కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమతా బైజు హీరోయిన్గా నటించింది. మధ్య వయస్కుడితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్ టైమ్లో ఎదురైన భయానక అనుభవాన్ని షేర్ చేశారు. ఊటీలో ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు సెట్స్లోకి చిరుతపులి వచ్చిందని తెలిపారు. అది తమ కళ్ల ముందు నుంచే వెళ్లిందని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా గడ్డ కట్టే చలిలో 102-103 ఫీవర్తో సూర్య, మమిత బైజు దాదాపు 11 రోజుల పాటు ఊటీలోనే షూట్లో పాల్గొన్నారని వెంకీ తెలిపారు. కాగా..ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.


