వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు.. ఎన్‌ఐఏ విచారణకు సిట్‌ నిరాకరణ | NIA Officers Petition On AP SIT About Murder Attempt On YS Jagan | Sakshi
Sakshi News home page

Jan 17 2019 5:32 PM | Updated on Jan 17 2019 6:41 PM

NIA Officers Petition On AP SIT About Murder Attempt On YS Jagan - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అడ్డుతగులుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌  దాఖలు చేసి విచారణ చేపట్టినా కేసు రికార్డులు అందజేసేందుకు సిట్‌ నిరాకరిస్తోంది.

ఎన్‌ఐఏకు అప్పగించిన ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను అప్పగించేందుకు ఏపీ సిట్‌ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈమేరకు ఎన్‌ఐఏ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సిట్‌ తీరుపై మండిపడ్డ ఎన్‌ఐఏ అధికారులు పిటిషన్‌ దాఖలు చేయడంతో.. కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement