
రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన 'కుబేర' సినిమాకు అన్నివైపుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఆదివారం రాత్రి బ్లాక్బస్టర్ సక్సెస్ మీట్ పేరిట ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఈ కార్యక్రమంలోనే మాట్లాడిన హీరోయిన్ రష్మిక.. తన యాక్టింగ్, చిరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రతి సినిమా ఒప్పుకొనేటప్పుడు చాలా విషయాలు ఆలోచిస్తుంటానని, కానీ 'కుబేర' విషయంలో అలా చేయలేదని రష్మిక చెప్పుకొచ్చింది. అలానే సెట్లో అడుగుపెట్టిన తర్వాత దర్శకుడికి సరెండర్ అయిపోయానని తెలిపింది. తాను నటించగలనని శేఖర్ కమ్ముల నిరూపించారని చెప్పింది. రీసెంట్గా సినిమా చూసిన వెంటనే.. 'ఓ మై గాడ్. ఎప్పుడూ మీ ఫెర్ఫార్మెన్స్కి ఫిదా' అని ధనుష్ సర్కి మెసేజ్ చేసినట్లు తెలిపింది. అలానే తన తొలి తెలుగు మూవీ నుంచి చిరంజీవిగారు తన సినీ ప్రయాణంలో భాగమైపోయారని రష్మిక పేర్కొంది.
(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)

రష్మిక చెప్పినట్లు ఇదివరకు చేసిన సినిమాల్లో ఈమె ఫెర్ఫార్మెన్స్ బాగానే చేసింది. కానీ 'కుబేర'లో పాత్ర నిడివి తక్కువైనప్పటికీ డిఫరెంట్ రోల్లో ఆకట్టుకుంది. ధనుష్, నాగార్జున యాక్టింగ్తో పాటు రష్మిక గురించి కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. వరస పెట్టి పాన్ ఇండియా హిట్స్ కొడుతోందని అనుకుంటున్నారు. ఎందుకంటే యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇప్పుడు 'కుబేర'తో బ్లాక్ బస్టర్ హీరోయిన్ అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక మేనియా నడుస్తోంది.
'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?)