Kubera Movie
-
కారులో జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?
రష్మిక పేరు చెప్పగానే ఆమె సినిమాలతో పాటు హీరో విజయ్ దేవరకొండ కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ ఉన్నాయి. కాకపోతే మీడియా కంటపడకుండా సీక్రెట్గా విదేశాలకు వెళ్లి వస్తుంటారు. వ్యక్తిగతంగా ఫొటోలు షేర్ చేస్తారు తప్పితే జంటగా అస్సలు కనిపించారు. కానీ ఎవరో తీసిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. రీసెంట్ టైంలో మాత్రం రష్మిక కొద్దికొద్దిగా ఓపెన్ అవుతోంది. విజయ్పై తనుకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'పడక్కళమ్' రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్)కొన్నిరోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని రష్మిక చెప్పింది. దీంతో అందరి చూపు విజయ్ దేవరకొండపై పడింది. తాజాగా 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ రష్మిక మాట్లాడుతూ విజయ్ దగ్గర నుంచి అన్నీ తీసేసుకుంటా అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్లో ఒకే కారులో జంటగా వెళ్తూ కనిపించారు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు.కెరీర్ విషయానికొస్తే.. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో రష్మిక పాన్ ఇండియా సూపర్స్టార్ అయిపోయింది. ఈమె నటించిన 'కుబేర' రిలీజ్కి రెడీగా ఉంది. మరోవైపు గర్ల్ఫ్రెండ్, థామా తదితర సినిమాలు ఆల్రెడీ సెట్స్పై ఉన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడక చాలా ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు దృష్టంతా 'కింగ్డమ్'పైనే పెట్టుకున్నాడు. పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న చిత్రం.. జూలై 25న ఎట్టకేలకు రిలీజ్ కాబోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం)Our favs #VijayDeverakonda and #RashmikaMandanna just got spotted together after ages!! My heart’s so full 😭❤️ pic.twitter.com/Ku1Z2Nv75J— Lilly ✨ (@therwdygirl) June 18, 2025 -
రష్మిక మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన విజయ్ దేవరకొండ!
నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో ధనుశ్ బిచ్చగాడి పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ధనిక-పేద తేడా, రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది . సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. బిగ్ స్క్రీన్పై సందడి చేయబోతున్న కుబేర చిత్రానికి అభినందనలు తెలిపారు. శేఖర్ కమ్ముల సర్ పేరు నా ప్రయాణంలో ఎల్లప్పుడూ ప్రత్యేకం.. నాలాంటి చాలా మంది నటులకు ఆయనే ఆదర్శమని కొనియాడారు. ఈ మూవీలో ధనుశ్, నాగార్జున సర్, రష్మిక లాంటి స్టార్లను చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కుబేర టీమ్కు ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఇక వేచి ఉండలేను అంటూ రాసుకొచ్చారు. రష్మిక మూవీకి విజయ్ దేవరకొండ ఆల్ ది బెస్ట్ చెప్పడంపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.Wishing #Kuberaa all the very best as it heads to the big screen. @sekharkammula sir will always be a special name in my journey — he gave many actors like me hope. To see him now telling a story on this scale, with a cast filled with personal favourites like @dhanushkraja,…— Vijay Deverakonda (@TheDeverakonda) June 17, 2025 -
‘కుబేర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మికా క్యూట్ ఫోజులు
-
ఆ పని మానేయండి.. డబ్బు సంపాదించడానికి టైమ్ ఎక్కడ?: నాగ్
దేశంలో అత్యంత ధనిక హీరోల్లో కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) ఒకరు. షారూఖ్ ఖాన్, జుహీ చావ్లా తర్వాత రూ.3500 కోట్ల సంపదతో ఈయన మూడో స్థానంలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు వ్యాపార రంగంలో పెట్టుబడులు ఆయన సంపదను మరింత పెంచాయి. తాజాగా నాగ్ జెన్ జెడ్ (Generation Z)కు విలువైన సలహా ఇచ్చాడు.డబ్బు ఎప్పుడు సంపాదిస్తారు?కుబేర సినిమా ఈవెంట్లో యాంకర్ సుమ (Anchor Suma Kanakala) మాట్లాడుతూ.. జెన్ జెడ్ ఫోన్ రీచార్జులపై ఎక్కువ ఖర్చు పెడుతోంది. అసలేం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఓ సలహా ఇవ్వమని నాగార్జునను అడిగింది. అందుకాయన క్షణం ఆలోచించకుండా ఫోన్ చూడటం ఆపేయండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఫోన్ చూస్తూ కూర్చుంటే డబ్బులు సంపాదించేందుకు సమయం ఎక్కడుంది? అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. ఇదేంటి? ఈ సలహా నాకే చెప్తున్నట్లు ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమానాగార్జున చివరగా నా సామిరంగ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కుబేర, కూలీ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇవి రెండు కూడా మల్టీస్టారర్ చిత్రాలే కావడం విశేషం. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కుబేరకు శేఖర్ కమ్ముల డైరెక్టర్. రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా జిమ్ సర్భ్ ముఖ్య పాత్ర పోషించింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. జూన్ 20న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతోంది.#Nagarjuna gives a financial advice to GenZ 🥲👌 pic.twitter.com/uV0pygF06W— Movies4u Official (@Movies4u_Officl) June 15, 2025 చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి -
విజయ్ దేవరకొండ నుంచి అన్నీ తీసేసుకుంటా: రష్మిక
విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు రష్మిక. వీళ్లిద్దరూ కలిసి రెండు సినిమాలు, అది కూడా చాలా ఏళ్ల క్రితం చేశారు. కానీ వీళ్ల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడానికి ఓ కారణం ఉంది. అదే ప్రేమ. రష్మిక-విజయ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు విదేశాలకు టూర్స్కి వెళ్తుంటారు. కొన్నాళ్ల ముందు వరకు తమ బంధం గురించి పెద్దగా స్పందించని రష్మిక.. రీసెంట్ టైంలో మాత్రం మెల్లమెల్లగా క్లూలు ఇస్తోంది.తాజాగా హైదరాబాద్లో జరిగిన 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ రష్మిక చిన్న హింట్ ఒకటి ఇచ్చేసింది. యాంకర్ సుమ.. ఈ సినిమాలో నటించిన ధనుష్, నాగార్జునలని కూడా పలు ప్రశ్నలు అడిగింది. రష్మికని మాత్రం ఫలానా హీరోల నుంచి ఏం కాపీ కొడతారు అని అడగ్గా.. నాగార్జున దగ్గర నుంచి ఛార్మ్, ధనుష్ దగ్గర సూర్యుడి కింద అయిన పనిచేసేలా బలం, అల్లు అర్జున్ దగ్గర నుంచి స్వాగ్, విజయ్ దేవరకొండ దగ్గర నుంచి మాత్రం అన్నీ కావాలి అని సమాధానమిచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇది నా రిక్వెస్ట్.. గద్దర్ అవార్డుల వేడుకపై దిల్ రాజు) శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర' సినిమా జూన్ 20న రిలీజ్ కాబోతుంది. ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు. ధనిక-పేద, డబ్బు బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ తీశారు. ఇందులో రష్మిక పాత్ర ఎలా ఉండబోతుందనేది ఇప్పటివరకు అయితే పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ప్రమోషన్స్లో మాత్రం ఈమె బాగానే పాల్గొంటుంది. మొన్నీమధ్య టీమ్తో కలిసి ముంబై కూడా వెళ్లొచ్చింది.ఇక రష్మిక-విజయ్ దేవరకొండ బంధం విషయానికొస్తే.. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్లు మాత్రం అటు అవును అని గానీ ఇటు లేదు గానీ చెప్పకుండా అలా సస్పెన్స్ మెంటైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రష్మిక.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అదే రీతిన బ్లాక్బస్టర్ హిట్స్ కొడుతూ ఫుల్ ఫామ్లో ఉంది. విజయ్ దేవరకొండ మాత్రం 'కింగ్డమ్' మూవీని రిలీజ్కి రెడీ చేస్తున్నాడు. జూలై 4న విడుదల అన్నట్లు చెప్పారు గానీ ఈసారి కూడా వాయిదా పడటం గ్యారంటీ అంటున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్ నివేదా థామస్ ఇంతలా మారిపోయిందేంటి?)"I want to Copy Everything from #VijayDeverakonda" - Rashmika pic.twitter.com/YEgwjURgrY— Movies4u Official (@Movies4u_Officl) June 15, 2025 -
పులిలా నడవమని లోకేశ్ చెప్పేవాడు.. కమ్ముల మాత్రం: నాగార్జున
నాగార్జున హీరోగా కొత్త సినిమాలు చేయక చాన్నాళ్లయింది. అలా అని ఖాళీగా ఏం లేడు. కూలీ, కుబేర చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. ఇదివరకే వీటికి సంబంధించిన లుక్స్, గ్లింప్స్ వీడియోలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు మూవీస్తో నాగ్ సరికొత్తగా కనిపించబోతున్నాడనే హింట్ అయితే వచ్చేసింది. త్వరలో ఈ రెండు మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ క్రమంలోనే నాగ్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఓ ఇంటర్వ్యూల మాట్లాడుతూ ఈ రెండు చిత్రాలు, దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం చిన్న వీడియో లాంటిది రిలీజ్ చేశాడు. ఇందులో నాగార్జునని వెనక వైపు నుంచి చూపించారు. అలా కొన్ని సెకన్లపాటు కనిపించిన ఈ వీడియో స్టైలిష్గా ఉండేసరికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో నాగ్.. సైమన్ అనే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన నాగ్.. 'లోకేశ్ ఎప్పుడు పులిలా నడవమని అనేవాడు. మిమ్మల్ని చూస్తే ప్రేక్షకులు భయపడాలి సర్ అనేవాడు' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా)అదే టైంలో 'కుబేర' తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం 'మీరు హీరోలా నడుస్తున్నారు. కొంచెం తగ్గించండి' అని చెప్పేవాడు. వీళ్లిద్దరికీ అదే తేడా. కూలీ విషయానికొస్తే.. 'లోకేశ్ నన్ను చాలా అద్భుతంగా చూపించాడు. నన్ను నేను అలానే చూడాలనుకున్నాను. సినిమా చూస్తున్నంతసేపు విజిల్స్ వేస్తూనే ఉంటారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సక్సెస్లు చూశాను. మూవీ కలెక్షన్స్ నాకు ముఖ్యం కాదు' అని నాగార్జున చెప్పుకొచ్చాడు.రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ 'కూలీ' మూవీ.. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. తెలుగులోనూ ఈ చిత్రానికి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర' సినిమా.. ఈనెల 20న అంటే వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఇందులో ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లు కాగా.. నాగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు మూవీస్ హిట్ అయితే గనక నాగార్జునని ఇలా మరిన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్లో చూడొచ్చేమో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) #Nagarjuna: Coolie Vs Kubera #Coolie: Lokesh is larger than life Filmmaker🔥. Loki says Walk in like a Tiger, people should scared with ur Look🐯👿#Kubera: Sekhar is very realistic filmmaker🫶. Director says you are waking like a Hero bring it down😀 pic.twitter.com/lVkVCkYE1r— AmuthaBharathi (@CinemaWithAB) June 13, 2025 -
కన్నడిగులని మళ్లీ ట్రిగర్ చేసిన రష్మిక
రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. కానీ ఆ రాష్ట్రానికి చెందిన ప్రేక్షకులే ఈమెని ఎప్పటికప్పుడు విమర్శిస్తుంటారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. గతంలో పలుమార్లు ఈమే మాట్లాడిన మాటలే దీనికి కారణం అని చెప్పొచ్చు. మరి తెలిసి చేసిందో తెలియక చేసిందో గానీ ఇప్పుడు మరోసారి కన్నడని కెలికింది. అసలే కమల్ హాసన్ వల్ల కోపంతో ఉన్నారు. ఇప్పుడు రష్మిక లేటెస్ట్ పోస్ట్ చూసి షాకవుతున్నారు.రష్మిక నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేర'. శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా జూన్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. నిన్ననే ముంబైలో ఓ ఈవెంట్ జరగ్గా.. అంతకు ముందు దక్షిణాదిలోనూ జరిగాయి. ఈ క్రమంలోనే రష్మిక తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతో పాటు చెన్నైతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంది. ఇప్పుడదే కన్నడిగుల ఆగ్రహం తెప్పిస్తోంది.(ఇదీ చదవండి: 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో ఫేమస్.. ఎవరీ డస్కీ బ్యూటీ?)రష్మిక పోస్ట్లో ఏముందంటే.. 'చెన్నైలోనే తన బాల్యం గడిచింది. అందుకే చెన్నైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది' అని రాసుకొచ్చింది. అంటే ఓ రకంగా తనది చెన్నై అన్నట్లు చెబుతోంది. ఇది ఇప్పుడు కన్నడిగులకు అసంతృప్తి తెప్పిస్తోంది. ఎందుకంటే రష్మిక పుట్టి పెరిగింది, స్కూల్ చదువుకున్నదంతా కర్ణాటకలోనే. కానీ చెన్నైలో బాల్యం గడపడం ఏంటి అని కన్నడ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.గతంలో 'కాంతార' సినిమాని తాను ఇంకా చూడలేదని చెప్పి ట్రోలింగ్కి గురైన రష్మిక.. మరో సందర్భంలో హైదరాబాద్ తనకు ఇల్లు లాంటిదని చెప్పి కన్నడిగుల ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు మరి ఉద్దేశపూర్వకంగా చేసిందో లేదో తెలీదు గానీ ఈమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్లో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక. పుష్ప 2, ఛావా లాంటి సినిమాలతో వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈమె.. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈమె నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో మాట్లాడుతూ ధనుష్.. రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో తాను బిచ్చగాడు పాత్ర చేశానని, ఓసారి డంప్ యార్డ్లో దాదాపు ఆరేడు గంటలు షూటింగ్ చేయాల్సి వచ్చిందని ధనుష్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తామంతా చెత్త నుంచి వచ్చే కంపుతో ఇబ్బంది పడుతుంటే.. రష్మిక మాత్రం నాకేం వాసన రావడం లేదు అని చెప్పేది. దీంతో ఆశ్చర్యపోవడం మా వంతైందని ధనుష్ అన్నాడు. అలానే 'కుబేర'.. జీవితంలోని మరో కోణాన్ని తనకు పరిచయం చేసిందని, చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసిందని చెప్పాడు.(ఇదీ చదవండి: డిజాస్టర్ 'థగ్ లైఫ్'.. ఓటీటీ లెక్క మారుతోంది!)ఇదే సినిమాలో కీ రోల్ చేసిన నాగార్జున మాట్లాడుతూ.. రష్మికని ఆకాశానికెత్తేశాడు. టాలెంట్లో ఈ అమ్మాయి పవర్ హౌస్ అంటూ పొగిడేశాడు. అలానే హీరోగా ఎందుకు చేయట్లేదంటే తనకు నచ్చే స్టోరీలు రావట్లేదని అన్నాడు. శేఖర్ కమ్ములు ఈ స్క్రిప్ట్తో తన దగ్గరకు రాగానే విని ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. త్వరలో 'కూలీ'తో మరోసారి హిందీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నానని కూడా చెప్పాడు.శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర'.. ఆయన గత చిత్రాలతో పోలిస్తే సమ్థింగ్ ఉండబోతుంది. కొన్నిరోజుల క్రితం రిలీజైన టీజర్ చూస్తే ఈ విషయం చాలామందికి అర్థమైంది. కాకపోతే ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లు ఇది యాక్షన్ మూవీ కాదు. డబ్బు, దాని వల్ల వచ్చే అనర్ధాలు తదితర అంశాలతో సినిమాని తీసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి 'కుబేర'.. బిగ్ స్క్రీన్పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో?(ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. ఎవరో తెలుసా?) -
రూ.10 కోట్లు కట్ చేస్తామన్నారు.. 'కుబేర' నిర్మాత ఆవేదన
ప్రస్తుతం టాలీవుడ్లో ఓటీటీల ఆధిపత్యం నడుస్తోంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది సదరు సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు దీని గురించి నిర్మాతలు పెద్దగా ఓపెన్ అయింది లేదు. కానీ త్వరలో రిలీజ్ కాబోతున్న 'కుబేర' నిర్మాత సునీల్ నారంగ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న సమస్యల గురించి తన అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకుడు. జూన్ 20న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ కాస్త హైప్ తీసుకొచ్చాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాతలైన సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ఓటీటీల ఆధిపత్యం గురించి చెప్పుకొచ్చారు. 'మేం 'కుబేర' చిత్రానికి జూలైలో రిలీజ్ చేస్తామని అడిగాం. కానీ ప్రైమ్ వాడు మాత్రం జూన్ 20న విడుదల చేయండి లేదంటే ఓటీటీ డీల్ నుంచి రూ.10 కోట్లు కట్ చేస్తామని అన్నాడు' అని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యూబ్ సిస్టమ్, బుక్ మై షో, ఓటీటీల ఆధిపత్యం నడుస్తోందని సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారు. అలానే 140 కోట్ల మంది జనాభాలో 40-50 మంది హీరోలు మాత్రమే ఉన్నారని.. దీంతో వాళ్లు దేవుళ్లతో సమానం అని చెప్పుకొచ్చారు. ఇకపోతే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఈయన శనివారం సాయంత్రం ఎన్నికయ్యారు. ఆదివారం సాయంత్రానికల్లా రాజీనామా చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్గా కొనసాగడం కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
డబ్బింగ్ డన్
హీరో అక్కినేని నాగార్జున ‘కుబేర’ సినిమాలోని తనపాత్ర డబ్బింగ్ని పూర్తి చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా, జిమ్ సర్భ్ కీలకపాత్రపోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా తనపాత్రకి సంబంధించిన డబ్బింగ్ని నాగార్జున పూర్తి చేశారు. ఈ విషయాన్ని ప్రకటించి, డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, పుస్కూర్ రామ్మోహన్ రావు కలసి మాట్లాడుతున్న ఫొటోలని మేకర్స్ షేర్ చేశారు.‘‘ఈపాన్ ఇండియా చిత్రాన్ని శేఖర్ కమ్ముల అద్భుతంగా తీర్చిదిద్దారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ మూవీ ఇండియన్ సినిమాలో గేమ్ ఛేంజర్గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్కి మంచి స్పందన వచ్చింది. పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర...’ వంటిపాటలు టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Upcoming Tollywood Movies: జూన్లో పెద్ద సినిమాల జాతర.. గ్యాపే లేదు!
టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత సమ్మర్కు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవి కాలం వృథాగా పోయింది. మే నెలలో పెద్ద సినిమాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. వచ్చిన వాటిలో హిట్ 3 చిత్రం ఒక్కటే కాస్త బెటర్గా ఆడింది. సమంత ‘శుభం’, శ్రీ విష్ణు ‘సింగిల్’ లాంటి చిత్రాలు కొంతమేర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇలా సమ్మర్కి కీలకమైన మే నెల టాలీవుడ్ని పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. కానీ అనూహ్యంగా జూన్ నెల టాలీవుడ్కి కీలకంగా మారబోతుంది. ఈ నెలలో వారానికొక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. వాటిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’తో ఈ నెల టాలీవుడ్ బాక్సాఫీస్ ఓపెన్ కాబోతుంది. ఈ చిత్రంపై టాలీవుడ్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దశాబ్దాల తర్వాత మణిరత్నం, కమల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. శింబు కీలక పాత్ర పోషించారు. కోలీవుడ్లో మాదిరే టాలీవుడ్లోనూ భారీ ప్రమోషన్స్ చేశారు. కమల్ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దీంతో థగ్ లైఫ్పై తెలుగులోనూ మంచి హైప్ క్రియేట్ అయింది. జూన్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.ఇక థగ్ లైఫ్ వచ్చిన వారానికే పవన్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న రిలీజ్ కాబోతుంది. చాలా రోజుల తర్వాత పవన్ నుంచి వస్తున్న చిత్రమిది. అంతేకాదు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ కాబోతున్న తొలి సినిమా.దీనిపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.ఎప్పుడైన ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే.. మరుసటి వారం కాస్త గ్యాప్ ఉండేది. లేదంటే చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవి. కానీ ఈ సారి పవన్ సినిమాకు కూడా పోటీ ఎదురైంది. హరిహర వీరమల్లు వచ్చిన మరుసటి వారమే(మే 20) ధనుష్-నాగార్జునల ‘కుబేర’ రిలీజ్ కానుంది. శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై కూడా ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అదే రోజు ఆమిర్ ఖాన్ సితారే జమీర్పర్ రిలీజ్ కాబోతుంది.ఇక జూన్ చివరివారంపై ‘కన్నప్ప’ కర్ఛీఫ్ వేశాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీ అయ్యారు విష్ణు. చెన్నై, బెంగళూరు, ముంబై తదితర పట్టణాలలో ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇలా జూన్ నెలలో ప్రతి వారం ఒక్కో పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటు గ్యాంబ్లర్స్(జూన్ 6), 8 వసంతాలు (జూన్ 20), మర్గాన్ (జూన్ 27) చిత్రాలు కూడా ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం సూపర్ హిట్గా నిలుస్తుందో చూడాలి. -
అందరిని మెప్పించేలా 'కుబేర' కొత్త సాంగ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 20న కుబేర చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. తాజాగా విడుదలైన 'అనగనగా కథ' పాటను చంద్రబోస్ రచించారు. హైడ్ కార్తీ, కరీముల్లా ఆలపించారు. -
నాగార్జున ఫ్లాప్ సినిమా నచ్చిందంటున్న ధనుష్
నాగార్జున హీరోగా సినిమాలు చేయట్లేదు. అలా అని ఖాళీగా ఏం లేరు. కుబేర, కూలీ లాంటి తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్తో కలిసి 'కుబేర'లో నటించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రం జూన్ 20న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ధనుష్.. నాగ్తో పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.నాగార్జునతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన ధనుష్.. ఆయన సినిమాల్లో 'రక్షకుడు' అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. దీంతో అసలు ఏంటి సినిమా అని కొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో మాత్రం నాగ్ సినిమాలు చేశారు గానీ అప్పట్లో తమిళంలోనూ పలు చిత్రాలు చేశారు. అలాంటి ఓ మూవీనే రక్షకుడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)ప్రవీణ్ గాంధీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాని కుంజుమోన్ భారీ బడ్జెట్తో నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజైంది గానీ ఘోరమైన డిజాస్టర్గా నిలచింది. అక్కడక్కడ కొన్ని ఫ్యాన్ మూమెంట్స్... అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇది తప్పితే స్టోరీ పరంగా తేలిపోవడంతో ఫ్లాప్ అయింది. అలాంటి మూవీ ధనుష్కి నచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని బయటపెట్టాడు.నాగ్ ప్రస్తుతం హీరోగా కంటే కీలక పాత్రలు చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చివరగా 'నా సామి రంగ' మూవీ చేశారు. తర్వాత అదిగో ఇదిగో అంటున్నారు గానీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ లేదు. మరోవైపు కుబేర, కూలీ లాంటి క్రేజీ మూవీస్ చేశారు. జైలర్ 2లోనూ నాగ్ విలన్గా చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. (ఇదీ చదవండి: 'వారసుడు' సినిమా చేసి బాధపడ్డాను: నందిని రాయ్) -
శేఖర్ కమ్ముల కుబేర.. టీజర్ వచ్చేసింది!
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర బృందం టీజర్ను విడుదల చేసింది. ట్రాన్స్ ఆఫ్ కుబేర పేరుతో టీజర్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. -
దేవగా ధనుష్
ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమాలో దేవ అనే పాత్రలో ధనుష్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ‘కుబేర’ సినిమా కొత్తపోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ధనుష్ యాక్టర్గా కెరీర్ని మొదలు పెట్టి, శనివారం (మే 10)కి 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘కుబేర’ కొత్తపోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘కుబేర’ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. -
ప్రేమ కబుర్లు?
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ 20న విడుదల కానుంది.ప్రస్తుతం ఈ సినిమాపోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ధనుష్, రష్మిక మాట్లాడుకుంటున్న ఓ కొత్తపోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ధనుష్, రష్మిక చిరునవ్వులు చిందిస్తూ, ఏవో ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా ఈపోస్టర్ ఉంది. తమిళ్, తెలుగు,హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
కుబేర నుంచి ఫస్ట్ సాంగ్.. 'పోయిరా మావా' అంటున్న ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush)- దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కుబేర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ‘పోయి రా మావా’ అంటూ సాగే ఈ పాటను ధనుష్ ఆలపించగా భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు. ధనుష్కు జోడీగా రష్మిక నటిస్తుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తొలి పాటలోనే ఆయన మార్క్ చూపించారు. -
ఫుల్ మాస్...
అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తుండగా, జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి పాటని ఈ నెల 20న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో విజిల్ వేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు ధనుష్. ఫుల్ మాస్గా ఈ పాట ఉంటుందని సమాచారం. -
రూ.100 కోట్లతో నాగార్జున 100వ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఈ నలుగురిని టాలీవుడ్కి నాలుగు స్తంభాలు అంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక సినిమాలలో హీరోలుగా నటించింది వీరే. చిరంజీవి ఇప్పటికే 156 చిత్రాలకు పైగా నటించగా.. బాలకృష్ణ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు నాగార్జున(Nagarjuna) తన 100వ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హీరోగా 99 చిత్రాల్లో నటించిన నాగ్.. తన సెంచరీ మూవీ కోసం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు.నాగ్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం 'నా సామి రంగ'. ఇది గతేడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజైంది. ఆ తర్వాత సోలో సినిమా ఇంత వరకూ ప్రకటించలేదు. ఇప్పుడు తన బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కింగ్ నాగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోందిప్రస్తుతం నాగార్జున ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తర్వాత 100వ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. తాజా వార్తల ప్రకారం, ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కార్తీక్ గతంలో తమిళంలో ‘నితం ఓరువానం" చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆడలేదు కానీ దర్శకుడు కథను తెరపై చూపించిన విధానం నాగ్కి బాగా నచ్చిందట. వెంటనే అతన్ని పిలిపించి..వందో చిత్రం బాధ్యతలు అప్పజెప్పాడట.తన 100వ విజువల్ వండర్గా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని నాగ్ కోరుకుంటున్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిన్న మొన్నటి వరకు నాగార్జున వందో చిత్రానికి పూరి జగన్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి.. అయితే, తాజా సమాచారం ప్రకారం కార్తీక్తోనే ఈ ప్రాజెక్ట్ ఖరారైనట్లు కనిపిస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివరలో లేదా 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. నాగ్ అభిమానులకు ఆకట్టుకునేలా ఓ సూపర్ స్టోరీని రెడీ చేశాడట కార్తీక్. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
చిరుతో పోటీకి ధనుష్..! కుబేర రిలీజ్ డేట్ లాక్
-
'కుబేర'కు టైటిల్ కష్టాలు..
ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమౌతున్న ‘కుబేర’ సినిమాకు టైటిల్ సమస్యలు ఎదురౌతున్నాయి. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ వివాధంలో చిక్కుకుంది.కుబేర సినిమా టైటిల్ తనదే అని తాను 2023 నవంబర్ 29వ తేదీనే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించానని త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ నిర్వాహ కుడు, సినీ నిర్మాత నరేందర్ తెలిపారు. 2024 మార్చి 5 నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల కుబేర అనే సినిమా టైటిల్కు కాపీ చేసుకుని టైటిల్కు ముందు శేఖర్ కమ్ముల అని పెట్టి తమ సినిమాకు ఇబ్బంది కలిగిస్తున్నాడని ఆయన ఆవేదనవ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శేఖర్ కుమ్ముల కుబేర టైటిల్ కాపీ చెయ్యగానే తాను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సంప్రదిస్తే వారు పెద్దవారితో ఎందుకు పెట్టుకుంటున్నారు అంటూ తమనే బెదిరిస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. న్యాయం జరుగకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. -
హరోం హర అంటున్న సినీ స్టార్స్
మహా శివరాత్రి పర్వదినం (ఫిబ్రవరి 26) సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహా శివరాత్రికి జాగరణ చేసేందుకు భక్తులు శివాలయాలకు పోటెత్తుతారు. ఆ రోజు శివాలయాలన్నీ హరోం హర అంటూ శివనామ స్మరణతో మార్మోగుతాయి. సినిమా ఇండస్ట్రీకి కూడా మహా శివుడితో ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. శివుడి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి, ప్రేక్షకులను అలరించాయి. తాజాగా పరమేశ్వరుడి నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే శివ భక్తి నేపథ్యంలో పాటలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాల విశేషాల గురించి తెలుసుకుందాం.శివుడి నేపథ్యంలో...తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీ బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివుడి నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. గత ఏడాది మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఆహార దేవతగా భావించే అన్నపూర్ణా దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో పోస్టర్లో ఉంది.అంటే... ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని కచ్చితంగా ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందని చెప్పకనే చెప్పింది యూనిట్. ఈ సినిమాలో మురికి వాడల్లో నివశించే వ్యక్తిగా ధనుష్ పాత్ర ఉంటుంది. అలాగే ముంబైకి చెందిన ఓ ధనవంతుడి పాత్రలో నాగార్జున కనిపించనుండగా, రష్మికా మందన్న మధ్యతరగతి యువతి పాత్ర చేస్తున్నారు. నటుడు జిమ్ సర్భ్ ఓ బిలియనీర్ బిజినెస్ మ్యాన్గా కనిపిస్తారు. శివ భక్తుడి కథమంచు విష్ణు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై మంచు మోహన్బాబు పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 25న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలకానుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది ‘కన్నప్ప’ యూనిట్. పరమశివుడికి వీర భక్తుడైన కన్నప్ప నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. కన్నప్పలోని వీరత్వం, భక్తిని మేళవించి ఈ మూవీ తెరకెక్కించారు ముఖేశ్ కుమార్ సింగ్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేయడం విశేషం. శివ తాండవం చేస్తున్న అక్షయ్ కుమార్ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.శివుడిగా ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో ఆ పోస్టర్ ద్వారా చూపించింది యూనిట్. అంతేకాదు... ఈ సినిమా నుంచి విడుదలైన ‘శివ శివ శంకరా...’ పాటకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్కి పెద్ద పీట వేశారు. ఈ మూవీలో తిన్నడు పాత్రలో మంచు విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. మధుబాల, ప్రీతీ ముకుందన్, ఐశ్వర్య, దేవరాజ్, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. శివ తాండవం పాప వినాశక సాక్షాత్ సాంబ శివ అంటూ ఆడి పాడుతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. ఈ మూవీలో అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై కథానాయికలు. పెన్ స్టూడియోస్పై డా. జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో శివుడి నేపథ్యంలో ఓ పాట తెరకెక్కించారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘భైరవం’ థీమ్ సాంగ్ను విడుదల చేసింది యూనిట్. ఈ పాటలో పరమ శివుని భయం, బలం ఈ రెండింటినీ తన హావభావాలు, నృత్యంతో అద్భుతంగా కనబరిచారు సాయి శ్రీనివాస్. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటని శంకర్ మహదేవన్ తనదైన శైలిలో పాడారు. ఓ ఆలయం ముందు ఈ పాటను చిత్రీకరించారు.‘‘ఈ నెల 26న రానున్న మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక పాటని విడుదల చేశాం. పరమ శివుడి దైవిక సారాన్ని అందంగా ప్రజెంట్ చేసి, లోతుగా ప్రతిధ్వనించే ఎమోషన్స్ని ఈ పాట ఆవిష్కరిస్తుంది. సాయి శ్రీనివాస్ పాత్ర శివ తాండవం ప్రేరణ స్ఫూర్తితో మెస్మరైజ్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. జటాధరవైవిధ్యమైన కథా నేపథ్యం ఉన్న చిత్రాలు, పాత్రలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సుధీర్బాబు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ భన్సల్, ప్రేరణా అరోరా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ ఇది.అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, పురాణ చరిత్ర వీటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పరమ శివుడితో ముడిపడిన కథే అని సమాచారం. పైగా టైటిల్ని బట్టి చూస్తే ఇదే వాస్తవం అనిపిస్తుంది. జటాధరుడు అని పరమ శివుణ్ణి పిలుస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.పరమ శివుని భక్తురాలుహీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. తొలి భాగాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అశోక్ తేజ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్నారు.సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో శివ భక్తురాలైన శివ శక్తి నాగసాధు పాత్రలో నటిస్తున్నారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ సింహ భాగం వారణాసిలోని కాశీలో జరిగింది. శనివారం విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇవే కాదు... మరికొన్ని సినిమాలు కూడా శివుడి నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. -
వీల్ఛైర్లో రష్మిక మందన్న.. వీడియో వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొద్దిరోజు క్రితం గాయపడిన విషయం తెలిసిందే. తన కొత్త సినిమా కోసం జిమ్లో కసరత్తులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తన కాలికి గాయం అయింది. చికిత్స పొందిన తర్వాత ఆమె హైదరాబాద్ విమానాశ్రయంలో వీల్ఛైర్లో కనిపించింది అందరినీ షాక్కు గురిచేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ ‘ఛావా’లో రష్మిక ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం ఆమె ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప2’తో శ్రీవల్లిగా థియేటర్లలో దుమ్మరేపిన రష్మిక మందన్న(Rashmika Mandan) ఇలా గాయంతో ఇబ్బంది పడుతూ కనిపించడంతో.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.కొత్త సంవత్సరంలో ఇలా జరగడంతో రష్మిక తీవ్ర నిరాశ చెందారు. పాన్ ఇండియా రేంజ్లో టాప్ హీరోయిన్గా ఉన్న ఆమె చేతిలో నాలుగు చిత్రాలకు పైగా ఆమె చేతిలో ఉన్నాయి. గాయం కారణంగా షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆమె తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో ఆమె కొద్దిరోజుల క్రితం ఇలా పంచుకున్నారు. 'నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఇలా మొదలైంది. జిమ్లో శిక్షణ తీసుకుంటూ ఉండగా నేను గాయపడ్డాను. (ఇదీ చదవండి: చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్ క్వీన్ రిక్వెస్ట్)దీంతో కొన్ని వారాలు, నెలలు పాటు రెస్ట్లో ఉండాలి. పూర్తిగా కోలుకునేందుకు ఎన్నిరోజులు పడుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇక నుంచి పూర్తిగా రెస్ట్ మోడ్లోనే ఉండాల్సి వస్తుంది. అంతా బాగాయ్యాక నేను మళ్లీ 'సికందర్ (Sikandar), కుబేర(Kubera), థామ(Thama)' సినిమాల షూటింగ్స్లో పాల్గొంటానని అనిపిస్తోంది. నా వల్ల సినిమా ఆలస్యం అవుతుంది. అందుకు దర్శకులు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను.' అని పేర్కొంది. 'ఛావా' (Chhaava) ప్రమోషన్స్లతో రష్మిక బిజీగా ఉంది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రానుంది. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమాపై ఫ్యాన్స్లలో భారీ అంచనాలు ఉన్నాయి.It's painful to see @iamRashmika like this. But at the same time, I'm also happy to see that she hasn't given up. She's showing her fans that she's a fighter, strong and unstoppable. That's why we call her our inspiration. Proud of you #RashmikaMandanna. Your strength &… pic.twitter.com/WVWjdDz2XC— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) January 22, 2025 -
గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి: రష్మిక
‘పుష్ప2’తో శ్రీవల్లిగా థియేటర్లలో దుమ్మరేపిన రష్మిక మందన్న(Rashmika Mandan) ఆసుపత్రిలో చేరింది. తన కాలికి గాయం కావడంతో చికిత్స పొందుతున్నారు. కొత్త సంవత్సరంలో ఇలా జరగడంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు. పాన్ ఇండియా రేంజ్లో టాప్ హీరోయిన్గా ఉన్న ఆమె చేతిలో నాలుగు చిత్రాలకు పైగా ఆమె చేతిలో ఉన్నాయి. గాయం కారణంగా షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆమె తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో ఆమె పంచుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ)కొత్త సినిమాల కోసం జిమ్లో కసరత్తులు చేస్తూ గాయపడినట్లు రష్మిక మందన్న ఇలా తెలిపారు. 'నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఇలా మొదలైంది. జిమ్లో శిక్షణ తీసుకుంటూ ఉండగా నేను గాయపడ్డాను. దీంతో కొన్ని వారాలు, నెలలు పాటు రెస్ట్లో ఉండాలి. పూర్తిగా కోలుకునేందుకు ఎన్నిరోజులు పడుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇక నుంచి పూర్తిగా రెస్ట్ మోడ్లోనే ఉండాల్సి వస్తుంది. అంతా బాగాయ్యాక నేను మళ్లీ 'సికందర్ (Sikandar), కుబేర(Kubera), థామ(Thama)' సినిమాల షూటింగ్స్లో పాల్గొంటానని అనిపిస్తోంది. నా వల్ల సినిమా ఆలస్యం అవుతుంది. అందుకు దర్శకులు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. షూటింగ్లో పాల్గొనేందుకు నా కాళ్లు సహకరించినప్పుడు తప్పకుండా వచ్చేస్తాను. నేను కూడా త్వరగా కోలుకునేందుకు వర్కౌట్స్ చేస్తాను' అని ఆమె అన్నారు.సికిందర్కు బ్రేకులు పడనున్నాయా..?సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సికందర్’. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2025 రంజాన్ కానుకగా మార్చి 2న విడుదల కానున్నట్లు వార్తలు వచ్చాయి. యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో రష్మికకు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు సికందర్ మూవీ ఆమెకు మరింత పాపులరాటిని తీసుకురావచ్చని చెప్పవచ్చు. అయితే, ఆమె గాయం కారణంగా ఈ చిత్రం రంజాన్కు విడుదల అవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి.జూన్లో కుబేర కష్టమేజూన్లో థియేటర్స్లోకి ‘కుబేర’ వస్తారని అందరూ అనుకున్నారు. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుందనే ప్రచారం సాగింది. కానీ జూన్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. అయితే, రష్మిక మందన్నకు గాయం కావడంతో జూన్లో విడుదల కష్టమేనని తెలుస్తోంది.ఈ సినిమా చిత్రకరణ కోసం రష్మిక గాయపడ్డారా..?హీరోయిన్ రష్మికా మందన్నా కెరీర్లో రానున్న తొలి హారర్ మూవీ ‘థామా’. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. హారర్ మూవీ ‘ముంజ్య’తో హిట్ కొట్టిన దర్శకుడు ఆదిత్యా సర్పోత్తా ఈ సినిమాకు దర్శకుడు. ‘బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాది విడుదలైంది. రీసెంట్గా ‘థామా’ చిత్రీకరణ కోసం ఢిల్లీ బయలుదేరినట్లుగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. ఈ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న క్రమంలోనే ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
కుబేర రిలీజ్ డేట్ లో ట్విస్ట్..
-
జూన్లో కుబేర?
జూన్లో థియేటర్స్లోకి రానున్నారట ‘కుబేర’. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుందనే ప్రచారం సాగింది. కానీ జూన్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
భారీ అంచనాలతో కుబేర.. విడుదల ఎప్పుడు..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించే పనిలో ఉన్నాడు. వాస్తవంగా ఈ మూవీ దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. -
'కుబేర' రిలీజ్ విషయంలో రిస్క్ చేస్తున్న మేకర్స్..
-
'కుబేర' మ్యూజికల్ గ్లింప్స్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన గ్లింప్స్ ఎలాంటి డైలాగ్స్ అయితే లేవు. కానీ, ధనుష్ పాత్రను మాత్రం బిచ్చగాడిగానే కాకుండా డబ్బున్న వ్యక్తిలా చూపించారు. 52 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రధాన హైలెట్గా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల కానుంది. -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్చరణ్ లుక్ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
అర్థాలే వేరులే!
ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ధనుష్, నాగార్జునల పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుష్ చూపులు దీనంగా ఉన్నట్లు, నాగార్జున తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇద్దరు చూపులకు అర్థాలేంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి. -
వినాయక చవితి నాడు విడుదలైన కొత్త పోస్టర్స్.. నెట్టింట వైరల్
ఏదైనా శుభకార్యం మొదలుపెడితే విఘ్నాలను తొలగిపోవాలని అందరూ వినాయకుడిని పూజిస్తారు. చిత్ర పరిశ్రమలో ఒక సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందంటే.. విఘ్నేశ్వరుడి పూజతోనే మొదలపెడుతారు. ఈ క్రమంలో వినాయకచవితి సందర్భంగా తాజాగా చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది. కొత్త సినిమా ప్రాజెక్ట్లకు సంబంధించిన పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. దేవర,కుబేరా,వేట్టయాన్ వంటి సినిమాల నుంచి అప్డేట్స్ ఇచ్చారు. సోషల్మీడియాలో వైరల్ అవుతున్న మీ అభిమాన హీరోల పోస్టర్లను చూసేయండి. -
సరికొత్త కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కుదిరితే ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్.ఆదివారం (జూలై 28) ధనుష్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కుబేర’ సినిమా నుంచి ధనుష్ కొత్తపోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్సర్భ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
డబ్బు ఎవరిది?
ఇక్కడ రష్మికా మందన్నా చేతిలో ఉన్న పెద్ద సూట్ కేసును చూశారుగా! ఈ సూట్కేసు నిండా డబ్బు కట్టలే. ఈ సూట్కేసును రాత్రి వేళ తవ్వి బయటకు తీశారు రష్మిక. మరి... ఈ డబ్బు ఎవరిది? రష్మికా మందన్నా ఇంత రహస్యంగా డబ్బును ఎందుకు తవ్వి తీశారు? అనే విషయాలు ‘కుబేర’ సినిమాలో తెలుస్తాయి.నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా, జిమ్ సర్ఫ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సోషల్ డ్రామాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. శుక్రవారం రష్మికా మందన్నా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. -
రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?
కన్నడ బ్యూటీ రష్మిక మరో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే కమర్షియల్ హీరోయిన్గా స్టార్ హోదా దక్కించుకుంది. 'పుష్ప'తో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. గతేడాది వచ్చిన 'యానిమల్'తో నటిగా తానేంటో నిరూపించింది. ఇప్పుడు 'కుబేర'తో మరోసారి సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అయిపోయింది.(ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్పై ప్రియురాలు సంచలన ఆరోపణలు..)శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తీస్తున్నట్లు తెలుస్తోంది. ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లుగా కాగా నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు. ఇదివరకే ధనుష్, నాగ్ ఫస్ట్ లుక్ వీడియోస్ రిలీజ్ చేశారు. తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేశారు. ఇప్పటివరకు చేయని పాత్ర ఏదో రష్మిక చేసినట్లు అనిపిస్తుంది.ఈ వీడియోలో రష్మిక.. ఓ గునపం తీసుకుని పాతిపెట్టిన సూట్ కేసుని బయటకు తీస్తుంది. అందులో కోట్లాది రూపాయల డబ్బు చూసి మురిసిపోతుంది. దాన్ని తీసుకుని వెళ్లిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్సిరీస్ రివ్యూ) -
క్షమాపణలు చెప్పిన హీరో నాగార్జున.. ఏమైందంటే?
కింగ్ నాగార్జున ఓ వ్యక్తికి క్షమాపణ చెప్పాడు. తన బాడీగార్డ్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఇదంతా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? నాగ్ ఎందుకు సారీ చెప్పాడు?(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?)నాగార్జున స్క్రీన్పై కనిపించి చాలా కాలమైపోయింది. సంక్రాంతికి ఓ సినిమాతో వచ్చాడు. ప్రస్తుతం 'కుబేర' అనే మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ సాగుతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ షెడ్యుల్ కోసం నాగార్జునతో పాటు ధనుష్ కూడా వచ్చారు. అయితే ఎయిర్పోర్ట్లో ఇద్దరు హీరోలు నడుచుకుని వస్తుండగా, అక్కడే షాపులో పనిచేస్తున్న ఓ వ్యక్తి సెల్ఫీ కోసమని నాగ్ దగ్గరకు వచ్చాడు.కానీ నాగ్ సెక్యురిటీ గార్డ్ మాత్రం పెద్దాయన అని కూడా చూడకుండా గట్టిగా తోసేశాడు. దీంతో కిందపడబోయిన ఆ పెద్దాయన తమాయించుకుని నిలబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా నాగ్ దృష్టికి కూడా వెళ్లింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ (ఎక్స్)లో నాగ్ క్షమాపణలు చెప్పాడు. మరోసారి ఇలా జరగకుండా చూస్తానని రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ డీటైల్స్.. అప్పటివరకు వెయిటింగ్ తప్పదా?)This just came to my notice … this shouldn’t have happened!! I apologise to the gentleman 🙏and will take necessary precautions that it will not happen in the future !! https://t.co/d8bsIgxfI8— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 23, 2024 -
దీపావళికి కుబేర?
ఈ దీపావళికి థియేటర్స్లోకి రానున్నాడట ‘కుబేర’. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. నాగార్జున–ధనుష్ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. -
యాక్షన్ కుబేర
‘కుబేర అండ్ కో యాక్షన్ మోడ్లోకి వెళ్లారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం తయారు చేయించిన ఓ స్పెషల్ సెట్లో ధనుష్–నాగార్జున పాల్గొంటుండగా, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్తో ‘కుబేర’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ‘‘చాలా వరకు టాకీ పార్టును పూర్తి చేశాం. ఒకవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు పోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ కూడా చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
డంప్యార్డ్లో ధనుష్.. ఫ్యాన్స్ అభినందనలు
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ముంబై మహానగరంలో అత్యంత భారీ డంప్యార్డ్లో ధనుష్తో ఒక సీన్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ ఆ డంప్ యార్డ్ను సెట్టింగ్స్తో క్రియేట్ చేయాలని అనుకున్నారట. అయితే సినిమాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ సీన్ను సహజంగా రావడం కోసం డంప్ యార్డ్లోనే షూటింగ్ చేద్దామని ధనుష్ చెప్పడమే కాకుండా.. అందుకు తగ్గట్లుగా సుమారు 10 గంటల పాటు మాస్క్ లేకుండానే డంప్యార్డ్లో ధనుష్ నటించారట. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ధనుష్ను అభినందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్లో కూడా ధనుష్ డీగ్లామరైజ్గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనున్న నాగార్జున ఫస్ట్ లుక్ను కూడా మీకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నాగ్ను చూసిన ఆయన ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కుబేర ఇదే ఏడాదిలో విడుదల కానుంది. -
నోటు కథేంటి?
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ని విడుదల చేశారు. వర్షం కురుస్తుండగా గొడుగు పట్టుకుని నిల్చున్నారు నాగార్జున. ఆయన వెనకవైపు డబ్బు నోట్ల కట్టలు ఉన్న కంటైనర్ కనిపిస్తోంది. కాగా.. ఓ ఐదువందల రూపాయల నోటు కింద పడి ఉండటాన్ని చూసిన నాగార్జున తన పర్సులోంచి ఓ నోటుని తీసి, ఆ కంటైనర్లో పెడతారు. మరి.. ఆ నోటు వెనక కథేంటి అనేది సినిమాలో చూడాల్సిందే. ‘‘వైవిధ్యమైన కథాంశంతో ‘కుబేర’ రూపొందుతోంది. ఈ చిత్రం కోసం బ్యాంకాక్లో నాగార్జున, ఇతర నటీనటులపై కొంత టాకీ, యాక్షన్ పార్ట్ చిత్రీకరించాం. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. -
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'కుబేర'. ఈ సినిమా నుంచి ఇప్పటికే ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా కింగ్ నాగార్జున లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.కుబేర సినిమాలో ధనుష్ కొంత సమయం పాటు రిచ్గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ, ధనుష్ ఫస్ట్ లుక్లో మాత్రం బిచ్చగాడి పాత్రలో కనిపించారు. నాగార్జున మాత్రం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం నాగార్జున అభిమానులతో పాటు ధనుష్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేస్తామని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పారు. -
ముంబైలో కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ముంబైలోప్రారంభం అయింది. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట శేఖర్ కమ్ముల. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
వివాదంలో శేఖర్ కమ్ముల కుబేర..
-
‘శివ... శివా...’ అంటూ శివనామాన్ని స్మరిస్తున్న టాలీవుడ్ స్టార్స్
భక్తి కలిసిన చిత్రాల్లో స్టార్స్ కనిపించడం చాలా తక్కువ. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. డివోషన్ ప్లస్ కమర్షియల్ మిక్స్ అయిన కథలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరహా చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో ‘శివుడు’ నేపథ్యంలో సాగే కథలు, శివుడి ప్రస్తావన కాసేపు ఉండే కథలు ఉన్నాయి. ‘శివ... శివా...’ అంటూ శివుడి నేపథ్యంలో భక్తి భావంతో రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. కన్నప్ప విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్పై మంచు మోహన్బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మోహన్బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప కథను ‘కన్నప్ప’ ద్వారా వెండితెరకు తీసుకొస్తు్తన్నారు. ఈ చిత్రంలో శివుడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారని సమాచారం. ఈ వార్తలు ఆ మధ్య హల్ చల్ చేయగా ‘హర హర మహాదేవా’ అంటూ రిప్లై ఇస్తూ పరోక్షంగా హింట్ ఇచ్చారు విష్ణు మంచు. ఈ విషయం గురించి మేలో అధికారిక ప్రకటన రావొచ్చని కూడా తాజాగా విష్ణు మంచు స్పందించారు. దీంతో ‘కన్నప్ప’లో శివుడి పాత్రలో ప్రభాస్ నటించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటివరకు మాస్ యాక్షన్ హీరోగా, లవర్ బాయ్గా నటించిన ప్రభాస్ ఇటీవలే ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడిగా కనిపించారు. ఇప్పుడు ‘కన్నప్ప’ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారు. ఇక శివుడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటారో అంటూ ఏఐ టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ఉన ్న ప్రభాస్ పోస్టర్లను డిజైన్ చేసి, నెట్టింట షేర్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ శివుడి రూపంలో ప్రభాస్ లుక్ సూపర్గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పార్వతీదేవి పాత్రలో నయనతార కనిపిస్తారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కన్నప్ప’ విడుదల కానుంది. కుబేర ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. అయితే ఫస్ట్ లుక్ మాత్రం టైటిల్కు భిన్నంగా ఉండటంతో పాటు ఆశ్చర్యపరిచేలా ఉంది. కుబేరుడు డబ్బులు ప్రసాదించే దేవుడు. కాగా ఫస్ట్ లుక్లో ధనుష్ సరైన కాస్ట్యూమ్ లేని పేదవాడిలా కనిపిస్తారు, ఆహార దేవత అన్నపూర్ణాదేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో కూడా పోస్టర్లో ఉంది. అంటే ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందనుకోవచ్చు. హరోం హర ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరో సుధీర్ బాబు. తాజాగా ఆయన నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్’ అనేది ట్యాగ్లైన్. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ హీరోయిన్ గా నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ సినిమా కథనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేపథ్యంలో సాగుతుంది. పైగా ఈ మూవీలో హీరో పేరు కూడా సుబ్రహ్మణ్యమే కావడం విశేషం. ఈ చిత్రానికి ‘హరోం హర’ టైటిల్ ఫిక్స్ చేశారంటే శివుడి నేపథ్యం ఎంతో కొంత ఉంటుందని ఊహించవచ్చు. ఎందుకంటే.. పరమశివుడి తనయుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పుత్రుడి కథ చెప్పే క్రమంలో తండ్రి కథని టచ్ చేసుంటారనుకోవచ్చు. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’లో సుధీర్ బాబు చిత్తూరు యాసలోనే మాట్లాడతారు. ఈ వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓదెల 2 తమన్నా పేరు చెప్పగానే గ్లామరస్ హీరోయిన్ గుర్తొస్తారు. తన నటన.. ప్రత్యేకించి తన అద్భుతమైన డ్యాన్సుతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు తమన్నా. ప్రస్తుతం ఆమె శివుడి నేపథ్యంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’ వంటి హిట్ సినిమాకి సీక్వెల్గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్లపై డి. మధు ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కాశీలో మొదలైంది. ఈ చిత్రంలో శివశక్తిగా తమన్నా నటిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివశక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగసాధువు వేషంలో కనిపించారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడాడు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. -
బ్యాంకాక్లో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ని బ్యాంకాక్లో ్ర΄ారంభించారు. ‘‘సరికొత్త కథాంశంతో రూ΄÷ందుతున్న చిత్రం ‘కుబేర’. బ్యాంకాక్లో ్ర΄ారంభించిన షెడ్యూల్లో నాగార్జునతో ΄ాటు మరికొందరు నటీనటులపై కొన్ని టాకీ, యాక్షన్ ΄ార్ట్లు చిత్రీకరించనున్నాం. భారీ స్థాయిలో రూ΄÷ందుతున్న ఈ సినిమా ఇంతకుముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి.