నెల్లూరులో టీడీపీకి ఎదురు దెబ్బ | TDP Leaders Join In YSRCP IN nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో టీడీపీకి ఎదురు దెబ్బ

Jan 19 2019 7:59 PM | Updated on Jan 19 2019 8:17 PM

TDP Leaders Join In YSRCP IN nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోట్టి శ్రీరాములు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన కీలక నేత బీసీఎల్‌  నందకుమార్‌ డెవిడ్‌తో పాటు పలువురు సీనియర్‌ నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్పార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ ఆధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హత్యయత్నంపై ఎన్‌ఐఏ విచారణపై చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నాడో అర్థం కావడం లేదన్నారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న వెంకట రమణను టీడీపీలో  చేర్చుకోవడంతోనే మీ బండారం బయటపడిందన్నారు.  వెంకటరమణ చంద్రబాబుకు బినామీగా వ్యవహరిస్తున్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement