
అక్కినేని నాగార్జున, ధనుశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో నాగార్జున కూడా పాల్గొంటున్నారు. తాజాగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగార్జునను హీరో నాగచైతన్య ఇంటర్వ్యూ చేశారు.
ఈ సందర్భంగా వీరిద్దరిని నాగచైతన్య సరదా ప్రశ్నలు అడిగారు. మీ చిన్నప్పుడు నాన్న పాకెట్ నుంచి ఎంత మనీ కొట్టేశారు? అంటూ చైతూ ఇద్దరినీ ప్రశ్నించారు. దీనికి శేఖర్ కమ్ముల ఆసక్తికర సమాధానమిచ్చారు. పతంగులు కొనేందుకు 50 పైసలు తీసుకునేవాడిని డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత నాన్న జేబు నుంచి రూపాయి, రెండు రూపాయల నోట్లు తీసుకునేవాడినని నాగార్జున వెల్లడించారు. అప్పుడు వాళ్ల పాకెట్లో కూడా అంతే ఉండేవని.. పెద్ద నోటు అంటే అప్పట్లో కేవలం పది రూపాయలేనని నాగార్జున అన్నారు. ఆ తర్వాత నా టైమ్లో బిగ్ నోట్ 500 రూపాయలని నాగచైతన్య నవ్వుతూ మాట్లాడారు. కాగా.. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగచైతన్య- సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ మూవీలో నటించారు.