-
యువరాజ్ సింగ్ పోరాటం వృధా.. లెజెండ్స్ టైటిల్ నెగ్గిన ఉతప్ప జట్టు
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న తొలి లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీని రాజస్థాన్ కింగ్స్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో రాబిన్ ఉతప్ప సారధ్యం వహిస్తున్న రాజస్థాన్.. యువరాజ్ సింగ్ నాయకత్వంలోని న్యూయార్క్ సూపర్స్టార్ స్ట్రయికర్స్ను 20 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూయార్క్ను గెలిపించేందకు యువరాజ్ సింగ్ చివరివరకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఆష్లే నర్స్ (41 బంతుల్లో 97), హ్యామిల్టన్ మసకద్జ (30 బంతుల్లో 56) చెలరేగడంతో నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూయార్క్ బౌలర్లలో జేరోమ్ టేలర్ 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ ప్రదీప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూయార్క్.. యువరాజ్ సింగ్ మెరుపు అర్దశతకంతో (22 బంతుల్లో 54) మెరిసినప్పటికీ ఓటమిపాలైంది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూయార్క్ ఇన్నింగ్స్లో కపుగెదెర (30), గుణరత్నే (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో పర్విందర్ అవానా, జకాతి, బిపుల్ శర్మ, చతురంగ డిసిల్వ, ఆష్లే నర్స్ తలో వికెట్ పడగొట్టారు. -
సిక్సర్ల మోత మోగించిన రాబిన్ ఉతప్ప.. కేవలం 34 బంతుల్లోనే..!
శ్రీలంకలో జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024లో భాగంగా దుబాయ్ జెయింట్స్తో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ కింగ్స్ కెప్టెన్ రాబిన్ ఉతప్ప శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్లో ఉతప్ప సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఉతప్పతో పాటు హమిల్టన్ మసకద్జ (19 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), చతురంగ డిసిల్వ (19 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో పెరీరా (16 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ కింగ్స్ నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. దుబాయ్ బౌలర్లలో పవన్ సుయాల్,సెక్కుగే ప్రసన్న, సచిత్ పతిరణ తలో వికెట్ పడగొట్టారు. ఈ లీగ్లో రాబిన్ ఉతప్ప భీకర ఫామ్లో ఉన్నాడు. 6 మ్యాచ్ల్లో నాలుగు అర్దసెంచరీలు సాధించాడు. -
తొందరపాటు తగదు.. మళ్లీ గాయపడితే అంతే సంగతులు!
IPL 2024- Rishabh Pant : టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పునరాగమనంపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే పంత్ బరిలోకి దిగాలని.. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా 2022, డిసెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. దాదాపు ఏడాదిన్నరకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన అతడు.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. క్రమక్రమంగా కోలుకుని నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన పంత్.. ఐపీఎల్-2024 సీజన్తో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. అందుకు అనుగుణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈసారి పంత్ తమ జట్టు కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపడతాడని తెలిపింది. అయితే, తొలి అర్ధ భాగంలో కేవలం బ్యాటర్గానే బరిలోకి దిగుతాడని.. వికెట్ కీపింగ్ చేయడని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. పంత్ రీఎంట్రీ విషయంలో హడావుడి వద్దని బీసీసీఐ కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టుకు దూరంగా ఉండాలంటే కష్టమే.. ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. ‘‘ఏడాదిన్నర కాలంగా జట్టుకు దూరంగా ఉండటం కష్టమే. అయితే, పూర్తిగా కోలుకోకముందే హడావుడిగా మైదానంలో దిగాలని భావిస్తే మళ్లీ గాయపడే అవకాశం ఉంది. అదే జరిగితే భారీ మూల్యం చెల్లించకతప్పదు. అప్పుడు మళ్లీ బెంచ్కే పరిమితం కావాలంటే చిరాకుగా ఉంటుంది. కాబట్టి పునరాగమనం విషయంలో ఆచితూచి.. ఆలోచించుకుని.. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటేనే పంత్ మళ్లీ బ్యాట్ పట్టాలి. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోసం! అతడు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తాడు. నెట్స్లో బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయడం శుభపరిణామం. ఏదేమైనా రీఎంట్రీ విషయంలో తొందరపాటు వద్దు’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్సైడ్స్పోర్ట్తో రాబిన్ ఊతప్ప తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఐపీఎల్లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పంత్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: టీమిండియా స్టార్ సంచలన నిర్ణయం?! -
రిటైరయ్యాక కూడా విదేశీ లీగ్ల్లో ఆడొద్దంటే ఎలా..? బీసీసీఐ అంక్షలపై రాబిన్ ఉతప్ప ఫైర్
రిటైరయ్యాక కూడా భారత క్రికెటర్లు విదేశీ లీగ్ల్లో పాల్గొనకుండా ఉండేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) త్వరలో ఓ కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. కూలింగ్ ఆఫ్ పీరియడ్గా పిలువబడే ఈ నిబంధన అమల్లోకి వస్తే భారత ఆటగాళ్లు రిటైరయ్యాక కూడా విదేశీ లీగ్ల్లో పాల్గొనడానికి వీలు ఉండదు. ఈ నిబంధనపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.. దీన్ని త్వరలోనే అమల్లోకి తెస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఆటగాడు రాబిన్ ఉతప్ప స్పందించాడు. బీసీసీఐ గనక ఈ నిబంధనను అమల్లో తెస్తే ఇప్పుడిప్పుడే రిటైర్డ్ అయిన క్రికెటర్లు చాలా నష్టపోతారని అన్నాడు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది రిటైర్డ్ క్రికెటర్లకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని, ఇది చాలా అన్యామని తెలిపాడు. భారత రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐతో ఎలాంటి కాంట్రాక్ట్ ఉండదు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ లీగ్లో అయినా పాల్గొనే హక్కు వారికి ఉంటుంది, ఈ విషయంలో బీసీసీఐ కఠినంగా వ్యవహరించదని అనుకుంటున్నా అంటూ ఇటీవల పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తుందని భావిస్తున్నానని తెలిపాడు. కాగా, ఐపీఎల్ మినహా ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్ల్లో పాల్గొనేందుకు బీసీసీఐతో ఒప్పంద ఉన్న భారత క్రికెటర్లకు అనుమతి లేదన్న విషయం తెలిసిందే. విదేశీ లీగ్ల్లో పాల్గొనేందుకు ఉన్ముక్త్ చంద్ లాంటి క్రికెటర్లు బీసీసీఐతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రస్తుతం బీసీసీఐతో ఎలాంటి అనుబంధం లేని భారత మాజీ క్రికెటర్లు (ఉతప్ప, పఠాన్ సోదరులు, శ్రీశాంత్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్ని) పలు విదేశీ లీగ్ల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు బీసీసీఐ ఈ విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని భావించాలని తెలుస్తుంది. భారత ఆటగాళ్లు విదేశీ లీగ్ల్లో పాల్గొంటే ఐపీఎల్కు ఉన్న క్రేజ్ పడిపోతుందని భావిస్తున్న బీసీసీఐ, రిటైర్డ్ ఆటగాళ్లను విదేశీ లీగ్ల్లో పాల్గొనకుండా అంక్షలు విధిస్తుంది. ఇందులో భాగంగానే కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధనను అమల్లోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, కూలింగ్ ఆఫ్ పీరియడ్పై స్పందించిన రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉతప్ప ఇటీవల ముగిసిన జింబాబ్వే టీ10 లీగ్లోనూ, అంతకుముందు యూఏఈలో జరిగిన ఇంటర్నేషనల్ టీ20 లీగ్లోనూ పాల్గొన్నాడు. -
రాబిన్ ఉతప్ప విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్లతో! వీడియో వైరల్
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్లో ఫైనల్ చేరడంలో హరారే హరికేన్స్ జట్టు విఫలమైంది. డర్బన్ క్వాలండర్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో 4 వికెట్ల తేడాతో డర్బన్ క్వాలండర్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి హరారే నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది. హరారే బ్యాటర్లలో సమిత్ పటేల్(39) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. డర్బన్ బౌలర్లో ఈవెన్స్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 83 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి డర్బన్ ఛేదించింది. దీంతో తమ ఫైనల్ బెర్త్ను డర్బన్ ఖారారు చేసుకుంది. జూలై 29న జరగనున్న ఫైనల్లో జోబర్గ్ బఫెలోస్ , డర్బన్ జట్లు తలపడనున్నాయి. రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప.. ఇక అంతకుముందు కేప్ టౌన్ సాంప్ ఆర్మీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో భారత మాజీ ఆటగాడు, హరారే హరికేన్స్ కెప్టెన్ రాబిన్ ఉతప్ప ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్లతో 88 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఉతప్ప విద్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగడంతో.. 146 లక్ష్యాన్ని హరికేన్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. అతడితో పాటు ఫెరీరా(35) రాణించాడు. అయితే ఎలిమినేటర్లో అద్బుత విజయం సాధించినప్పటికీ.. క్వాలిఫయర్-2లో ఓటమి పాలకావడంతో హరారే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. కాగా ఉతప్ప ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Ashes 2023 Steve Smith Run Out Video: ఔటని వెళ్లిపోయిన స్మిత్.. ఇంగ్లండ్ కొంపముంచిన బెయిర్ స్టో తప్పిదం! వీడియో వైర -
రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప.. సరిపోని ఫ్లెచర్ మెరుపులు
జింబాబ్వే టీ10 లీగ్లో టీమిండియా వెటరన్ ఆటగాడు, హరారే హరికేన్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప తొలి అర్ధశతకం బాదాడు. డర్బన్ ఖలందర్స్తో నిన్న (జులై 26) జరిగిన మ్యాచ్లో రెచ్చిపోయిన ఉతప్ప.. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. అతనితో పాటు చకబ్వా (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డొనవాన్ ఫెరియెరా (12 బంతుల్లో 24 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో హరికేన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఖలందర్స్ బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, అజ్మతుల్లా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా హరికేన్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆండ్రీ ఫ్లెచర్ (25 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (28 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఖలందర్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. హరికేన్స్ బౌలర్ లూక్ జాంగ్వే 2 వికెట్లు పడగొట్టాడు. మెరిసిన కాలా.. నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్ల్లో కేప్టౌన్ సాంప్ ఆర్మీపై బులవాయో బ్రేవ్స్.. జోబర్గ్ బఫెలోస్పై కేప్టౌన్ విజయాలు సాధించాయి. కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. ఇన్నోసెంట్ కాలా (52 నాటౌట్), వెబ్స్టర్ (23 నాటౌట్) రాణించడంతో 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా, ఛేదనలో గట్టి పోటీ ఇచ్చిన కేప్టౌన్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో (122/4) నిలిచిపోయింది. రాణించిన హఫీజ్, బొపారా.. కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో మహ్మద్ హఫీజ్ (40 నాటౌట్), రవి బొపారా (30 నాటౌట్) రాణించడంతో జోబర్గ్ బఫెలోస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేప్టౌన్.. ముజరబాని (3/7), న్యాయుచి (2/11), డాలా (1/17) ధాటికి 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగా.. హఫీజ్, బొపారా రాణించడంతో బఫెలోస్ టీమ్ 6.5 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. -
సరిపోని టిమ్ సీఫర్ట్ మెరుపులు.. ఇర్ఫాన్ పఠాన్ ఊచకోత
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్లో డర్బన్ ఖలందర్స్కు ఆడుతున్న న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సీఫర్ట్కు నిక్ వెల్చ్ (9 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడవ్వడంతో డర్బన్ ఖలందర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఖలందర్స్ ఇన్నింగ్స్లో హజ్రతుల్లా జజాయ్ (3), ఆండ్రీ ఫ్లెచర్ (2) విఫలం కాగా.. ఆసిఫ్ అలీ (18; 2 సిక్సర్లు) కాసేపు అలరించాడు. హరారే బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టగా.. సమిత్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. Irfan Pathan rolling back the 🕰️ for some Sunday entertainment! #ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/OV44qCpSeG — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరారే హరికేన్స్.. కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం వెరవక ఖలందర్స్కు ధీటైన సమాధానం ఇచ్చింది. ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ రెగిస్ చకబ్వా (22 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. వీరికి డొనవన్ ఫెరియెరా (16; 2 సిక్సర్లు), మహ్మద్ నబీ (19; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. హరారే ఇన్నింగ్స్లో రాబిన్ ఉతప్ప (1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (2) విఫలమయ్యారు. ఖలందర్స్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 2, బ్రాడ్ ఈవాన్స్, జార్జ్ లిండే, టెండాయ్ చటారా తలో వికెట్ పడగొట్టారు. Seifert Storm in Harare! 🌪️#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/DvxQ84T4hr — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 -
రాణించిన ఉతప్ప.. నిరాశపరిచిన పఠాన్ సోదరులు
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్లో భారత వెటరన్ ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. ఈ లీగ్లో మొత్తం ఆరుగురు భారత వెటరన్లు పాల్గొంటుండగా.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్ల్లో కేప్టౌన్ కెప్టెన్ పార్థివ్ పటేల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలం కాగా.. హరారే ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ (4), బౌలింగ్ (1-0-21-0) విభాగాల్లో దారుణంగా నిరాశపరిచాడు. భారత ఆటగాళ్లలో హరారే ఆటగాడు రాబిన్ ఉతప్ప (31) ఒక్కడే పర్వాలేదనిపించాడు. కేప్ హరారే హరికేన్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టౌన్ సాంప్ ఆర్మీ.. రహ్మానుల్లా గుర్భాజ్ (25) ఓ మోస్తరు స్కోర్ చేయడంతో నిర్ణీత 10 ఓవర్లలో 112/7 స్కోర్ చేయగా.. హరారే హరికేన్స్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 97/6 స్కోర్ చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డర్బన్ ఖలందర్స్తో జరిగిన మరో మ్యాచ్లో జోబర్గ్ బఫెలోస్ ఆటగాడు, భారత మాజీ ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ సైతం తేలిపోయాడు. అతను 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్.. టామ్ బాంటన్ (55 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేయగా.. డర్బన్ ఖలందర్స్మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హజ్రతుల్లా జజాయ్ (41 నాటౌట్) డర్బన్ను గెలిపించాడు. నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో కేప్టౌన్ సాంప్ ఆర్మీ.. బులవాయో బ్రేవ్స్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. బెన్ మెక్డెర్మాట్ (27) రాణించడంతో 10 ఓవర్లలో 86 పరుగులు చేయగా.. 21 బంతుల్లో 43 పరుగులు చేసిన మరుమాని సాంప్ ఆర్మీని గెలిపించాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్రో టీ10 లీగ్లో భారత ఆటగాళ్లు పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ (కేప్టౌన్ సాంప్ ఆర్మీ), రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ (హరారే హరికేన్స్), యూసఫ్ పఠాన్ (జోబర్గ్ బఫెలోస్) పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
టీ10 లీగ్లో ఆడనున్న రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్
జింబాబ్వే క్రికెట్ తొలిసారిగా "జిమ్ ఆఫ్రో టీ10" పేరుతో ఓ ప్రాంఛైజీ లీగ్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్లో మొత్తం ఐదు జట్లు భాగం కానున్నాయి. డర్బన్ క్వాలండర్స్, కేప్టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. తాజాగా ఆయా ఫ్రాంచైజీలు తమ జట్లను ఖారారు చేశాయి. కాగా ఈ టీ10 లీగ్లో రాబిన్ ఊతప్ప, పార్ధివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, యూసప్ ఫఠాన్, రాహుల్ చోప్రా, స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్ వంటి భారత మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ హరారే హరికేన్స్కు ప్రాతినిధ్యం వహించనుండగా.. పార్ధివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ కేప్టౌన్ సాంప్ ఆర్మీకి, రాహుల్ శర్మ, యూసప్ ఫఠాన్ జోహన్నెస్బర్గ్ బఫెలోస్ తరపున ఆడనున్నారు. అదే విధంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ హాఫీజ్ కూడా ఈ లీగ్లో భాగం కానున్నారు. డర్బన్ క్వాలండర్స్: ఆసిఫ్ అలీ, మహ్మద్ అమీర్, జార్జ్ లిండే, హజ్రతుల్లా జజాయ్, టిమ్ సిఫెర్ట్, సిసంద మగాలా, హిల్టన్ కార్ట్రైట్, మీర్జా తాహిర్ బేగ్, తయాబ్ అబ్బాస్, క్రెయిగ్ ఎర్విన్, టెండై చతారా, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదాండే, నిక్ వెల్చ్, ఆండ్రీ ఫ్లెచర్ హరారే హరికేన్స్: మహ్మద్ నబీ, ఎవిన్ లూయిస్, రాబిన్ ఉతప్ప, డోనోవాన్ ఫెరైరా, షాజావాజ్ దహానీ, డువాన్ జాన్సెన్, సమిత్ పటేల్, కెవిన్ కొత్తెగోడ, క్రిస్టోఫర్ మ్ఫోఫు, రెగిస్ చకబ్వా, ల్యూక్ జోన్వే, బ్రాండన్ మవుతా, తషింగా ముషివా, ఇర్ఫాన్ పఠాన్, యూసప్ ఫఠాన్,శ్రీశాంత్ జోహన్నెస్బర్గ్ బఫెలోస్: ముష్ఫికర్ రహీమ్, ఓడియన్ స్మిత్, టామ్ బాంటన్, యూసుఫ్ పఠాన్, విల్ స్మీద్, నూర్ అహ్మద్, రవి బొపారా, ఉస్మాన్ షిన్వారీ, జూనియర్ డలా, బ్లెస్సింగ్ ముజారబానీ, వెల్లింగ్టన్ మసకద్జా, వెస్లీ మాధేవెరే, విక్టర్ న్యౌచి, మిల్టన్ శుంబా, మొహమ్మద్ హఫీజ్, రాహుల్ చోప్రా. బులవాయో బ్రేవ్స్: సికిందర్ రజా, తస్కిన్ అహ్మద్, ఆష్టన్ టర్నర్, టైమల్ మిల్స్, తిసారా పెరెరా, బెన్ మెక్డెర్మాట్, బ్యూ వెబ్స్టర్, పాట్రిక్ డూలీ, కోబ్ హెర్ఫ్, రేయన్ బర్ల్, టిమిసెన్ మరుమా, జాయ్లార్డ్ గుంబీ, ఇన్నోసెంట్ కైయా, ఫరాజ్ అక్రమ్ , ముజీబ్ ఉర్ రెహ్మాన్. కేప్టౌన్ సాంప్ ఆర్మీ: రహ్మానుల్లా గుర్బాజ్, షాన్ విలియమ్స్, భానుక రాజపక్స, మహేశ్ తీక్షణ, షెల్డన్ కాట్రెల్, కరీం జనత్, చమికా కరుణరత్నే, పీటర్ హజ్లోగౌ, మాథ్యూ బ్రీట్జ్కే, రిచర్డ్వాకా న్గరావా, రిచర్డ్వాకా న్గరావా, తద్శ్వాని మారుమణి, తినాషే కమునకేవే, పార్థివ్ పటేల్, మొహమ్మద్ ఇర్ఫాన్, స్టువర్ట్ బిన్నీ చదవండి: Ashes 2023: బెయిర్స్టో స్టంపౌట్ ఉదంతం.. ప్రధాని సైతం స్పందించారు..! -
గ్లామర్లో తగ్గేదేలే! భారత క్రికెటర్ భార్య.. ఈమె ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
-
ఉతప్ప ఊచకోత.. గంభీర్ గర్జన
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో ఇండియా మహారాజాస్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ప్రస్తుత ఎడిషన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైన మహారాజాస్.. నిన్న (మార్చి 14) ఆసియా లయన్స్తో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన మహారాజాస్.. లయన్స్ను 157 పరుగులకు కట్టడి చేసింది. A great feeling to get the first win under the belt 💪🏾 Always a pleasure to bat along with my brother @GautamGambhir !! pic.twitter.com/uUSU54NMfN — Robin Aiyuda Uthappa (@robbieuthappa) March 14, 2023 ఉపుల్ తరంగ (48 బంతుల్లో 69; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలకరత్నే దిల్షన్ (27 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్), అబ్దుర్ రజాక్ (17 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లయన్స్ ఇన్నింగ్స్లో మహ్మద్ హఫీజ్ (2), కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ (0), అస్ఘర్ అఫ్ఘాన్ (15) విఫలం కాగా.. మహారాజాస్ బౌలర్లలో సురేశ్ రైనా 2, స్టువర్ట్ బిన్నీ, హర్భజన్ సింగ్, ప్రవీణ్ తాంబే తలో వికెట్ పడగొట్టారు. .@GautamGambhir is still on the top for @rariohq Boss Cap Holder for the highest runs. @VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/95wb1UmUn2 — Legends League Cricket (@llct20) March 14, 2023 అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మహారాజస్.. వికెట్ కూడా నష్టపోకుండానే విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (39 బంతుల్లో 88 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (36 బంతుల్లో 61 నాటౌట్; 12 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 12.3 ఓవర్లలోనే ఇండియా మహారాజాస్ విజయం సాధించారు. .@harbhajan_singh bounce back to his top spot for @rariohq Boss Cap Holder for the most wickets after tonight’s game!@VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/f3JVRL10VR — Legends League Cricket (@llct20) March 14, 2023 లయన్స్ బౌలర్లను ఉతప్ప ఊచకోత కోయగా, గంభీర్ ప్రత్యర్ధి బౌలర్లపై సింహగర్జన చేశాడు. గంభీర్కు ఈ సీజన్లో ఇది వరుసగా 3వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. లీగ్లో తదుపరి మ్యాచ్లో ఇవాళ (మార్చి 15) వరల్డ్ జెయింట్స్ జట్టు.. ఇండియా మహారాజాస్తో తలపడనుంది. Match Day 5: A duel reloaded! ⚡ Will the Maharajas win back-to-back and cease the top spot? Or will the Giants topple the Maharajas back to bottom? Tune in tonight at 8 PM IST to find out! @VisitQatar#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/jRB3xzdu88 — Legends League Cricket (@llct20) March 15, 2023 కాగా, లీగ్లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్ల్లో రెండింటిలో ఆసియా లయన్స్, ఒక మ్యాచ్లో వరల్డ్ జెయింట్స్ విజయం సాధించగా.. ఇండియా మహారాజాస్ ఆడిన 3 మ్యాచ్ల్లో ఓ విజయం సాధించింది. లీగ్ తొలి మ్యాచ్లో ఆసియా లయన్స్ చేతిలో ఖంగుతిన్న (9 పరుగుల తేడాతో ఓటమి) మహారాజాస్.. రెండో మ్యాచ్లో వరల్డ్ జెయింట్స్ చేతిలో (2 పరుగుల తేడాతో ఓటమి) ఓటమిపాలయ్యారు. నిన్న ఆసియా లయన్స్పై గెలుపొందడంతో మహారాజాస్ టీమ్ బోణీ విజయం సాధించింది. Points Table Update after Match Day 4. The table has changed on the lower half! Maharajas make a majestic leap to second place while Asia Lions hold their ground at the top.@VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/XSHt2svlBK — Legends League Cricket (@llct20) March 14, 2023 -
వరుస మెరుపు ఇన్నింగ్స్లతో రెచ్చిపోతున్న రాబిన్ ఉతప్ప
ఇంటర్నేషనల్ లీగ్ టీ20, 2023 (దుబాయ్) సీజన్లో టీమిండియా మాజీ క్రికెటర్, దుబాయ్ క్యాపిటల్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప వరుస మెరుపు ఇన్నింగ్స్లతో రెచ్చిపోతున్నాడు. అబుదాబీ నైట్రైడర్స్తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన రాబీ.. ఇవాళ (జనవరి 16) గల్ఫ్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో 46 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 79 పరుగులు చేశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. A brilliant innings by @robbieuthappa some sensational shots on display pic.twitter.com/E15dDxGVef— International League T20 (@ILT20Official) January 16, 2023 దుబాయ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ రోవమన్ పావెల్ (25 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సికందర్ రజా (19 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. జో రూట్ (6), భానుక రాజపక్స (3), దసున్ షనక (2), రవి బొపారా (2), ఇసురు ఉడాన (2) నిరాశపరిచారు. ఆఖర్లో హజ్రత్ లుక్మాన్ (3 బంతుల్లో 10) వరుస బంతుల్లో ఫోర్, సిక్సర్ బాదడంతో క్యాపిటల్స్ జట్టు 180 పరుగుల మార్కును దాటింది. గల్ప్ జెయింట్స్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ గ్లీసన్ 2, సంచిత్ శర్మ, డేవిడ్ వీస్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సీజన్లో రాబిన్ ఉతప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ అద్భుతమ ప్రదర్శనతో ముందుకెళ్తుంది. తొలి మ్యాచ్లో అబుదాబీ నైట్రైడర్స్ను 73 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన ఈ జట్టు.. తాజాగా గల్ఫ్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ భారీ స్కోర్ సాధించి, మరో విజయానికి బాటలు వేసుకుంది. -
దుబాయ్ ప్రీమియర్ లీగ్ మొదలైంది.. తొలి మ్యాచ్లోనే నైట్ రైడర్స్కు షాక్
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్), బీబీఎల్ (బిగ్బాష్ లీగ్, ఆస్ట్రేలియా), బీపీఎల్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్), పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్), ఎస్ఏ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్) తరహాలోనే యూఏఈ వేదికగా మరో టీ20 లీగ్ ప్రారంభమైంది. అంతర్జాతీయ స్టార్లతో నిండిన ఈ లీగ్కు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)గా నామకరణం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ తరహాలోనే ఈ లీగ్లోనూ 6 జట్లు పోటీపడుతున్నాయి. One for the history books 📖@Dubai_Capitals WIN THE FIRST #DPWorldILT20 GAME 👏 #ALeagueApart #DCvADKR pic.twitter.com/l4Z5GXPVxr — International League T20 (@ILT20Official) January 13, 2023 నిన్న (జనవరి 13) జరిగిన లీగ్ ఇనాగురల్ మ్యాచ్లో దుబాయ్ క్యాపిటల్స్, అబుదాబీ నైట్ రైడర్స్ జట్లు తలపడగా.. దుబాయ్ క్యాపిటల్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోవమన్ పావెల్ (29 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జో రూట్ (21 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సికందర్ రజా (17 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. భానుక రాజపక్స (9), యూసప్ పఠాన్ (6) విఫలమయ్యారు. రవి బొపారా (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్), ఇసురు ఉడాన (3 బంతుల్లో 11 నాటౌట్; ఫోర్, సిక్స్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో రవి రాంపాల్, అలీ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. రజా అకీఫుల్లా ఖాన్ (2/20), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/16), రోవమన్ పావెల్ (2/15), ఇసురు ఉడాన (1/14), హజ్రత్ లుక్మా్న్ (1/27), సికందర్ రజా (1/17) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (38 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (12 బంతుల్లో 12; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కొలిన్ ఇంగ్రామ్ (1), బ్రాండన్ కింగ్ (8), జవార్ ఫరీద్ (9), సునీల్ నరైన్ (4), కాన్నర్ (3), అకీల్ హొస్సేన్ (3), ఫహాద్ నవాజ్ (1) దారుణంగా విఫలమయ్యారు. రవి రాంపాల్ (6), అలీ ఖాన్ (6) అజేయంగా నిలిచారు. లీగ్లో తదుపరి మ్యాచ్లో ఇవాళ (జనవరి 14) ముంబై ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్ యాజమాన్యం), షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) జట్లు తలపడనున్నాయి. About time you plan your schedule as ours is all set. 34 action packed matches from 13th Jan 2023 💥 Teams are ready to duel for the glorious ILT20 trophy. Catch all the action live with @ilt20onzee Check out the #ILT20 schedule.#ALeagueApart pic.twitter.com/dVINE7FIEu — International League T20 (@ILT20Official) November 29, 2022 ఐఎల్ టీ20 లీగ్కు సంబంధించిన పూర్తి వివరాలు.. షెడ్యూల్.. జనవరి 13 నుంచి మొదలయ్యే ఈ లీగ్ ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. 6 జట్లు పాల్గొనే ఈ లీగ్లో మొత్తం 34 మ్యాచ్లు జరుగుతాయి. Ready to conquer! 🏆 The captains and the trophy, a glimpse of the final destination before the tournament begins 🤩 #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/IC88z9Qu59 — International League T20 (@ILT20Official) January 12, 2023 ఎలా చూడాలి.. ఐఎల్ టీ20 లీగ్ను జీ నెట్వర్క్స్లోని 10 ఛానల్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. జీ సినిమా (ఎస్డీ, హెచ్డీ), జీ అన్మోల్ సినిమా, జీ తిరాయ్, జీ బంగ్లా సినిమా, జీ జస్ట్ (ఎస్డీ, హెచ్డీ), పిక్చర్స్ హెచ్డీ, ఫ్లిక్స్ (ఎస్డీ, హెచ్డీ) ఛానల్లతో పాటు ఇదే సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో చూడవచ్చు. The BIGGEST movie star in the world meets the BIGGEST T20 League 🤩 2023 will indeed start with a BANG because @iamsrk has joined #ALeagueApart 🔥 Book your tickets now; https://t.co/MXQYHlHN5j#DPWorldILT20 #SRK #ShahRukhKhan pic.twitter.com/fXUP0P6XaV — International League T20 (@ILT20Official) January 7, 2023 టీమ్స్, ఓనర్స్ .. ఎంఐ ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్) అబుదాబి నైట్ రైడర్స్ (కోల్కతా నైట్ రైడర్స్) డెసర్ట్ వైపర్స్ (గ్లేజర్ ఫ్యామిలీ) దుబాయ్ క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) గల్ఫ్ జెయింట్స్ (అదానీ గ్రూప్) షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) కెప్టెన్లు.. ఎంఐ ఎమిరేట్స్ - కీరన్ పొలార్డ్/ డ్వేన్ బ్రావో అబుదాబి నైట్ రైడర్స్ - సునీల్ నరైన్ డెసర్ట్ వైపర్స్ - కొలిన్ మున్రో దుబాయ్ క్యాపిటల్స్ - రొవమన్ పావెల్ గల్ఫ్ జెయింట్స్ - జేమ్స్ విన్స్ షార్జా వారియర్స్ - మొయిన్ అలీ లీగ్లో పాల్గొనే కీలక ఆటగాళ్లు.. సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, రోవమన్ పావెల్, షిమ్రోన్ హెట్మెయర్, ఆండ్రీ రసెల్, పాల్ స్టిర్లింగ్, మొయిన్ అలీ, సికందర్ రజా, రాబిన్ ఉతప్ప, యూసఫ్పఠాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ విన్స్, దసున్ షనక, వనిందు హసరంగ, ట్రెంట్ బౌల్ట్ తదితరులు -
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడనున్న రాబిన్ ఊతప్ప
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో ఇండియా మహారాజా తరపున ఆడేందుకు భారత మాజీ ఆటగాళ్లు రాబిన్ ఊతప్ప, శ్రీశాంత్ సిద్దమయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఊతప్ప ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అదే విధంగా గతేడాది లెజెండ్స్ లీగ్ సీజన్లో ఊతప్ప కామేంటేటర్గా వ్యవహరించాడు. "లెజెండ్స్ లీగ్ క్రికెట్ చివరి సీజన్లో వాఖ్యతగా వ్యవహరించినప్పడే ఈ టోర్నీలో ఆడాలని నిర్ణయించకున్నాను. ఇప్పుడు నా పాత సహచరులతో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది" అని రాబిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక గత సీజన్లో భిల్వారా కింగ్స్ తరపున ఆడిన శ్రీశాంత్.. ఈ ఏడాది సీజన్లో ఇండియా మహారాజాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు శ్రీశాంత్ మాట్లాడుతూ.. లెజెండ్స్ లీగ్ సెకెండ్ సీజన్ అద్భుతంగా జరిగిది. ఈ టోర్నీలో పోటీ మా అంచనాలకు మించి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మరి కొంత మంది మాజీ ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగం కావాలని నేను ఆశిస్తున్నాను. అయితే భారత్ తరఫున ఆడడం ఎప్పుడూ గర్వంగా భావిస్తాను అని పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. రుత్రాజ్కు నో ఛాన్స్! గిల్ వైపే మొగ్గు -
రానున్న పదేళ్లలో టీ20 క్రికెట్లో పంత్దే హవా: భారత మాజీ బ్యాటర్
Rishabh Pant- T20 Cricket: టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ను ఉద్దేశించి మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్లో రానున్న పదేళ్లలో భారత జట్టులో అతడు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. టాపార్డర్లో పంత్ను ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని.. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా అతడి సొంతమని వ్యాఖ్యానించాడు. డీకే రాకతో పక్కకు పంత్! కాగా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ పునరాగమనం నేపథ్యంలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా ప్రపంచకప్-2022 టోర్నీలో పంత్కు అవకాశాలు సన్నగిల్లాయి. అనువజ్ఞుడైన డీకే వైపు మొగ్గు చూపిన యాజమాన్యం పంత్ను కాదని అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. కేవలం తొమ్మిది పరుగులే ఈ క్రమంలో ఐసీసీ ఈవెంట్లో కేవలం రెండు మ్యాచ్లు ఆడే అవకాశం దక్కించుకున్న రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. జింబాబ్వేతో మ్యాచ్లో మూడు పరుగులు, ఇంగ్లండ్తో రెండో సెమీ ఫైనల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో పంత్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్తో ద్వైపాక్షిక సిరీస్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీ20 జట్టుకు పంత్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరీ నేపథ్యంలో యువ జట్టు కివీస్తో పోటీ పడనుంది. రానున్న పదేళ్లలో అతడిదే హవా! ఈ నేపథ్యంలో స్పోర్ట్స్కీడాతో ముచ్చటించిన రాబిన్ ఊతప్ప టీ20లలో పంత్ భవిష్యత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘న్యూజిలాండ్తో సిరీస్లో రిషభ్ పంత్ ఓపెనర్గా రావాలి. పంత్ టాపార్డర్లోనే మెరుగ్గా రాణించగలడు. టీ20 క్రికెట్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు. తను మ్యాచ్ విన్నర్. గేమ్ చేంజర్. ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించగల సత్తా ఉన్నవాడు. రానున్న పదేళ్లలో భారత టీ20 జట్టులో అతడు అత్యంత కీలక ప్లేయర్గా ఎదుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఎడతెరిపి లేని వర్షం కారణంగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దైంది. చదవండి: Naseem Shah: అన్న అడుగు పడింది.. ఇప్పుడు తమ్ముడి వంతు ఐపీఎల్లో కప్ సాధిస్తే.. టీమిండియా కెప్టెన్ చేయాలా? ఇదెక్కడి రూల్! అలా అయితే.. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా డాషింగ్ క్రికెటర్
టీమిండియా డాషింగ్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. టీమిండియాకు, సొంత రాష్ట్రం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానని ఉతప్ప ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రతి విషయానికి ఏదో ఒక సమయంలో ముగింపు ఉంటుంది. కాబట్టి, నేను కూడా భారత క్రికెట్తో ఉన్న అనుబంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నానని ట్వీటాడు. It has been my greatest honour to represent my country and my state, Karnataka. However, all good things must come to an end, and with a grateful heart, I have decided to retire from all forms of Indian cricket. Thank you all ❤️ pic.twitter.com/GvWrIx2NRs — Robin Aiyuda Uthappa (@robbieuthappa) September 14, 2022 తన 20 ఏళ్ల కెరీర్లో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే రాబీ తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ టీమ్లకు (సీఎస్కే, కేకేఆర్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, పూణే వారియర్స్) సైతం కృతజ్ఞతలు తెలిపాడు. రాబీ తన ఐపీఎల్ కెరీర్లో రెండుసార్లు విజేతగా (సీఎస్కే, కేకేఆర్) నిలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 36 ఏళ్ల ఉతప్ప.. 2006-15 మధ్యలో 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. వన్డేల్లో 6 హాఫ్ సెంచరీ సాయంతో 934 పరుగులు, టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 249 పరుగులు సాధించాడు. ఉతప్ప తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్ల్లో 27 హాఫ్ సెంచరీల సాయంతో 130.3 స్ట్రయిక్ రేట్తో 4952 పరుగులు చేశాడు. దూకుడైన బ్యాటింగ్కు పేరుగాంచిన ఉతప్ప.. చాలా సందర్భాల్లో వికెట్కీపర్గానూ సేవలందించాడు. ఉతప్ప ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. -
అప్పుడు కోహ్లీకి చెప్పలేదుగా..ఇప్పుడెందుకు అడుగుతున్నాడు
-
జట్టులో కోహ్లి స్థానం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు!
Robin Uthappa Comments In Virat Kohli Form: ‘‘విరాట్ కోహ్లి పరుగులు సాధించినపుడు.. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సెంచరీలు బాదినపుడు.. ఇలా ఆడాలి. అలా ఆడాలి అని ఎవరూ చెప్పలేదు కదా! మరి ఇప్పుడు ఎందుకు జట్టులో అతడి స్థానం గురించి ప్రశ్నిస్తున్నారు. అసలు మనలో ఎవరికీ కోహ్లిని క్వశ్చన్ చేసే హక్కు లేనేలేదు’’ అని టీమిండియా, చెన్నై సూపర్కింగ్స్ వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ మేరకు తనదైన శైలిలో కోహ్లి విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. కాగా గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్తో సతమవుతున్న భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు కపిల్దేవ్ వంటి లెజెండ్స్ అతడిని పక్కనపెట్టాలని సూచిస్తుండగా.. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సహా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విదేశీ సారథులు కూడా కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు. రాబిన్ ఊతప్ప(PC: CSK) 70 సెంచరీలు చేశాడు కదా! ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా స్పందించిన ఊతప్ప షేర్చాట్ ఆడియో చాట్రూమ్ సెషన్లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘కోహ్లి ఇప్పటికే 70 సెంచరీలు సాధించాడు. ఇంతటి గొప్ప ప్రతిభ కలిగి ఉండి భారత క్రికెట్ పేరును నిలబెట్టిన అతడికి ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పుడు కూడా అతడు 30 లేదంటే 35 పరుగులు చేయగలుగుతున్నాడు. కొన్నిరోజులు కోహ్లిని ఒంటరిగా వదిలేయండి. తనదైన శైలిలో క్రికెట్ ఆడే వరకు వేచి చూడండి. తనకు ఏది మంచో మనకంటే తనకే బాగా తెలుసు. తన సమస్య ఏమిటో కూడా తనకే తెలుసు. అంతేకాదు దానిని అధిగమించగల సత్తా కూడా అతడికి ఉంది. అంతవరకు అతడి మానాన అతడిని వదిలేసి కాస్త ఓపికగా ఎదురు చూడటం కంటే మనం చేసేదేమీ లేదు’’ అని ఊతప్ప కోహ్లికి మద్దతుగా నిలిచాడు. అతడు మ్యాచ్ విన్నర్.. ఎవరికీ ఆ హక్కులేదు! అదే విధంగా టీమిండియా వరుస సిరీస్ల నేపథ్యంలో విశ్రాంతి పేరిట కోహ్లి జట్టుకు దూరం కావడంపై స్పందిస్తూ.. ‘‘ఒకవేళ తనకు బ్రేక్ కావాలని కోరుకుంటే కోహ్లి తప్పక విశ్రాంతి తీసుకుంటాడు. ఒకవేళ అతడికి ఫలానా సిరీస్ లేదంటే ఫలానా టోర్నీ ఆడాలని ఉందంటే తప్పకుండా ఆడతాడు. అందుకు యాజమాన్యం అంగీకరించాలి. అంతేగానీ.. జట్టులో అతడి స్థానం ఏమిటన్న విషయంపై బయట పెద్దగా చర్చ అవసరం లేదు. అతడు మ్యాచ్ విన్నర్. ప్రపంచంలోని బెస్ట్ మ్యాచ్ విన్నర్ అని ఇప్పటికే రుజువు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి శక్తిసామర్థ్యాల గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు’’ అని ఊతప్ప ఉద్వేగ పూరితంగా మాట్లాడాడు. కాగా వెస్టిండీస్ పర్యటనకు దూరమైన కోహ్లి.. ఆసియా కప్ టోర్నీ నేపథ్యంలో ఆగష్టులో తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉంది. చదవండి: Axar Patel: ఆఖరి ఓవర్లో సిక్సర్ బాది టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే? Rohit Sharma Latest Photo: వెస్టిండీస్కు చేరుకున్న టీమిండియా కెప్టెన్.. పంత్, డీకేతో పాటు -
రెండోసారి తండ్రైన సీఎస్కే బ్యాటర్.. మా చిన్నారి దేవత అంటూ ఎమోషనల్!
టీమిండియా వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప రెండోసారి తండ్రయ్యాడు. ఊతప్ప దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని ఊతప్ప సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భార్యా, బిడ్డలతో ఉన్న ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశాడు. ‘‘మా జీవితాల్లో అడుగుపెట్టిన చిన్నారి దేవతను మీకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ట్రినిటి థియా ఊతప్ప.. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు.. నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చే అవకాశం ఇచ్చినందుకు నీకు రుణపడి ఉంటాం. నీకు తల్లిదండ్రులమైనందుకు మేము.. అన్నయ్య అయినందుకు నీ సోదరుడు.. దీనిని మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాం’’ అని ఊతప్ప ఉద్వేగపూరిత నోట్ రాసుకొచ్చాడు. కాగా కేరళకు చెందిన రాబిన్ వేణు ఊతప్ప వికెట్ కీపర్ బ్యాటర్గా ఎదిగాడు. 2006లో భారత్ తరఫున అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు. ఊతప్ప చివరిసారిగా జింబాబ్వేతో వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఊతప్ప వ్యక్తిగత విషయానికొస్తే.. 2016లో శీతల్ను పెళ్లాడాడు. వీరికి ఇప్పటికే కుమారుడు నీల్ నోలన్ ఊతప్ప ఉన్నాడు. తాజాగా కుమార్తె జన్మించింది. కాగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే ఊతప్ప ఎప్పటికప్పుడు తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. చదవండి: Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! View this post on Instagram A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa) View this post on Instagram A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa) -
Rafael Nadal: ‘సెల్యూట్ ఫరెవర్’.. నాదల్పై సచిన్, సెహ్వాగ్ ప్రశంసలు
టెన్నిస్ దిగ్గజం, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్పై భారత మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా పద్నాలుగవసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన ‘మట్టి కోర్టు మహారాజు’కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ‘‘36 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ఓపెన్లో రికార్డు స్థాయిలో 14వ టైటిల్.. 22వ గ్రాండ్స్లామ్ టైటిల్ గెలవడం నిజంగా అద్భుతం.. అసాధారణ విజయం. కంగ్రాట్స్ నాదల్’’ అంటూ ట్విటర్ వేదికగా విష్ చేశారు. To go out there and win a record 14th @rolandgarros & 22nd Grand Slam at the age of 36 is an incredible achievement. Congratulations @RafaelNadal! 🏆🎾 pic.twitter.com/MAxsEklfFQ — Sachin Tendulkar (@sachin_rt) June 5, 2022 ఇక భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం.. ‘‘మట్టి కోర్టు రాజు.. గొప్ప ఆటగాడు.. చాంపియన్.. నాదల్.. ఫ్రెంచ్ఓపెన్లో 14వ టైటిల్’’ అంటూ నాదల్ ఫొటోను ట్వీట్ చేస్తూ అతడికి అభినందనలు తెలిపాడు. అదే విధంగా ప్రజ్ఞాన్ ఓజా, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, రాబిన్ ఊతప్ప ట్విటర్ వేదికగా నాదల్పై ప్రశంసల జల్లు కురిపించారు. నాదల్ను గ్రీక్ గాడ్ హెర్క్యులస్తో పోల్చిన రవిశాస్త్రి.. ఎర్రమట్టి కోర్టులో అతడు 15వ టైటిల్ కూడా గెలవాలని ఆకాంక్షించాడు. సెల్యూట్ ఫరెవర్ అంటూ అతడిని ఆకాశానికెత్తాడు. A modern day Hercules who just will not melt in the hottest Claypot. Starts favourite to make it 15 only. Just insane. Salute forever @RafaelNadal @rolandgarros #Nadal #FrenchOpen pic.twitter.com/XXfMHRgmku — Ravi Shastri (@RaviShastriOfc) June 5, 2022 కాగా ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్-2022 పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాదల్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి కాస్పర్ రూడ్ (నార్వే)ను 6–3, 6–3, 6–0తో ఓడించాడు. తద్వారా తద్వారా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను 14వసారి గెలిచిన నాదల్.. తన ఖాతాలో 22వ గ్రాండ్స్లామ్ టైటిల్ను జమ చేసుకున్నాడు. మట్టి కోర్టుకు తాను మకుటం లేని మహారాజునని మరోసారి నిరూపించుకుని కితాబులు అందుకుంటున్నాడు. ✅ Rafa 🆚 Ruud ✅ Double delight for France 🇫🇷 ✅ 1️⃣4️⃣ for @RafaelNadal Look back at Day 15 with the Best Moments of the Day by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoments pic.twitter.com/IPfdgyMB2w — Roland-Garros (@rolandgarros) June 5, 2022 చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! -
IPL 2022: కెప్టెన్గా తొలి గెలుపు.. ఆమెకే అంకితం: జడేజా
IPL 2022 CSK Vs RCB- Ravindra Jadeja Comments: వరుసగా నాలుగు పరాజయాల తర్వాత చెన్నై సూపర్కింగ్స్ ఐపీఎల్-2022లో ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. శివమ్ దూబే(94 నాటౌట్), రాబిన్ ఉతప్ప( 89 పరుగులు) తుఫాన్ ఇన్నింగ్స్తో జట్టును గెలుపు బాట పట్టించారు. కాగా ఐపీఎల్-2022 సీజన్తో తొలిసారిగా చెన్నై పగ్గాలు చేపట్టిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్గా మొదటి విజయం. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాడు. ఈ గెలుపును జట్టు సభ్యులు, తన భార్య రివా సోలంకికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. ‘‘కెప్టెన్గా నాకు ఇది తొలి విజయం. ఈ గెలుపు ఎల్లప్పుడూ నాకు ప్రత్యేకమే! గత నాలుగు మ్యాచ్లలో మాకు నిరాశే ఎదురైంది. అయితే, మేము పుంజుకున్నాం. బ్యాటింగ్ యూనిట్లో ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు. ముఖ్యంగా రాబీ, శివమ్ అద్భుతంగా ఆడారు. బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు. నిజానికి మేనేజ్మెంట్ నాపై ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు. నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. భార్యతో జడేజా ఇంకా నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. కెప్టెన్ అయినప్పటికీ నేను సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తూనే ఉన్నాను. మహీ భాయ్ ఉన్నాడు కదా! ఆయనతో ప్రతీ విషయం చర్చిస్తాను. సారథిగా ఎదగడంలో, ఆ పాత్రలో ఒదిగేందుకు.. ఈ సలహాలు పనికివస్తాయి. అయితే, అందుకు కాస్త సమయం పట్టవచ్చు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం మాత్రం నాకు కలిసి వచ్చే అంశం. సానుకూల దృక్పథంతో, కఠిన శ్రమకోరుస్తూ .. విజయాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తాం. కెప్టెన్గా నా తొలి విజయాన్ని నా సతీమణికి, జట్టు సభ్యులకు అంకితమిస్తున్నా’’ అని జడేజా పేర్కొన్నాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్లో జడేజా వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. వనిందు హసరంగ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. అయితే, తన బౌలింగ్ కోటా(4 ఓవర్లు)ను పూర్తి చేసిన జడ్డూ.. 39 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్కోర్లు: చెన్నై: 216/4 (20) బెంగళూరు: 193/9 (20) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శివమ్ దూబే చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్కు మతి భ్రమించిందా..? The Jadeja catch celebration 👌👌#TATAIPL #CSKvRCB pic.twitter.com/u3zvE59I3k — IndianPremierLeague (@IPL) April 12, 2022 -
IPL 2022: సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ
IPL 2022 Chennai Super Kings Vs Royal Challengers Bangalore- ముంబై: ఈ మ్యాచ్ కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నాలుగు మ్యాచ్లాడింది. అన్నీంటా ఓటమే! నాలుగుసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్కు ఏమాత్రం రుచించని ఈ ఎదురుగాలికి... సుడిగాలి బ్యాటింగ్తో ఫలితం సాధించింది. సూపర్కింగ్స్ బ్యాటర్స్ శివమ్ దూబే (46 బంతుల్లో 94 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్లు), రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 89; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) సిక్సర్ల సునామీతో ఎట్టకేలకు ఐదో మ్యాచ్లో బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 23 పరుగులతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై జయభేరి మోగించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసింది. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది. షహబాజ్ (27 బంతుల్లో 41; 4 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుగ్గా ఆడారు. స్పిన్నర్లు మహీశ్ తీక్షణ (4/33), జడేజా (3/39) బెంగళూరును దెబ్బ తీశారు. కెప్టెన్గా జడేజాకిది తొలి విజయం కావడం విశేషం. మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... పవర్ ప్లేలో చెన్నై స్కోరు 35/1. అప్పటికే ఒక ఓపెనర్ రుతురాజ్ (17) పెవిలియన్లో ప్రేక్షకుడయ్యాడు. ఇంకో ఓపెనింగ్ బ్యాటర్ ఉతప్పకు మొయిన్ అలీ (3) జతయినా చేసిందేమీ లేదు. దూబే వచ్చాక నెమ్మదిగా 8.4 ఓవర్లో జట్టు స్కోరు 50కి... 10 ఓవర్లలో 2 వికెట్లకు 60 పరుగులకు చేరింది. కానీ ఆ తర్వాతి 10 ఓవర్లలో ఆట ఎవరి ఊహకందని విధ్వంసంగా సాగింది. చెన్నై ఏకంగా 156 పరుగులు చేసింది. శివమ్ దూబే, ఉతప్ప సిక్సర్లతో చుక్కలు చూపించడంతో అప్పటిదాకా భళా అనిపించిన బెంగళూరు బౌలింగ్ డీలా పడింది. హసరంగ 19వ ఓవర్లో ఉతప్ప 2 సిక్సర్లు కొట్టడంతో జట్టు వాయువేగంతో 200 మార్క్ దాటింది. మరో షాట్కు ప్రయత్నించి కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఉతప్ప నిష్క్రమించడంతో 165 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి ఓవర్ ఆసాంతం దూబేనే ఆడి 2 సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. టాపార్డర్ టపటపా... కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బెంగళూరు 50 పరుగులకే డుప్లెసిస్, కోహ్లి, అనూజ్ రావత్, మ్యాక్స్వెల్ వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. ఈ దశలో షహబాజ్, సుయశ్ ప్రభుదేశాయ్ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడుతూ జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. కానీ కొండను కరిగించేందుకు ఈ కాసేపటి జోరు సరిపోలేదు. ఇద్దర్ని మహీశ్ తీక్షణ క్లీన్బౌల్డ్ చేయగా... దినేశ్ కార్తీక్ సిక్సర్లు అంతరాన్ని తగ్గించిందే తప్ప విజయం వైపునకు తీసుకెళ్లలేదు. ఆకాశ్దీప్ కొట్టిన షాట్ను రాయుడు కళ్లు చెదిరే క్యాచ్గా పట్టేశాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హజల్వుడ్ 17; ఉతప్ప (సి) కోహ్లి (బి) హసరంగ 88; మొయిన్ అలీ (రనౌట్) 3; శివమ్ దూబే (నాటౌట్) 95; జడేజా (సి) అనుజ్ (బి) హసరంగ 0; ధోని (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 216. వికెట్ల పతనం: 1–19, 2–36, 3–201, 4–201. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, హాజల్వుడ్ 4–0–33–1, ఆకాశ్ 4–0–58–0, మ్యాక్స్వెల్ 3–0–29–0, షహబాజ్ 2–0–18–0, హసరంగ 3–0–35–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: డుప్లెసిస్ (సి) జోర్డాన్ (బి) తీక్షణ 8; అనూజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 12; కోహ్లి (సి) దూబే (బి) ముకేశ్ 1; మ్యాక్స్వెల్ (బి) జడేజా 26; షహబాజ్ (బి) తీక్షణ 41; ప్రభుదేశాయ్ (బి) తీక్షణ 34; కార్తీక్ (సి) జడేజా (బి) బ్రేవో 34; హసరంగ (సి) జోర్డాన్ (బి) జడేజా 7; ఆకాశ్ (సి) రాయుడు (బి) జడేజా 0; సిరాజ్ (నాటౌట్) 14; హాజల్వుడ్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–14, 2–20, 3–42, 4–50, 5–110, 6–133, 7–146, 8–146, 9–171. బౌలింగ్: మొయిన్ అలీ 3–0–19–0, ముకేశ్ 3–0–40–1, మహీశ్ తీక్షణ 4–0–33–4, రవీంద్ర జడేజా 4–0–39–3, జోర్డాన్ 2–0–20–0, బ్రేవో 4–0–42–1. చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్కు మతి భ్రమించిందా..? View this post on Instagram A post shared by IPL (@iplt20) View this post on Instagram A post shared by IPL (@iplt20) -
IPL 2022- CSK: డుప్లెసిస్ స్థానంలో టీమిండియా వెటరన్ ఆటగాడే సరైనోడు!
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ఆరంభం కానుంది. మార్చి 26న చెన్నై సూపర్కింగ్స్- కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్తో తాజా సీజన్ మొదలు కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీసులో తలమునకలై పోయాయి. అయితే, గత సీజన్లో సీఎస్కేను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్, వేలంలో భారీ ధర పలికిన దీపక్ చహర్ ఆరంభ మ్యాచ్లకు దూరం కావడంతో ధోని సేనకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అంతేగాక అత్యధిక పరుగుల వీరుడు, సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్గైక్వాడ్ ఫిట్నెస్ సాధించడం ఊరట కలిగించినా.. అతడికి జోడీ ఎవరన్నది ఇంకా తేలలేదు. గత సీజన్లో రుతుతో కలిసి ఓపెనింగ్ చేసిన ఫాఫ్ డుప్లెసిస్ను వదిలేయగా ఆర్సీబీ వేలంలో అతడిని కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. ఈ నేపథ్యంలో వీరి స్థానాల్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరన్నా అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీపక్ చహర్ను రీప్లేస్ చేయగల సత్తా అండర్ -19 వరల్డ్కప్ స్టార్ రాజ్వర్ధన్ హంగర్కర్కు ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘దీపక్ చహర్ గొప్ప బౌలర్. అతడు దూరం కావడం సీఎస్కేకు పెద్ద దెబ్బ. నిజానికి శార్దూల్ ఠాకూర్ కూడా ఇప్పుడు సీఎస్కేలో లేడు. చహర్ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో యువ ఆటగాడు హంగర్కర్ సేవలను సీఎస్కే ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. అతడు ప్రతిభావంతుడు. అయితే, హంగర్కర్ చాలా చిన్నవాడు. తనకు అనుభవం తక్కువ. కానీ ధోని వంటి నాయకుడు ఉన్నపుడు ఇలాంటి విషయాలకు భయపడాల్సిన పనిలేదు. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఫలితాలు రాబట్టడం, వారిని సౌకర్యంగా మెదిలేలా చేయడంలో ధోని దిట్ట. కాబట్టి హంగర్కర్ను చహర్ ప్లేస్లో జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ‘‘ఇక ఫాఫ్ స్థానం విషయంలో సీఎస్కేకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే. మరొకరు రాబిన్ ఊతప్ప. ఊతప్ప సైతం ఓపెనర్గా రాణించగలడనే నమ్మకం ఉంది. అయితే, సీఎస్కే వ్యూహం ప్రకారం ఓపెనింగ్ జోడీలో కచ్చితంగా ఒక విదేశీ ఓపెనర్ ఉండాలనుకుంటే... కాన్వే మంచి ఆప్షన్’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్ పంత్.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు 📹 Slowed to perfection! #Yellove #WhistlePodu 🦁💛 pic.twitter.com/4fS1o9sm3H — Chennai Super Kings (@ChennaiIPL) March 20, 2022 The one with "I'm gonna go with Mahi bhai first!" 💛#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/YBTevDUJZK — Chennai Super Kings (@ChennaiIPL) March 19, 2022 -
IPL 2022: ఐపీఎల్తో పోలికా.. పాక్ జర్నలిస్ట్కి కౌంటరిచ్చిన రాబిన్ ఊతప్ప
ఐపీఎల్ను తక్కువ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఓ పాక్ జర్నలిస్ట్కు టీమిండియా ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు రాబిన్ ఊతప్ప చురకలంటించాడు. ఇటీవల ఫిరోజ్ అనే సదరు పాక్ జర్నలిస్ట్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను ఆకాశానికెత్తుతూ, ఐపీఎల్ని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. పీఎస్ఎల్తో ఐపీఎల్ను పోల్చకండి.. పీఎస్ఎల్ 2016లో ఆరంభమైతే, ఐపీఎల్ 2008లోనే మొదలైంది.. పీఎస్ఎల్, ఐపీఎల్ కంటే వేగంగా పాపులారిటీ దక్కించుకుంది.. ఐపీఎల్ పుట్టినప్పుడు మార్కెట్లో పోటీగా మరో లీగ్ లేదు.. అంటూ ఫిరోజ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై ఊతప్ప స్పందిస్తూ.. నువ్వు అంటున్న ఆ మార్కెట్ని క్రియేట్ చేసిందే ఐపీఎల్.. అంటూ గట్టిగా కౌంటరిచ్చాడు. No comparison between PSL and IPL! PSL started in 2016 while IPL inaugurated in 2008. However one has to admit PSL gained worldwide popularity more quicker in an era when other boards had introduced their leagues too whereas there was no competitor in the market when IPL was born — Arfa Feroz Zake (@ArfaSays_) March 18, 2022 ఇదిలా ఉంటే, ఇటీవల పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రాజా ఐపీఎల్పై తన అక్కసును వెల్లగక్కడంతో ఐపీఎల్ వర్సస్ పీఎస్ఎల్ చర్చ మొదలైంది. ఐపీఎల్ తరహాలో పీఎస్ఎల్లోనూ వేలం పద్ధతి ప్రవేశపెడితే, ఇండియన్ లీగ్ ఆడేందుకు ఏ విదేశీ క్రికెటర్ ముందుకు రాడంటూ రమీజ్ సంచలన కామెంట్లు చేశాడు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఘాటుగా స్పందించాడు. ఓ ఆటగాడిపై 16 కోట్లు ఖర్చు చేసే స్తోమత పీఎస్ఎల్ ఫ్రాంచైజీలకు ఉందా అంటూ ప్రశ్నించాడు. కాగా, పీఎస్ఎల్లో ఆ దేశ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్కు ఇచ్చే రూ.3 కోట్లే అత్యధికం. చదవండి: IPL 2022: సన్రైజర్స్ ఆల్రౌండర్కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నేచురల్ స్టార్ నాని
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి
జన్మభూమి కమిటీలతో టీడీపీ దోపిడీ
పథకాల నగదును చంద్రబాబే ఆపించారు
వ్యాపారులపై పగబట్టిన దామచర్ల
జగనన్న పంపిన సేవకుడిని
మౌలిక వసతులకు పెద్దపీట
అధునాతన వైద్యం
'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
పరిశ్రమలపై పనికిమాలిన కథ
సీఎం జగన్తోనే రాష్ట్రాభివృద్ధి
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement