Tahawwur Rana: తహవూర్‌ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక | Successfully extradited NIA said on Tahawwur Rana | Sakshi
Sakshi News home page

Tahawwur Rana: తహవూర్‌ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక

Apr 10 2025 8:08 PM | Updated on Apr 10 2025 9:11 PM

Successfully extradited NIA said on Tahawwur Rana

ఎన్‌ఐఏ విడుదల చేసిన తహవూర్‌ రాణా ఫొటో

ఢిల్లీ: ముంబై 26/11 ఉగ్రదాడి కేసు ప్రధాన నిందితుడు తహవూర్‌ హుస్సేన్‌ రాణాను (Tahawwur Rana) భారత్‌కు తరలించారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోనే రాణాను ఎన్‌ఏఐ(National Investigation Agency) అరెస్ట్‌ చేసింది. అనంతరం తీహార్‌ జైలుకు తరలించింది. తీహార్‌ జైల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్‌ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా తహవూర్‌ రాణా గురించి ఎన్‌ఐఏ అధికారిక ప్రకటన చేసింది.

ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ తహవర్ రాణాను భారత్‌కు తీసుకురావడంలో ఎన్ఐఏ  విజయవంతమైంది. ముంబై దాడులకు పడిన పాల్పడిన కుట్ర దారున్ని న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నాం. అమెరికాలో రాణాకు అన్ని న్యాయపరమైన దారులు మూసుకు పోయాయి. 2023 మే 16న భారత్‌కు అప్పగించేందుకు అమెరికా స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

 

 

రాణా ఫైల్ చేసిన అన్ని పిటిషన్లు అమెరికా సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు కొట్టివేశాయి. అమెరికా భారత్‌లోని కీలక సంస్థల సమన్వయంతో రాణాను భారత్‌కు తీసుకు రాగలిగాం. ముంబై ఉగ్రదాడుల కుట్ర దారు రాణా. డేవిడ్ హెడ్లితో కలిసి ముంబై దాడులకు కుట్ర పన్నాడు. లష్కర్ ఈ తోయిబా, హుజీ ఉగ్ర సంస్థలు, పాకిస్తాన్ కుట్ర దారులు ఇందులో భాగస్వాములు. ముంబై ఉగ్రదాడులో 166 మంది చనిపోయారు 238 మంది గాయపడ్డారు’అంటూ అధికారిక నోట్‌ను విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement