Tamil film
-
ప్రాణం లేని మనిషి ఈ సినిమా హీరో
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం జాలీ ఓ జిమ్ఖానా(Jolly O Gymkhana) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.కదలని బొమ్మ చిత్రమైతే, కదిలే బొమ్మ ఓ విచిత్రం. అటువంటి విచిత్రానికి వినోదం తోడైతే అదే మనం చూసే సినిమా. సినిమాలలో దర్శకుడు తన కాల్పనిక ధోరణితో ఓ కథను అనుకొని ఆ కథకు అనుగుణంగా పాత్రలను సృష్టించి ఆ పాత్రలచే ప్రేక్షకులకు విచిత్ర వినోదాన్ని అందిస్తాడు. ప్రస్తుతం వచ్చే సినిమాలలో ఔరా అని అబ్బురపరిచే సినిమాలనుండి అయ్యో అనే సినిమాల వరకూ పుష్కలంగా ఉన్నాయి. సన్ నెక్ట్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘జాలీ ఓ జిమ్ఖానా’(Jolly O Gymkhana) సినిమా ఔరా అనిపించే ఓ అద్భుతమని చెప్పాలి. ఈ సినిమాకి శక్తి చిదంబరం దర్శకత్వం వహించారు.ప్రముఖ కథానాయకుడు, కొరియోగ్రాఫర్ అలాగే దర్శకుడు అయిన ప్రభుదేవా(Prabhu Deva) ఈ సినిమాలోని ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక అంతలా ఏముంది ఈ సినిమాలో... ఓసారి కథ గురించి చెప్పుకుందాం. భవానీ అనే అమ్మాయి తను చేసిన ఓ తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన కథ చెప్పుకోడానికి ఓ చర్చిలోని ఫాదర్ దగ్గరకు రావడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. తంగసామి తన కూతురు చెల్లమ్మ, మనవరాళ్ళైన భవానీ, శివానీ, యాజినీతో ఓ హోటల్ నడుపుతుంటాడు. తెన్ కాశీకి చెందిన రాజకీయవేత్త అడైక్కళరాజ్తో హోటల్లో జరిగిన ఓ ఘర్షణ వల్ల తంగసామి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవుతాడు.తంగసామి ఆపరేషన్ కోసం దాదాపు రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుందని భవానీ అక్కచెల్లెళ్లకు చెబుతాడు డాక్టర్. అనూహ్యంగా ఆ డబ్బు భవానీ అకౌంట్లో డిపాజిట్ అయి, ఆపరేషన్ ఏ అవరోధం లేకుండా జరిగిపోతుంది. కానీ ఆ డబ్బు కోసం ఓ గ్యాంగ్ వీళ్ల వెంటపడి వేధిస్తూ ఉంటుంది. మరో పక్క ఇదే అడైక్కళరాజ్ ఓ కేస్ విషయమై న్యాయవాది పూన్గుండ్రన్తో పెద్ద విరోధం పెట్టుకొని ఉంటాడు. ఇంకో పక్క ఈ విషయం తెలిసిన తంగసామి హోటల్ విషయమై పూన్గుండ్రన్ని కలవమని భవానీ వాళ్లకి చెప్తాడు. భవానీ వాళ్ళు న్యాయవాదిని కలిసే సమయంలో అతను చనిపోయి ఓ హోటల్ గదిలో పడి ఉంటాడు. ప్రపంచానికి మాత్రం పూన్గుండ్రన్ బ్రతికే ఉన్న విషయం తెలుస్తుంది. మరి ఆడవాళ్ళైన భవానీ అక్కచెల్లెళ్ళు న్యాయవాది శవంతో తమ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారన్నదే ఈ ‘జాలీ ఓ జిమ్ఖానా’ సినిమా. ఈ సినిమా ప్రారంభం నుండే సరదా సరదాగా సాగిపోతుంది. అనూహ్యమైన మలుపులకు చక్కటి వినోదం మేళవించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. నాటి ఆడవాళ్లకు మాత్రమే సినిమాలోని అప్పటి నటుడు నగేశ్ నటించిన ఓ సన్నివేశం ఈ సినిమా కథకి ఓ స్ఫూర్తి అని చెప్పవచ్చు. సూపర్ ఎంటర్టైనర్ ఫర్ ది కంప్లీట్ ఫ్యామిలీ. వర్త్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
ఇడ్లీ కొట్టులో ఏం జరిగింది?
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను విడుదల చేశారు. ‘మా సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశాం. మీ మూలాలకు కట్టుబడి ఉండండి’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. ఇక ఈ సినిమాలో ధనుష్ యంగ్ లుక్లో కనిపిస్తుండటం ఆయన ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. మరి... ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’లో ఏం జరిగింది? అనేది చూడాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
టాలీవుడ్ పై దుల్కర్ డామినేషన్
-
Vaazhai Movie Review: ఈ అరటిపండు చాలా చేదు!!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘వాళై’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనం తినే అరటిపండు నోటికి ఎంత తియ్యగా ఉంటుందో, అది మన నోటి దాకా రావడానికి ఎన్ని జీవితాలను చేదు చేస్తుందో చెప్పిన చిత్రం ‘వాళై’. ఈ సినిమా మాతృక తమిళమైనా తెలుగులో డబ్ అయి హాట్ స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. 1999 ఫిబ్రవరి 22న తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శ్రీ వాయుగుండం ప్రాంత పరిధిలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో బతికి బయటపడ్డ వ్యక్తి అందించిన సమాచార రూపమే ఈ ‘వాళై’ సినిమా. ఈ విషయాన్ని సవివరంగా దర్శకుడు సినిమా ఆఖర్లో చెప్పారు. ఈ సినిమాకి మారీ సెల్వరాజ్ దర్శకుడు. ప్రముఖ వర్ధమాన తమిళ నటులు కలైరాసన్, నిఖిలా విమల్ ఈ సినిమా ముఖ్య తారాగణం. ఇక కథాంశానికొస్తే... శివానందన్, శేఖర్ మంచి స్నేహితులు. బాగా పేద కుటుంబం నుండి వచ్చిన పిల్లలు. ఇద్దరూ ప్రభుత్వ బడిలో ఎనిమిదో తరగతి చదువుతూ ఉంటారు. వారమంతా బడికి వెళ్ళి వారాంతంలో ఓ రూపాయి సంపాదించడం కోసం అరటి గెలలు కోసే పనికి ఊరితో పాటు వెళుతూ ఉంటారు. శివానందన్ చదువులో మంచి తెలివిగలవాడు, ఈ అరటిపండ్లు కోసే పని అస్సలు నచ్చదు తనకు. క్లాసులో సైన్సు పాఠాలు చెప్పే పూంగొడి టీచర్ అంటే శివానందన్కు చాలా ఇష్టం. ఇక అరటిపండ్లు కోయడానికి ఆ ఊరి తరఫున ఖని అనే వ్యక్తి నాయకత్వం వహిస్తుంటాడు. అరటి గెలల వ్యాపారికి, ఊరికి మధ్యలో బ్రోకర్గా ముత్తురాజ్ వ్యవహరిస్తుంటాడు. ముత్తురాజ్కు, ఖనికి కూలీ డబ్బుల మధ్య వైరం ఏర్పడి ఖని మీద ముత్తురాజ్ ద్వేషం పెంచుకుంటాడు. ఓ రోజు శివానందన్ అరటి గెలల పని నుండి తప్పించుకొని ఆకలితో ఓ అరటి తోటలోకి వెళ్ళి అరటిపండ్లు తినబోతాడు. అంతే... ఆ తోట యజమాని శివానందన్ను పట్టుకుని తీవ్రంగా కొట్టగా స్పృహ తప్పి ఓ కొలనులో పడిపోతాడు. తను లేచి కళ్ళు తెరిచేసరికి ఊరంతా ఏడుస్తుంటుంది. శివానందన్ తల్లితో పాటు అక్క, తోటి స్నేహితుడు శేఖర్, ఖనితోపాటు దాదాపు 19మంది ఊరువాళ్ళు చనిపోయి పడి ఉంటారు. అసలు వీళ్ళంతా ఎలా చనిపోయారు? ఆ తరువాత శివానందన్ పరిస్థితి ఏంటి అన్నది ‘వాళై’ సినిమాలోనే చూడాలి. రోజు వారీ కూలీ చేసుకుని బతికే జీవితాలు ఎలా ఉంటాయన్న స్థితిగతులను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు దర్శకుడు. ఈ సినిమాని మనం తెర మీద చూస్తున్నట్టుండదు... జీవితాలను చూస్తున్న ఫీల్ కలుగుతుంది. సినిమాలో కొంచెం ల్యాగ్ ఉన్నా మనసుకు హత్తుకుంటుంది. తినే పండు మనకు తియ్యగా ఉన్నా ఆ పండు మన దాకా రావడానికి ఎంతమంది జీవితాలను చేదు చేసిందో అని చెప్పేదే ఈ ‘వాళై’ సినిమా. – ఇంటూరు హరికృష్ణ -
"సాలా" సినిమాకు అల్లు అర్జున్ బెస్ట్ విషెస్
ధీరన్ హీరోగా నటించిన తమిళ మూవీ "సాలా". ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 23న) రిలీజ్ అయింది. ఈ క్రమంలో హీరో ధీరన్, హీరోయిన్ రేష్మ వెంకటేష్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ ఎస్ డీ మణిపాల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను మీట్ అయ్యారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సాలా సినిమాకు బెస్ట్ విషెస్ అందించారు. తన మిత్రుడు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు సాలా సినిమా కోలీవుడ్లో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. సాలా సినిమాను రాయపురంలోని ఫేమస్ పార్వతీ బార్ నేపథ్యంతో యాక్షన్ డ్రామాగా దర్శకుడు ఎస్ డీ మణిపాల్ రూపొందించారు. Icon Star #AlluArjun met and greeted the Team #Saala for the Big Success 💐#SaalaFromTomorrow #AWarForABarIn Cinemas Aug 23 rd 🥁@alluarjun @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @ManipaulSd @dheeran_offl_ @Reshmavenkat01 @ravindranathDP @Theeson_Music @dir_buvan… pic.twitter.com/axwDR2CPbw— Nikil Murukan (@onlynikil) August 22, 2024 -
నిర్మాతల మండలి ఏకపక్ష నిర్ణయం సరికాదు: నడిగర్ సంఘం
తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య వార్ మొదలైందా? అంటే అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇందుకు కారణం నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలే. ఈ మండలి ఈ నెల 29న ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళ నిర్మాతల మండలి, యాక్టీవ్ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్ సంఘం కలిసి నిర్వహించిన సమావేశంలో చేసిన తీర్మానాలను ఆ ప్రకటనలో వెల్లడించారు.ముఖ్యంగా నటీనటులు ముందుగా నటించడానికి అంగీకరించి, అడ్వాన్స్ లు తీసుకున్న చిత్రాల్లోనే నటించాలని, అదే విధంగా నటీనటులపారితోషికం, నిర్మాణ వ్యయం వంటి విషయాల గురించి నూతన విధి విధానాలను నిర్ణయించే వరకూ నవంబర్ 1వ తేదీ నుంచి షూటింగ్లను నిలిపి వేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఆగస్ట్ 16 తర్వాత కొత్త చిత్రాల ఆరంభానికి అనుమతి లేదని కూడా నిర్మాతల సంఘం పేర్కొంది. అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్లను అక్టోబర్ 30 లోగా పూర్తి చేయాలని తీర్మానం చేసింది.అలాగే నటుడు ధనుష్ పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారనీ, అందువల్ల ఆయనతో కొత్త చిత్రాలను నిర్మించే నిర్మా తలు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో చర్చించాకే ఆ సినిమా కార్యక్రమాలు మొదలుపెట్టాలనే తీర్మానం చేశారు. కాగా నిర్మాతల మండలి తీర్మానాలపై నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ మేరకు నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని సారాంశం ఈ విధంగా...తమిళ నిర్మాతల మండలి విడుదల చేసిన ప్రకటనలో నటీనటులకు సంబంధించిన తీర్మానాలు, నటుడు ధనుష్కు సంబంధించిన తీర్మానం తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని నటీనటుల సంఘం పేర్కొంది. ధనుష్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అకస్మాత్తుగా అతనిపై నిషేధం విధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదని కూడా ఆ ప్రకటనలో ఉంది.సమస్యను తమతో చర్చించకుండా తీర్మానించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. రెండు సంఘాలూ కలిసి మాట్లాడుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని ఏక పక్షంగా నిర్ణయించి, పత్రికా ప్రకటనలా ఇవ్వడం సరి కాదని కూడా నటీనటుల సంఘం అభిప్రాయపడింది. తమిళ సినీ సంఘాల్లో ముఖ్యమైన నటీ నటీనటుల సంఘం నిర్వాహకులను సంప్రదించకుండా వేలాది మంది నటీనటులు, కార్మికుల జీవితాలను బాధించే విధంగా షూటింగ్లు నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తాము విడుదల చేసిన నోట్లో నటీనటుల సంఘం పేర్కొంది.ఈ ఏక పక్ష తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయమై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గంతో చర్చించి తగిన చర్యలు గురించి వెల్లడించడం జరుగుతుందని పేర్కొంది. – సాక్షి, చెన్నైనిర్మాతల మండలి తీర్మానాన్ని ఖండిస్తున్నాం: కార్తీనటీనటుల సంఘం కోశాధికారి, నటుడు కార్తీ మీడియాతో మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతల మండలి ఏక పక్షంగా చేసిన తీర్మాలను ఖండిస్తున్నాం. ముఖ్యంగా నటుడు ధనుష్ పై ఎలాంటి ఫిర్యాదు లేకున్నా ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అన్నారు.నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్లను సంపద్రించాకే పత్రికా ప్రకటన విడుదల చేశామని కూడా కార్తీ పేర్కొన్నారు. అదే విధంగా నడిగర్ సంఘాన్ని సంప్రదించకుండా నిర్మాతల మండలి చేసిన తీర్మానాలను వ్యతిరేకిస్తున్నట్లు నటీనటుల సంఘం ఉపాధ్యక్షుల్లో ఒకరైన కరుణాస్ కూడా పేర్కొన్నారు. -
టార్గెట్ ధనుష్..తమిళ ఇండస్ట్రీలో సంచలనం
-
ఓటీటీకి వచ్చేస్తోన్న రొమాంటిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అర్జున్ దాస్, తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ చిత్రం 'రసవతి'. ఈ చిత్రం మే 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు శాంతకుమార్ దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.మిస్టరీ థ్రిల్లర్గా వచ్చిన రసవతి ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్తో పాటు ఆహా (తమిళం), సింప్లీ సౌత్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓవర్ సీస్ ఫ్యాన్స్ కోసమే సింప్లీసౌత్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు రసవతి పోస్టర్ను మేకర్స్ పంచుకున్నారు. ఈ చిత్రంలో సదాశివగా అర్జున్ దాస్, సూర్యగా తాన్య రవిచంద్రన్ తమ పాత్రల్లో మెప్పించారు.ఈ చిత్రం కొడైకెనాల్ నేపథ్యంలో సాగుతుంది. ఓ గ్రామంలో వైద్యం చేసే సదాశివ అనే యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. కాగా.. ఇందులో నిఖిలా శంకర్, దీప, అరుల్ జోతి, రిషికాంత్, సుజాత శివకుమార్, రమ్య సుబ్రమణియన్, జిఎమ్ సుందర్, రేష్మా వెంకటేష్, సుజిత్ శంకర్ కీలక పాత్రలు పోషించారు. Rasavathi will be streaming on Amazon prime, Aha and simply south ( in simply south excluding India) from June 21st. #Rasavathi @iam_arjundas @actortanya @Reshmavenkat01 @actorramya @GMSundar_ @MusicThaman @EditorSabu @SPremChandra1 @minu_jayebal @dancersatz @SureshChandraa… pic.twitter.com/f5ElM8y7O0— Santhakumar (@Santhakumar_Dir) June 19, 2024 -
యాచకుడిగా మారిన హీరో..
కొన్ని చిత్రాల టైటిల్స్ ప్రారంభంలోనే హైప్ తీసుకొస్తాయి. బ్లడీ బెగ్గర్ టైటిల్ కూడా అదే కోవలోకి వస్తుంది. కోలమావు కోకిల, డాన్, బీస్ట్, జైలర్ వంటి చిత్రాలతో స్టార్ దర్శకుడిగా రాణిస్తున్న నెల్సన్ దిలీప్కుమార్ ఈ మూవీతో నిర్మాతగా మారుతున్నారు. ఫిలమెంట్ ఫిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తన శిష్యులును, ఇతర ప్రతిభావంతులైన నూతన దర్శకులను ప్రోత్సహించనున్నారు. బ్లడీ బెగ్గర్వారితో కలిసి మంచి కథా చిత్రాలను నిర్మించనున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా బ్లడీ బెగ్గర్ అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో కవిన్ కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా నెల్సన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న శివబాలన్ ముత్తుకుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. బిచ్చగాడి గెటప్లో ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను దర్శకుడు నెల్సన్, నటుడు రెడిన్ కింగ్స్లీ, కవిన్, శివబాలన్లు నటించిన ఓ ఫన్నీ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే బ్లడీ బెగ్గర్ పేరుతో కవిన్ బిచ్చగాడి గెటప్లో ఉన్న పోస్టర్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇకపోతే కవిన్ హీరోగా నటించిన స్టార్ మూవీ తమిళనాట నేడే (మే 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: నేరుగా ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే? -
మాకే ఎందుకిన్ని కష్టాలు అనిపించే స్టోరీ.. ఓటీటీలో చూసేయండి..
నలుగురమ్మాయిలు పడ్డ కష్టాలు.. వాటి నుంచి బయటపడేందుకు చేసిన పోరాటమే కన్నగి కథ! అమ్ము అభిరామి, విద్య ప్రదీప్, షాలిని జోయ, కీర్తి పాండియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ తమిళ సినిమాకు యశ్వంత్ కిషోర్ దర్శకత్వం వహించారు. ఆ నాలుగు పాత్రలు.. మాకే ఎందుకిన్ని కష్టాలు అనిపించేలా ఉంటాయి. స్కైమూన్ ఎంటర్టైన్మెంట్, ఈ5 ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ గణేశ్, ధనుష్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రమే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో చడీచప్పుడు లేకుండా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. అప్పుడు తమిళ వర్షన్ మాత్రమే రిలీజైంది. తాజాగా హిందీ, తెలుగు వర్షన్ను ప్రైమ్లో అందుబాటులోకి తెచ్చారు. సినిమా రిలీజైన రెండున్నర నెలల తర్వాత తెలుగు వర్షన్ తీసుకురావడం విశేషం. #atmsuggestions #Kannagi pic.twitter.com/LqE8jTkYbm — Addicted To Memes (@Addictedtomemez) March 3, 2024 చదవండి: సడన్గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి -
అప్పుడు ఐటం సాంగ్తో అదరగొట్టింది.. ఇప్పుడు హీరోయిన్గా
హాస్యనటుడు సతీష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విత్తైక్కారన్. వైట్ కార్పెట్ ఫిలిమ్స్ పతాకంపై కె.విజయ్ పాండి నిర్మించిన ఈ చిత్రం ద్వారా వెంకీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సిమ్రాన్ గుప్తా హీరోయిన్గా నటించారు. ఈమె మంచి డాన్సర్, మోడల్ కూడా! 2014లో డీడీ నేషనల్ టీవీ నిర్వాహకులు నిర్వహించిన డాన్స్ పోటీల్లో సిమ్రాన్ గుప్తా టైటిల్ విన్నర్ కావడం గమనార్హం. ఆ తరువాత మోడలింగ్లో రాణించిన ఈమె తెలుగులో అన్వేషి అనే చిత్రంలో నాయకిగా నటించారు. అదేవిధంగా హిందీలోనూ జహాన్ చార్ యార్ అనే చిత్రంలో నటించారు. తమిళంలో హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన సర్కార్ చిత్రంలో సిండాక్కారన్ అనే ఐటెం సాంగ్లో ఆయనతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా విత్తైక్కారన్ చిత్రంతో మరోసారి కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. కాగా ఇంతకుముందు సిమ్రాన్ తన నటనతో తమిళం, తెలుగు భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. మరి ఈసారి సిమ్రాన్ గుప్తాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాల్సి ఉంది. విత్తైకారన్ సినిమా వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగే కామెడీ కథా చిత్రమని చెప్పారు. ఇందులో నటుడు ఆనంద్రాజ్, మధుసూదనరావు, దర్శకుడు సుబ్రమణ్య శివ, జాన్ విజయ్, ఆసిఫ్ అలీ, శ్యామ్స్ స్వామినాథన్ ముఖ్యపాత్రలు పోషించినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: 25వ పెళ్లి రోజు.. వారితో కలిసి సెలబ్రేషన్స్.. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గొడవలు.. -
నిండు గర్భిణిగా కనిపించనున్న నా సామిరంగ బ్యూటీ!
హీరోయిన్లకు బలమైన పాత్రలు అరుదుగానే లభిస్తుంటాయి. అలా జైలర్ చిత్రం ఫేమ్ మీర్నా మీనన్కు బర్త్మార్క్ అనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం లభించింది. విక్రమ్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రచన, నిర్మాత బాధ్యతలను శ్రీరామ్ శివరామన్, విక్రమ్ శ్రీధరన్ నిర్వహిస్తున్నారు. సబీర్ కల్ల రక్కల్, ఇంద్రజిత్, ఫోర్కొడి, బి ఆర్ వరలక్ష్మి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని, ఉదయ్ తంగవేలు చాయాగ్రహణం అందిస్తున్నారు. డైరెక్టర్ ఈ సినిమా విశేషాలను గురించి తెలుపుతూ.. ఇది జెనీ అనే యువతి చుట్టూ తిరిగే కథా చిత్రమని చెప్పారు. ఇందులో ఏడు నెలల గర్భిణి పాత్రలో మిర్నా అద్భుతంగా నటించారన్నారు. చిత్రంలో చాలా కీలకమైన ఈ పాత్రలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్న తరుణంలో ఈమె పేరు పరిశీలనకు వచ్చిందన్నారు. ఆమె ఆ పాత్రకు కరెక్ట్గా నప్పుతారని భావించినట్లు చెప్పారు. కథను అర్థం చేసుకుని జెనీ పాత్రలో ఆమె జీవించారన్నారు. ఈ పాత్రకు ఆమెను మినహా వేరే ఎవరినీ ఊహించలేమన్నారు. మిర్నా మీనన్ ఇంతకుముందు మలయాళంలో బిగ్ బ్రదర్, తమిళంలో బుర్ఖా, జైలర్, తెలుగులో నా సామిరంగ చిత్రాలలో నటించారని.. వాటన్నింటికంటే పూర్తిభిన్నంగా బర్త్మార్క్ చిత్రంలో ఆమెను చూస్తారని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం మిర్నా మీనన్ ఎంతగానో శ్రమించారని చెప్పారు. చిత్ర షూటింగ్ను 36 రోజుల్లో పూర్తి చేసినట్లు దర్శకుడు చెప్పారు. చదవండి: ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఈ ఏడాది పోటీపడుతున్న సినిమాలివే! -
10 ఏళ్ల తర్వాత హిట్ మూవీకి సీక్వెల్.. తెలుగు హీరోయిన్స్తో
దర్శకుడు ఎస్.ఎళిల్... విజయ్ హీరోగా 'తుళ్లాద మనం తుళ్లుమ్', అజిత్ కథానాయకుడిగా 'పూవెల్లా ఉన్ వాసన్', రాజా, ప్రభుదేవా హీరోగా 'పెన్నిన్ మనదై తొట్టు', జయంరవితో 'దీపావళి', విష్ణువిశాల్ హీరోగా 'వేలన్ను వందుట్టా వేళైక్కారన్' వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. ఆ తరువాత విమల్ కథానాయకుడిగా దేసింగురాజా చిత్రాన్ని రూపొందించాడు. 10 ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా దేసింగురాజు –2 రూపొందుతోంది. ఎస్.ఎళిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మరోసారి విమలే కథానాయకుడిగా నటిస్తున్నారు. అలా ఈ సక్సెస్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ఎళిల్ తన చిత్రాల్లో వినోదానికి పెద్ద పీట వేస్తాడు. పి.రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి ఐనా కీలక పాత్రను పోషిస్తున్నారు. పూజిత పొన్నాడ, హర్షిత ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూరి, యోగిబాబు, రవి మరియ, రోబో శంకర్, సింగం పులి, మొట్టై రాజేంద్రన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వేర్వేరు బాటల్లో పయనించే నలుగురు కళాశాల విద్యార్థుల ఇతివృత్తంతో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దేసింగురాజు –2 ఉంటుందని దర్శకుడు తెలిపాడు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాడు. ఆర్.బాలకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం..! -
మహారాణి బయోపిక్.. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నిర్మాత కూతురు!
బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన భారతదేశ మొట్టమొదటి రాణి వీరమంగై వేలు నాచ్చియార్ జీవిత చరిత్ర సినిమాగా రానుంది. వేలు నాచ్చియార్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ పతాకంపై జేఎం.బషీర్ నిర్మిస్తున్నారు. ఆర్.అరవింద్రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో టైటిల్ పాత్రను నటి ఆయిషా పోషిస్తున్నారు. ఈమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. దీనికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించడం విశేషం. కాగా ఇందులో పెరియమరుద అనే ముఖ్య పాత్రను ఈ చిత్ర నిర్మాత, నటుడు జేఎం.బషీర్ పోషిస్తున్నారు. ఈ చిత్ర పరిచయ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక టీ.నగర్లోని దేవర్ మహల్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జేఎం.బషీర్ మాట్లాడుతూ.. వేలు నాచ్చియార్ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడం గర్వంగా ఉందన్నారు. ఇందులో టైటిల్ పాత్రను తన కుమార్తె ఆయిషా పోషించడం ఇంకా సంతోషంగా ఉందన్నారు. మన దేశం కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడిన తొలి మహిళారాణి గురించి ఈ తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్న సదుద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. తాను నటించిన దేశీయ తలైవర్ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని, ఆ తరువాత వేలు నాచ్చియార్ చిత్ర షూటింగ్ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి జె.శ్రీధర్ చాయాగ్రహణం అందించనున్నారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జేఎం.బషీర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: ప్రభాస్ హీరోయిన్కి చేదు అనుభవం.. అలా జరగడంతో! -
అప్పుడు కాత్తు వాక్కుల రెండు కాదల్.. ఇప్పుడు..
నయనతార, సమంత, విజయ్ సేతుపతి కలిసి నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా కాత్తు వాక్కుల ఒరు కాదల్ అనే పేరుతో మరో వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రం రూపొందడం విశేషం. చైన్నె ప్రొడక్షన్స్ పతాకంపై ఎళిల్ అనియన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాస్ రవి భూపతి కథ, కథనం, పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి లక్ష్మీప్రియ, మంజుల కథానాయికలుగా నటిస్తున్న ఇందులో సూపర్ సుబ్బరాయన్, సాయి దినా, సత్య, కల్లూరి వినోద్, ఆదిత్య ఖదీర్, తంగదురై, ఫవర్ స్టార్, కబాలి విశ్వంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ గాలిని ఎవరూ చూడలేరని, అనుభూతిని మాత్రమే పొందగలరని అన్నారు. అదే విధంగా ప్రేమలో నలుపు, ఎరుపు ఎవరూ చూడలేదని దాన్ని కేవలం ఫీల్ అవగలరన్నారు. అలా ఒక నిజమైన ప్రేమ చుట్టూ తిరిగే కథా చిత్రమే కాత్తు వాక్కుల ఒరు కాదల్ అని పేర్కొన్నారు. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో ఉంటుందన్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు ఎలా మోసపోతున్నారనేదాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. నేటి తరం ప్రేక్షకులకు కావలసిన ప్రేమ, వినోదం, యాక్షన్, థ్రిల్లర్, ఎమోషనల్.. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ చైన్నె, పాండిచ్చేరి, కేరళ ప్రాంతాలలో నిర్వహించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి జీకే వీ సంగీతాన్ని, రాజదురై ఎంఏ, సుభాష్ ఎన్.మణియన్ ద్వయం ఛాయాగ్రహణం అందించినట్లు దర్శకుడు తెలిపారు. చదవండి: అమ్మ జీవితంలో చాలా మిస్సయింది.. రెండో పెళ్లి.. మేము ఏమంటామోనని.. -
'దాదా' హీరో కొత్త సినిమా.. అప్డేట్స్ ఇవే!
యంగ్ హీరో కెవిన్ కథానాయకుడిగా నటించిన దాదా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రానికి స్టార్ అనే టైటిల్ను ఖరారు చేశారు. దీనికి ప్యార్ ప్రేమ కాదల్ చిత్రం ఫేమ్ ఇళన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్, శ్రీనిధి సాగర్ కలిసి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులోని పాటలన్నీ యూత్ను అలరించే విధంగా ఉంటాయంటున్నాయి చిత్ర వర్గాలు. ఈ చిత్ర ప్రోమో వీడియోను యువన్ శంకర్ రాజా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చిందని పేర్కొన్నారు. ఇటీవల ఇందులోని ఓ సాంగ్ కోసం భారీ సెట్ వేసి చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇది నటుడు కెవిన్ ఇంతకు ముందు నటించిన చిత్రాల కంటే భిన్నంగానూ, భారీగానూ రూపొందిస్తున్న చిత్రం అని పేర్కొన్నాయి. కాగా ఇది సినీ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందట. తెర వెనుక పలు ఆసక్తికరమైన అంశాలను ఆవిష్కరించే చిత్రంగా స్టార్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న స్టార్ చిత్రాన్ని ఫిబ్రవరి 9వ తేదిన తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: తిరుపతిలో బిగ్ బాస్ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం -
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో రుద్రతాండవం హీరో
ద్రౌపది, రుద్రతాండవం చిత్రాల ఫేమ్ నటుడు రిచర్డ్ రిషి, పున్నగై పూ గీత, యషికా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సిలనొడిగళిల్. ఎస్కైర్ ప్రొడక్షన్స్ యూకే సంస్థతో కలిసి పున్నగై పూగీత నిర్మించిన ఈ చిత్రానికి వినయ్ భరద్వాజ్ కథ, దర్శక బాధ్యతలను నిర్వహించారు. ఐదుగురు సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ఇది సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో రిచర్డ్ రిషి లండన్లో పేరొందిన కాస్మోటిక్ సర్జన్గా నటించారన్నారు. పున్నగై పూగీత, రిచర్జ్ రిషి అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారన్నారు. అలాంటి సమయంలో ప్రముఖ మోడల్ నటి యషికా ఆనంద్ అతనికి పరిచయం అవుతుందన్నారు. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడుతుందన్నారు. ఆ తర్వాత యషికా ఆనంద్ హత్యకు గురవుతుందని, ఆమెను ఎవరు ఎందుకు హత్య చేశారన్నదే చిత్ర ప్రధాన అంశం అని చెప్పారు. ఈ సినిమా పూర్తిగా కొత్తగా ఉంటుందని లండన్ నేపథ్యాన్ని చిత్రానికి ఎంచుకున్నట్లు చెప్పారు. ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో గ్లామర్ పాత్రలు పోషించిన యషికా ఆనంద్ ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యత కలిగిన పాత్రలో అద్భుతంగా నటించారని, రిచర్డ్ రిషి తన పాత్రకు న్యాయం చేశారని నిర్మాత తెలిపారు. సిల నొడిగళిల్ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చేవారం చిత్రం టీజర్, ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. చదవండి: గాయత్రి గుప్తాకు ఏమైంది?.. అసలా బూతులేంటి! -
30 ఏళ్ల తర్వాత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. నెక్స్ట్ హైదరాబాద్లోనే
శంకర్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.టి.కుంజుమోన్ 1993లో నిర్మించిన జెంటిల్మన్ చిత్రం సంచలన విజయం సాధించింది. 30 ఏళ్ల తరువాత కె.టి.కుంజుమోన్ ఆ చిత్రానికి సీక్వెల్ను నిర్మిస్తున్నారు. అయితే దర్శకుడు, కథానాయకుడు, సంగీత దర్శకుడు అందరూ మారిపోయారు. ఈ చిత్రానికి గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్, నయనతార చక్రవర్తి జంటగా నటిస్తున్న ఇందులో 50 మందికి పైగా నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అజయ్ విన్సెంట్ చాయాగ్రహణం, వైరముత్తు పాటలను, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయిందని చిత్రయూనిట్ వెల్లడించింది. తొలి షెడ్యూల్ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు పేర్కొంది. ఈ షూటింగ్లో పలు కీలక సన్నివేశాలను, భారీ ఫైట్ సీక్వెన్స్ను చిత్రీకరించినట్లు తెలిపారు. కాగా రెండో షెడ్యూల్ను నవంబర్ మూడో వారంలో మొదలుపెట్టి చైన్నె, హైదరాబాద్, పుదుచ్చేరి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తరువాత ముంబై, మలేషియా, శ్రీలంకలలో చిత్రీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. చదవండి: తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య ఇక లేరు -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సింగర్
విజయ్ టీవీ సూపర్ సింగర్ ఫేమ్, గాయని రాజ్యలక్ష్మి సెంథిల్ తొలిసారి కథానాయకిగా పరిచయం అవుతున్న చిత్రం లైసెన్స్. జేఆర్జీ పిక్చర్స్ పతాకంపై ఎన్.జీవానందం నిర్మించిన చిత్రం ఇది. గణపతి బాలకుమార్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు రాధారవి, ఎన్.ఆనందం, కరుప్పయ్య, గీతా కై లాసం, అభి నక్షత్ర, తాన్య అనన్య, వైయాపురి, నమో నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కాశీ విశ్వనాథ్ చాయాగ్రహణం, బైజు జాకబ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లైసెన్స్ చిత్రంలో గాయని రాజ్యలక్ష్మి సెంథిల్ పాఠశాల ఉపాధ్యాయులుగా నటించారు. అభ్యుదయ భావాలు కలిగిన విద్యార్థుల కోసం ఎలా పోరాటం చేశారు? అసలు ఈమె దేని కోసం లైసెన్స్ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు? ఆమె కోరిన లైసెన్స్ వచ్చిందా? ఇలా పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం లైసెన్స్. ముఖ్యంగా పాఠశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను, వాటిని నివారించటానికి ఉపాధ్యాయురాలు ఎంచుకున్న పోరుబాట ఏమిటి అనేది లైసెన్స్ ప్రధానాంశం. -
రారా సరసకు రారా మూవీకి 62 సెన్సార్ కట్స్!
'రారా సరసకు రారా' చిత్రానికి సెన్సార్ బోర్డు 62 చోట్ల కత్తెరకు పని చెప్పిందని నిర్మాత జయలక్ష్మి తెలిపారు. వేలూరులో చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలోనూ పోలీసులు, ఇన్స్పెక్టర్, కమిషనర్ స్థాయి నుంచి పలు సమస్యలను ఎదుర్కొన్నామని, కాట్పాడి రాజన్ తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు. స్కై వండర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈమె నిర్మించిన చిత్రం రారా సరసకు రారా. ఈ చిత్రానికి కేశవ్ దబర్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 3వ తేదీ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. లేడీస్ హాస్టల్లో ఒక్క రాత్రి జరిగే కథా చిత్రం అని చెప్పారు. నిత్యం పలు సమస్యలతో సతమతమయ్యే ప్రజలు రెండు గంటల పాటు హాయిగా చూసి ఎంజాయ్ చేసే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. సెన్సార్ బోర్డు నిబంధనలు 5 ఏళ్లకు ఒకసారి మారాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడో 1952లలో సెన్సార్ విధి విధానాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అన్నారు. తమ చిత్రానికి 62 కట్స్ ఇచ్చారని తెలిపారు. అందుకే తనను 62 కట్స్ చిత్ర దర్శకుడు అంటున్నారని తెలిపారు. రారా సరసకు రారా చిత్రం టైటిల్కే అభ్యంతరం తెలిపారని, ఇంతకు ముందు ఎన్నో చిత్రాలకు అభ్యంతరం చెప్పినా సెన్సార్ బోర్డు తమ చిత్రానికి చాలా కట్స్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రివైజింగ్ కమిటీకి వెళ్లినట్లు, నటి గౌతమి సభ్యురాలిగా ఉన్న ఆ కమిటీలోనూ పలుమార్లు చర్చ జరిగిందని చెప్పారు. తాము యు సర్టిఫికెట్ కోరలేదని, వారు ఎన్ని కట్స్ చెప్పినా ఓకే చెప్పడానికి సిద్ధమయ్యామని దర్శకుడు పేర్కొన్నారు. లేడీస్ హాస్టల్లో జరుగుతున్న అనర్థాలను చెప్పడమే తమ చిత్ర ప్రధాన ఉద్దేశం అని దర్శకుడు తెలిపారు. చదవండి: ఐశ్వర్యరాయ్ బర్త్డే స్పెషల్.. ఏడువందల కోట్లకు పైగా ఆస్తులు -
షూటింగ్లకు రాకుండా తిప్పలు పెడుతున్న యోగిబాబు?
నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లక్కీమ్యాన్. నటి రేచ్చల్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి నటుడు బాలాజీ వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు తాను దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ పానీపూరికి మంచి ఆదరణ లభించిందన్నారు. తాజాగా లక్కీమ్యాన్ చిత్ర కథను నటుడు యోగిబాబుకు చెప్పగా వెంటనే నటించడానికి అంగీకరించారన్నారు. యోగిబాబును ఇండియన్ నటుడు అని చెప్పవచ్చునన్నారు. అంతటి ప్రతిభావంతుడని పేర్కొన్నారు. ఆయన గురించి ఇటీవల పలు వదంతులు ప్రచారం అవుతున్నాయని, వాటిలో ఏమాత్రం నిజం లేదన్నారు. యోగిబాబు ఇంటిలో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొన్నా, షూటింగ్కు ఇబ్బంది కలుగుతుందని, కష్టాన్ని భరిస్తూనే తమ చిత్రంలో నటించారన్నారు. కాగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న శక్తి ఫిలిమ్స్ శక్తివేల్కు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. నటుడు యోగిబాబు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ చెప్పినట్లుగా ఈ చిత్రం తన జీవితాన్ని తిరిగి చూసుకునేట్లు ఉందన్నారు. ఇంతకు ముందు తాను కొన్ని చిత్రాల్లో నాలుగైదు సన్నివేశాల్లో నటించినా తన పేరును ప్రచారానికి వాడుకోవడం అభిమానులను మోసం చేయడం కాదా..? అని ప్రశ్నించారు. దాని గురించి అడిగితే సమస్యగా మారుతోందన్నారు. తాను షూటింగ్లకు సరిగా రావడం లేదనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. షూటింగ్కు రాకుండా తానెక్కడికి వెళతానన్నారు. తన గురించి జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. తాను కథలను విని కాకుండా వారి కష్టాలను విని నటిస్తున్నానని యోగిబాబు వెల్లడించారు. చదవండి: చిన్నాచితకా పాత్రలకు సైతం కాంప్రమైజ్.. కెరీర్ కోసం నేనూ అడ్జస్ట్ అయ్యా..: నటి -
సూపర్ హిట్గా నిలిచిన గుడ్నైట్ మూవీ.. ఈ టీమ్ కలయికలో కొత్త చిత్రం
చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం గుడ్నైట్. ఈ చిత్ర కథానాయకుడు మణికంఠన్, మిలియన్ డాలర్స్, ఎంఆర్పీ సంస్థలు మరో చిత్రానికి సిద్ధమయ్యారు. శ్రీగౌరిప్రియ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని, శ్రేయాకృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం ఉదయం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నటుడు విజయ్సేతుపతి విచ్చేసి ముహూర్తం షాట్కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలను తెలుపుతూ యువతీ యువకులు సమకాలీన ప్రేమ, తద్వారా ఏర్పడే సమస్యలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ను చైన్నె, గోవా సమీపంలోని గోకర్ణం ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. చిత్ర కథ జనరంజక అంశాలతోపాటు మంచి సందేశంతో కూడి ఉంటుందన్నారు. చదవండి: నాకు హద్దులు తెలుసు.. అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్ -
బకాసురన్.. కూతురి కోసం పోరాడే తండ్రి కథ!
చిత్రాలను ప్రయోగాత్మకం, ప్రయోజనాత్మకం, ప్రజానందాత్మకం అంటూ మూడు భాగాలుగా విభజిస్తే బకాసురన్ చిత్రం ప్రయోజనాత్మకం కేటగిరీలో చేరుతుంది. సమాజానికి అవసరమైన కంటెంట్తో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు మోహన్.జి. ఇంతకుముందు పళయ వన్నారపేట్టై, ద్రౌపది, రుద్ర తాండవం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను రూపొందించారు. తాజాగా శ్రీ దర్శకత్వంలో జీఎం ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించిన చిత్రం బకాసురన్. దర్శకుడు సెల్వరాఘవన్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటరాజన్, కే రాజన్, మన్సూర్ అలీఖాన్, నటి తారాక్షి, లావణ్య మాణిక్యం, దేవదర్శిని, పి.ఎల్ తేనప్పన్, గుణానిధి, రామ్, శశిలైలా రిచా, కూల్ జయంత్, అరుణోదయన్, కుట్టి గోపి ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఫరూక్ బాషా చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జీటీఎం సంస్థ శుక్రవారం విడుదల చేసింది. దర్శకుడు మోహన్.జి ఈ చిత్రానికి సమాజంలో జరుగుతున్న ప్రస్తుత విషయాలను ఇతివృత్తంగా తీసుకున్నారు. కొన్ని యధార్థ సంఘటనలను చిత్రంలో వాడుకున్నారు. ముఖ్యంగా విద్యార్థినుల భవిష్యత్తులతో విద్యాసంస్థల అధినేతలు ఎలా ఆడుకుంటున్నారు?, పరిస్థితుల ప్రభావం కారణంగానో, మరి ఇతర కారణాల వల్లో యువతులు వ్యభిచార కూపంలో చిక్కుకుని ఎలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు? అందుకు కొందరు యువకులు ఆధునిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుకుంటున్నారు? వంటి అంశాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన కథ చిత్రం బకాసురన్. ఇందులో వీధి భాగోతం కళాకారుడుగా దర్శకుడు సెల్వరాఘవన్ నటించారు. మాజీ సైనికుడిగా నటరాజన్, విద్యాసంస్థ అధినేతగా రాధారవి నటించారు. వీరి మధ్య జరిగే కథే బకాసురన్. అయితే ఇందులో బకాసురన్ ఎవరనేదే చిత్రంలో ఆసక్తికరమైన అంశం. కూతురి తండ్రిగా భీమరాజ్ పాత్రలో సెల్వరాఘవన్ నటన హైలైట్గా ఉంటుంది. ఆయన అలుపెరుగని పోరా టమే బకాసురన్ చిత్రం. -
స్వాతంత్య్ర సమరయోధురాలిగా మిస్ చెన్నై
తొలి స్వతంత్ర సమరయోధురాలు వేలు నాచియార్ జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కనుంది. దీనికి మరుదుస్క్వేర్ అనే పేరును నిర్ణయించారు. దీన్ని జే.ఎం.బషీర్ తన ఫ్రెండ్స్ సినిమా పతాకంపై నిర్మించి పెద్ద మరుదు పాత్రను పోషించనున్నారు. ఈయన ఇప్పటికే దేశీయతలైవర్ చిత్రంలో టైటిల్ పాత్ర పసుమ్ పొన్ ముత్తురామలింగ దేవర్గా నటిస్తున్నారు. కాగా ఇందులో వేలు నాచియార్ అనే ప్రధాన పాత్రను బషీర్ కూతురు ఆయిషా పోషించనున్నారు. ఈమె 2019లో మిస్ చెన్నై అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్నారు. నటనపై ఆసక్తితో అందుకు కావలసిన శిక్షణ పొందారు. శ్రీధర్ మాస్టర్ వద్ద డాన్స్, స్టంట్ మాస్టర్లు తవసీరాజ్, మిరాకిల్ మైఖెల్ ఫైట్స్లో శిక్షణ పొందారు. అదేవిధంగా మదుర్ ముత్తు లక్ష్మి వద్ద సిలంబాట్టం వంటి విలు విద్యలు నేర్చుకున్నారు. ఈ చిత్రానికి ఊమై విళిగల్, ఉళవన్ మగన్ చిత్రాల ఫేమ్ అరవింద్ రాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ప్రస్తుతం జెఎం.బషీర్ టైటిల్ పాత్రను పోషించిన దేశీయతలైవన్ చిత్రాన్ని పూర్తిచేశారు. ఈ చిత్రం విడుదల తరువాత మరుదు స్క్వేర్ చిత్రాన్ని సెట్ పైకి తీసుకెళ్లనున్నట్లు చిత్రం వర్గాలు గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. ఈ సినిమాకు ఒక ప్రముఖ సంగీత దర్శకుడు సంగీతాన్ని అందించనున్నారని, అదేవిధంగా చిన్న మరుదు పాత్రను పోషించడానికి ఒక ప్రముఖ నటుడితో చర్చలు జరుగుతున్నాయని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. చదవండి: రెండు సీన్లు చూసి థ్రిల్ అయ్యా: అఖిల్ -
కొత్త హీరోయిన్ను పరిచయం చేస్తున్న హీరో శింబు
మానాడు హిట్ తరువాత శింబు నటిస్తున్న తాజా చిత్రం వెందు తనిందదు కాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వేల్స్ ఫిలిం పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గుజరాతీ భామ సిద్ధి ఇడ్నాని కథానాయికగా పరిచయం అవుతోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో శింబు విభిన్న పాత్రల్లో నటించినట్లు, ఆయన గెటప్ కూడా చాలా భిన్నంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. సెప్టెంబర్ 15న సినిమా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి, వెడ్డింగ్ ఫొటోలపై ఫ్యాన్స్ అసంతృప్తి! దాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ అదే నా బ్యూటీ సీక్రెట్ -
విడుదలకు సిద్ధమైన ఫారిన్ సరకు
ఫారిన్ సరకు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నెప్టియన్ సెయ్లర్స్ పతాకంపై గోపినాథ్ నిర్మించి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ద్వారా విఘ్నేశ్వరన్ కుప్పసామి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. దానితో చిత్రంలో పాటు ప్రధాన పాత్ర పోషిస్తూ, సహ నిర్మాతగా బాధ్యతలను నిర్వహించారు. దీనిలో సుందర్ అనే వ్యక్తి కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. ఇందులో విశేషం ఏంటంటే.. షిప్లో పని చేసిన ఈ ముగ్గురూ సినిమాపై ఆసక్తితో ముందుగా షార్ట్ ఫిలింస్ చేశారు. తాజాగా ఫారిన్ సరకు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ రంగప్రవేశం చేశారు. ఫారిన్ సరకు అనగానే ఏదేదో ఊహించుకునే అవకాశం ఉందని, చిత్రం చూసిన తరువాత ప్రేక్షకుల భావన మారుతుందని దర్శకుడు మంగళవారం చెన్నైలో నిర్వహించిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలిపారు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన చిత్రం ఇదన్నారు. తమలాంటి వారికి అవకాశం కలిగించాలన్న భావనతో 300 మందిని ఈ చిత్రం ద్వారా పరిచయం చేసినట్లు తెలిపారు. గుజరాత్, తమిళనాడు రాష్టాల మధ్యలో జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథ అని తెలిపారు. ఇది రెగ్యులర్ ఫార్ములాలో సాగే చిత్రం కాదని, కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయన్నారు. చిత్రాన్ని విడుదల చేయడమే విజయంగా భావిస్తున్నట్లు నిర్మాత గోపినాథ్ తెలిపారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే.. ప్రముఖ దర్శక-నిర్మాత రాజేంద్రప్రసాద్ మృతి -
హరికృష్ణన్, షీలా జంటగా కొత్త చిత్రం
మెడ్రాస్ చిత్రం ఫేమ్ హరికృష్ణన్, టూలెట్ చిత్రం ఫేమ్ షీలా రాజ్కుమార్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు పా.రంజిత్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. మంజల్ సినిమా పతాకంపై గోల్డెన్ సురేష్, విజయలక్ష్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జస్టిన్ ప్రభు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధ్య తరగతి కుటుంబాల జీవితాల్లో జరిగే సంఘటనలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. సహజత్వానికి దగ్గరగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ను కృష్ణగిరి, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. ఏ.కుమరన్ ఛాయాగ్రహణం, శివశంకర్ మాటలను అందిస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. చదవండి: ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్ అప్పారావు కృష్ణ వంశీ భారీ ప్లాన్.. రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్! -
విదార్థ్ హీరోగా సైకో థ్రిల్లర్ మూవీ ప్రారంభం!
నటుడు విదార్థ్ నూతన చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గ్రీనేటివ్ ఫిలింస్ పతాకంపై ఆర్.మోహన్ రాజేశ్ బాబు నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. రచయిత శ్రీనివాసన్ సుందర్, కథ, కథనం, మాటలు అందిస్తున్న ఈ చిత్రం ద్వారా మణిమారన్ నటరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర పూజా కార్యక్రమాల్లో ఐఏఎస్ అధికారి నందకుమార్, దర్శకుడు కార్తీక్ సుందర్, సద్గుణాలు, రామనాథ్ పళణి కుమార్, డోరా దాస్ రామస్వామి తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇందులో నటించే హీరోయిన్, విలన్ పాత్రదారుల ఎంపిక జరుగుతోందని దర్శకుడు తెలిపారు. ఇది పోలీస్ అధికారి ఇన్వెస్టిగేషన్ ఇతివృత్తంతో సాగే సైకో థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. దీనికి జీబ్రాన్ సంగీతాన్ని ఎస్ఆర్ సతీష్కుమార్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాణ సంస్థ గ్రీనేటివ్ డాట్ కామ్ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించింది. చదవండి: ‘పక్కా కమర్షియల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే.. ఫ్రెండ్తో వన్ నైట్ స్టాండ్.. తల్లిని కావాలని లేదు: నటి -
భారీ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి!
ప్రేక్షకులు మెచ్చిన కొన్ని సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కడం కామన్. అలా కోలీవుడ్లో అరడజనుకు పైగా సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయి. భారీ హిట్స్ సాధించిన చిత్రాలకు ‘కథ కంటిన్యూ’ అవుతోంది. ఈ సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. దాదాపు 26ఏళ్ల క్రితం వెండితెరపై శంకర్ చూపించిన ‘భారతీయుడు’ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. బాక్సాఫీస్ రికార్డులను సృష్టించాడు. కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు’ (1996) చిత్రానికి అంతటి రెస్పాన్స్ లభించింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2)కి స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారు శంకర్. సీక్వెల్లోనూ కమల్హాసనే హీరో. అయితే షూటింగ్ వేగంగా జరుగుతున్న సమయంలో లొకేషన్లో యాక్సిడెంట్ జరగడం, ఆ తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్కు, దర్శకుడు శంకర్కు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడం వంటి కారణాలతో ‘ఇండియన్ 2’ షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. అయితే మళ్లీ పట్టాలెక్కించి, వీలైతే ఈ ఏడాదే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఓ సందర్భంలో కమల్హాసన్ చెప్పారు.. సో.. సమయం కాస్త అటూ ఇటూ అయినా తెరపైకి మరోసారి భారతీయుడు రావడం ఖాయం. అలాగే శంకర్ దర్శకత్వంలోనే యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ‘జెంటిల్మేన్’ (1993) చిత్రం ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి తెలిసిందే. దీంతో ఈ చిత్రనిర్మాత టి. కుంజుమోన్ ‘జెంటిల్మేన్ 2’ను ప్రకటించారు. కానీ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించడంలేదు. నానీతో ‘ఆహా కళ్యాణం’ సినిమా తీసిన గోకుల్ కృష్ణ ‘జెంటిల్మేన్ 2’కు దర్శకుడు. ఈ చిత్రంలో ప్రియాలాల్, నయనతార చక్రవర్తి హీరోయిన్లుగా నటిస్తారు. అయితే హీరోగా ఎవరు నటిస్తారు? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే విషయాలపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న హిస్టారికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. ‘జయం’ రవి, కార్తీ, విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మీ, శోభితా ధూలిపాళ్ల ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. చోళ సామ్రాజ్య నేపథ్యంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా తొలి భాగం ‘పొన్నియిన్ సెల్వన్: 1’ సెప్టెంబరు 30న రిలీజ్ కానుంది. సీక్వెల్ వచ్చే ఏడాది విడుదలవుతుంది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకోవైపు సిల్వర్ స్క్రీన్పైకి వచ్చేందుకు ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (‘యుగానికి ఒక్కడు’ – 2010) మళ్లీ రెడీ అవుతున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ, రీమాసేన్, ఆండ్రియా, ఆర్. పార్తీబన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ సెట్స్పైకి వెళ్లనుంది. అయితే సీక్వెల్లో మెయిన్ హీరోగా కార్తీ కాదు...ధనుష్ నటిస్తారు. కార్తీ పాత్ర కూడా ఉందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఇక ‘లక లక లక...’ అనగానే అందరికీ రజనీకాంత్ ‘చంద్రముఖి’ (2005) సినిమాయే గుర్తుకు వస్తుంది. పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు, వినీత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా ‘చంద్రముఖి 2’ వస్తోంది. సీక్వెల్కు పి. వాసుయే దర్శకుడు కానీ హీరోగా నటించేది మాత్రం రజనీకాంత్ కాదు. రాఘవా లారెన్స్ నటిస్తారు. కాగా ‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తని ఒరువన్’ (ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ధృవ’లో రామ్చరణ్ హీరోగా నటించారు) చిత్రం మంచి హిట్ సాధించింది. దీంతో ‘తని ఒరువన్’ సీక్వెల్ను ప్రకటించారు దర్శకుడు మోహన్రాజా. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. అలాగే కార్తీ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘ఖైదీ’కి సీక్వెల్ ఉందని ఈ చిత్రదర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ సందర్భంలో చెప్పారు. ఇక ఇటీవల కమల్హాసన్ నటించిన హిట్ ఫిల్మ్ ‘విక్రమ్’కు కూడా సీక్వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాదు.. సూర్య, శింబు, అజిత్ నటించిన హిట్ మూవీస్ సీక్వెల్స్కు సంబంధించిన వార్తలను అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. ఇంకా హీరో సూర్య–దర్శకుడు హరి కాంబినేషన్లోని ‘సింగమ్’ సిరీస్, దర్శక–నిర్మాత, నటుడు రాఘవా లారెన్స్ ‘కాంచన’, దర్శకుడు సుందర్. సి ‘అరణ్మణై’ ఫ్రాంచైజీల నుంచి సీక్వెల్ చిత్రాలు రెడీ అవుతున్నాయన్నది కోలీవుడ్ ఖబర్. చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ జూలై 1న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్లు.. -
మామతో హీరో కలిసి చేసిన మూవీ యానై, ట్రైలర్ చూశారా?
కమర్షియల్ చిత్రాలకు మారుపేరు దర్శకుడు హరి. ఈ తరహా చిత్రాలకు కాస్త భిన్నంగా ఆయన తెరకెక్కించిన చిత్రం యానై అని హీరో అరుణ్ విజయ్ పేర్కొన్నారు. వీరి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్ పతాకంపై వెడిక్కారన్పట్టి ఎస్.శక్తివేల్ నిర్మించారు. ప్రియ భవానీ శంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి చెన్నైలో నిర్వహించిన చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు విజయ్ మాట్లాడుతూ తాను తన మామ హరి కలిసి చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నామని, అది ఈ చిత్రంతో కుదిరిందని తెలిపారు. ఈ కథకు భారీ బడ్జెట్ అవసరం అవడంతో శక్తి వేల్ను సంప్రదించామన్నారు. ఇందులో తన చుట్టూ ఉన్న వారిని రక్షించుకునే పాత్రలో తాను నటించానన్నారు. ఇది చాలెంజింగ్ అనిపించిందన్నారు. చదవండి: నాగార్జునను సైడ్ చేసి సమంతకు బాధ్యతలు! ఆస్ట్రేలియా ఆఫర్, భారీ రెమ్యునరేషన్, కానీ మేనేజర్ను పర్సనల్గా కలవాలట! -
చైల్డ్ ఆర్టిస్ట్ యోగేశ్వరన్కు ప్రశంసలు
'హే సగో' అనే వీడియో ఆల్బమ్ కోసం ఆడి పాడిన బాలనటుడు యోగేశ్వరన్ను పలువురు సినీ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. రఘురామన్, సంగీత దంపతులు రూపొందించిన వీడియో ఆల్బమ్ హే సగో, జై క్రిష్ కదీర్ పాటను రాసి సంగీతాన్ని సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు పేరరసు, రాజు మురుగన్, నటుడు, నిర్మాత కె.రాజన్, గాయకుడు ఉన్నికృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఆల్భమ్ ద్వారా మంచి సంగీత ప్రయత్నం చేశారని గాయకుడు ఉన్నికృష్ణన్ పేర్కొన్నారు. ఇందులో ఆడి పాడిన చిన్నారి యోగేశ్వరన్కు ఇంత మంచి అవకాశం కల్పించి ప్రోత్సహించిన అతని తల్లిదండ్రులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కుర్రాడు మరింతగా ఎదిగి తమిళ కళలను ప్రపంచస్థాయిలో వ్యాప్తి చేయాలని కె. రాజన్ ఆకాక్షించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: బాడీ షేమింగ్ చేశారు, మట్కా అని పిలిచేవారు: జెర్సీ హీరోయిన్ -
గాఢంగా ప్రేమించుకున్న జంట అనుకోకుండా దూరమైతే..
పరువు కాదల్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. రామ్ ఫిలిం ప్రొడక్షన్ పతాకంపై న్యాయవాది అల్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎస్.రవి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాళింగరాయన్, సల్మిత హీరో హీరోయిన్లుగా నటించిన ఇందులో ఆర్.సుందరరాజన్ ముఖ్యపాత్ర పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో గాఢంగా ప్రేమించుకున్న జంట అనుకోకుండా దూరం కావాల్సి వస్తుందన్నారు. ఆ తరువాత యువకుడు తన ప్రేయసిని కలుసుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించిందా? లేదా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ప్రేమ, వినోదం కలగలిపిన చిత్రంగా ఉంటుందని తెలిపారు. హోసూర్, పెరంబలూర్ ప్రాంతాల్లో షూటింగ్ చేసినట్లు చెప్పారు. దీనికి తంజై అరుణ్ప్రసాద్ సంగీతాన్ని, టి.మహిబాలన్ చాయాగ్రహణం అందించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1181265244.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి 👉 హీరో కంట్లో పడ్డాను, నో చెప్పినందుకు అంత పని చేశారు, హృదయం ముక్కలైంది సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్ -
మోసపోయిన ముగ్గురు మహిళల కథే 'ర్యాట్'
ఆన్లైన్ చక్రవడ్డీ రుణాల నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ర్యాట్ అని దర్శకుడు జోయల్ విజయ్ తెలిపారు. ఈయన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆబ్రో సినిమాస్ పతాకంపై పి. రాజరాజన్ సమర్పణలో ముత్తులక్ష్మి రాజరాజన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ విజ్ఞాన ప్రపంచం నానాటికీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సమాజానికి చాలా మంచి జరుగుతున్నా, కొంత చెడు కూడా జరుగుతోందన్నారు. డిజిటల్ టెక్నాలజీని కొందరు అవినీతికి వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అలా ఆన్లైన్ చక్ర వడ్డీ రుణాలతో మోసపోయిన ముగ్గురు మహిళల ఇతివృత్తమే ర్యాట్ చిత్రమని తెలిపారు. ఇందులో నటి రేష్మ వెంకటేష్, ఛాయాదేవి ప్రధాన పాత్రల్లో పోషిస్తుండగా నటి కనికరవి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారన్నారు. దీనికి శ్రీనివాస్ దేవాన్స్ ఛాయాగ్రహణం, అశ్విన్ హేమనాథ్ సంగీతం అందిస్తున్నట్లు వెల్లడించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_511240763.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేశారు హీరోతో డేటింగ్, రిషికేష్లో ప్రియుడితో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న బిగ్బీ మనవరాలు -
21 ఏళ్ల తర్వాత హీరోగా, గంటన్నరలో సినిమా కంప్లీట్, వరల్డ్ రికార్డ్!
ప్రపంచ రికార్డే లక్ష్యంగా రూపొందించిన చిత్రం 3.6.9. శివమాధవ్ దర్శకత్వంలో పీజీఎస్.శరవణకుమార్ నిర్మించిన ఈ చిత్రంలో దర్శక నిర్మాత కె.భాగ్యరాజ్ కథానాయకుడిగా నటించారు. నిర్మాత శరవణకుమార్ మరో హీరోగా నటించారు. ఈ చిత్రానికి మారీశ్వరన్ ఛాయాగ్రహణం, కార్తీక్ హర్ష సంగీతాన్ని అందించారు. చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం చెన్నైలో సాయంత్రం నిర్వహించారు. ఇది ప్రపంచ రికార్డు కోసం కట్స్ లేకుండా 81 నిమిషాల్లో 24 కెమెరాలతో 450 మంది సాంకేతికవర్గంతో 750 మందికి పైగా నటీనటులతో చిత్రీకరించిన చిత్రం ఇదని తెలిపారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు చిత్రాన్ని సరికొత్త ప్రయోగం చేశారన్నారు. 81 నిమిషాల్లో చిత్రాన్ని పూర్తి చేయడం సాధారణ విషయం కాదని అందుకు దర్శకుడు చాలా హోమ్వర్క్ చేశారని అన్నారు. ఇందులో తాను చర్చి ఫాదర్గా నటించానని తెలిపారు. అందరూ తాను 21 ఏళ్ల తరువాత హీరోగా నటించిన చిత్రం ఇదని అంటున్నారని, నిజానికి తాను ఎవర్గ్రీన్ హీరో అని భాగ్యరాజ్ పేర్కొన్నారు. చదవండి: అంటే సుందరానికీ.. నాని నాలుక మీద వాత పెట్టారు! ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్ ఇదిగో -
విజయ్ లాంటి పెద్ద స్టార్లకే ఆటంకాలు తప్పలేదు, నేనెంత?: హీరో
విజయ్ లాంటి పెద్ద స్టార్లకే ఆటంకాలు తప్పలేదు, తాను ఏపాటి అని వర్ధమాన నటుడు ఆర్యన్ శ్యామ్ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటించి నిర్మించిన చిత్రం అందనాళ్. వీవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి నటుడు, నిర్మాత ఆర్యన్ శ్యామ్ మాట్లాడుతూ.. తాను ఈ రంగంలో చాలా ఆటంకాలను ఎదుర్కొన్నానన్నారు. అందనాళ్ నరబలి నేపథ్యంలో సాగే బ్లాక్ మ్యాజిక్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి నిరాకరించిందని, తాను రివైజింగ్ కమిటీకి వెళ్లి పోరాడి ఏ సర్టిఫకెట్ తెచ్చుకున్నానని తెలిపారు. చదవండి: చిరంజీవిని గట్టిగా కొట్టాను, ముఖం ఎరుపెక్కిపోయింది: రాధిక -
నా డైరెక్షన్లో తనయుడిని హీరో చేద్దామనుకుంటే మొండికేశాడు
తన కొడుకు తన దర్శకత్వంలో నటించనని మొండికేశాడని దర్శకుడు, ఛాయాగ్రాహకుడు తంగర్ బచ్చన్ అన్నారు. చాలా గ్యాప్ తర్వాత తన కొడుకు విజిత్ బచ్చన్ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ దర్శకత్వం వహించిన చిత్రం టక్కు ముక్కు టిక్కు తాళం. జార్జ్ డియాజ్, శరణరాజా కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ధరణ్ కుమార్ సంగీతాన్ని అందించారు. బుధవారం చెన్నైలో నిర్వహించిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు తంగర్ బచ్చన్ మాట్లాడారు. 'నా కొడుకు నా డైరెక్షన్లో నటించనని మొండికేశాడు. అందుకే అతడిని హీరోగా చేయడానికి ఇంతకాలం పట్టింది' అని చెప్పారు. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు నాజర్, దర్శకుడు ఆర్వి ఉదయ్ కుమార్, పేరరసు పాల్గొన్నారు. చదవండి: పునీత్ మరణవార్తను రహస్యంగా ఉంచిన కుటుంబసభ్యులు.. -
సినిమా హిట్, కానీ కలెక్షన్ల వివరాలు చెప్పట్లేదు: నిర్మాత ఆవేదన
విజయవంతంగా ప్రదర్శించబడుతున్న మానాడు చిత్రానికే ఇలాంటి గతియా? అంటూ ఆ చిత్ర నిర్మాత సురేష్ కామాక్షి వాపోయారు. ఈయన తన వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై శింబు కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మానాడు. కోవిడ్ సమయంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే చిత్రం విడుదలై 75 రోజులు దాటినా ఇప్పటికీ బయ్యర్లు తనకు వసూళ్ల వివరాలను అందించడం లేదని నిర్మాత సురేష్ కామాక్షి వాపోయారు. ఈయన దీని గురించి ట్విట్టర్లో పేర్కొంటూ సక్సెస్ఫుల్ చిత్రానికే ఇలాంటి గతి ఐతే ఇక ఈ వృత్తిని ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో నటులు, నిర్మాతలు ఓటీటీ వైపు దృష్టి సారించడంలో తప్పు ఏముందని నిలదీస్తున్నారు. #maanaadu75days pic.twitter.com/m6A1Z4XMLF— sureshkamatchi (@sureshkamatchi) February 5, 2022 -
వాస్తవ ఘటన ఆధారంగా ‘కంపెనీ’
వాస్తవ ఘటన ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం కంపెనీ. గోలిసోడా చిత్రం ఫేమ్ పాండీ, మురుగేశన్, నవ నటుడు టిరీష్ కుమార్, పృథ్వీ కథానాయకులుగాను, నటి వలిన, గాయత్రి నాయికలుగా నటిస్తున్నారు. ఎస్.రంగరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ మహానంద సినిమాస్ పతాకంపై ఆర్.మురుగేశన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది కరూర్ జిల్లాలోని బస్సుల తయారీ కర్మాగారంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిందన్నారు. అందులో పని చేసే నలుగురు యువకులు తమ లక్ష్యం కోసం పాటుబడ్డారన్నారు. ఆ సమయంలో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? వంటి పలు ఆసక్తికరమైన విషయాలతో యాక్షన్ డ్రామా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ కరూర్ జిల్లాలోని బస్సుల తయారీ కర్మాగారంలోనే చేపట్టినట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. దీనికి సెంథిల్కుమార్ ఛాయాగ్రహణం, జుపిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
హీరోగా మరో వారసుడు
తమిళ తెరకు మరో వారసుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన పేరు ఆకాష్ మురళి. దివంగత నటుడు మురళి రెండవ కుమారుడు, యువ నటుడు అధర్వ సోదరుడే ఈ ఆకాష్ మురళి. కాగా, ఇంతకుముందు నటుడు విజయ్ కథానాయకుడిగా మాస్టర్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఎక్స్ బి ఫిలిమ్స్ క్రియేటర్స్ సంస్థ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఆకాశ మురళి కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. దీనికి విష్ణువర్దన్ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్లో కమర్షియల్ దర్శకుల్లో ఈయన ఒకరు. చాలా గ్యాప్ తర్వాత ఈయన తమిళంలో ఆకాష్ మురళి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. -
తమిళ స్టార్ హీరో సినిమాలో బేబమ్మకు ఛాన్స్!
ఒక్క ఛాన్స్ దక్కాక రెండో అవకాశం వెంటనే రాకపోవచ్చు. ప్రతిభ ఉన్నా ఇంకో ఛాన్స్ రావడానికి టైమ్ పట్టొచ్చు. వస్తే మాత్రం అదృష్టవంతుల కిందే లెక్క. ఇప్పుడు అందరూ కృతీ శెట్టిని అంటున్న మాట ‘లక్కీ గర్ల్’. ‘ఉప్పెన’ సినిమాతో కథానాయికగా పరిచయమై, తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్న ఈ బ్యూటీ ఇప్పటికే నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, హీరో రామ్ తాజా చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇప్పుడు తమిళ చిత్రసీమ నుంచి ఆమెకు బంపర్ ఆఫర్ దక్కిందని టాక్. మాస్ హీరో ధనుష్ సరసన కృతి అవకాశం దక్కించుకున్నారట. ధనుష్ హీరోగా ‘మారి’, ‘మారి 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలాజీ మోహన్ ఈ హీరోతో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలోనే కృతి నాయికగా నటించనున్నారని సమాచారం. ధనుష్లాంటి హీరోతో తొలి ఎంట్రీ అంటే.. లక్కీయే. (చదవండి: ఆనందంలో మునిగితేలుతున్న అల్లు శిరీష్) -
నాలోని ప్రపంచాన్ని రాశా!
ఓ తమిళ చిత్రానికి కథ రాస్తున్నట్లు ఇటీవల శ్రుతీహాసన్ చెప్పారు. ఇప్పుడు ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేసే పని మీద ఉన్నారు. నిజానికి ఈ పాటను బ్రిటన్లో ఓ వేదిక మీద ప్రేక్షకులకు వినిపించారు. ఈ పాట రాసింది ఆమే. ‘‘అక్కడి శ్రోతలు పాటను బాగా ఎంజాయ్ చేశారు. ఈ పాటనే కొంచెం కొత్త రకంగా మలచి విడుదల చేయనున్నాను’’ అన్నారు శ్రుతీహాసన్. ఒకవైపు ఈ పనులు చేయడంతో పాటు నటిగా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారామె. అయినప్పటికీ కవితల పుస్తకాన్ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘నా పదో ఏట నుంచే కవితలు రాస్తున్నాను. ఈ మధ్య నా ఫ్రెండ్స్ కొందరు ఆ కవితలన్నింటినీ బుక్ రూపంలో తీసుకురావొచ్చు కదా అన్నారు. ఆ ఐడియా నచ్చింది. ఒక నటిగా నేను బయటి ప్రపంచంలోనే ఎక్కువ టైమ్ గడుపుతుంటాను. కానీ నా లోపలి ప్రపంచం ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రపంచం గురించే కవితలు రాశాను’’ అన్నారు శ్రుతీహాసన్. -
‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అంటున్న నిహారిక
విజయ్ సేతుపతి, నిహారిక జంటగా ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని రావూరి అల్లికేశ్వరి సమర్పణలో డాక్టర్ రావూరి వెంకటస్వామి తెలుగులో ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ– ‘‘విజయ్సేతుపతి నటన హైలైట్. ఇంతకు ముందు చేయని పాత్రలో నిహారిక కనిపిస్తారు. మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ’’ అన్నారు. -
రాణి వేలు నాచ్చియార్
నయనతార యువరాణిగా మారనున్నారు. అది కూడా బ్రిటిష్వారిపై పోరాడిన మొట్టమొదటి మహారాణిగా మారడానికి సిద్ధమవుతున్నారు. రాణి పేరు ‘వేలు నాచ్చియార్’. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన రాణి తను. 1780 నుంచి 1790 వరకూ శివగంగై సంస్థానాన్ని పాలించారు వేలు నాచ్చియార్. ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు సుశీ గణేశన్ ఓ చిత్రం తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో రాణి పాత్రకు నయనతారను అనుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో నటించడానికి నయన కూడా పచ్చజెండా ఊపారట. ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ, మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు నయనతార. కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్గా కనిపించే నయనతార ‘శ్రీరామరాజ్యం’లో సీతగా మెప్పించారు. ‘సైరా’లో స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సతీమణి సిద్ధమ్మ పాత్రకు చక్కగా సరిపోయారు. అందుకే ‘వేలు నాచ్చియార్’కి నయనతార యాప్ట్ అని సుశీ గణేశన్ అనుకుని ఉంటారు. వేలు నాచ్చియార్కి యుద్ధ విద్యల్లో మంచి నైపుణ్యం ఉంది. గుర్రపు స్వారీ, విలు విద్య, కర్ర సాము వంటివన్నీ తెలుసు. ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి నయనతార ఈ విద్యలన్నీ నేర్చుకుంటారని ఊహించవచ్చు. -
ఆమె అంతే!
సౌతిండియా గ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా గతంలో హిందీలో ‘డర్టీ పిక్చర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. విద్యా బాలన్ ముఖ్య పాత్రలో నటించారు. తాజాగా స్మిత జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. తమిళంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అవళ్ అప్పడిదాన్’ (ఆమె అంతే అని అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారు. కేయస్ మణికందన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్, హెచ్. మురళి నిర్మించనున్నారు. నవంబర్లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు సమాచారం. టైటిల్ రోల్లో ఎవరు నటిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ‘సిల్క్ స్మిత గ్లామర్ను ఇప్పటి వరకూ ఎవ్వరూ మ్యాచ్ చేయలేకపోయారు. ఆమె పాత్రను పోషించే నటి కోసం చూస్తున్నాం’’ అన్నారు దర్శకుడు మణికందన్. -
హిట్ సినిమా రీమేక్లో...
తమిళ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజా తెరకెక్కించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘ముందానై ముడిచ్చు’ (1983). భాగ్యరాజా, ఊర్వశి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం తాజాగా రీమేక్ కాబోతోంది. ఈ రీమేక్లో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తారు. ఊర్వశి చేసిన పాత్రను ఐశ్వర్య చేయనున్నారు. హీరోగా దర్శకుడు శశికుమార్ నటిస్తారు. ఈ రీమేక్కు కథ, స్క్రీన్ ప్లే, మాటలు భాగ్యరాజానే అందిస్తుండటం విశేషం. జేయస్బీ ఫిల్మ్ స్టూడియో బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అప్పట్లో ఈ సినిమాను ‘మూడు ముళ్లు’గా తెలుగులో రీమేక్ చేశారు దర్శకులు జంధ్యాల. చంద్రమోహన్, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు. భార్య చనిపోయిన ఓ టీచర్ని ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను ఎలా గెలుచుకుంది? అన్నది చిత్రకథాంశం. -
చిరు చెల్లెలుగా సాయి పల్లవి!
హీరోయిన్గా ఫుల్ ఫామ్లో ఉన్నారు సాయి పల్లవి. ఇలాంటి సమయంలో చెల్లెలు పాత్ర అంగీకరిస్తారా? ఆ పాత్ర చుట్టూ కథ తిరిగితే అప్పుడు అంగీకరించే అవకాశం ఉంది. తమిళ చిత్రం ‘వేదాళం’లో ఉన్న చెల్లెలు పాత్ర అలాంటిదే. ఈ సినిమా తెలుగు రీమేక్లో చిరంజీవి హీరోగా నటించనున్నారు. తమిళంలో చెల్లెలి పాత్రను లక్ష్మీ మీనన్ చేశారు. తెలుగులో ఆ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారని సమాచారం. చిరంజీవి హీరోగా రూపొందనున్న సినిమా, పైగా పాత్ర కూడా గొప్పగానే ఉంటుంది.. ఈ రెండు కారణాలతో సాయి పల్లవి ఈ సినిమా ఒప్పుకుంటారని ఊహించవచ్చు. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు. -
నారప్ప మళ్లీ మొదలప్ప
తమిళ చిత్రం ‘అసురన్’ను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు. నారప్పగా టైటిల్ రోల్లో వెంకటేశ్ నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్బాబు, కలైపులి యస్. థాను నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయికగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో జరిగే చిత్రమిది. ఇందులో వెంకటేశ్ రైతుగా కనిపిస్తారు. లాక్డౌన్ ముందు చాలా శాతం వరకూ చిత్రీకరణను పూర్తి చేసింది చిత్రబృందం. లాక్డౌన్ వల్ల సుమారు ఆర్నెల్లు చిత్రీకరణకు గ్యాప్ వచ్చింది. అక్టోబర్లో మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్లో ‘నారప్ప’ చిత్రబృందం ఉందని టాక్. అక్టోబర్లో ప్రారంభించి సినిమా మొత్తాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలన్నది ఆలోచనట. ఈ చిత్రంలో వెంకటేశ్ పాత్ర రెండు షేడ్స్లో ఉంటుంది. -
విలన్ రోల్లో ఛమ్మక్ చంద్ర
తెలుగు ప్రేక్షకులకు జబర్థస్త్ షోతో హాస్యనటుడిగా పరిచయం అయిన ఛమ్మక్ చంద్ర పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే తెలుగులో పూర్తి స్థాయి పాత్రలో ఇంత వరకు కనిపించలేదు చంద్ర. తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ దక్కకపోయినా.. కోలీవుడ్ ఇండస్ట్రీ ఆ అవకాశం ఇచ్చింది. త్వరలో ఓ తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ కామెడీ స్టార్. సెయల్ పేరుతో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో చంద్ర విలన్ రోల్ లో కనిపించనున్నాడు. రవి అబ్బులు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజన్ తేజేశ్వర్, థరుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్ధార్థ్ విపిన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను సీఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై సీఆర్ రాజన్ నిర్మిస్తున్నారు. -
విలన్ రోల్లో ఛమ్మక్ చంద్ర
-
మరో ఆఫర్
తమిళసినిమా: పెళ్లిచూపులు చిత్ర కథానాయకి రీతూవర్మకు కోలీవుడ్లో అవకాశాలు వరుస కడుతున్నాయి. తమిళంలో వీఐపీ–2 చిత్రం ద్వారా చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలంగాణ పోరి ప్రస్తుతం విక్రమ్కు జంటగా నటిస్తున్న ధ్రువనక్షత్రం చిత్రంపై చాలా ఆశలనే పెటుకుంది. గౌతమ్మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రం కోసం ప్రస్తుతం టర్కీలో మకాం పెట్టిన రీతూవర్మ చిన్న అనే మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. తాజాగా మరో లక్కీ ఆఫర్ను దక్కించుకుంది. నటుడు దుల్కర్ సల్మాన్తో రొమాన్స్ చేసే అవకాశం ఈ బ్యూటీని వరించిందన్న తాజా సమాచారం. డేసింగ్ పెరియస్వామి దర్శకత్వంలో దుల్కర్సల్మాన్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా నటి రీతూవర్మను ఎంపిక చేసినట్లు దర్శకుడు వెల్లడించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో రీతూవర్మ సోలో హీరోయిన్గా నటించనుంది. కాగా ప్రస్తుతం దుల్కర్సల్మాన్ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అది పూర్తి కాగానే అక్టోబరులో ప్రారంభం కానున్న డేసింగ్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించనున్నారు. ఈలోగా నటి రీతూవర్మ ధ్రువనక్షత్రం చిత్రాన్ని పూర్తి చేసుకుంటుందట. కాగా ఈ భామ తెలుగులోనూ బిజీగానే నటిస్తోందన్నది గమనార్హం. ఇప్పుడు కోలీవుడ్లోనూ తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతోందన్న మాట. -
అల్లు అర్జున్ కొత్త చిత్రం ప్రారంభం
-
ఆస్కార్కి ‘విసారణై’
ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్ ఎంట్రీకి ఈ ఏడాది మనదేశం నుంచి అధికారికంగా తమిళ చిత్రం ‘విసారణై’ను పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో శ్రామికులుగా పనిచేసిన తమిళుల జీవితాల ఆధారంగా ఒక ఆటోరిక్షా డ్రైవర్ రాసిన నవల ఈ చిత్రానికి ఆధారం. నిజజీవితాలకు అద్దం పట్టే ఈ క్రైమ్ థ్రిల్లర్ను వెట్రిమారన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ అవార్డు అందుకుంది. నిజానికి, రానున్న ఆస్కార్స్లో ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’ విభాగంలో భారత సినీసీమ నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్ళేం దుకు మన ‘రుద్రమదేవి’ సహా వివిధ ప్రాంతీయ భాషల నుంచి మొత్తం 29 ఫిల్మ్లు పోటీ పడ్డాయి. చివరకు ‘విసారణై’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) సారథ్యంలోని జ్యూరీ ఎంపిక చేసింది. ‘ఆస్కార్ అవార్డ్స్ ఎంట్రీ సెలక్షన్ కమిటీ’ చైర్మన్, ప్రముఖ దర్శకుడు కేతన్ మెహతా గురువారం హైదరాబాద్లో ఈ సంగతి ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘‘ఇండియాలో ఏటా దాదాపు వెయ్యి సినిమాలు నిర్మిస్తున్నారు. ఆస్కార్ ఎంట్రీ పరిశీలనకు కొన్ని చిత్రాలనే ఎంపిక చేయడం కష్టం. ఈసారి పరిశీలించిన 29 చిత్రాలూ ఇన్స్పైర్ చేశాయి. ఎంచుకున్న కథాంశం, దాన్ని తెరపై ప్రెజెంట్ చేసిన విధానం, సాంకేతిక అంశాలను పరిశీలనలోకి తీసుకుని ‘విసారణై’ని మన ఎంట్రీగా ఎంపిక చేశాం’’ అన్నారు. ‘‘మా జ్యూరీ మెంబర్లలో తమిళ సభ్యులెవరూ లేరు. ఎంపికలో జ్యూరీపై ఎలాంటి ఒత్తిడులూ లేవు. ఉత్తమ విదేశీ భాషా చిత్రాల ఎంట్రీల సంఖ్య పెంచాలని ఆస్కార్ కమిటీకి విన్నవిస్తాం’’ అని ఆయన తెలిపారు. ఏయే భాషల నుంచి ఏయే చిత్రాలను జ్యూరీ పరిశీలించిందో వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. తెలుగు ఫిలిమ్ చాంబర్ అధ్యక్షుడు, నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘విసారణై’ని ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు. నార్తిండియన్ జ్యూరీ సభ్యులు సౌత్ ఇండియన్ చిత్రాన్ని ఎంపిక చేయడం సంతోషం’’ అన్నారు. నిర్మాత కల్యాణ్ ఈ చిత్రాన్ని ఇప్పటికే తెలుగులో ‘విచారణ’ పేరుతో అనువదించి, రిలీజ్కు సిద్ధం చేస్తుండడం విశేషం. ఈ సమావేశంలో ఎఫ్.ఎఫ్.ఐ చైర్మన్ టీపీ అగర్వాల్, జ్యూరీ మెంబర్లు పాల్గొన్నారు. రానున్న 89వ ఆస్కార్ అవార్డు వేడుకలు ఫిబ్రవరిలో లాస్ ఏంజెల్స్లో జరగనున్నాయి. -
తప్పుగా మాట్లాడినా తమిళే మాట్లాడతా!
‘‘నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. ఇక్కడే చదువుకున్నా. చెన్నైలో 20 ఏళ్లు ఉన్నాను. అందుకని నన్ను ఇక్కడివాడిలానే భావించవచ్చు. తప్పుగా మాట్లాడినా తమిళంలోనే మాట్లాడాలనుకుంటున్నాను. ‘ఎల్లారుక్కుమ్ వణక్కమ్’ (అందరికీ నమస్కారం)’’ అని అల్లు అర్జున్ అన్నారు. లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ పతాకంపై అల్లు అర్జున్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న చిత్రం గురువారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ - ‘‘తమిళ సినిమా చేయాలని, మంచి దర్శకుడితో చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పటివరకూ నేను నటించిన తెలుగు సినిమాల్లో ఒక్క చిత్రాన్ని కూడా తమిళంలో అనువదించి, విడుదల చేయలేదు. ఎందుకంటే నేను పుట్టిన చెన్నైలో స్ట్రైట్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం కావాలనుకున్నాను’’ అన్నారు. ‘‘అల్లు అర్జున్ని మా సంస్థ ద్వారా తమిళ్కి పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో లేదా మార్చి ప్రథమార్ధంలో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అని జ్ఞానవేల్ రాజా చెప్పారు. ‘‘ఇప్పటివరకూ నేను కలిసిన స్టార్స్లో అల్లు అర్జున్ మోస్ట్ ఎనర్జిటిక్, హార్డ్ వర్కింగ్. అందుకే తనతో సినిమా చేయాలనుకున్నాను’’ అని లింగుస్వామి అన్నారు. సీనియర్ నటుడు, హీరోలు సూర్య-కార్తీ తండ్రి శివకుమార్ పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు శిరీష్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. -
'తమిళ సినిమాలో నటించడం లేదు'
చెన్నె: తాను తమిళంలో ప్రస్తుతం సినిమాలేవి చేయడం లేదని నటి, దర్శకురాలు నందితా దాస్ తెలిపారు. కొత్త సినిమాలేవి ఒప్పుకోలేదని వెల్లడించారు. తన కుమారుడితో కలిసి ఆమె వేసవి సెలవులు గడుపుతున్నారు. కుట్టి రేవతి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమాలో తాను నటించనున్నట్టు వచ్చిన వార్తలపై నందిత స్పందించారు. 'ఈ వార్తలు నా దాకా వచ్చాయి. రేవతి సినిమా గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ప్రస్తుతం మా అబ్బాయితో కలిసి వేసవి సెలవులు గడుపుతున్నా. తిరిగి వచ్చాక నా ప్రాజెక్టుల్లో పాల్గొంటా'నని నందిత పేర్కొంది. అయితే రేవతి సినిమాలో తనను నటింపజేయాలనుకున్నారో, లేదో తనకు తెలియదని చెప్పింది. ‘ఫైర్’ వంటి సంచలన చిత్రం ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిత.. ‘అమృత’, ‘కమ్లి’ వంటి చిత్రాలతో దక్షిణాదిన కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 2008లో దర్శకురాలిగా మారి ‘ఫిరాక్’ సినిమా తీశారు. ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందించేందుకు ఆమె సమాయత్తమవుతున్నట్టు సమాచారం. -
హీరోయిన్ ఓరియంటెడ్ జ్యోతిక
హీరో సూర్యను పెళ్ళి చేసుకున్నాక సినిమా రంగానికి దూరంగా కాలక్షేపం చేస్తున్న నటి జ్యోతిక. ఇంట్లో పిల్లల బాగోగుల మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతూ వచ్చిన ఆమె చాలా విరామం తరువాత గత ఏడాది ‘36 వయదునిలే’ (36 ఏళ్ళ వయసులో అని అర్థం) అనే తమిళ చిత్రంలో నటించారు. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకురావడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా సంపాదించి పెట్టింది. కానీ, ఎందుకనో ఆమె మళ్ళీ ఏ కొత్త ప్రాజెక్ట్కూ పచ్చజెండా ఊపలేదు. తాజాగా జ్యోతిక ఒక కొత్త సినిమా స్క్రిప్ట్కు ఓకే చెప్పారు. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం మొన్నటి ‘36 వయదునిలే’ లాగానే ఇదీ పూర్తిగా హీరోయిన్కు ప్రాధాన్య మున్న స్రిప్ట్. ‘కుట్రమ్ కడిదళ్’కి గాను జాతీయస్థాయిలో ఉత్తమ తమిళచలనచిత్ర అవార్డును అందుకున్న దర్శకుడు బ్రహ్మనాథన్ ఈ చిత్రాన్ని రూపొందించ నున్నారు. నిజానికి, రీ-ఎంట్రీ తరువాత మరో కొత్త ప్రాజెక్ట్ను వెంటనే చేపట్టేందుకు జ్యోతిక తొందరపడలేదు. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూశారు. ఈ పరిస్థితుల్లో బ్రహ్మ ఇటీవల కలసి, ఈ కొత్త సినిమా స్క్రిప్ట్ను చర్చిం చారు. ‘‘జ్యోతిక మేడమ్కు స్క్రిప్ట్ నచ్చింది. అందులోని బలమైన స్త్రీ పాత్ర నచ్చింది. అందుకే, ఈ సినిమాలో పనిచేయడానికి అంగీకరిం చారు’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కొత్త సినిమా పేరు, ఇతర వివరాలన్నీ తెలియడానికి మరికొంత కాలం ఆగాలి. -
శ్రుతితో అవగాహన చిత్రం
ఏ అంశానికైనా ప్రచారం చాలా అవసరం. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు వ్యాపార సంస్థలు. ఎంత వ్యయం చేసినా కార్యానికి ప్రయోజనం చేకూరాలి. లేకుంటే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వ అగ్నిమాపక శాఖ చాలా కసరత్తులు చేసినట్లుంది. దీపావళి పండగ దగ్గర పడుతోంది. ఇది ప్రతి ఇంటా కాంతులు విరజిమ్మే పండగ అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే సమయంలో పలు విపత్తులు ఎదురవుతుంటాయి. ఇందుకు కారణం ఆనందంగా కాల్చే పటాసులే. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఘోర ప్రమాదాలను చవి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ తగిన చర్యలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా నటి శ్రుతిహాసన్ క్రేజ్ను వాడుకునే ప్రయత్నం చేసింది. అర్థం కాలేదా? టపాసులు కాల్చడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తద్వారా విపత్తులకు గురి కాకుండా సురక్షితంగా, సుఖ సంతోషాలతో పండగను జరుపుకునే విధంగా అవగాహన చిత్రాన్ని రూపొందించారు. ఇందులో నటి శ్రుతిహాసన్ నటించారు. ఆమెతో చెప్పిస్తే విషయం ప్రజల్లోకి చేరుతుందని, వారు టపాసులు కాల్చడంలో అప్రమత్తం అవుతారని అగ్నిమాపక శాఖ భావిస్తోంది. ఈ అవగాహనా చిత్రాన్ని సినీ థియేటర్లు, టీవీ చానళ్లలో ప్రదర్శించనున్నారు. అంతే కాకుండా నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రదర్శించడానికి సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది చాలా జాగ్రత్తలు తీసుకున్నా అక్కడక్కడా కొంత ముప్పు వాటిల్లింది. పునరావృతం కాకుండా శాఖాధికారులు చెబుతున్నారు. -
ఈ వారం you tube హిట్స్
గర్ల్స్ టు మెన్ : ఛానెల్ 4 నిడివి : 34 సె. హిట్స్ : 56,71,913 చానెల్ 4 బ్రిటిష్ టీవీ చానెల్. సామాజిక అంశాలు, సమస్యలపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడంలో ప్రసిద్ధి చెందిన ఈ చానెల్ తాజాగా ‘గర్ల్స్ టు మెన్’ అనే ప్రోగ్రామ్ని అక్టోబర్ 13 రాత్రి పది గంటలకు ప్రసారం చేయబోతోంది. దాని ట్రైలరే గర్ల్స్ టు మెన్. అమ్మాయిలుగా పుట్టి, అమ్మాయిలుగా ఉండడానికి ఇష్టపడని పిల్లల్ని, వాళ్ల తల్లిదండ్రుల్ని చానల్ 4 ఇంటర్వ్యూ చేసింది. అమ్మాయిల్ని శారీరకంగా అబ్బాయిలుగా మార్చే ఆధునిక శస్త్రచికిత్సల గురించి కూడా ఈ ప్రోగ్రామ్లో చూపించబోతోంది. ముందైతే ట్రయిలర్ చూడండి. భలే ఉంది. వెడలామ్ : టీజర్ నిడివి : 45 సె. హిట్స్ : 31,19,402 అజిత్, శృతిహాసన్ నటించిన తమిళ చిత్రం ‘వెడలాం’ ట్రైలర్ హిట్స్ అంతకంతకూ పెరిగిపోతున్నాయి! శివ డెరైక్ట్ చేసిన ఈ చిత్రానికి మ్యూజిక్ అనిరుథ్ రవిచందర్. ఇద్దరి కాంబినేషన్కు చిన్న శాంపిల్లా ఉంది ఈ టీజర్. నిర్మాత ఎ.ఎం. రత్నం. ప్రస్తుతానికైతే నవంబర్ 11న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. టీజర్లో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో, అజిత్ ఒక రాక్షసుడిలా కనిపిస్తాడు. యూట్యూబ్ హిట్స్లో ఈ టీజర్... టేలర్ స్విఫ్ట్ ‘బ్యాడ్ బ్లడ్’ రికార్డును బ్రేక్ చేసింది. అప్లోడ్ చేసిన తొలి గంటలోనే ‘వెడలాం’కు 50 వేల లైకులు వచ్చాయి. హెయిల్, సీజర్ : ట్రైలర్ నిడివి : 2 ని. 32 సె. హిట్స్ : 25,46,726 నాలుగుసార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న కోయెన్ బ్రదర్స్ స్క్రిప్టు రాసి, డెరైక్ట్ చేస్తున్న ఆల్స్టార్ కామెడీ మూవీ ‘హెయిల్, సీజర్’. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న విడుదలవుతోంది. 1950ల నాటి హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ మేనేజర్ కథ ఇది. కంపెనీ ప్రతిష్టను కాపాడడం, ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సినీ తారలను వివాదాలకు దూరంగా ఉంచడం అతడి పని. ఈ క్రమంలో నిర్మాణంలో ఉన్న ‘హెయిల్ సీజర్, ఎ టేల్ ఆఫ్ క్రైస్ట్స్ లైఫ్’ నటుడు బైర్డ్ వైట్లాక్ కిడ్నాప్ అవుతాడు. తర్వాత ఏం జరుగుతుందన్నదే ఈ చిత్రం. ట్రైలర్ రెండు రోజుల క్రితమే విడుదలైంది. మటర్ గస్తీ : వీడియో సాంగ్ నిడివి : 2 ని. 29 సె. హిట్స్ : 17,22,587 బాలీవుడ్ మూవీ ‘తమాషా’లోని వీడియో సాంగ్ ఇది. మూడు రోజుల క్రితమే టీ సీరీస్ అప్లోడ్ చేసింది. రణబీర్ కబీర్, దీపికా పడుకోన్ మధ్య సాగే ఈ ఉల్లాస గీతాన్ని మోహిత్ చౌహాన్ ఆలా పించారు. సంగీతం ఎ.ఆర్.రెహమాన్. చిత్రం నవంబర్ 27 న విడుదలవుతోంది. ఈ రొమాంటిక్ డ్రామాను డెరైక్ట్ చేసింది ఇంతియాజ్ అలీ. ఆచారాలు, సంప్రదాయాలు, నిమయాలు, నిబంధనలకు అనుగుణం జీవితాన్ని సాగించాలనుకునే ఒక యువకుడు తనలో తను ఎలా సతమతమవుతుంటాడో ఈ చిత్రం వినోదాత్మకంగా చూపిస్తుంది. సాంగ్ చూడండి. బాగుంది. కలర్ఫుల్గా. ది హంగర్ గేమ్స్ పార్ట్ 2 : ట్రైలర్ నిడివి : 1 ని. 56 సె. హిట్స్ : 18,42,897 గత ఏడాది విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ వార్ ఫిల్మ్ ‘ది హంగర్ గేమ్స్ : మాకింగ్జే పార్ట్ 1’కి సీక్వెల్ ఈ పార్ట్ 2. దీని ట్రైలర్ నాలుగు రోజుల క్రితమే విడుదలైంది. చిత్రం విడుదల నవంబర్ 20. సుజాన్ కాలిన్స్ 2010లో రాసిన ‘మాకింగ్జే’ నవల ఆధారంగా ఈ సీరీస్ తయారవు తున్నాయి. పార్ట్ 2లో కూడా జెన్నిఫర్ లారెన్స్, జోష్ హచర్సన్ నటిస్తున్నారు డెరైక్టర్ ఫ్రాన్సిస్ లారెన్స్. జెన్నిఫర్, ఆమె బృందం కలసి యుద్ధ పీడిత ప్రాంతమైన పానెమ్లో పౌరులకు విముక్తి కల్పించడం కోసం బయల్దేరతారు. భయంకర మైన పోరాటాలు చేస్తారు. చివరికి విజయం సాధిస్తారు. జస్టిన్ బీబర్ స్నబ్డ్ నిడివి : 1 ని. 8 సె. హిట్స్ : 23,91,885 అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్, నటి రోండా జీన్ రౌజీ... ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన పదహారేళ్ల చెల్లెలు జూన్కు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ కాస్మోపాలిటన్ మ్యాగజీన్ ఫంక్షన్లో మాట్లాడిన వీడియో ఇది. జూన్ని అవమానించింది ఎవరో తెలుసా? యూత్ పాప్ ఐకన్, కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్! ‘బీబర్కి నా చెల్లెలు డై హార్ట్ ఫ్యాన్. కాన్స్ ఫెస్టివల్లో అందరూ వెళ్లి బీబర్తో ఫొటోలు దిగుతున్నారు. తనూ అతడితో ఫొటో దిగాలని ఎంతో ఉబలాట పడింది. కానీ బీబర్ ఛాన్స్ ఇవ్వలేదు’ అని రోండా ఆవేదన వ్యక్తం చేశారు. -
పిల్లలు, మహిళలు నా సినిమాలు చూడకండి
సినిమా ప్రమోషన్ సమయంలో ఏ డైరెక్టర్ అయినా మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రచారం చేసుకుంటారు. అయితే తమిళ దర్శకుడు మిస్కిన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన సినిమాను చిన్న పిల్లలు, మహిళలు చూడొద్దంటూ తానే ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల 'తర్కపు' అనే తమిళ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న మిస్కిన్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పిశాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మిస్కిన్, ఈ వ్యాఖ్యలతో సౌత్ ఇండస్ట్రీలో సంఛలనం సృష్టిస్తున్నాడు. సినిమా అంటేనే పెద్దలకోసం తీస్తారని, అలాంటి సినిమాలను కుటుంబ సమేతంగా చూడాలనుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు ఒకవేళ మీరు మీ పిల్లలతో కలిసి సినిమా చూడాలి అనుకుంటే ఏ యానిమేటెడ్ సినిమాకో లేక 'మై డియర్ కుట్టిచేతన్' లాంటి చిన్న పిల్లల సినిమాకో వెళ్లండి అంటూ ఘూటుగా స్పందించాడు. డైరెక్టర్ తాను అనుకున్న భావం తెర మీదకు రావటం కోసం కొన్నిసార్లు అసభ్యకరమైన పదాలు వాడక తప్పదని చెప్పాడు మిస్కిన్. తన తదుపరి చిత్రానికి సెన్సార్ బోర్డ్ తప్పకుండా 'ఏ' సర్టిఫికేట్ ఇస్తుందన్న మిస్కిన్... పిల్లలు, మహిళలు మాత్రం ఆ సినిమాను చూడొద్దన్నాడు. ఈ స్టేట్మెంట్ ఇవ్వటంలో మిస్కిన్ ధైర్యాన్నిమెచ్చుకున్నా, ప్రేక్షకుల్లో కేవలం ఒక వర్గం మాత్రమే చూస్తే సినిమా వసూళ్ల విషయంలో కష్టం అంటున్నారు సినీ జనాలు. -
శంకర్ దర్శకత్వంలో...?
ఆరంభం, వీరమ్.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు అజిత్. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఎన్నయ్ అరిందాల్’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తదుపరి శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అజిత్ అంగీకరించారట. శంకర్తో ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్ నిర్మించిన ఏయం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెన్నయ్ టాక్. -
తమిళ పులిలో 'శ్రీదేవి'
ముంబై : పులి సినిమా షూటింగ్ని మంచి ఎంజాయి చేస్తున్నానని ప్రముఖ నటి శ్రీదేవి తెలిపారు. చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక బృందంతో కలసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం శ్రీదేవి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ హాన్సికాకు తల్లిగా శ్రీదేవి నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ శ్రీదేవి తమిళ చిత్ర సీమలో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటిస్తున్నారు. అలాగే శృతీ హాసన్, సుదీప్ కూడా నటిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల వయస్సులో బాలనటిగా చిత్రసీమలోకి అడుగు పెట్టిన శ్రీదేవి... తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించారు. ఇంగ్లీషు వింగ్లీషు చిత్రం ద్వారా శ్రీదేవి బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
పగబట్టిన పాము కథ
అదో అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఓ యువతి, యువకుడు ప్రేమించుకుంటారు. తెలియక ఆ యువకుడు చేసిన ఓ పని వల్ల ఒక పాము అతనిపై పగబడుతుంది. మహా భక్తురాలైన అతని ప్రేయసి ఎలాగైనా ప్రియుణ్ణి కాపాడాలనుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? అనే కథతో రూపొందిన తమిళ చిత్రం ‘నంజుపురం’. ఈ చిత్రాన్ని ‘నాగలాపురం’ పేరుతో కె. సృజన సమర్పణలో మురళీమోహన్ కూసుపాటి తెలుగులో విడుదల చేయనున్నారు. ‘శివరామరాజు’లో చెల్లెలి పాత్ర, ‘మా అల్లుడు వెరీ గుడ్డు’ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన మోనిక ఈ చిత్రంలో హీరోయిన్. రాఘవ్ హీరో. ప్రేమ, పగ, ఫ్యామిలీ సెంటిమెంట్తో రూపొందిన చిత్రమని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: మంగమ్మ, దర్శకత్వం: చార్లెస్. -
అక్కడ కూడా సత్తా చూపిస్తారా?
గ్లామర్ తార కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఓ తమిళ చిత్రంలో మెరవనున్నారు. అదీ తమిళనాట ప్రస్తుతం మంచి క్రేజున్న హీరో ధనుష్ సరసన! గతంలో తెలుగు, తమిళ భాషల్లో ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రాన్ని అందించిన బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలోని కథానాయక పాత్ర పేరునే సినిమా టైటిల్గా నిర్ణయించారు. సినిమా పేరు -‘మారి’. ‘‘మంచి పాత్ర కావడంతో కాజల్ అగర్వాల్ను ఈ చిత్ర కథానాయికగా ఎంచుకున్నాం’’ అని దర్శకుడు ప్రకటించారు. పూర్తి స్థాయి సకుటుంబ వినోదంగా తయారయ్యే ఈ చిత్రానికి కాజల్ అగర్వాల్ అతికినట్లు సరిపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ప్రస్తుతానికి ఆమె పాత్ర తీరుతెన్నుల గురించి యూనిట్ పెదవి విప్పడం లేదు. దర్శకుడు బాలాజీ మోహన్ తన గత చిత్రాల లాగే ఇందులోనూ పూర్తి స్థాయిలో వినోదం పంచనున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యే ‘గోవిం దుడు అందరివాడేలే’ లాంటి సకుటుంబ వినోద చిత్రంలో మెరిసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తమిళ కుటుంబ కథలో తన సత్తా చూపనున్నారన్న మాట! -
కత్తి చిత్రం పై తీవ్ర దుమారం
-
అడిగి మరీ నటించాను
నిర్మాతను అవకాశం అడిగి మరీ ఎనకుళ్ ఒరువన్ చిత్రంలో నటించానని నటుడు సిద్దార్థ్ తెలిపారు. ఈయన ప్రస్తుతం తమిళ చిత్రాల్లో వరుసగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన జిగర్తండా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా సిద్దార్థ్ నటిస్తున్న చిత్రం ఎనకుళ్ ఒరువన్. ఇది ఇంతకు ముందు కమల్హాసన్ నటించిన చిత్రం టైటిల్. తిరుకుమరన్ ఎంటర్ టెయిన్మెంట్, సీవీ కుమార్ అబి టీసీఎస్ మీడియా అభినేష్ ఇళంగోవన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్థ్ సరసన కన్నడ నటి దీపా సన్నిధి హీరోయిన్గా నటిస్తున్నారు. పిజ్జా చిత్రానికి కార్తిక్ సుబ్బరాజ్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ప్రసాద్ రామన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇది కన్నడంలో సక్సెస్ అయిన లూసియా చిత్రానికి రీమేక్. సంతోష్ నారాయణ్ సంగీత బాణీలందిస్తున్న చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం నగరంలోని సత్యం సినీ కాంప్లెక్స్లో జరిగింది. అనంతరం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నటుడు సిద్దార్థ్ మాట్లాడుతూ కన్నడంలో ఘన విజయం సాధించిన లూసియా చిత్రం చూసి తమిళ హక్కుల్ని తాను పొందాలనుకున్నానన్నారు. అయితే అప్పటికే నిర్మాత సీవీ కుమార్ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారని తెలిసి వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఈ చిత్రంలో నటించే అవకాశం తనకు ఇవ్వమని అడిగి మరీ నటించానన్నారు. ఇంతకు ముందు తన చిత్రాల్లో చెయ్యని పలు విషయాలను ఈ ఎనకుళ్ ఒరువన్ చిత్రంలో చేశానన్నారు. కన్నడంలో ఈ చిత్రాన్ని పవన్కుమార్ సుమారు పది వేల మంది వద్ద డొనేషన్ వసూలు చేసి తెరకెక్కించడం విశేషం అన్నారు. చిత్ర దర్శకుడు ప్రసాద్ రామన్ మాట్లాడుతూ చిత్ర టీమ్ కథకు స్ఫూర్తి చెంది నటించిన చిత్రం ఎనకుళ్ ఒరువన్ అని తెలిపారు. చిత్రంలో అన్ని పాత్రలు రెండు షేడ్స్తో కనిపించడం విశేషం అన్నారు. చిత్రానికి సంతోష్ నారాయణ్ బ్రహ్మాండమైన సంగీతాన్ని అందించారన్నారు. చిత్రాన్ని తమిళనాడులో రేడియన్స్ మీడియా వరుణ్ మణియన్, వైనాట్ శశి సంయుక్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత సి.వి.కుమార్ వెల్లడించారు. -
విశాల్ చిత్రంలో రమ్యకృష్ణ
చెన్నై: తన దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ ముఖ్య భూమిక పోషించనున్నారని ఆ చిత్ర దర్శకుడు సుందర్. సి బుధవారం చెన్నైలో వెల్లడించారు. ఆ చిత్రం త్వరలో హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. ఆ షూటింగ్లో రమ్య పాల్గొంటారని తెలిపారు. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా రమ్యకృష్ణ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. 1990లో తమిళంలో తెరకెక్కిన కుట్టి పిశాసు చిత్రం ఆమె నటించిన అఖరి చిత్రమని సుందర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బహుబలిలో నటిస్తు రమ్యకృష్ణ మహా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
నాటకమే జీవితం..
‘రంగస్థలంపై 53 ఏళ్ల అనుభవం నాది. దాదాపు ఎనిమిదివేల ప్రదర్శనలు ఇచ్చి ఉంటా. ఆత్మతృప్తి కోసం నాటకాన్ని ఇష్టపడతా. భుక్తికోసం సినీ, టీవీ రంగాలపై ఆధారపడక తప్పడం లేదు’ అని తమిళ సినీ, రంగస్థల నటుడు వైజీ మహేంద్రన్ అన్నారు. గవర్నర్ నరసింహన్ తనకు పెద్ద అభిమాని అని, తన డ్రామాలన్నింటినీ సతీసమేతంగా వచ్చి మరీ ఆసక్తిగా తిలకిస్తారని చెప్పారు. తమిళంలో శివాజీ గణేశన్, తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు తన అభిమాన నటులని చెప్పారు. మద్రాసు తర్వాత తాను ఎక్కువగా ఇష్టపడే నగరం హైదరాబాదేనని చెప్పారు. భాగ్యనగరంతో తనకు గల అనుబంధంపై మహేంద్రన్ ‘సిటీ ప్లస్’తో పంచుకున్న అనుభూతులు ఆయన మాటల్లోనే... హైదరాబాద్తో పాతికేళ్ల అనుబంధం.. హైదరాబాద్తో పాతికేళ్ల అనుబంధం నాది. హైదరాబాద్ తర్వాత ఇప్పుడిప్పుడే వైజాగ్ను ఇష్టపడుతున్నా. ‘సీతారాముల సినిమాగోల’ టీవీ సీరియల్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది. కుటుంబ సభ్యులు మొత్తం కలసి ఆహ్లాదకరంగా పగలబడి నవ్వుతూ నా నాటకాలు చూడాలనేదే నా ఆశయం. అయితే, నాటకాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు. స్పాన్సర్ల సౌజన్యంతోనే ప్రదర్శనలు చేస్తున్నాం. తమిళనాడులో పాఠశాలలకు రంగస్థలానుబంధం తమిళనాడులో పాఠశాలలకు రంగస్థలంతో అనుబంధం ఉంది. ఆంధ్రాలో ఆ పరిస్థితి ఉన్నట్లు లేదు. హైదరాబాద్లో ఇప్పటి వరకు నలభై, వైజాగ్లో పది ప్రదర్శనలు చేశాను. తొలిసారిగా 1971లో ‘నవగ్రహం’ సినిమాలో నటించా. హిందీ, తెలుగు, తమిళం, మలయాళాలలో దాదాపు 300 సినిమాల్లో నటించా. ఇటీవల తమిళంలో నిర్మించిన రామానుజన్ సినిమా ఇంగ్లిష్ వెర్షన్లోనూ నటించా. నేను నటించిన వాటిలో ‘రగస్యం... పరమరగస్యం’ నాటకం బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు ఆ నాటకాన్ని 700 సార్లు ప్రదర్శించా. ఇప్పటికీ అందులో కాలేజీ స్టూడెంట్ వేషం నేనే వేస్తా. నటవారసత్వం మా నాన్న వైజీ పార్థసారథి దక్షిణాదిలోనే గొప్ప రంగస్థల నటుడు. నాన్న నుంచే నాకు నట వారసత్వం వచ్చింది. ఆయన స్థాపించిన యునెటైడ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్స్ (యూఏఏ) సంస్థ ద్వారానే ఎదిగాను. తమిళనాడు సీఎం జయలలిత కూడా అప్పట్లో యూఏఏ సభ్యురాలే. నాటక రంగానికి చావు లేదు నాటక రంగానికి చావు లేదు. నెలకు యాభై సిని మాలు వస్తున్నాయి. అందులో నిలిచేవి రెండు మూడే. నాటకాలకు మాత్రం ప్రేక్షకాదరణ తగ్గడం లేదు. శ్రీలంక, బ్యాంకాక్, సింగపూర్, మలేసియా, హాంకాం గ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, డెన్మా ర్క్, స్వీడన్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో నాటకాలు వేశాను. రాజమౌళి డెరైక్షన్లో ఒక్కసారైనా..వందల సినిమాలు, వేల డ్రామాల్లో నటించాను కానీ రాజమౌళి డెరైక్షన్లో ఒక్క సినిమాలోనైనా నటించాలని నా ఆశ. ..:: కోన సుధాకర్రెడ్డి -
సమస్యల నుంచి బయటపడ్డా
ఇంటగెలిచి రచ్చ గెలవాలంటారు. నటి అంజలి లాంటి కొందరు రచ్చ గెలిచి ఆ తర్వాతే ఇంట గెలిచే ప్రయత్నంలో పడుతుంటారు. అచ్చ తెలుగు చిన్నది అంజలి కట్రదు తమిళ్ చిత్రంతో కోలీవుడ్కు పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటిగా పేరు తెచ్చుకుంది. అంగాడి తెరు చిత్రం అంజలికి సక్సెస్ రుచిని చూపించింది. ఆ తర్వాత వరుసగా ఎంగేయుం ఎప్పోదుం, కలగలప్పు తది తర చిత్రాలు పాపులర్ చేశాయి. నటిగా మంచి స్థాయికి చేరుకుంటున్న దశలో పిన్నితో ఏర్పడిన మనస్పర్థలు, అనూహ్యంగా హైదరాబాద్ వెళ్లిపోవడం, అక్కడి నుంచి పిన్నిపై ఆరోపణలు గుప్పించ డం, కోర్టులు, కేసులు ఇలా అంజలి జీవితం సమస్యల మయంగా మారింది. అదే సమయంలో ఈ అమ్మ డు తెలుగు చిత్ర పరిశ్రమలో పాగా వేయాలని చూసిం ది. వెంకటేశ్ సరసన నటించిన సీతమ్మ వాకి ట్లో సిరి మల్లె చెట్టు చిత్రం మంచి విజ యాన్ని సాధించడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఊహించుకుంది. తల చింది ఒక్కటి జరిగింది ఒక్కటి అన్న ట్లు అంజలి పరిస్థితి తయారైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తర్వాత వెంకటేష్తో జోడి కట్టిన మసాలా చిత్రం ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ఈ ముద్దుగుమ్మ మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. ఆమె పేర్కొంటూ ప్రస్తు తం తన సమస్యలు పూరిగా సమసిపోయాయని పేర్కొంది. కన్నడ చిత్ర రంగంలోకి కూడా ప్రవేశించానని, అక్కడే ఇప్పుడు పునీత్ రాజ్కుమార్ సరసన ఒక చిత్రం చేస్తున్నట్లు తెలిపింది. తాను నటించడాన్ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించింది. తాను తప్పు చేయలేదన్న విషయం తమిళ పరిశ్రమకు, ప్రేక్షకులకు తెలుసని తెలిపింది. వారి ఆదరణ తనకు తప్పకుండా ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ బ్యూ టీ తమిళంలో జయం రవి సరసన నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అంజలిని కోర్టు కీడుస్తా నటి అంజలి తమిళంలో మళ్లీ నటించడానికి సిద్ధం అవుతుంటే మరోపక్క దర్శకుడు కలైంజన్ ఆమెను కోర్టుకీడుస్తానని శపథం చేయడం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఈయన స్వీయ దర్శకత్వంలో హీరోగా ఊర చుట్రి పురాణం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అంజలి హీరోయిన్. కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అంజలి కారణంగా నిలి చిపోయింది. అప్పట్లో అంజలి ఈ నట దర్శకుడిపై కూడా ఆరోపణలు గుప్పించింది. ఈ వ్యవహారంలో కలైంజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు. ఇటీవల ఇతర చిత్రాల లోను నటిస్తున్న కలైం జన్ ఇటీవల కనవు తొళిర్శాలై చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను తన ఊర్ చుట్టి పురాణం చిత్రం గురించి అడ గ్గా చిత్రాన్ని ఏ ముహూర్తాన మొదలెట్టానో ఏమో నటి అంజలి కోసం ఆ మధ్య ఊరూరా తిరిగాను అని అన్నారు. అంజలి మళ్లీ తమిళ చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం గురించి ప్రస్తావించగా ఆమె తన చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాతే ఇతర చిత్రాల్లో నటించాలని తెలిపారు. ఈ విషయమై నిర్మాతల సంఘం, నటీనటుల సం ఘం, ఫిలించాంబర్, గిల్డ్, ఫెఫ్సీ, దర్శకుల సం ఘంలో ఫిర్యాదు చేశానని తెలిపారు. తన సమస్య పరిష్కారం కాకుండా అం జలి ఏ భాషలో నటించిన చిత్రాన్నైనా విడుదలకాకుండా ఆమెను కోర్టుకీడ్చి అడ్డుకుంటానని కలైంజన్ పేర్కొన్నారు. -
నంబర్ పాత్రలతో యానిమేషన్ చిత్రం
ప్రయోగాత్మక, చిత్రాలకిప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ తమిళ సినిమా, మరో అంతస్తుకు చేరుకుంటోంది. ఇటీవల తెరపైకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డి ఫార్మెట్లో రూపొంది అశేష అభిమానుల్ని అలరిస్తోంది. తాజాగా 029 అనే మరో యానిమేషన్ చిత్రం తమిళ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినివ్వడానికి సిద్ధం అవుతోంది. ఇది జీరో నుంచి తొమ్మిది అంకెల పేరుతో పాత్రలు తెరకెక్కించిన వినూత్న ప్రయోగాత్మక యానిమేషన్ చిత్రం. టీఎఫ్ఎస్ఎస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహిళా దర్శక నిర్మాత బి.నిషా తెరపై ఆవిష్కరించిన చిత్రం 029. ఇలా సంఖ్య పేర్లతో పాత్రల రూపకల్పన చేసి చిత్రం చేయడం అనేది ప్రపంచంలోనే తొలి ప్రయత్నం అవుతుంది. ఈ కథ ప్రేమ, రొమాన్స్, హాస్యం, యాక్షన్ అంటూ జనరంజక అంశాలన్నీ చోటు చేసుకుంటాయంటున్నారు. దర్శక నిర్మాత బి.నిషా. ఈమె చిత్రం గురించి మాట్లాడుతూ, 100 నుంచి 150 మంది సాంకేతిక నిపుణులు ఆరేడేళ్లు, రేయింబవ ళ్లు శ్రమించి రూపొందించిన చిత్రం 029 అని తెలిపారు. తమిళ సినిమాలో ఒక కొత్త ప్రయోగం చేశామన్నారు. ఫలితం ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రాన్ని ముఖ్యంగా పిల్లలకు నచ్చే విధంగా రూపొందించామన్నారు. పెద్దలు మెచ్చే విధంగా 029 యానిమేషన్ చిత్రం ఉంటుందన్నారు. 3డి యానిమేషన్లో రూపొందిన కోచ్చడయాన్ చిత్రం విశేష ప్రజాదరణ పొందుతోందన్నారు. ఆ చిత్ర మైలేజ్ తమ చిత్రానికి ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని దర్శక నిర్మాత బి.నిషా వ్యక్తం చేశారు. విజయ్ రమేష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మిరకిల్ పీటర్ యానిమేషన్ను రూపొందించారు. చిత్రాన్ని మిస్బా యాడ్ సంస్థ మార్కెటింగ్ చేయనుంది. -
వ్యభిచారానికి పాల్పడిన సహాయ నటి అరెస్ట్
చెన్నై చూలైలో వ్యభిచారానికి పాల్పడిన సహాయ నటిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై చూలై అవధాన పాప్పయ్యార్ వీధిలో బహుళ అంతస్తు భవనం ఉంది. ఈ భవనంలో గౌరి (35) ఇటీవలి కాలం నుంచి అద్దెకు ఉంటోంది. తాను సహాయ నటిగా చిత్రాలలో నటించడమే కాకుండా సినిమాలో నటించేందుకు వ్యక్తులను ప్రొత్సహిస్తున్నట్లు స్థానికంగా పలువురికి ఆమె తెలిపింది. ఆమె ఉంటున్న ఇంటికి రాత్రి సమయంలో ఎక్కువ సంఖ్యలో మగవాళ్లు వచ్చి వెళ్లేవారు. దీన్ని అక్కడున్న వారు గమనించారు. సందేహం కలిగి పోలీసులకు రహస్యంగా సమాచారం అందించారు. వెప్పేరి పోలీసు ఇన్స్పెక్టర్ ప్రభు నేతృత్వంలో పోలీసులు ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలిసింది. అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ యువతిని దీనికి పావుగా వాడుతున్నట్టు వెల్లడైంది. ఈ వృత్తిని చేపడుతు న్న గౌరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ. కన్నడ చిత్రాల్లో సహాయ నటిగా ఉంటున్నట్టు తెలిసింది. సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. -
నిరసనల సెగలో ఓ తమిళ సినిమా
సుప్రసిద్ధ ఛాయాగ్రాహక - దర్శకుడు సంతోష్ శివన్ తాజా తమిళ చిత్రం ‘ఇనమ్’ (హిందీ వెర్షన్ పేరు ‘సిలోన్’) ఇప్పుడు వివాదాలకు నిలయమైంది. మార్చి ఆఖరు శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా ప్రదర్శన పలు తమిళ సంఘాల నిరసనలతో ముచ్చటగా మూడు రోజులకే ఆగిపోయింది. సోమవారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను ఉపసంహరించుకోవడం గమనార్హం. శ్రీలంక అంతర్యుద్ధంలో చిక్కుకుపోయి, అనాథలుగా మారిన కొంతమంది జీవితాల చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. శ్రీలంకలోని పరిణామాలతో అస్తవ్యస్తమైన అక్కడి తమిళుల జీవితాలను గుర్తుచేసే ఈ సినిమా పంపిణీ హక్కులను మరో ప్రముఖ తమిళ దర్శక - నిర్మాత లింగుస్వామి కొనుగోలు చేశారు. తీరా తాజా వివాదాలతో హాళ్ళ నుంచి ఈ సినిమాను ఉపసంహరించుకోవాల్సి వచ్చినట్లు ఆయన ప్రకటించారు. దాంతో, తమిళనాట రాజకీయాల ద్వారా వచ్చే ఒత్తిళ్ళు సినీ రంగంపై ఏ మేరకు ఉంటాయన్నది మరోసారి తేటతెల్లమైంది. సింహళీయులకు అనుకూలంగానూ, శ్రీలంకలోని ఈలమ్ తమిళులకు వ్యతిరేకంగానూ ఉందంటూ తమిళ రాజకీయ నాయకుడు, ఎం.డి.ఎం.కె. అధినేత వైకో ఈ సినిమాలోని సన్నివేశాలను చీల్చిచెండాడారు. మరికొన్ని తమిళ ఉద్యమకారులైతే పాండిచ్చేరీలో ‘ఇనమ్’ను ప్రదర్శిస్తున్న థియేటర్లపై దాడి చేశారు. నిషేధించాలంటూ పిలుపు నిచ్చారు. దాంతో, తమిళ సినిమా ప్రదర్శనను దేశవ్యాప్తంగా ఆపివేస్తున్నట్లు లింగుస్వామి హడావిడిగా ప్రకటించాల్సి వచ్చింది. ‘‘మంచి సినిమాలంటే ఇష్టపడే వ్యక్తిగా ‘ఇనమ్’ చిత్రాన్ని నేను పంపిణీ చేశాను. అంతేతప్ప, తమిళ సోదరుల భావోద్వేగాలను దెబ్బతీయాలనో, ఈ సినిమా ద్వారా లాభాలు కూడబెట్టుకోవాలనో నాకు ఏ కోశానా లేదు. కానీ, దురదృష్టవశాత్తూ కొన్ని సంఘాలు ఏకంగా తమిళుల పట్ల నాకున్న ప్రేమాభిమానాల పట్ల సందేహాలు వ్యక్తం చేశాయి. అది నన్ను బాధించింది’’అని ఆయన తన బాధను వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల జరగనున్న ఈ సమయంలో ‘‘జనంలో గందరగోళం సృష్టించకూడదనుకున్నా. అందుకే, ప్రదర్శనను ఆపివేస్తున్నా’’ అని చెప్పారు. సీనియర్ తెలుగు - తమిళ నటి సరిత, ఇంకా కరుణాస్, కరణ్ కీలకపాత్రలు పోషించిన ‘ఇనమ్’కు మళ్ళీ తెరపై మోక్షమెప్పుడో తెలీదు. సెన్సారైనా ఇక్కట్లే! నిజానికి, అంతర్జాతీయ ఖ్యాతికెక్కిన సినీ సృజనశీలి సంతోష్ శివన్ ఈ వాస్తవ కథా చిత్రంతో రిలీజ్కు ముందు నుంచి వార్తల్లో నిలిచారు. చెన్నైతో పాటు ముంబయ్ లాంటి చోట్ల కూడా సినిమా ప్రివ్యూలు ఏర్పాటు చేసి, వైరముత్తు, శేఖర్ కపూర్ లాంటి తమిళ, హిందీ సినీ ప్రముఖులకు ముందుగానే సినిమా చూపించారు. ఈ సినిమాకు మొత్తం మీద సానుకూలమైన స్పందన, సమీక్షలే వచ్చాయి. అయితే, వారి సూచనల మేరకు సినిమాలో కొన్ని డైలాగులనూ, నాలుగైదు దృశ్యాలనూ కూడా స్వచ్ఛందంగా తొలగించారు. అయినప్పటికీ, ఇప్పుడీ సినిమా వివాదాల్లో పడింది. ఆ మాటకొస్తే, ‘ఇనమ్’ సినిమాను సెన్సార్ బోర్డు చూసి, ప్రదర్శన యోగ్యమైందంటూ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రభుత్వం ఈ చిత్రానికి ‘పన్ను మినహాయింపు’ ప్రకటించింది. కానీ, తీరా సెంటిమెంట్లు దెబ్బతిన్నాయంటూ కొన్ని తమిళ బృందాలు నిరసన తెలపడంతో కథ అడ్డం తిరిగింది. ఏమిటీ వివాదం? మలయాళీ మూలాలున్న సంతోష్ శివన్ ఉద్దేశపూర్వకంగానే తన చిత్రాల్లో పదే పదే ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్’ (ఎల్.టి.టి.ఇ)ను కించపరిచేలా చూపిస్తున్నారంటూ వైకో లాంటివారు ఆరోపిస్తున్నారు. శివన్ తన గత చిత్రం ‘టైస్ట్’లో ఎల్.టి.టి.ఇ.కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలైన ఓ మహిళ ఏ రకంగా ప్రాణత్యాగానికి సిద్ధమవుతుందో చూపారు. చిన్నపిల్లలను ఎల్.టి. టి.ఇ. పోరాట యోధులుగా మారుస్తోందనీ, అలాగే శ్రీలంక బౌద్ధ సన్న్యాసులు దయార్ద్ర హృదయులనీ సంతోష్ శివన్ తన చిత్రాల్లో చూపడాన్ని కూడా ఉద్యమకారులు తప్పుబడుతున్నారు. ఇదే పద్ధతిలో తమిళుడు ఎవరైనా ముందుకొచ్చి మలయాళీలను కించపరుస్తూ సినిమా తీసి, కేరళలో ప్రదర్శిస్తే, మలయాళీలు ఊరకుంటారా అని ఆగ్రహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారీ ఆర్థిక నష్టానికి కూడా సిద్ధపడి, నిర్మాతలు సినిమా ప్రదర్శనను ఆపుచేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి సంతోష్ శివన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఒక్కసారి గతంలోకి వెళితే, గడచిన ఏడాది పైచిలుకు కాలంలో తమిళనాట కమలహాసన్ ‘విశ్వరూపం’, రాజీవ్ గాంధీ హత్యోదంతం ఆధారంగా వచ్చిన హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’, హీరో విజయ్ నటించిన ‘తలైవా‘ (తెలుగులో ‘అన్న’) లాంటివి సెన్సార్ జరుపుకొని కూడా రిలీజ్కు ముందు నిరసనలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ‘ఇనమ్’ చిత్రమైతే ఏకంగా రిలీజై కూడా, నిరసనలతో తెర మీద నుంచి పక్కకు తప్పించాల్సి రావడం విచిత్రం. -
ఎలా చెప్పను
పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందిన తమిళ చిత్రం ‘కోళి కూవుదు’ తెలుగులో ‘ఎలా చెప్పను’ పేరుతో విడుదల కానుంది. లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తాండ్ర కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 15న సినిమాని విడుదల చేస్తున్న సందర్భంగా తాండ్ర కుమార్ మాట్లాడుతూ - ‘‘తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే కథ కావడంతో ఇక్కడ విడుదల చేస్తున్నాను. రామ్రాజు స్వరపరచిన పాటలు సినిమాకి ఎస్సెట్గా నిలుస్తాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. ‘యు’ సర్టిఫికెట్ లభించింది. ఏపీలో మొత్తం 100 థియేటర్లలో విడుదల చేయనున్నాం. తమిళంలో ఘనవిజయం సాధించినట్లుగానే తెలుగులో కూడా ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. అశోక్, శిజారోజ్ జంటగా నటించిన ఈ చిత్రానికి కె.ఐ. రంజిత్ దర్శకత్వం వహించారు.