
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం కుబేర. ఈ మూవీకి విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ధనుశ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటించారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాగార్జున ఎవరి కాళ్లకు దండ పెట్టడు.. ఒక్క ఆయనకు తప్పా.. అని అన్నారు.
మెగాస్టార్ మాట్లాడుతూ..'నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క ఆయన మీ నాన్నగారి( సునీల్ నారంగ్ తండ్రి నారాయణ్దాస్ నారంగ్) కాళ్లకు తప్పా. నాకు ఆయన అంతే ఇష్టం. ఆయన గౌరవాన్ని నిలబెడుతూ మీరిద్దరు కూడా వెళ్లడం చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా థర్డ్ జనరేషన్ జాన్వీ కూడా అదే బాటలో వెళ్తోంది. మళ్లీ మాతో సినిమా చేయొచ్చు కదా అని సునీల్ నారంగ్ నాతో అన్నారు. మా నాన్నగారు మీ సినిమాలు చేసి బాగా డబ్బులు సంపాదించాం. కానీ ఆ తర్వాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పెట్టిన తర్వాత మీకు సినిమాలు రాకుండా పోయాయి కదా (నవ్వుతూ). ఇక మీ మూడో తరం నిర్మాత జాన్వీకి ఆల్ ది బెస్ట్. ఇక జాన్వీతో కూడా సినిమా చేస్తే మూడు జనరేషన్స్తో చేసినట్లవుతుందని' చిరంజీవి అన్నారు.