ్యాంగ్స్టర్,లేడీ డాన్ల పెళ్లికి గ్యాంగ్వార్ ముప్పు -
Delhi: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు జరుపుతోంది. తమిళనాడు, కర్ణాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును సోమవారమే ఎన్ఐఏకు దర్యాప్తు నిమిత్తం అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్ఐఏ చేస్తున్న సోదాలు లష్కరే ఉగ్రవాది బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఖైదీలకు ఉగ్రవాద భావజాలం నూరిపోస్తున్న కేసులో జరుగుతున్నట్లు సమాచారం. పరప్పన జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నజీర్ ఉగ్రవాద బోధనలు చేస్తున్నట్లు 2023లో బెంగళూరులో పట్టుబడిన ఐదుగురు ఉగ్రవాదుల ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇదీ చదవండి.. మధ్యప్రదేశ్లో బీఎస్పీ నేత దారుణ హత్య -
హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గురువారం హైదరాబాద్లో వీక్షణం పత్రిక ఎడిటర్, వరవరరావు అల్లుడు ఎన్. వేణుగోపాల్తోపాటు రచయిత, పౌరహక్కుల నేత రవిశర్మ నివాసాల్లో సోదాలు జరిపారు. తెల్లవారుజామున 4 గంటలకే హిమాయత్నగర్లోని ఎన్. వేణుగోపాల్ ఇంటితోపాటు ఎల్బీ నగర్ శ్రీనివాసనగర్ కాలనీలోని రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు పుస్తకాలు, కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయానికి విచారణ కోసం హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఆ కేసు ఆధారంగా దర్యాప్తు... మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్రావును గతేడాది సెప్టెంబర్ 15న కూకట్పల్లి పీఎస్ పరిధిలోని మలేసియా టౌన్షిప్లో సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఏడాది జనవరి 3న ఎన్ఐఏ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంజయ్ దీపక్రావుతో ఎన్. వేణుగోపాల్, రవిశర్మకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల దృష్ట్యానే ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ కేసులో వేణుగోపాల్ను 22వ నిందితుడిగా పేర్కొన్న ఎన్ఐఏ... రవిశర్మతోపాటు కేరళకు చెందిన మరో ముగ్గురిని సైతం నిందితులుగా చేర్చింది. కబలి దళం పేరిట సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా గురువారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనూ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సోదాల్లో మావోయిస్టు సాహిత్యంతో పాటు ఆరు సెల్ఫోన్లు, రూ. 1,37,210 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘాల ఖండన వేణుగోపాల్, రవిశర్మ ఇళ్లపై ఎన్ఐఏ దాడులను పౌరహక్కుల సంఘాల నాయకులు ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టానుసారంగా దాడులు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేయగా అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు డిమాండ్ చేశారు. నిర్బంద వ్యతిరేక వేదిక తెలంగాణ సైతం ఈ అరెస్టులను ఖండించింది. విచారణకు హాజరవ్వాలన్నారు: రవిశర్మ మన్సూరాబాద్: రవిశర్మ మీడియాతో మాట్లాడుతూ 10న విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ అధికారులు ఆదేశించారని చెప్పారు. 2016లో జనజీవన స్రవంతిలో కలిసినప్పటి నుంచి తాను ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. 2019లో స్థానిక పోలీసులు, 2021లో ఎన్ఐఎ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని గుర్తుచేశారు. ఇది పూర్తిగా అబద్ధపు కేసు: ఎన్.వేణుగోపాల్ ఎన్ఐఏ అధికారులు తనపై నమోదు చేసినది పూర్తిగా అబద్ధపు కేసని వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఆరోపించారు. ‘నేను ఒక మాస పత్రిక నడుపుతున్నాను. నేను ప్రస్తుతం విరసంలో లేను’అని మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన పేర్కొన్నారు. 2013లో నయీం బెదిరింపు లేఖలపై తాను రాసిన పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. తన మొబైల్ ఫోన్ను సీజ్ చేశారని, ఈ నెల 10న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు ఇచ్చారని వేణుగోపాల్ పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలుచోట్ల (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 32 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హర్యానాలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితులు, బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన షార్ప్ షూటర్లు అంకిత్ సెర్సా, ప్రియవ్రత్ ఫౌజీల కుటుంబ సభ్యులను విచారించేందుకు సోనిపట్ జిల్లాకి ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. VIDEO | NIA conducts raids in connection with #SidhuMooseWala murder case in Sonipat, Haryana. pic.twitter.com/ofm93XDhnI — Press Trust of India (@PTI_News) January 11, 2024 ఇదీ చదవండి: అశ్లీల కంటెంట్... యూట్యూబ్కు సమన్లు -
Karni Sena Chief’s Killing Case: కర్ణిసేన చీఫ్ హత్య..మరో నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గొగామెడి హత్య కేసులో మరో ప్రధాన నిందితుడు అశోక్ కుమార్ను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది. తాజా అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ హత్యకు సంబంధించి రాజస్థాన్, హర్యానాల్లోని 31 ప్రదేశాల్లో బుధవారం జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. తాజాగా అరెస్టయిన నిందితుడు అశోక్కుమార్ కర్ణిసేన చీఫ్ హత్య తామే చేశామని క్లెయిమ్ చేసుకున్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోడారాకు సన్నిహితుడు. ‘కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం(జనవరి 3)న హర్యానా, రాజస్థాన్లోని 31 ప్రాంతాల్లో సోదాలు జరిపాం. వీటిలో నిందితులకు సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. సోదాల్లో భాగంగానే అశోక్ కుమార్ అనే నిందితుడిని రాజస్ధాన్లోని జున్జున్లో అరెస్టు చేశాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన జైపూర్లోని శ్యామ్నగర్లో ఉన్న ఆయన ఇంట్లోనే కర్ణిసేన చీఫ్ గొగామెడిని ముగ్గురు షూటర్లు కాల్చిచంపారు. పట్టపగలు జరిగిన ఈ హత్య సంచలనం రేపింది. హత్య తర్వాత రాజస్థాన్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇదీచదవండి..మహువా పిటిషన్..లోక్సభ సెక్రెటరీకి సుప్రీం నోటీసు -
దౌత్య కార్యాలయాలపై దాడులు.. 43 మందిని గుర్తించిన ఎన్ఐఏ
ఢిల్లీ: అమెరికా, యూకే, కెనడాలోని భారత రాయబార కార్యాలయాలపై ఇటీవల జరిగిన దాడుల్లో 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గుర్తించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాల మేరకు ఈ ఏడాది అమెరికా, యూకే, కెనడాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడుల కేసును జూన్లో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది మార్చి 19న లండన్లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ వర్గాలు రెండు వేర్వేరు దాడులకు పాల్పడ్డాయి. జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులు జరిగాయి. ఈ ఏడాది ఆగష్టులో శాన్ ఫ్రాన్సిస్కోను ఎన్ఐఏ బృందం సందర్శించింది. మార్చి 2023లో కెనడా, శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. ఈ కేసులో భారతదేశంలో ఇప్పటివరకు 50 చోట్ల దాడులు నిర్వహించామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దాడులకు సంబంధించి సుమారు 80 మందిని విచారించారని సమాచారం. ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్పీ అలర్ట్ -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు.. 2021నాటి పేలుళ్లతో లింక్
ఢిల్లీ: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటన 2021నాటి పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2021లో అదే ప్రదేశంలో ఐఈడీ పేలుళ్లకు ప్రస్తుత దాడికి పోలికలు ఉన్నాయని సమాచారం. పేలుడు ఘటనలో ఇద్దరు అనుమానితులను సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. నిందితులు ఇండియా గేట్ వైపు ఆటో రిక్షాను తీసుకెళ్తున్నట్లు పసిగట్టారు. చివరికి జామియా ప్రాంతంలో అనుమానితులను గుర్తించారు. 2021లో ఇదే ప్రదేశంలో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ కేసులోనూ నిందితులు జామియా వైపే వెళ్లారు. వారికోసం ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. ఈ రెండు పేలుళ్లలోనూ ఘటనాస్థలంలో టైప్ చేసిన అక్షరాలతో కూడిన లేఖ లభ్యమైంది. రెండు కేసుల్లోనూ ఆటోనే ఉపయోగించారు. జామియా వైపే వెళ్లారు. రెండు పేలుళ్ల ఘటనలకు పోలికలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సహా ఇతర భారత ఉగ్రవాద నిరోధక సంస్థలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి కేసును ఛేదించే పనిలో ఉన్నాయి. పేలుడు నేపథ్యంలో ఇండియాలో ఉన్న తమ దేశస్తులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద డిసెంబర్ 26న బాంబు పేలుడు సంభవించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఆక్షేపిస్తూ ఓ లేఖ కూడా ఘటనాస్థలంలో లభ్యమైంది. బాంబు పేలుడు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కానీ ఎంబసీపై దాడిగానే ఇజ్రాయెల్ అధికారులు పరిగణించారు. ప్రస్తుతం ఎన్ఐఏ ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు పేలుడు? లేఖ లభ్యం
ఢ్లిలీ: ఢ్లిలీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు బెదిరింపుల ఘటనలో ఢిల్లీ పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు. దీంతోపాటు గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తూ ఓ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. లేఖను ఇజ్రాయెల్ జెండాలో చుట్టారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చర్యను ఎండగడుతూ ఢిల్లీలో ఆదేశ దౌత్యవేత్తకు దుండగులు లేఖ రాశారని వెల్లడించారు. ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఎంబసీపై బాంబు పేలుళ్లు జరుపుతామని బెదిరింపు కాల్ప్ వచ్చాయి. పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కానీ ఆ శబ్దం పేలుళ్లకు సంబంధించిందేనని ఇజ్రాయెల్ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీపై దాడిగానే పరిగణించింది. ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. #WATCH | Forensic teams and Dog squad of NSG carry out an investigation near the Israel Embassy. As per the Israel Embassy, there was a blast near the embassy at around 5:10 pm yesterday pic.twitter.com/X4lMPD2FR8 — ANI (@ANI) December 27, 2023 ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు సహా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) విస్తృతంగా గాలింపు చేపట్టగా ఓ లేఖ లభ్యమైంది. గాజాపై ఇజ్రాయెల్ చర్యను విమర్శిస్తూ అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనపై నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఎంబసీ ప్రాంతంలో శబ్దం రసాయన పేలుడు అయి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్ఐఏ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. సమగ్రంగా దర్యాప్తు చేపడుతోంది. ఇదీ చదవండి: అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి అస్వస్థత -
ఎన్ఐఏ చేతికి కర్ణిసేన చీఫ్ హత్య కేసు
చంఢీగడ్: కర్ణిసేన అధినేత సుఖ్దేవ్ గోగమేడి హత్య కేసును ఎన్ఐఏ చేపట్టింది. హత్యలో ప్రముఖ గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్నందున హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కర్ణిసేన అధినేతను డిసెంబర్ 5న రాజస్థాన్, జైపూర్లోని ఆయన నివాసంలో దుండగులు కాల్చి చంపారు. హత్య జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా హత్యకు బాధ్యత వహించాడు. ఇద్దరు నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలను డిసెంబర్ 9న చండీగఢ్లో పోలీసులు అరెస్టు చేశారు. గోదారానే తమను సుఖ్దేవ్ గోగామేడి హత్యకు ఆదేశించారని పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న షూటర్లు గోదార సన్నిహితులు వీరేంద్ర చాహన్, దనరామ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొందరు వ్యాపారవేత్తల నుంచి వసూళ్లకు సంబంధించి గోదార, గోగమేడి మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే హత్యకు దారితీసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: 'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్పై విపక్ష ఎంపీ మిమిక్రి -
పేలుళ్లకు కుట్ర.. 8మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. కర్ణాటక, ముంబయి, ఢిల్లీలో జరిపిన సోదాల్లో 8మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసింది. భారీగా పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. Nia Foils ISIS Ballari Module’s Plans to Trigger IED Blasts Arrests 8 Terror Operatives, including Module Head, in Raids Across 4 States, Seizes Explosive Raw Materials, Weapons, Documents Exposing Terror Plans, etc. pic.twitter.com/jluje0B91b — NIA India (@NIA_India) December 18, 2023 సల్ఫర్, పొటాషియం నైట్రేట్, గన్పౌడర్ వంటి పేలుడు పదార్థాల నిల్వలు, ప్రతిపాదిత దాడుల వివరాలతో కూడిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. బాకులు, నగదు, డిజిటల్ పరికరాల వంటి పదునైన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. బళ్లారి మాడ్యూల్కు చెందిన నాయకుడు మహ్మద్ సులైమాన్ అరెస్టైన వాళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులు సమాచారం పంచుకోవడానికి IM యాప్లను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోపేలుళ్లు జరపడానికి కుట్ర పన్నారని అధికారులు పేర్కొన్నారు. తమ గ్యాంగ్లో చేర్చుకోవడానికి కళాశాల విద్యార్థులను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని గత వారం ఎన్ఐఏ 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
టార్గెట్ ఐసిస్..44 చోట్ల ఎన్ఐఏ రెయిడ్స్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్ లక్ష్యంగా కర్ణాటక,మహారాష్ట్రల్లో ఏకకాలంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)రెయిడ్స్ చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో మొత్తం 44 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటకలోని ఒక ప్రాంతంలో మహారాష్ట్రలో 43 చోట్ల ఎన్ఐఏ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా దాడులకు ఐసిస్ కుట్ర పన్నిందని సమాచారం రావడంతోనే ఎన్ఐఏ ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.ఈ రెయిడ్స్లో భాగంగా ఎన్ఐఏ ఇప్పటికే 13 మంది దాకా అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..అమెరికన్ కన్సల్టెన్సీ సర్వే: ప్రధాని మోదీపై కీలక విషయం వెల్లడి..! -
ఎయిరిండియా ఎక్కొద్దు: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్కు ఎన్ఐఏ షాక్
టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) షాకిచ్చింది. అతడిపై పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు సోమవారం పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతి, కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు పెట్టినట్టు వెల్లడించింది. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నవంబర్ 4 న ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. సిక్కులు ఎవరూ నవంబరు 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని, ఒకవేళ అలా ఎవరైనా ప్రయాణిస్తే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించాడు. మొత్తం 37 సెకెన్ల వీడియోలో అదే రోజు నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంటూ బెదిరించడం వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కలకలం రేపాయి. దీంతో హై అలర్ట్ జారీ చేసిన ఇండియా, కెనడాతోపాటు ఎయిరిండియా పయనిచంఏ ప్రయాణించే కొన్ని ఇతర దేశాలలో భద్రతా దళాలు దర్యాప్తు ప్రారంభించాయి. 2019లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ అతనిపై తొలి కేసు నమోదైంది. అప్పటికీ అతడు ఎన్ఐఏ దృష్టిలో కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ,చండీగఢ్లోని అమృత్సర్లో ఇల్లు , కొంతభూమిని జప్తు చేసింది. 2021 ఫిబ్రవరిలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పన్నన్పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29న అతన్ని "ప్రకటిత నేరస్థుడిగా" ప్రకటించింది. భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పేరు ప్రతిచోటా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. -
తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్: తెలంగాణతో సహా దేశంలో 10 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. National Investigation Agency (NIA) is conducting raids across 10 states in connection with Human Trafficking cases. More details awaited. — ANI (@ANI) November 8, 2023 తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్ము కాశ్మీర్లో సోదాలు జరుగుతున్నాయి. Tripura, Assam, West Bengal, Karnataka, Tamil Nadu, Telangana, Haryana, Puducherry, Rajasthan and Jammu & Kashmir are among the states being searched by the NIA in the human trafficking case. — ANI (@ANI) November 8, 2023 మరోవైపు టెర్రర్ ఫండింగ్ కేసులో జమ్మూ కశ్మీర్లో రాష్ట్ర దర్యాప్తు సంస్థ(ఎస్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. అనంతనాగ్, పుల్వామా జిల్లాలతో సహా దక్షిణ కశ్మీర్లో ఎస్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. #WATCH | J&K: State Investigation Agency (SIA) is conducting raids at several places in the Anantnag & Pulwama districts of South Kashmir. The raids are being conducted in connection with a terror funding case. (Visuals from Panzgam village of Kokernag area in Anantnag district) pic.twitter.com/ZWbxDUwryy — ANI (@ANI) November 8, 2023 -
19 ఏళ్లకే గ్యాంగ్స్టర్గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్స్టర్పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్పోల్) రెడ్ కార్నర్ నోటీసు జారీ ఏసింది. నకిలీ పాస్పోర్ట్తో రెండేళ్ల క్రితం అమెరికాకు పారిపోయిన గ్యాంగ్స్టర్ యోగేష్ కాద్యాన్పై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం లాంటి అభియోగాలతో తాజాగా ఈ నోటీసు లిచ్చింది. యోగేష్ చిన్న వయస్సులోనే ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణుడని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్లో ఇతను కూడా చేరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం యుఎస్లోని బాబిన్హా గ్యాంగ్లో చేరిన కాద్యాన్కు ఖలిస్తానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని, అత్యాధునిక ఆయుధాల వినియోగంలో ఆరితేరిపోయాడనే తీవ్ర ఆరోపణలూ ఉన్నాయి. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) ఈ నేపథ్యంలోనే ఇండియాలో కాద్యాన్ ఇల్లు, ఇతర రహస్య స్థావరాలపై ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)దాడులు చేసింది. అలాగే అతని ఆచూకీ తెలిపిన రూ.1.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. తాజాగా ఇంటర్పోల్ కూడా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అంతకుముందు, విదేశాలకు పారిపోయాడని భావిస్తున్న మరో గ్యాంగ్స్టర్ హిమాన్షు అలియాస్ భౌపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. వీరంతా ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను తొలగించి, అమెరికా, కెనడాలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) కాగా గ్యాంగ్స్టర్-టెర్రర్ నెట్వర్క్లో NIA ఇటీవల వేగం పెంచింది. దీంతోచాలా మంది గ్యాంగ్స్టర్లు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోవడమో, లేదా యోగేష్ కడియన్ మాదిరిగా నకిలీ పాస్పోర్ట్లతో భారతదేశం నుండి పారిపోయారు. గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. ఈ కేసును ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్ ప్రధాన నిందితుడు. (కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!) గత నెలలో పంజాబ్కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ (సుఖ దునేకే) కెనడాలో తామే హత మార్చామని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించడంతో అతను ఇటీవల మళ్లీ వార్తల్లో నిలిచాడు. గతంలో కూడా పలు మార్లు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
ఎన్ఐఏ పేరిట ఐఎస్ దుష్ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే, లవ్జిహాదీలకు ప్రేరేపించే, సోషల్ మీడియాలో ముస్లింలు పెట్టే అభ్యంతరకరమైన మెసేజ్లపై సమాచారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) పేరిట ఓ తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవుతున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యతిరేక భావజాలం ఉన్న ముస్లింల సమాచారం ఇవ్వాలంటూ ఫేక్ ఫోన్ నంబర్లతో ఎన్ఐఏ పేరిట ప్రచారం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ వర్గాన్ని ఎన్ఐఏ టార్గెట్గా చేసుకున్నట్టు కొన్ని తప్పుడు సందేశాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రసారం అవుతున్నాయని వెల్లడించింది. నకిలీ ఫోన్ నంబర్లను జత చేసిన ఈ సందేశాలతో ఎన్ఐఏకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్ఐఏ అధికారులు దీనిపై ఆరా తీయగా..ఈ తరహా సందేశాలతో ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) మోసపూరితంగా భారతీయ యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ, తప్పుడు సందేశాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని లేదా ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను ఎన్ఐఏ అధికారులు కోరారు. -
రాష్ట్రంలో 53 చోట్ల ఎన్ఐఏ సోదాలు
సాక్షి, అమరావతి: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు సానుభూతిపరులు, మద్దతుదారులు, పౌరహక్కుల నేతల నివాసాల్లో సోమవారం సోదాలు చేసింది. విప్లవ రచయితల సంఘం (విరసం), మానవహక్కుల సంఘం, రాష్ట్ర పౌరహక్కుల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం, కులనిర్మూలన పోరాట సమితి, పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ప్రజాకళా మండలి, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ తదితర సంఘాల నేతల నివాసాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కోణంలో 53 నివాసాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో ఒక నాటు తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లతోపాటు మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కూటగల్లులోని రాష్ట్ర ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.చంద్రనర్సింహులు ఇంట్లో నాటు తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. కడపలోని ఒక ఇంట్లో రూ.13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతిపరులుగా పేర్కొంటూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని హైదరాబాద్లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఎన్ఐఏ అధికారులు గుంటూరు జిల్లాలో 13 ఇళ్లలోను, శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది, ఎన్టీఆర్ జిల్లాలో ఆరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో నాలుగేసి, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మూడేసి, తూర్పుగోదావరి జిల్లాలో రెండు, విజయనగరం, శ్రీసత్యసాయి, ఏలూరు, తిరుపతి, పల్నాడు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల జిల్లాల్లో ఒక్కో ఇంట్లో సోదాలు నిర్వహించారు. 2020లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఐఏ ఓ కేసు నమోదు చేసి 2021 మే నెలలో చార్్జషీట్ దాఖలు చేసింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
జిల్లాలో ఎన్ఐఏ తనిఖీలు
పొన్నూరు/తాడేపల్లి రూరల్/మంగళగిరి: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు సోమవారం జిల్లా వ్యాప్తంగా పౌరహక్కుల నేతల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పొన్నూరుకు చెందిన ప్రజావైద్యశాల డాక్టర్ టి.రాజారావు పౌరహక్కుల సంఘం రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నారు. సుమారు ఐదు గంటలపాటు రాజారావు నివాసంలో సోదాలు నిర్వహించారు. డాక్టర్ రాజారావు వద్ద లభించిన కరపత్రాలు, కమ్యూనిస్టు సంబంధిత పుస్తకాలు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడులో నివాసముంటున్న ప్రగతిశీల సమైఖ్య సభ్యుడు బత్తుల రామయ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం డోలాస్నగర్లోని పలువురి నివాసాల్లో తనిఖీలు నిర్వహించి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మంగళగిరి నగర పరిధిలోని నవులూరు మక్కెవారిపేటలో నివాసం ఉంటున్న చైతన్య మహిళా సంఘం సభ్యురాలు సిప్పోరా నివాసంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఒక సెల్ఫోన్, విప్లవ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన దేవభక్త ప్రజాతంత్ర ఉద్యమ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమలపాకుల సుబ్బారావు నివాసంలో సోదాలు నిర్వహించారు. చివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వెనుదిరిగారు. డాక్టర్ రాజారావు విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులతో సంబంధాలు, రాజకీయ పార్టీలతో సంబంధాలపై ఆరా తీశారని అన్నారు. -
వరంగల్పై ఎన్ఐఏ గురి! సోమవారం మళ్లీ దాడులు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉద్యమాలకు కేరాఫ్ అయిన వరంగల్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురిపెట్టింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావానికి ముందు, తర్వాత విప్లవ రాజకీయాలకు అడ్డాగా మారిన ఈప్రాంతంలో కార్యకలాపాలపై ఆరా తీస్తోంది. పౌరహక్కులు, ప్రజాసంఘాల కార్యకలాపాలు, నాయకుల కదలికలపై నిఘా పెట్టింది. ఈమేరకు ఎన్ఐఏ వరంగల్ నగరంతోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల తరచూ సోదాలు నిర్వహిస్తోంది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలతో సమావేశమైనట్లు సమాచారం ఉందని.. 152 మందిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత హరగోపాల్ సహా ఆరుగురిపై కేసులు ఎత్తివేయగా.. ప్రొఫెసర్ ఖాసీం సహా 146 మందిపై విచారణ జరుగుతోంది. గత సెప్టెంబర్లో విశాఖపట్నంలో నమోదైన ఓ కేసు విషయంలో హనుమకొండ హంటర్రోడ్డులోని సముద్రాల అనిత ఇంట్లో సోదాలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న కూడా వరంగల్లోని ఐదు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. తాజాగా సోమవారం హంటర్రోడ్డు, ప్రకాశ్రెడ్డిపేట, పైడిపల్లిలో అధిక సంఖ్యలో పోలీసులను మోహరించి సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఓ వైపు ‘ఉపా’.. మరోవైపు సోదాలు.. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాల వ్యూహంలో భాగంగా ఎన్ఐఏ నిఘా ముమ్మరం చేసింది. ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలపై ఓ వైపు కేసులు.. మరోవైపు ఇళ్లల్లో సోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి సమీపంలో మావోయిస్టు నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఇతర మావోయిస్టులు సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో ములుగు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అమాయక గిరిజన యువతను దళంలో చేర్చుకోవడం.. అధికారులు, అమాయక పౌరులను హత్య చేయడం, నిధుల సేకరణ వంటి లక్ష్యాలతో ఈ సమావేశం జరగ్గా, పోలీసుల రాకతో వారంతా పారిపోయారు. ఈమేరకు పస్రా సీఐ ఫిర్యాదు మేరకు అక్కడ పంచనామా నిర్వహించి ఐపీసీ 120బీ, 147, 148 రెడ్ విత్ 149.. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)’లోని సెక్షన్లు 10, 13, 18, 20, 38, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25 (1–బీ)(ఎ)ల కింద తాడ్వాయి పోలీసులు 152 మందిపై కేసు నమోదు చేశారు. మావోయిస్టు నేతలు, వారి సానుభూతిపరులు, సమావేశ స్థలం వద్ద లభించిన సాహిత్యంలో ఉన్న ఇతరుల పేర్లపై కేసులు నమోదు చేశారు. 2023 జూన్లో ఈ కేసు వెలుగు చూడగా.. ఈ కేసులో ప్రొఫెసర్ హరగోపా ల్, పద్మజా షా, రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్, సురేశ్కుమార్కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించలేదని కేసులు ఎత్తివేశారు. ప్రొఫెసర్ కాశీం, పీఓడబ్ల్యూ నేత సంధ్య, విమలక్క సహా 146 మందిపై కేసు కొనసాగుతుంది. ఇదంతా సద్దు మణిగిన కొద్ది రోజులకే ఉమ్మడి జిల్లాలో ఎన్ఐఏ సోదాలు ఉధృతం చేయడం కలకలం రేపుతోంది. ‘కవర్ సంఘాల’ కట్టడి.. అనుమానంతో సోదాలు.. మావోయిస్టు పార్టీకి కవర్సంఘాలు పని చేస్తున్నాయంటూ పలు ప్రజాసంఘాల నాయకులపై తరచూ కేసులు నమోదు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో రాధ అనే నర్సింగ్ విద్యార్థి కొన్నేళ్ల క్రితం కిడ్నాప్ కాగా.. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులే కిడ్నాప్ చేశారని ఆమె తల్లి పోచమ్మ 2017లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై 2022న ఎన్ఐఏ కేసు టేకప్ చేసింది. ఈకేసులో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 22 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈక్రమంలో చైతన్య మహిళా సంఘంలో గతంలో చురుగ్గా పని చేసిన సముద్రాల అనిత, ఆమె తల్లిగారిళ్లలో గతేడాది సెప్టెంబర్లో సోదాలు నిర్వహించారు. తాజాగా సోమవారం కూడా ఆమె ఇంట్లో మళ్లీ సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యురాలిగా వ్యవహరిస్తున్న కొత్తకొండ శాంతమ్మ ఇంట్లోనూ ఈసారి ఎన్ఐఏ సోదాలు చేసింది. పైడిపల్లిలోని ఆమె ఇంటిని ఉదయమే పోలీసులు చుట్టుముట్టగా.. తర్వాత ఎన్ఐఏ అధికారులు ఇల్లంతా తనిఖీ చేశారు. ఇంట్లో ప్రజాకవి వరవరరావుపై ప్రొఫెసర్ కాశీం రాసిన ‘కాగితం మీద అక్షరానికి కమిటైన కవి వరవరరావు’, ‘జన హృదయం జనార్దన్.. అమరుడు సూరపనేని జనార్దన్’ తదితర పుస్తకాలు లభ్యమయ్యాయి. 2016 మార్చి 1న ఎన్కౌంటర్లో మృతిచెందిన శాంతమ్మ కూతురు కొత్తకొండ సృజన అలియాస్ నవత ఫొటోలను పరిశీలించిన అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. కాగా.. ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు వివరాలు మాత్రం వెల్లడించలేదు. మొత్తంగా వరంగల్లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. -
ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు..
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement