breaking news
Ambati Rambabu
-
ఉగాది వేడుకల్లో YSRCP నేతలు
-
ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు
-
‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’
సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు...మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే...రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’ అని అంబటి రాంబాబు అన్నారు. -
నా ఇంటిపై దాడిని సీఎం, ఆయన కుమారుడు మానిటర్ చేశారు
-
ఎర్రబుక్లు, పిచ్చిబుక్లు మమ్మల్ని ఏమీ చేయలేవు: అంబటి
సాక్షి, విశాఖపట్నం: తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. విశాఖలోని కరణం ధర్మశ్రీ నివాసంలో విశాఖ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇటీవల పరిణామాలపై కాపు నేతలు చర్చించారు. అలాగే, కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్ట్లపై కాపు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు పాల్గొన్నారు.అనంతరం, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీకి చెందిన వారు నా ఇంటిపైకి వచ్చారు.. కులం పేరుతో దూషించారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు?. గుంటూరు నడి బొడ్డున నా ఇంటిపై దాడి చేశారు. నా ఇంటిపై దాడిని టీవీ చానెల్స్ లైవ్ ఇస్తున్నా ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది. భగవంతుడి దయ వల్ల నన్ను చంపలేదు. రెడ్బుక్ను మా కుక్క లెక్కచేయదంటే లోకేష్కు కోపం వచ్చిందేమో.నేను సెంటర్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలి వచ్చారు. నా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపారు. నన్ను 18 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. నాపై జరిగిన దాడి ఒక కులంపై మరొక కులం చేసిన దాడిగా భావించాలి. చరిత్రలో ఎన్నడు ఎప్పుడు జరగని దాడి నాపై జరిగింది. టీడీపీ గుండాలకు అలుపు వచ్చే వరకు దాడి చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటలకు దాడి జరిగింది. చంద్రబాబు పతనం ప్రారంభమైంది. నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను. ఎర్రబుక్కులు, పిచ్చిబుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవు.కులాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ గూండాలు వంగవీటి రంగాను దారుణంగా చంపారు. పోలీసులు సహకారంతో రంగాను హత్య చేశారు. అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని నాపై దాడి చేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం ముద్రగడ ఉద్యమం చేశారు. కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడను జైల్లో పెట్టారు, చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి కాపులు మా వైపు ఉన్నారనుకుంటే అది మీ భ్రమ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
అంబటి రాంబాబును కలిసిన కొడాలి నాని
-
అంబటి రాంబాబు హీరో.. లోకేష్.. గుర్తుపెట్టుకో.. పిచ్చిపిచ్చి వేషాలేస్తే..
-
‘2029లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం’
సాక్షి,గుంటూరు: 2029లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని ఆదివారం కొడాలి నాని, ఇతర వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు.అనంతరం, కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ‘కూటమి బెదిరింపులకు వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడరు. కూటమి ప్రభుత్వం అంబటి కుటుంబసభ్యుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టీడీపీ నేతలు కావాలనే అంబటి రాంబాబును రెచ్చగొట్టారు.అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు.పోలీసుల సమక్షంలో అంబటి ఇంటిపై దాడి జరిగింది. లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్సీపీ భయపడదు. 2029లో వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం’అని స్పష్టం చేశారు. -
అంబటికి మళ్ళీ నోటీసులు
-
రెడ్ బుక్ లో జగన్ పేరు..! అంబటి మాస్ రియాక్షన్
-
రెడ్బుక్ పేరుతో ఏపీని సర్వ నాశనం చేస్తున్నారు: అంబటి
సాక్షి, గుంటూరు: ‘‘నన్ను 100 సార్లు జైలుకు పంపినా.. నాపై 1000 కేసులు పెట్టినా.. మా ఇంటి కుక్క కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. జనసేన ఆఫీసులో రెండు వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో పరుగులు తీసుకుంటూ వెళ్లి విచారించిన గుంటూరు ఎస్పీ, ఐజీ.. మా ఇంటి పై ఏడు గంటల పాటు దాడి జరిగితే స్పందించలేదంటూ ప్రశ్నించారు.చంద్రబాబుకు దమ్ముంటే మా ఇంటి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే మా ఇంటిపై దాడిలో ఆయన ప్రోద్బలం ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. మా ఇంటి పై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయపరంగా పోరాడతాం. లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదుప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు: నూరిఫాతిమాగుంటూరు నగర వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారంలో విష ప్రచారం చేసి ప్రజలకు అడ్డంగా దొరికిపోయారని... ప్రజల దృష్టిని మళ్లించడానికి టీడీపీ గుండాలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు. ఇలా దాడులు చేస్తూ భవిష్యత్తు తరాల వారికి ఏం మెసేజ్ పంపిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.రెడ్బుక్ పాలన పేరుతో అరాచకం: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజురాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. రెడ్బుక్ ఎలా ఉందో మీరు చూపిస్తున్నారు. డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు. అక్రమ కేసులు, దాడులు, హత్యలు, హత్యాచారాలతో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. -
అంబటిని పరామర్శించిన వంశీ
-
అన్నింటికి సిద్దపడే జైలుకు వెళ్ళా... కానీ పొన్నవోలు మాత్రం అంబటి ప్రశంసలు
-
మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్
-
ధైర్యానికి మారు పేరు అంబటి
-
Guntur: అంబటిని పరామర్శించిన YSRCP నేతలు
-
చంద్రబాబు కాపులను వేధిస్తున్నారు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్)/ఇబ్రహీంపట్నం: కాపుల వల్లే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వారిపైనే దాడులు చేయిస్తూ అవమానాలు, వేధింపులకు గురిచేస్తున్నారని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులంతా బానిసలుగా బతకాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, అది జరగదని మండిపడ్డారు. సోమవారం ఆయన గుంటూరు సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో కలిసి వచ్చారు. అంబటిని పరామర్శించారు.ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ మాట్లాడుతూ గతంలో తనపైనా, తన కుటుంబంపైనా దాడి చేయించారని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబంపైనా దాడి చేయించారని చంద్రబాబుపై మండిపడ్డారు. ‘అయ్యా చంద్రబాబు నీకు, మీ సతీమణి, మీ కుమారుడు, కోడలికి అవమానం జరిగితే మీ ఫీలింగ్స్ ఏమిటి?’ అని ముద్రగడ ప్రశ్నించారు. మాజీ మంత్రుల నివాసాలపై దాడులు చేయించటం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు అబద్ధాలు వల్లించడం హాస్యాస్పదమన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అరెస్టులు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.ఇప్పటికైనా అబద్ధాలు ఆపి దేవదేవుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను సోమవారం ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. దాడి జరిగిన తీరును జోగి రమేష్ ఆయనకు వివరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా జోగి రమే‹Ùను పరామర్శించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నగర గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గం ఇన్చార్జ్, ఉమ్మడి గోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షుడు చిలిమిలి వెంకటరాయుడు, పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ పాల్గొన్నారు. -
నన్ను, నా కుటుంబాన్ని కాల్చేయమని.. బాబు, లోకేష్ పై అంబటి సంచలన కామెంట్స్
-
‘నా ఇంటిపై దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం’
గుంటూరు: తన ఇంటిపై జరిగిన దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణమని మరోసారి పునరుద్ఘాటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ తన ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఇది చంద్రబాబు, లోకేష్ల కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఈ రోజు(సోమవారం, ఫిబ్రవరి 23వ తేదీ) మీడియాతో మాట్లాడిన అంబటి.. ‘ రాజమండ్రి జైలు నుంచి విడుదలైనప్పటినుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. వారందరికీ నా ధన్యవాదాలు. నేను జైలులో ఉన్నప్పుడు మా అధినేత జగన్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. 18 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశాను.నన్ను అరెస్టు చేసి తీసుకెళ్ళిన తర్వాత నా ఆఫీసు, ఇల్లు తగలబెట్టాలని నిర్ణయించుకున్నారు. మా ఇంట్లోనుంచి నా భార్య, కూతుర్లు వెనుకనుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సీఎం చంద్రబాబే బాధ్యుడు. ఏడు గంటలు పోలీసులు నిర్వీర్యంగా ఉండడానికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం. మీరు కాదని చెప్పండి.. ఆవేశంలో దాడులు చెయ్యడం చూశాం. కానీ సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ పోలీసులు పట్టించుకోలేదు. ఇది మీ కుట్ర కాదా చంద్రబాబు.మాజీ మంత్రి ఇంటిపై దాడి చేస్తుంటే ఎందుకు నిర్యీర్యంగా ఉన్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు.. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు’
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. అంబటి ఇంటిపై దాడి చేసి.. ఆయన్నే అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దని హెచ్చరించారు. రాంబాబు ఇంటిపై దాడి బాధాకరమని అన్నారు. మాజీ మంత్రి అంబటిని కలిసిన వారిలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ఉన్నారు.అనంతరం, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘అంబటి రాంబాబు ఇంటిపై ఏడు గంటలపాటు దాడి చేశారు. చెరపకురా చెడేవు అన్న సామెత గుర్తుపెట్డుకోండి. దాడులపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?. ముద్రగడ లాంటి వ్యక్తులపై కూడా దాడి చేశారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు.ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ..‘రాంబాబు కుమార్తె ఫైర్ బ్రాండ్ మౌనికను పలకరించడానికి వచ్చాను. భవిష్యత్తులో మమతా బెనర్జీ స్థాయికి మౌనిక వెళ్లాలి. మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు. మాకు జరిగిన అవమానాలు మీకు మీ భార్య, కొడుకు, కోడలికి జరిగితే ఎలా ఉంటుంది?. మేం బానిసలం కాదు. తిరుమల లడ్డుపై రోజూ అబద్దాలు ఆడుతున్నారు. మీ అబద్దాలను ఇకనైనా ఆపి క్షమాపణలు చెప్పండి. క్షమాపణ లేకపోయినా ఫరవాలేదు.. మాట్లాడడం ఆపేయండి. మీ ఉద్దేశం ఏంటి? అందరినీ జైలులో పెట్టాలనా?. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు.. సద్వినియోగం చేసుకోండి. మా ఇళ్లపై దాడిచేసే కార్యక్రమాలకు స్వస్తి పలకండి అని హెచ్చరించారు.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘అరెస్టు చేసి జైలులో పెట్టడం ఎంతవరకు సమంజసం. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు. అంబటి రాంబాబు, జోగి రమేష్, చెవిరెడ్డిని అరెస్టు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. మీరు ఏం చేస్తానన్నా మేం బయటకు వస్తాం. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబుకు ఏ విధంగా పాలించాలో తెలియదా?. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తున్నారు. అరెస్టులు ఇప్పటికైనా ఆపండి. తిరుమల లడ్డులో కల్తీ లేదని తేలింది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఆ రోజు రాత్రి 12 గంటల వరకు.. లోకేష్ రెడ్ బుక్ కు కుక్కలు కూడా లెక్క చెయ్యవు
-
తప్పు చేసిన వారు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి ఆహుతి కాక తప్పదు
-
నాపై దాడిని బీజేపీ, జనసేన నేతలు ఖండించారు.. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప
-
చంద్రబాబూ.. ప్రజలు గమనిస్తున్నారు: అంబటి రాంబాబు
సాక్షి, తిరుపతి: లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నా ఇల్లు, ఆఫీస్పై దాడి చేశారు. 5 గంటలు నుంచి 12 గంటలు వరకు దాడి జరుగుతూనే ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు’’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వైవిధ్యాలు ఉంటాయి. పోలీసులను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో చంద్రబాబు ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించమని కోరుతున్నా.. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు సరికాదు. బీజేపీ, సీపీఐ, జనసేన పార్టీ నాయకులు స్పందించారు. పార్టీలకు అతీతంగా నా అరెస్ట్పై స్పందించారు. జనసేన పార్టీ అధినేత స్పందించలేదు.లడ్డూ వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఛార్జిషీట్ ఫైల్ చేశాక మీకు తొందర ఎందుకు? వాస్తవాలు చెప్పారు కదా.. భగవంతుడ్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదు’’ అని అంబటి పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కొనసాగుతున్న ప్రభుత్వ కక్ష సాధింపు
రాజమండ్రి: వైఎస్సార్సీపీ నేతలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈనెల 19వ తేదీన రాజమండ్రి నుండి గుంటూరుకు అంబటి రాంబాబు బయల్దేరిన సమయంలో సెక్షన్ 30 నోటీసులు అందజేశారు పోలీసులు. అంబటి కాన్వాయ్కు అడగడుగునా అడ్డు తగిలిన పోలీసులు.. సెక్షన్ 30 కింది అంబటి రాంబాబుకి, జక్కంపూడి రాజాకు నోటీసులు ఇచ్చారు. దాంతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు ప్రకాశ్ నగర్ పోలీసులు.కాగా, మంగళవారం(ఫిబ్రవరి 19వ తేదీ) రాజమండ్రి నుంచి గుంటూరుకు బయల్దేరిన అంబటి రాంబాబుకు అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అంబటి కాన్వాయ్ను పదే పదే అడ్డుకున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకసారి కాన్వాయ్ లో అంబటి వాహనం వెనకాల ఉన్న వాహనాలను నిలిపి వేశారు పోలీసులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. అనుమతిస్తే కారులో వెళతానని, అలాకాకుండా తన వెనకాల నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేస్తే మాత్రం.. పాదయాత్రగా వెళ్తానని అంబటి స్పష్టం చేశారు. తన కాన్వాయ్ అడ్డుపడటమే కాకుండా, సెక్షన్ 30 కింద నోటీసులు ఇవ్వడాన్ని అప్పుడే అంబటి తీవ్రంగా ఖండించారు. తన ఇంటిపై దాడి చేసినప్పుడు రాని సెక్షన్ 30, ఇప్పుడు తాను కాన్వాయ్లో బయల్దేరితే వచ్చేసిందా అంటూ మండిపడ్డారు. -
ఏ రాజకీయ నాయకుడు చెప్పుడు.. అది అంబటి సంస్కారం..
-
నాకు కొడుకులు లేరని ఎప్పుడూ.... కూతురు మౌనిక పై అంబటి ప్రశంసలు
-
ఆమెని చూసి సిగ్గు తెచ్చుకోండి... జనసేన రజినీ పై అంబటి ప్రశంసలు
-
ఈ అంబటి అనే కుక్కకు కూడా... అంటే అర్ధం ఏంటో తెలుసా పవన్...ఏకిపారేసిన అంబటి
-
నన్ను రాత్రి 2 గంటలకు నిద్రలేపి ఇద్దరు కానిస్టేబుల్ లు వచ్చి సంచలన నిజాలు బయటపెట్టిన అంబటి
-
నీవు తీసిన సినిమాలో నేనే హీరో.. పెమ్మసానికి గుబాపగిలేలా అంబటి కౌంటర్
-
చంపితే చస్తా కానీ.. తగ్గేదేలే... మరో సారి అంబటి మాస్ వార్నింగ్
-
ఏం బెదిరిస్తున్నావా...? నీ కన్నా గట్టిగా అరవగలను... అంబటి Vs పోలీస్
-
తొందరేమీ లేదు.. అన్నింటికీ సమయం వస్తుంది: అంబటి
సాక్షి, గుంటూరు: తొందరేమీ లేదు.. అన్నింటికి మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్మిషన్ తీసుకునే నల్లపాడు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాను. టీడీపీ నేతలు కర్రలు, రాడ్డులు తీసుకుని నా కారు మీదకు వచ్చారు. టీడీపీ నేతలు కట్టిన ఫ్లైక్సీని చించలేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పా. గూండాలు 4 గంటల పాటు బీభత్సం సృష్టిస్తే పోలీసులు ఏం చేశారు?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు, గూండాలు ఏకమై దారుణంగా ఇంటిపై దాడి చేశారు. ఆ మాట అనడాన్ని నా అంతరాత్మ ఒప్పుకోలేదు.. నేను బాధపడ్డాను. టీడీపీ నేతలు తిడుతున్నారనే ఉద్దేశంతో మాట అన్నాను. బ్యాచ్లుగా బ్యాచ్లుగా నా ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో నా పిల్లలు, నా మనవళ్లు ఉన్నారు. పోలీసులు సాక్షిగానే నా ఇంటి మీద దాడి చేశారు. నాలుగు గంటల పాటు నా ఇంటి మీద కరాళ నృత్యం చేశారు. పోలీసులు రక్షణ కల్పించలేక పారిపోండి అన్నారు...నేను అనని మాటలను అన్నట్లు రిపోర్ట్లో పెట్టారు. నా అల్లుళ్లు ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. కమ్మ సామాజిక వర్గాన్ని నేను అనని మాటలను అన్నట్లు రిపోర్ట్లో పెట్టారు. నా ఇంటి మీద దాడి చేసింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. పెమ్మసాని నాకు సినిమా చూపిస్తానని చెప్పారు. అవును నాకు పెమ్మసాని సినిమా చూపించారు. పెమ్మసాని సినిమాలో హీరో ఎవరు?’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు...31 అర్ధరాత్రి నల్లపాడు పోలీసులు అరెస్టు చేస్తే కోర్టు తీర్పుతో మొన్న విడుదల అయ్యాను. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు. నా కుటుంబం, నా కూతురు అన్నీ అర్థమయ్యేవిధంగా చెప్పారు. ఇక్కడే అన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. టీడీపీ కట్టిన ఫ్లెక్సీ వద్దకు వెళ్ళి ఇది మంచి పద్దతి కాదని చెప్పాను. కానీ చించివేయలేదు. మరుసటి రోజు గుళ్లలో పూజలు చేయమని పార్టీ పిలుపు ఇచ్చింది. పర్మిషన్ తీసుకుని వెళ్లాను. నల్లపాడు సీఐ అడిగితే ఫ్లెక్సీ వద్దకు వెళ్లనని చెప్పాను. తిరిగి వస్తుంటే కారు అడ్డుకుని అమ్మ, అక్క అంటూ తిట్టారు. అప్పుడు నేను తిట్టాను. అది ఆ సమయంలో జరిగింది. తర్వాత ఇంటికొచ్చి ఆలోచిస్తే నా అంతరాత్మ ఒప్పుకోలేదు...నేను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదు. నేను ఈ వయసులో తిట్టి ఉండాల్సింది కాదనుకున్నాను. పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదు. ఐదు గంటలకు నా ఇంటివద్దకు పలు నియోజకవర్గాలనుంచి జనం వచ్చారు. నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, మనవళ్లు ఉన్నారు. ఏడు గంటల పాటు కరాళనృత్యం చేశారు. పోలీసుల అండతో రెచ్చిపోయారు. ఎక్కడైనా పోలీసులు, గూండాలు ఒక్కటవుతారా? ఇది ధర్మమేనా? వైఎస్సార్సీపీ వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు పారిపోవాలని చెప్పారు. పారిపోవడం కన్నా చచ్చిపోవడం మేలని చెప్పాను...ఇంత దారుణం.. అన్యాయం జరిగితే స్పందించరా? పోలీసులు తీసుకెళ్లి లాకప్లో పెట్టారు. రాత్రి 2గంటలకు స్టేషన్పైకి తీసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఎందుకో కొట్టలేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తా. నల్లపాడు సీఐ వంశీ రిమాండ్ రిపోర్ట్లో కమ్మవారిని తిట్టానని పేర్కొన్నారు. నా ఇద్దరు అల్లుళ్లు కమ్మవారే. కులాల పేరుతో రెచ్చగొడుతుంది మీరే. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పశ్చాత్తాప పడ్డా. పవన్ కళ్యాణ్ మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడ లేదా? వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని వేదికపై చెప్పు తీశావు...నేను అప్పుడు ఎమ్మెల్యేనే కదా. నా కొడకా అంటే అర్థం తెలుసా. ఇప్పటికైనా పశ్చాతాపం పడ్డావా.. అన్యాయాన్ని అన్యాయం అనలేని నువ్వు ఏం డిప్యూటీ సీఎంవు. అంబటి కాపు కాదా. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తా. నేను కమ్మ ద్వేషిని కాదు. నా కులం తరపున మాట్లాడా.. చిరంజీవి వచ్చి కాపులకు మద్దతుగా మాట్లాడారు. వంగవీటి రంగాను కోల్పోయాం... ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేమన్నారు. అప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘చంద్రబాబుకమ్మని ప్రభుత్వానికి పవన్ కాపు కాస్తున్నాడు. నేను తగ్గను, చావనైనా చస్తా, తగ్గదేలేదు. నన్ను ఎమిలినేట్ చేయాలని రెడ్బుక్లో రాసుకున్నారట. చంపేస్తే సమాధి అయ్యి సాధిస్తా. పోలీసులతో హత్యలు చేయించడం చంద్రబాబుకు అలవాటే. ఆ అలవాటే లోకేష్కు వచ్చింది’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
కూటమికి దడ పుట్టిస్తున్న అంబటి వారసురాలు
-
జగన్ ను కలిసిన అంబటి రాంబాబు
-
వైఎస్ జగన్ను కలిసిన అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో వైఎస్ జగన్ను కలిసి అంబటి మాట్లాడారు. అయితే, అక్రమ కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబు.. గురువారం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ వంటి అంశాలను వైఎస్ జగన్కు వివరించారు. ఈ క్రమంలో తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో అంబటితో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. -
అంబటికి విడదల రజిని పరామర్శ
-
అంబటికి స్వాగతం పలికిన భార్య, కూతుర్లు
-
నా ఇంటికి నేను వెళుతుంటే అడ్డుకుంటారా.. అంబటి మాస్ వార్నింగ్
-
పోలీసుల అత్యుత్సాహం.. కాన్వాయ్ ఆపుదాం అని చూసారు దెబ్బకి ఇచ్చిపడేసిన అంబటి
-
రాజమండ్రిలో హైటెన్షన్.. అంబటి ర్యాలీకి అడ్డంకులు
-
అప్పుడు లేని యాక్ట్.. ఇప్పుడు వచ్చిందా?: అంబటి తీవ్ర ఆగ్రహం
రాజమండ్రి: గుంటూరు బయల్దేరిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. అంబటి వాహనం వెనుక మూడుకు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు పోలీసులు. అంబటి రాంబాబు వాహనం బయల్దేరిన వెంటనే కాన్వాయ్గా వస్తున్న పలు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జక్కంపూడి రాజాతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు.దాంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం దిగి వెనక్కి వచ్చారు అంబటి. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు అనుమతిస్తే గుంటూరుకు కారులో వెళతా.. లేకపోతే గుంటూరుకు పాదయాత్రగా వెళతా’ అంటూ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉందంటూ మండిపడ్డారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళుతున్న వారిపై ఈ తరహా దాష్టీకం చేయడం సరికాదన్నారు.. ‘రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంతకన్నా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టగలరు’ అంటూ ధ్వజమెత్తారు. తన ఇల్లును పగలగొట్టినప్పడు 30 యాక్ట్ లేదా.. ఇప్పుడు 30 యాక్ట్ వచ్చిందా అంటూ అంబటి ప్రశ్నించారు. పోలీసులు దగ్గరుండి తన ఇల్లును పగలగొట్టించారని, ఆ రోజు ఏమైంది 30 యాక్ట్ అంటూ నిలదీశారు. తాను శాంతియుతంగా గుంటూరుకు వెళుతున్నానని, మీరు కారులో వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోతే మాత్రం పాదయాత్రగా గుంటూరుకు వెళతా అంటూ హెచ్చరించారు. రాజమండ్రిలో పోలీసుల హైడ్రామారాజమండ్రి నుంచి గుంటూరుకు బయల్దేరిన అంబటి రాంబాబుకు అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అంబటి కాన్వాయ్ను పదే పదే అడ్డుకుంటున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకసారి కాన్వాయ్ లో అంబటి వాహనం వెనకాల ఉన్న వాహనాలను నిలిపి వేస్తున్నారు పోలీసులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. అనుమతిస్తే కారులో వెళతానని, అలాకాకుండా తన వెనకాల నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేస్తే మాత్రం.. పాదయాత్రగా వెళ్తానని అంబటి స్పష్టం చేశారు. -
అంబటి ఇంటి దగ్గర సంబరాలు
-
ప్రజా బలం దైవబలం కలిసి.. అంబటి విడుదలపై కూతురు రియాక్షన్
-
కాపు టైగర్ ఈజ్ బ్యాక్
-
భయపడడం నా రక్తంలోనే లేదు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నన్ను జైలులో పెడితే భయపడతానని అనుకున్నారని, అది నా రక్తంలోనే లేదని... ఎన్ని కేసులు పెట్టినా ఒక్క అడుగూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జైలుకు వెళ్లినప్పుడు సంతోషంగానే ఉన్నానని, తిరిగి వచ్చినప్పుడూ అంతే సంతోషంగా ఉన్నానని, ఐ డోంట్కేర్ అన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో 18 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న రాంబాబు బుధవారం విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బెయిలబుల్ కేసుకు ఇన్ని రోజులు జైలులో ఉండాల్సి వచ్చిందన్నారు. తనకు మద్దతు పలికిన వారికి, పలకని వారికి ధన్యవాదాలన్నారు. తనను జైలులో పెట్టడానికి చంద్రబాబు, లోకేశ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారని, వారికి ఈ చిన్నపాటి విషయం దొరికిందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా కూల్చేవరకు ఈ పోరాటం ఆగదన్నారు. సెంట్రల్ జైలును తనలో పట్టుదల పెంచే శిక్షణ కేంద్రంగా భావించానన్నారు. త్వరలో పరిస్థితులు మారుతాయన్నారు. తనను అన్యాయంగా, అక్రమంగా జైలులో పెట్టారన్నారు. చంద్రబాబు, లోకేశ్ పర్యవేక్షణలోనే దాడి ‘నా ఇంటిని దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు, ఆఫీసు పగులకొట్టారు. నా భార్య, పిల్లలను తరిమికొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైలులో పెట్టారు, అయితే ఏమైంది..’ అని చంద్రబాబు, లోకేశ్ను అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఏడు గంటల సేపు తన ఇంటిపై దాడి జరిగిందని, దాన్ని చంద్రబాబు, లోకేశ్ పర్యవేక్షించారన్నారు. పోలీసుల సమక్షంలో తెలుగుదేశం కార్యకర్తలు, రౌడీలు, గంజాయి బ్యాచ్ తమపై దాడి చేశారన్నారు. ఎప్పుడూ, ఎక్కడా తప్పు చేయలేదని, పొరబాటు మాట్లాడి వెంటనే పశ్చాత్తాప పడ్డానన్నారు. దానికి మించిన ప్రాయశ్చిత్తం లేదన్నారు. దేనికైనా సిద్ధపడి ఉన్నామని, అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుక, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుక నడుస్తున్నామన్నారు. ఎన్ని కుట్రలైనా, కుతంత్రాలైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. జైలు అధికారులు వారి డ్యూటీ చేశారని, తనకు నచ్చకపోయినా వారు పెట్టిన ఆహారాన్నే తిన్నానని, తనను ప్రత్యేకంగా చూడాలని కోరలేదన్నారు. జైలులో ఇబ్బంది పడలేదని, బాత్రూమ్లో జారిపడ్డానని తెలిపారు. జైలు బయట అంబటి వెంట మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకట్రావు ఉన్నారు.అంబటి రాంబాబుకుబెయిల్ మంజూరు గుంటూరు లీగల్: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నం.8 /23 కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.కుముదిని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘‘రంగోలి లక్కీ డ్రా’ కార్యక్రమానికి సంబంధించి ఆరి్థక నేర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు పీటీ వారెంట్ ఆధారంగా అరెస్టు చేసి ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్కు తరలించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట రాంబాబు తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి బుధవారం కోర్టులో వాదనలు వినిపిస్తూ... ఆ కార్యక్రమం ప్రజా ఉత్సవాల్లో భాగమని, మోసం, బలవంతం లేదా ఆరి్థక దుర్వినియోగం జరగలేదని, కేసులో నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని, విచారణ పూర్తికాక ముందే అరెస్టు చేయడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని వివరించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించిన అనంతరం, న్యాయమూర్తి రెండు పక్షాల వాదనలు పరిశీలించి బెయిల్ మంజూరు చేశారు. విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు. -
నా పెళ్ళాం.. బిడ్డలని తరిమేశారు.. జైలు నుంచి రాగానే అంబటి మాస్ వార్నింగ్..
-
ఒక్క రోజు కూడా జైల్లో ఉండాల్సిన కేసు కాదు.. అంబటి విడుదలపై అడ్వకేట్ షాకింగ్ నిజాలు
-
మళ్లీ చెప్తున్నా తగ్గేదేలే. అనితకు కౌంటర్ Ambati
-
పులిలా బయటకు వచ్చాడు.. విడుదలపై YSRCP నేతల రియాక్షన్
-
బాత్ రూమ్ లో జారి పడ్డ... జైల్లో పరిస్థితులపై అంబటి సెటైర్లు
-
జైలు నుండి అంబటి విడుదల పులిలా బయటకొచ్చిన కాపు టైగర్
-
అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల
-
మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల
సాక్షి,రాజమండ్రి: కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. నా ఇంటిపై దాడి చేశారు. నన్ను హింసించారు. నా భార్య,పిల్లల్ని తరిమారు. నా కార్లను ధ్వంసం చేశారు. నా ఇల్లు తగలబెట్టేందుకు యత్నించారు. ఐ డోంట్ కేర్. బాధితుణ్ని లోపల పెట్టారు. నిందితుణ్ని వదిలారు. పార్టీలకు అతీతకంగా దాడిని ఖండించిన వారికి నా కృతజ్ఞతలు. దేవుడున్నాడు.. ధర్మమే గెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు అంబటి రాంబాబు విడుదలపై వైఎస్సార్సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. తప్పు చేయలేదు కాబట్టి అంబటి రాంబాబుకు ఆత్మవిశ్వాసం ఉంది. వైఎస్సార్సీపీ నేతలు అక్రమ కేసులను, దాడులను లెక్క చేయరు. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజలకు అండగా ఉంటాం -జక్కంపూడి రాజాప్రశ్నించినందుకు అంబటి ఇంటిపై దాడి చేసి అయనను జైల్లో పెట్టారు. కక్ష సాధించుకోవటానికే తనకు అధికారమిచ్చారని చంద్రబాబు అనుకుంటున్నారు. అంబటి రాంబాబు మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. నా వైపు న్యాయం ఉంది వెనక్కి తగ్గేది లేదని అంబటి చెప్పారు. ఆయన కుటుంబాన్ని కూడా హింసించారు -వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి.. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించే తప్ప ప్రజలకు ప్రభుత్వం మంచి చేయడం లేదు. అంబటి క్షమాపణ చెప్పినా ఇంటిని ముట్టడి చేసి దారుణంగా ధ్వంసం చేశారు. మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేశారు అటువంటి వారిపై ఎటువంటి చర్యలు లేవు..అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేస్తున్నారు. అధికారం, అహంకారంతో ఏదైనా చెల్లుతుంది అని అనుకుంటున్నారు. ప్రజల్లో అంతా గమనిస్తున్నారుఅధికార పార్టీ తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గర పడింది. - తానేటి వనిత ,మాజీ హోంమంత్రి -
అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారాయణస్వామి, కుమార్తె కృపాలక్ష్మి
-
అంబటికి బెయిల్ ఇచ్చిన గుంటూరు కోర్టు
-
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో అంబటి ఉన్నారు.అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపింది. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్ మంజూరు చేశారు.ఈ కేసులో విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో పీటీ వారెంట్ జారీచేశారు. తాజాగా ఈ కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
జైల్లో అంబటి పరిస్థితి ఏలా ఉందంటే..
-
పులిని తీసుకొచ్చి నాలుగు గోడల మధ్య పెట్టారు జాగ్రత్త
-
కోర్టు ఆర్డర్స్.. అంబటికి ప్రత్యేక సదుపాయాలు
-
కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది
-
గళ్ళ మాధవి, అనిత గుర్తుపెట్టుకోండి..!
-
మీ తల్లిని తిట్టినా సిగ్గులేకుండా.. నాగబాబుకు మాస్ కౌంటర్..
-
బూతులు తిట్టిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు... బాధితుడు అంబటి గారు జైల్లో ఉన్నారు
-
అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్
-
పవన్పై అంబటి రాంబాబు కుమార్తె ఫైర్
సాక్షి,గుంటూరు: తన తండ్రిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అంబటి మౌనిక తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దాడి చేసి, తిరిగి అంబటి రాంబాబుపై కేసులు పెట్టారు. అక్రమ కేసులకు, దాడులకు భయపడేది లేదు.కూటమి నేతలు కావాలని రెచ్చగొట్టి, దాడులకు పాల్పడ్డారు. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. అంబటి రాంబాబుకు రక్షణ కల్పించడంలో హోంశాఖ విఫలమైందని మండిపడ్డారు. -
కాలమే సమాధానం చెప్తుంది.. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన బొత్స
-
జైల్లో అంబటి పరిస్థితి..! జడ శ్రవణ్ రియాక్షన్..
-
Israel : ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేయటమే శాంతి భద్రతలా..?
-
Botsa: అంబటి తల్లి కూడా తల్లే మీ తల్లిని తిడితే ఊరుకుంటారా?
-
అంబటితో ములాఖత్..YSRCP నాయకులు సంచలన వ్యాఖ్యలు
-
కూటమి కుట్ర... అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్
-
సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు బాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది.సత్తెనపల్లి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు.. 14 రోజులు రిమాండ్ విధించింది. గుంటూరు నుంచి అంబటి రాంబాబును రాజమండ్రికి తరలిస్తున్నారు. సత్తెనపల్లి కేసులో బెయిల్ పిటిషన్, జైల్లో వసతులు కల్పించాలంటూ మరొక పిటిషన్ను అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు.కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్ మంజూరు చేశారు. నేడు (గురువారం) ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు.ఇలా వరుస కేసులతో బాబు సర్కార్.. ఇబ్బందులకు గురిచేస్తోంది. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను ఇవాళ (గురువారం) గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపర్చారు. ఈ కేసులో కోర్టు.. అంబటికి 14 రోజులు రిమాండ్ విధించింది. -
Chirla Jaggi: గుర్తుపెట్టుకోండి.. ఇంటికి వెళ్ళడానికి దారి ఖర్చులు ఉండవు..
-
జైల్లో పెట్టినా అదే ధైర్యం.. పోలీస్ జీపులోంచి తగ్గేదే లే..
-
అంబటిపై కుట్రల మీద కుట్రలు
-
2023లో కేసు.. ఇప్పుడు పీటీ వారెంట్
-
అంబటి కుటుంబానికి పెద్దిరెడ్డి పరామర్శ
-
సర్కార్ శాడిజం.. కాపు నేతపై కన్నింగ్ ప్లాన్
-
అంబటిపై కక్ష సాధింపు.. గుంటూరు కోర్టులో రాంబాబు
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ పోలీసులు తాజాగా అంబటిపై మరో కేసుకు సంబంధించిన పిటీ వారెట్పై విచారణకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కాగా, గతేదాడి నవంబర్ 12న పట్టాభిపురం వైఎస్సార్సీపీ ర్యాలీ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. దీంతో, అంబటి జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. ఆయన బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం మరో కేసులో అరెస్ట్కు రంగం సిద్దం చేసింది. 2023లో(ప్రైవేట్ కేసు నమోదు) సత్తెనపల్లి పరిధిలో నమోదైంది. అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పిటీ వారెంట్ జారీచేశారు. కేసుకు సంబంధించి పిటీ వారెంట్పై విచారణకు అంబటి రాంబాబును గుంటూరు తరలించారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటీ వారెంట్పై అంబటిని సత్తెనపల్లి పోలీసులు హాజరు పరిచారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబంధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. -
సర్కారు శాడిజానికి 'పరాకాష్ట'
సాక్షి ప్రతినిధి, గుంటూరు, గుంటూరు లీగల్: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం బెయిల్ మంజూరు చేశారు. గురువారం ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు. ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓ విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చని పరిశీలకులంటున్నారు. ఒక కాపు నేతపై ఇంతలా కక్ష సాధించడం విడ్డూరమని వారు పేర్కొంటున్నారు. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని అంటున్నారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమరి్పంచిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను గురువారం గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపరుచనున్నారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. సుప్రీం తీర్పులకు విరుద్ధంగా.. అంబటి రాంబాబు మాట్లాడిన ఒక్క మాటకు 36 కేసులు పెట్టారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా విరుద్ధమని, దీని వెనుక సర్కారు రాక్షసత్వం, ఒక వ్యక్తిపై కక్ష, పగ కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ 2022లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఓ కాగ్నిజబుల్ అఫెన్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే.. ఇక ఎక్కడా అలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఈ ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయకుండా ఫిర్యాదుదారుల్ని సాక్షులుగా పేర్కొనవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. టీటీ ఆంథోనీ కేసులోనూ ఆర్టికల్ 141 ప్రకారం ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదే కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పినా ఆ తీర్పును రాష్ట్రంలో అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టికల్ 141, సుప్రీంకోర్టు తీర్పుల్ని లెక్కచేయడం లేదు. ఒకే కేసులో ఇన్ని ఎఫ్ఐఆర్లా..హైకోర్టు విస్మయం.. అంబటి రాంబాబుపై అనేక కేసులు నమోదు చేస్తుండడంపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ అంబటి లంచ్మోషన్ రూపంలో దాఖలుచేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రశ్నించారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. అంబటి కేసులో చట్ట ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు గుంటూరు జిల్లా, మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆదేశించారు. ఆయనకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఈ కేసులో తమ కుట్ర ఫలించకపోవడం వల్లనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో అంబటిపై ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారని విమర్శకులంటున్నారు. -
అంబటి ఇంటిపై దాడి దుర్మార్గం: పెద్దిరెడ్డి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు.సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునుపెన్నడూ చూడలేదని.. ఈ అరాచకాలకు మంత్రి లోకేషే మూల కారణమని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు. ఇలాంటి దాడులతో కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అర్ధం కావడం లేదు? ఇలాంటి దాడులతో మళ్లీ రాజకీయాలలో మనుగడ సాగించాలన్న ఆలోచన చేస్తుందా? లేదా అన్నది కూడా అర్ధం కావడం లేదు. వీరి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, విడిపోయిన తర్వాత అయినా మాజీ మంత్రులు, శాసనసభ్యుల ఇళ్లపై దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ చూడలేదు.1978 నుంచి రాజకీయాల్లో నేను కూడా ఏ పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడ్డాన్ని చూడలేదు. కాపులకు అండగా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఆ రోజు అధికారం కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పాడు. ఇవాళ ఒక్క మహిళనైనా మరి వెనక్కి తిరిగి తీసుకొచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. పవన్ కళ్యాణ్ కాపులకు చేసిందేమీ లేదు.మరో వైపు, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటికీ మూల కారణం లోకేష్. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్లు చేస్తున్న తప్పులకు వత్తాసు పలకడం తప్ప.. తన వయస్సుకు తగినట్లు ప్రవర్తించడం లేదు. ఆలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్లకు ఒక్కటే చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అయితే మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, మీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఇవాళ శాసనసభలో అధికార పార్టీ నేతల మొహాలు చూస్తుంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుంది. వారి మొహాల్లో భయం కనిపిస్తోంది.అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్ జగన్తో పాటు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాంబాబు మీద దాడి చేసిన వారు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, అధికార పార్టీ నేతలు చేసిన దుశ్చర్యను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన టైంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అంబటి రాంబాబుకి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
మిమ్మల్ని పొలిమేరలు దాటే వరకు.. గల్లా మాధవి వంగలపూడి అనితకు జడ శ్రవణ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
విడుదల కాకుండా ... అంబటిపై మరో కేసులో ఇరికించాలని చూస్తోన్న పోలీసులు
-
అంబటికి బెయిల్... కూతురు మౌనిక ఫస్ట్ రియాక్షన్
-
మాజీ మంత్రి అంబటిపై ఆగని కూటమి కుట్రలు
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అంబటి విడుదల కాకుండా విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత కేసులను తిరగతోడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అంబటిని మరో కేసులో ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు.గతేడాది నవంబర్లో పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో అంబటికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. అంబటి విడుదల కాకుండా పాత కేసులు తిరగతోడాలని ఆదేశాలు జారీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో పెండింగ్లో ఉన్న పాత కేసును2023లో పెండింగ్లో ఉన్న పాత కేసును పోలీసులు తెరపైకి తెచ్చారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదుతో అప్పట్లో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభిపురం కేసులో అంబటికి బెయిల్ వస్తుందని భావించిన కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం నుంచి పాత కేసులను తిరగ తోడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ ఆదేశాల మేరకు.. సత్తెనపల్లి కేసుకు సంబంధించి ఇవాళ గుంటూరు కోర్టులో పిటి వారెంట్ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటి వారెంటుకు కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి జైలు నుంచి పట్టాభిపురం కేసులో విడుదల కానున్న అంబటిని ఈ కేసులో కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. -
అంబటి రాంబాబు బెయిల్పై లాయర్లు రియాక్షన్
-
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన ఉషశ్రీ చరణ్
-
రాజమండ్రి జైల్ నుంచి రేపే అంబటి విడుదల
-
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. నవంబర్ 12న వైఎస్సార్సీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టింది. ఆ ర్యాలీ నిర్వహించే సమయంలో అంబటి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తాజా, కోర్టు తీర్పుతో ఈరోజే అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబు బెయిల్కు సంబంధించి పూచికత్తుల వ్యవహారం ఇప్పటికే పూర్తయ్యింది. అంబటి తరఫు న్యాయవాదులు పదివేల రూపాయలు చొప్పున రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించారు. రిలీజింగ్ ఆర్డర్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయల్దేరారు. -
అంబటి కుటుంబానికి విజయవాడ YSRCP నేతలు పరామర్శ
-
జైల్లో అంబటిని కలిసిన తరువాత ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
-
ఇటువంటివి నేనెప్పుడూ చూడలేదు... ఇది మీకు చాలా ప్రమాదం.. అరెస్ట్ పై ఉండవల్లి
-
కక్ష సాధింపే.. క్లియర్గా తెలిసిపోయింది: ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మంగళవారం కలిశారు. రాజమండ్రి జైలులో అంబటితో ఉండవల్లి అరణ్కుమార్, మాజీ మంత్రి కన్నబాబు ములాఖత్ అయ్యారు.అనంతరం ఉండవల్లి.. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కొత్త పద్దతి నడుస్తుందన్నారు. ‘‘ధ్వంసం చేసిన వారికి స్టేషన్ బెయిల్.. విమర్శించిన వారికి జైలు. పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన వారికి బెయిల్ దారుణం. జైల్లో వేయడం, 30 చోట్ల నుంచి కంప్లైట్ల పెట్టడం దారుణం. చంద్రబాబు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కక్ష సాధింపు అనేది క్లియర్ గా తెలిసిపోయింది’’ అని ఉండవల్లి పేర్కొన్నారు.కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో బెయిల్ రాగా, మరో కేసులో ఈ నెల 22వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబును పోలీసులు సోమవారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరు పరిచారు. ఒక కేసులో బెయిల్ లభించినా.. మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి రాత్రి 7.30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు.అంబటిపై ఆగని కుట్రలునల్లపాడు పోలీసు స్టేషన్లో కేసుకు సంబంధించి అంబటి రాంబాబుకు బెయిల్ ఇచ్చిన స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్తోపాటు సౌకర్యాలు కోరుతూ రాంబాబు వేసిన ఎమినిటీస్ పిటిషన్లను తిరస్కరించారు. నల్లపాడు కేసులో బెయిల్ వస్తుందన్న ఉద్దేశంతో గతంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనపై పట్టాభిపురం పోలీసు స్టేషన్లో పెట్టిన కేసులో పీటీ వారెంట్పై సోమవారం రాజమండ్రి నుంచి గుంటూరు తీసుకువచ్చి ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది వక్కాల సూరిబాబు, మాజీ ఎంపీపీ మాతంగి శ్రీకాంత్, సహచర న్యాయవాదులు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వాదనలు వినిపించారు.బెయిలబుల్ సెక్షన్లతో ఉన్న కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ బద్ధమైన హక్కు అని, అలాంటి సందర్భాల్లో అరెస్ట్, రిమాండ్ అవసరంపై కోర్టు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే.. ఈ కేసులో ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా.. అంబటికి ఎట్టిపరిస్థితుల్లో బెయిల్ రాకుండా, పాత కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. -
KSR Show: రాజకీయ నిరసనలపై కూడా పోలీసులు దృష్టి పెట్టాలట..!
-
ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ–సిట్ చార్జిషిట్ దాఖలు చేసినా.. అధికార పార్టీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో చేసిన వ్యాఖ్యలకు గాను తనపై రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసులను కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు సోమవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు.ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదన్నారు. దీనిపై పోలీసులకు తగిన సూచనలు చేస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ నాటికి స్పష్టత తీసుకోవాలని పీపీకి న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 33 కేసుల్లో చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసి ఆయన వివరణ తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేశారు. అంబటి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 35 కేసులు ఒకే అంశానికి సంబంధించినవని, దీనిపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం నడుచుకోండి గత ఏడాది జూన్లో వెన్నుపోటు దినం పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించినందుకు అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని గుంటూరు, పట్టాభిపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆయనకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలంది. అంబటిపై నమోదైన కేసులు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, ఫిర్యాదుదారులకు నోటీసులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
చంద్రబాబుకు బిగ్ షాక్ అంబటికి బెయిల్
-
పుల్ హ్యాపీ.. అంబటి బెయిల్ పై పొన్నవోలు రియాక్షన్
-
ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబుకు ఊరట
-
అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
-
అంబటిపై నాగబాబు వ్యాఖ్యలు.. కొండా రాజీవ్ అదిరిపోయే కౌంటర్
-
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అరెస్టు చేసిన కేసులో బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు. పోలీసులు కస్టడీ పిటిషన్ను తిరస్కరించింది. పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులుగతేడాది నవంబర్ నెలలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ‘ప్రజా ఉద్యమం’ పేరుతో ర్యాలీ నిర్వహించింది. అయితే, గుంటూరులో ఈ ర్యాలీ నిర్వహించిన అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో పోలీసులు అంబటిని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న అరెస్టు చేసిన కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో రిమాండ్లో కొనసాగనున్నారు. ఈ కేసులోనూ బెయిల్ వస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. 44 కేసులు కాగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన ఎనిమిది రోజుల్లో అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 44 కేసులు నమోదయ్యాయి. -
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట
సాక్షి,విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంబటి దాఖలు పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో కావాలని ఏపీ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
గుంటూరు కోర్టులో అంబటి రాంబాబు విజువల్స్
-
అంబటికి 22 వరకూ రిమాండ్ పొడగింపు
సాక్షి గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు ఈ నెల 22 వరకూ రిమాండ్ పొడిగించింది. గతేడాది నవంబర్ 12న పెట్టిన కేసులో ఆయనను కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ర్యాలీ చేయగా దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దానిపై పీటీవారెంట్ జారీ చేసి కోర్టులో హాజరు పరిచారు.కాగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన ఎనిమిది రోజుల్లో అంబటిరాంబాబుపై 36 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 44 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అంబటిపై పీటీ వారెంట్లు జారీ చేసి రాష్ట్రమంతా తిప్పాలని సర్కార్ కుట్ర చేస్తోంది. ఇందులో భాగంగానే గతంలో నమోదైన కేసులో ఆయనకు పీటీ వారెంట్ జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనను జైలుకు తరలించనున్నారు. -
గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు
-
Advocate: PT వారెంట్ పెట్టి హింసిస్తున్నారు..? అంబటి ఆరోగ్యం ఎలా ఉందంటే..
-
అంబటి రాంబాబుపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు
-
అంబటి రాంబాబుపై PT వారెంట్.. గుంటూరుకు తరలింపు
-
అంబటిపై కక్ష సాధింపు.. 52 కేసులు, పిటీ వారెంట్లు..
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అంబటిపై నమోదు చేసిన మరో అక్రమ కేసులో భాగంగా పట్టాభిపురం పోలీసులు.. ఆయనను నేడు గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి నిరసిస్తూ అంబటి రాంబాబు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీని అడ్డుకుని అంబటి రాంబాబుపై దౌర్జన్యానికి దిగారు. దీంతో, తమ విధులకు అంబటి ఆటంకం కలిగించారని రాంబాబుపై అక్రమంగా కేసు నమోదు చేశారు. రాంబాబుపై నమోదైన కేసులో పిటీ వారెంట్ ద్వారా పట్టాభిపురం పోలీసులు నేడు గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో పట్టాభిపురం పోలీసులు రాజమండ్రి జైలు నుంచి అంబటిని తీసుకొని గుంటూరు బయలుదేరారు.ఇక, ఇప్పటికే రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు, బాపట్లతో సహ రాష్ట్రంలో పలుచోట్ల అంబటిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 52 కేసులు నమోదయ్యాయి. మరో మూడు పిటీ వారంట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటికి ప్రత్యేక సదుపాయాలు సైతం ప్రభుత్వం కల్పించకపోవడం గమనార్హం. అంబటితో పాటు అదే బ్యారక్లో మరో ముగ్గురు ఖైదీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబటి భద్రతపై అడ్వకేట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, అంబటి రాంబాబు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయనపై నమోదైన మరికొన్ని కేసుల్లో పిటీ వారెంట్లు వేయటానికి పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు కావాలనే అంబటిని మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారని మండిపడుతున్నారు. ప్లాన్ ప్రకారమే కక్షగట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు నడుస్తున్నారని ఆరోపించారు. -
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన కాకాణి, పూజిత
-
ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. అరెస్ట్కు భయపడం: కాకాణి
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వం.. నాటి బ్రిటిష్ పాలనను మించిపోయింది.. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. అంబటి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆయన కుటుంబాలకు ధైర్యం చెప్పటానికి వచ్చాం. కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపై అంబటి ప్రశ్నించారు. దీంతో దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేశారు.సీఎం చంద్రబాబు లడ్డూ విషయంలో అబద్ధాలు ఆడారు. కూటమి పాలన అధ్వాన్నంగా ఉంది. సమాధానం చెప్పలేక చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అన్న విషయం కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. పైశాచిక ఆనందం పొందటం తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు. చంద్రబాబు తనని అరెస్టు చేసినందుకు మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు. రాంబాబు తుపాకి తూటాలకు కూడా భయపడరు’ అని అన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాకాణి పూజిత మాట్లాడుతూ..‘మౌనిక.. తండ్రి బాధ్యతను తీసుకొంది. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంది. అంబటి కుటుంబ సభ్యులను ఈ పరిస్థితుల్లో కలుస్తామనుకోలేదు. రాజకీయాలు దిగజారిపోయాయి. వైఎస్ జగన్కు సైన్యంలా నిలబడే భావన కూటమి నేతలే కల్పిస్తున్నారు. ప్రాణాలర్పించైనా జగన్ను గెలిపించుకుంటాం. కూటమి పాలనను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మహిళలంటే గౌరవం లేదు. ప్రభుత్వం చేసే తాటాకు బెదిరింపులకు భయపడం’ అని హెచ్చరించారు. -
పొగరు తగ్గించుకో... మౌనిక వార్నింగ్
-
కాపులు తమ చెప్పు కింద ఉండాలన్న భావనతో టీడీపీ వ్యవహరిస్తోంది
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): టీడీపీ తొలినుంచీ కాపులు తమ చెప్పు కింద ఉండాలన్న భావనతోనే వ్యవహరిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. 1988లో వంగవీటి రంగా హత్య మొదలుకుని.. ఇటీవల ముద్రగడ పద్మనాభంపై దాడి వరకు కాపులపై టీడీపీ దాష్టికాలు చేస్తూనే ఉందని చెప్పారు. తాజాగా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి కూడా టీడీపీ కాపు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. శనివారం గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్సార్సీపీ నేతలు, ఉత్తరాంధ్ర కాపు నేతలు వచ్చారు. ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ నేతలే ఘటనలన్నిటికీ కారణం ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అంబటి నివాసం, ఆయన కార్యాలయం, కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడి చేయటం సిగ్గుచేటన్నారు. ఘర్షణకు ప్రేరేపించింది, తిట్టింది, కార్యాలయం తగలబెట్టింది, అంబటిపై హత్యాయత్నం చేసింది టీడీపీ నేతలేనని స్పష్టం చేశారు. చివరకు అంబటిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కుట్రపన్ని రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారని, కొవ్వు లేదని నివేదికలు రావటంతో తమ ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని ఫ్లెక్సీలు వేయించారని ఆరోపించారు.ఆ ఫ్లెక్సీలు తొలగించాలని అంబటి పిలుపునిచ్చారని, దీంతో ఉద్దేశపూర్వకంగా ఆయనపై దాడికి తెగబడ్డారన్నారు. కుటుంబ సభ్యులను తిడుతుంటే అంబటి మాట తూలారని, దానికి పొరపాటు జరిగిందని కూడా చెప్పారని గుర్తు చేశారు. అంబటిపై 17 కేసులు పెట్టి అక్రమ అరెస్ట్కు తెరదీశారని, తాజాగా ఆయనపై మరో 16 కేసులు పెట్టినట్టు తెలుస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. అంబటి టైగర్ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని.. కచ్చితంగా పులి బయటకు వస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించదన్నారు. పరామర్శించేందుకు వచ్చే వారినీ అడ్డుకుంటున్నారు అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ.. తన తండ్రిపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ తమకు మద్దతివ్వటానికి వస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. పరామర్శకు వస్తున్న వారి ఆస్తులు అయిపోవాల్సిందేనని ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే మాధవి తిరిగి దాడి చేస్తానంటున్నారని, ఆమెను అధికార అహంకారం ఆవరించిందన్నారు. ‘మీరు మొదటిసారి గెలిచారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం ఎవరి వల్లా కాదు. క్షమాపణ అడగడానికి కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో ఇళ్లకు వస్తారా? ఎమ్మెల్యే గల్లా మాధవి సమాధానం చెప్పాలి.కేంద్ర మంత్రి పెమ్మసాని రాజకీయాలు ప్రక్షాళన చేస్తామన్నారు. చివరకు అయనే మరింత కలుషితం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్కళ్యాణ్ను ఇటువంటి ఘటనపై స్పందించాలని అడగటం తప్పా? కేవలం దాడి విషయంలో ప్రశ్నించి, భద్రత కల్పించాలని అడిగాను’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, పార్టీ నేతలు చింతలపూడి వెంకట్రామయ్య, కంది రాజీవ్గాం«దీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నింస్తే గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. అంబటిపై దాడిని చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ చేతకాని విధానాలను ప్రశ్నింస్తే ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ దుర్మార్గంగా వ్యవహరించారని, అందుకు నిలువెత్తు నిదర్శనం అంబటిపై దాడేనని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా కాపులపై దాడి చేయటం పరిపాటిగా మారిందన్నారు. కాపులపై దాడి చేయడం టీడీపీ డీఎన్ఏలోనే ఉందని దుయ్యబట్టారు. ప్రణాళిక ప్రకారమే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ల నరేంద్ర కనుసన్నల్లోనే టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు లోకేశ్ ఆదేశాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నేతలంతా అంబటి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
పవన్ కల్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చారా? అంబటి మౌనిక అదిరిపోయే రిప్లై
-
గల్లా మాధవి, పెమ్మసానికి YSRCP కాపు నేతల స్ట్రాంగ్ వార్నింగ్
-
చంపడానికి వచ్చినా భయపడలేదు అందుకే.. అంబటి కాపు టైగర్..
-
మనిషి చనిపోయినా కూడా వదలట్లే.. వీళ్ళు పోలీసులా.. రాక్షసులా..
-
ఫస్ట్ టైం ఎమ్మెల్యే నువ్వు అహంకారం తగ్గించుకో.. లేదంటే..
-
అధికార అహంకారమా.. గల్లా మాధవిపై అంబటి మౌనిక ఆగ్రహం
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపై కర్రలు, రాడ్లతో దాడి చేయమని మాధవికి ఏ రాజ్యాంగం చెప్పింది అని ప్రశ్నించారు. గల్లా మాధవి అధికార అహంకారంతో మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి బెదిరింపులకు దిగుతున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి మా ఇంటిపై దాడి చేశారు. ఇళ్లపై కర్రలు, రాడ్లతో దాడి చేయమని మాధవికి ఏ రాజ్యాంగం చెప్పింది. మీరు మొదటి సారి గెలిచారు. క్షమాపణ అడగటానికి వచ్చాం అంటూనే దాడి చేశామంటున్నారు. క్షమాపణ అడగడానికి వచ్చినవాళ్లు కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో వస్తారా? ఎమ్మెల్యే గల్లా మాధవి సమాధానం చెప్పాలి. మీరు మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారు. దాడి చేయమనే మీరు మీ పిల్లలకి మెసేజ్ ఇస్తున్నారా?.కేంద్ర మంత్రి పెమ్మసాని రాజకీయాలు ప్రక్షాళన చేస్తామన్నారు. ఆయనే మరింత కలుషితం చేశారు. రాళ్లు విసురుతూ, కత్తులు దూస్తున్నా.. గునపాలతో గోడలు పొడుస్తున్నా అంబటి ధైర్యంగా కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన మీరు ఓట్ల కోసం ఆయన దగ్గరకు రాలేదా?. వైఎస్ జగన్ మా ఇంటికి వచ్చినప్పుడు బంగారు, వెండి ఆభరణాలు పోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులకు చేతనైంది.. తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే. అంబటి రాంబాబుపై తెలుగుదేశం గుండాలు చేసిన హత్యాయత్నానికి వ్యతిరేకంగా మద్దతివ్వటానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడాలని నేను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కోరాను అని వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబుకు వణుకు పుట్టేలా 300 కార్లతో అంబటి ఇంటికి కాపు నేతలు
-
చలో గుంటూరు కార్యక్రమం.. అంబటి ఇంటికి కాపు నేతలు
విశాఖ: వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కాపు నేతలు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు,. ఉమ్మడి విశాఖ జిల్లా వైయస్సార్సీపి కాపు నేతల ఆధ్వర్యంలో నేడు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు. విశాఖ నుంచి భారీ ర్యాలీగా కార్లతో బయలుదేరిన వైఎస్ఆర్సిపి కాపు నాయకులు..అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలపనున్నారు వైఎస్సార్సీపీ కాపు నేతలు. దీనిలో భాగంగా అక్రమ అరెస్టులతో కాపులను చంద్రబాబు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాపు నేతలు. కాపు ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడుతున్నారు. తిరుపతి లడ్డు, గీతం భూములు కబ్జా వంటి అంశాన్ని దృష్టి మళ్లించేందుకు కాపులపై దాడులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చలో గుంటూరు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘ మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా నేడు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టామన్నారు. చలో గుంటూరు కార్యక్రమం ద్వారా కాపు నేతలు.. అంబటి రాంబాబు కుటుంబానికి సంఘీభావం తెలపనున్నట్లు వెల్లడించారు. ‘ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహారిస్తుంది. పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా మా స్పందన ఇలాగే ఉంటుంది. అంబటి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్తాం’ అని స్పష్టం చేశారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ ప్రశ్నించే కాపులను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు.. అంబటిపై అక్రమ కేసులు పెట్టారు. మేమంతా అండగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. -
అంబటి కుటుంబానికి రోజా, భూమన పరామర్శ
-
పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి.. క్షమాపణ చెప్పాలి
సీబీఐ సిట్ చార్జ్షీట్ వేసిన తర్వాత అయినా చంద్రబాబు చేయాల్సిన పని ఏంటంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కనీసం మానవత్వం ఉన్న మనిషైతే చంద్రబాబు అలాంటి పని ఎందుకు చేయడం లేదు?సీబీఐ సిట్ చార్జ్షీట్లో పొందుపరిచిన వాస్తవాలను చూపించి ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే.. ఆయన అసహనంతో మా నాయకుల మీద దాడులు చేయించే నీచ స్థాయికి దిగజారిపోయాడు. అందులో భాగంగానే వరుసపెట్టి మా నాయకులు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి మీద దాడి చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశారు.అసలు చంద్రబాబుకు చిప్ సరిగ్గా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా? తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా.. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు ఎలాంటి జంతు కొవ్వు లేదని ధ్రువీకరించినా.. చంద్రబాబు, పవన్కల్యాణ్,లోకేశ్ తమ తీరు అస్సలు మార్చుకోవడం లేదు.తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు వక్రబుద్ధి, అబద్ధాలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ను ఏర్పాటు చేసింది. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఎవరూ తప్పుపట్టలేరు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి పెద్దది కాదు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థం కోసం వన్మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఎలాంటి ప్రామాణికత ఉండదు. తనకు అనుకూలంగా రిపోర్టు రాకపోవడంతో మళ్లీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసుకుని, తనకు అనుకూలమైన రిపోర్టు కోసం కుట్ర చేస్తున్నాడు. - వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సీబీఐ చార్జ్షీట్లో తేల్చి చెప్పింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలవలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు అన్యాయంగా ఇంకా దుష్ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఎవరైనా తిరుమల ప్రసాదం ఇస్తే కళ్లకు అద్దుకుని తినేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రసాదం పవిత్రతను చంద్రబాబు దిగజార్చాడు. ఒక అబద్ధాన్ని సృష్టించి రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబే. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ల నివేదికలు స్పష్టం చేసినా చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం దారుణం..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబువి అబద్ధాలని సీబీఐ చార్జ్షీట్ తేల్చేసిందని వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటిని శుక్రవారం వైఎస్ జగన్ పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. కక్షగట్టి దాడులుచంద్రబాబు అబద్ధాలను ప్రశ్నిస్తున్నందుకు చిప్ పని చేయక పోవడం వల్లే కక్షగట్టి దాడులకు దిగుతున్నారు. చేసిన తప్పు ఒప్పుకుని, లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు వన్మ్యాన్ కమిషన్ అంటూ అనుకూల నివేదిక కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆ కమిషన్కు ఏ మాత్రం విలువ ఉండదు. టీడీపీ గూండాలు గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో ఐదు కార్లు «ధ్వంసం చేయడంతోపాటు ఇల్లు, ఆఫీసులో విధ్వంసం సృష్టించి ఆఫీస్కు నిప్పుపెట్టారు. ఆ మర్నాడు ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జోగి రమేష్ ఇంటిపై ఏకంగా యాసిడ్ బాటిళ్లతో, పెట్రోల్ బాంబులతో వి«ధ్వంసం సాగించారు. అక్కడ అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ తండ్రిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల సమక్షంలోనే రెండు చోట్లా దాడులు జరిగాయి. టీడీపీ గూండాలకు వారు అండగా ఉంటున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు రాష్ట్రంలో జంగిల్రాజ్ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు సర్కారు చర్యలు ఉన్నాయి. తప్పులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోం. సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. మరో మూడేళ్లలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇప్పుడు తప్పులు చేస్తున్న అందరినీ బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదు. నాగరిక సమాజం తలదించుకునేలా.. రాష్ట్రంలో జంగిల్రాజ్ పరిపాలన సాగుతోంది. నాగరిక ప్రపంచం తలవంచుకునేలా చంద్రబాబునాయుడు చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో 5 కార్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. అద్దాలను పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లను దుర్భాషలాడారు. ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులోకి చొరబడి విధ్వంసానికి దిగి ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటాన్ని అంతా చూశాం. అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండ జరిగింది. ఆ మర్నాడే ఇక్కడ కూడా సాయంత్రం అదే పరంపర కొనసాగింది. జోగి రమేష్ ఇంటిపైనా దారుణంగా దాడి చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని సీబీఐ తేల్చింది చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించాడని సాక్షాత్తూ సీబీఐయే తేటతెల్లం చేస్తూ చార్జ్షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదని సీబీఐ స్పష్టం చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు దు్రష్పచారం చేశాడు. ప్రతిష్టాత్మక ల్యాబ్లూ అదే నిర్ధారించాయి తిరుమలలో వాడిన నెయ్యిపై చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ల్యాబ్లు నిర్ధారించాయి. ఆ మేరకు నివేదికలు ఇచ్చాయి. అవి రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వారు పరీక్షించిన నెయ్యి శాంపిల్స్ అన్నీ కూడా చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన మనిషి టీటీడీ ఈవోగా ఉండగా సేకరించినవే. సీబీఐ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీకి ఆ శాంపిల్స్ పంపారు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, గొడ్డు కొవ్వు లేదని, పందికొవ్వూ లేదని, ఎలాంటి చేపనూనె కూడా కలవలేదని ఆ ల్యాబ్లు ధ్రువీకరించాయి. ఆ రిపోర్టులను సీబీఐ కూడా సరి్టఫై చేసింది. సీబీఐ సిట్ ఆ మేరకు చార్జ్షీట్ దాఖలు చేసింది. భూమన, వైవీకి సీబీఐ క్లీన్చిట్.. ఆ చార్జ్షీట్లో సీబీఐ మరో విషయం కూడా చెప్పింది... గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు వాళ్లు ఎలాంటి తప్పూ చేయలేదని, అన్యాయమైన పనులు చేయలేదని స్పష్టం చేసింది. అందుకే వారి పేర్లు చార్జ్షీట్లో పెట్టలేదు. వారిలో ఎవరినీ అరెస్టు చేయలేదు. అంటే సీబీఐ వారికి క్లీన్చిట్ కూడా ఇచ్చింది. ఇదొక్కటే కాదు.. ఆ చార్జ్షీట్లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. (పేజీ నెం 62 ప్రస్తావించారు) చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2024 జూలై 25న నెయ్యిలో నాణ్యత లేదని టీటీడీ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది (ఆ రిపోర్టు చదివి వినిపించారు. చార్జ్షీట్లోని పేజీ నెం 64, 44 అంశాలను చదివి వినిపించారు). కానీ ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దొడ్డిదారిన వేరేవాళ్ల పేరుతో తిరిగి వస్తే వాటిని టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ వెల్లడించింది. అలా చంద్రబాబు ప్రభుత్వం మీద, వాళ్లు చేసిన తప్పుల మీద, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్షీట్లో రాశారు. పాపం చేసింది ఎవరు బాబూ..? ఏకంగా సీబీఐనే చంద్రబాబు ప్రభుత్వం మీద ఈ మాదిరిగా చార్జిషీట్లో రాసిన తర్వాత అసలు పాపం చేసిన వాళ్లు ఎవరు? అని చంద్రబాబును, ఆయన కుమారుడిని, కూటమిలో ఉన్న పవన్కల్యాణ్ను ప్రశ్నిస్తున్నా. టీటీడీ నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు చెప్పారు..? సీబీఐ చెప్పిందా..? ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయా..? చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్తో పాటు రోజూ వారి పల్లకి మోస్తున్న ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) ప్రచారం చేయడం మినహా ఎవరైనా చెప్పారా? ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలి.. అనిల్ సింఘాల్ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా నియమించారు. మా ప్రభుత్వం ఆయన్ను కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన్నే తెచ్చారు. శ్యామలరావును టీటీడీ ప్రక్షాళన కోసం తెచ్చానని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక చెప్పారు. ప్రక్షాళనకు ముందే ఆయన్ను ఎందుకు టీటీడీ ఈవోగా తొలగించారు? శ్యామలరావు ఈవోగా ఉన్నప్పుడు కొన్ని నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. అవే ట్యాంకర్లు.. మళ్లీ టీటీడీకి మరో డెయిరీ పేరుతో తిరిగి వచ్చినట్లు సీబీఐ సిట్ ధ్రువీకరించింది. మరి పాపం చేసింది ఎవరు చంద్రబాబూ? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. పూజలు చేయడం తప్పా..? మానవత్వం లేని చంద్రబాబుని ప్రశ్నిస్తూ.. ఆయనకు దేవుడు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థిస్తూ మా నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. ఆయనతోపాటు లోకేశ్, పవన్కల్యాణ్తో సహా ఇతర నాయకులకు బుద్ధి, జ్ఞానం కలగాలని, వారి చిప్ రిపేర్ చేయాలని మా నాయకులంతా గుళ్లల్లో పూజలు చేశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేస్తూ శ్రీవారి ప్రతిష్టను మంట కలిపేస్తుంటే మావాళ్లు గుళ్లలో పూజలు చేయడం తప్పా? ఇది హత్యాయత్నం కాదా..? లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధమని అంత స్పష్టంగా, అన్ని విధాలుగా తేలిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి ఫ్లెక్సీలు కట్టి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా దు్రష్పచారం చేయడం ధర్మమేనా? ఆ ఫ్లెక్సీల్లో అన్యాయమైన మాటలు రాసి దు్రష్పచారం చేయడం న్యాయమేనా? చంద్రబాబు, లోకేశ్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రశ్నిస్తూ మా నాయకుడు జోగి రమేష్.. మీ చిప్ రిపేర్ చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి ఇంత అన్యాయమైన పని చేయడం ధర్మమేనా? సలహా ఇవ్వడం మినహా జోగి రమేష్ ఏమీ చేయలేదు. దానికే చంద్రబాబుకి అసహనం ఏస్థాయిలో వచ్చింది అంటే.. ఏకంగా యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయించాడు. ఆ యాసిడ్ పడిన ప్రాంతంలో బండలు తీవ్రంగా కాలిపోయాయి. గోడల నిండా యాసిడ్ మరకలు కనిపిస్తున్నాయి. యాసిడ్ పడి డోర్లు కాలిపోయాయి. ఆ పక్కనే ఉన్న స్విచ్ బోర్డుల మీద పడి షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ఘోరం జరిగి ఉండేది. ఇంట్లో ఉన్న కర్టెన్లు, ఉడెన్ ఫర్నీచర్లు కాలిపోతే పరిస్థితి తీవ్రరూపం దాల్చేది. ఇంట్లో 80 ఏళ్ల వయసున్న జోగి రమేష్ నాన్న నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా? బీసీ నాయకుడిగా జోగి రమేష్ ఎదుగుతుంటే, ప్రభుత్వ తప్పులపై ఆయన వాయిస్ బలంగా వినిపిస్తుంటే.. ఆ గొంతు నొక్కే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో దాడులు చేయిస్తున్నాడు. పోలీసులతో కలిసి టీడీపీ కుట్ర..జోగి రమేష్ ఇంటి మీద సాయంత్రం ఐదు గంటలకు దాడి జరిగితే.. ఆ దాడికి సంబంధించి పోలీసులు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కుట్రలు చేశారనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం (పోలీసులతో టీడీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న ఫొటోను చూపారు). ఇదే సర్కిల్లో డీసీపీ రామకృష్ణ, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్తో టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు దాడులకు సంబంధించి వ్యూహరచన చేశాడు. జోగి రమేష్ను హత్య చేసి, ఇంటి మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే కుట్రలకు ఇక్కడే పోలీసులతో టీడీపీ నాయకుడు మంతనాలు జరిపాడని క్లియర్గా తెలిసిపోతోంది. హత్యా యత్నం ఎలా చేయాలి? ఆ దాడికి పోలీసులు ఎలా సహకరించాలో పథక రచన చేశారు. ఏకంగా పోలీసులే టీడీపీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంతనాలు జరిపారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు ఏకంగా పోలీసులనే వెంటబెట్టుకుని కలసికట్టుగా జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు.ఈ పాపాలు ఎవరివి బాబూ?» నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి.. మళ్లీ అదే నెయ్యి ట్యాంకర్లు మరో పేరుతో వస్తే ఆమోదించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కదా.» అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ చెప్పింది. » చంద్రబాబు ప్రభుత్వం తప్పులు, వాళ్లు చేసిన అన్యాయాన్ని చార్జ్షీట్లో సీబీఐ రాసింది » టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్ను తీసుకొచ్చింది ఎవరు? » ప్రక్షాళన కోసం తెచ్చామన్న శ్యామలరావును తప్పించింది ఎవరు?ఇవిగో పచ్చి నిజాలు... సాక్ష్యాలుటీడీపీ నాయకుడు ఫతావుల్లా ఏకంగా యాసిడ్ బాటిల్, పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు. దాడికి ముందు వాటితో ఉన్న ఫొటోల్లో క్లియర్గా చూడవచ్చు. పోలీసుల సమక్షంలోనే జోగి ఇంటిపైకి పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించాడు. ఫతావుల్లాతోపాటు ఆశా అనే టీడీపీ కార్యకర్త కూడా జోగి రమేష్ ఇంటి మీద పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి చేసింది. ఆశా కుమార్తె పెళ్లికి చంద్రబాబు కూడా హాజరయ్యాడు. (చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రితో వారు దిగిన ఫొటోలు, ఆశా కుమార్తె పెళ్లికి హాజరైన చంద్రబాబు ఫొటోలు చూపించారు. పోలీసులతోనే కలసి వచ్చి వారి సమక్షంలోనే టీడీపీ నాయకులు దాడికి దిగిన వీడియోలు కూడా చూపారు). టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు, డీసీపీ, సీఐ మంతనాలు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులతో కలిసి టీడీపీ శ్రేణులు వస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. (టీడీపీ నాయకుడు బాటిల్ ఎగరేస్తూ పోలీసులతో కలిసి జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్ను మీడియాకు చూపారు). మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక జంగిల్ రాజ్లో ఉన్నామో చెప్పేందుకు ఈ వీడియోలే సాక్ష్యం. కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యేందుకు జోగి రమేష్ వెళ్తుండగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై దాడి జరిగినట్లు ఆయనకు సమాచారం వచ్చింది. ఈ విషయంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసేందుకు జోగి రమేష్ ఫోన్ చేసినా స్పందించలేదు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి సమయంలోనూ ఇలాగే జరిగింది. అన్ని ఆధారాలున్నాయ్.. ఎవరినీ వదిలిపెట్టం.. దాడులు, విధ్వంసాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి గడప తొక్కుతాం. న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సాగుతున్న జంగిల్రాజ్ పాలనను దేశానికి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది మూడేళ్లే. ఆ తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇవాళ మా పార్టీ నాయకుల ఇళ్లపై గూండాగిరీ చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు.బీసీలంటే చంద్రబాబుకు చులకన.. తంబళ్లపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. కమీషన్ల పంపకాల్లో తేడా రావడంతో ఆ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో జయచంద్రారెడ్డిని అరెస్టు చేయాల్సింది పోయి సంబంధం లేని జోగి రమేష్ను కేసులో చేర్చారు. చంద్రబాబు రాజ్యంలో జోగి రమేష్ లాంటి వ్యక్తి నకిలీ లిక్కర్ తయారు చేయగలడా? ఆ లిక్కర్ను బెల్ట్ షాపుల్లోకి సరఫరా చేయగలరా? జోగి రమేష్ పై చంద్రబాబు ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. చేయని నేరానికి 83 రోజులు జైలులో పెట్టారు. ఆయన కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నాడని చిన్న పిల్లాడిపై ఏడు కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్యపై పోలీసులే దౌర్జన్యం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న చులకన భావానికి జోగి రమేష్పై నమోదైన కేసులే నిదర్శనం. -
ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు
ఏపీ విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాభిపురం, నగరం పాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వాటిని క్వాష్ (కొట్టివేయాలని) చేయాలని కోరారు. ఇప్పటికే నల్లపాడు పీఎస్ కేసు క్వాష్ ఈ నెల 11కి వాయిదా పడింది. మంగళగిరిలో నమోదైన కేసులో 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో అవ్వాలని మంగళగిరి పోలీసులకు ఇవాళ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. అంబటిపై పిటి వారెంట్ కోసం మంగళగిరి కోర్టులో మంగళగిరి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరో ఐదు కేసుల్లో క్వాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
బాబూ.. లడ్డూపై ప్రశ్నిస్తే కోపమెందుకు?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపులంటే కక్ష అని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. తిరుమలపై రాజకీయం చేస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కాపులను టార్గెట్ చేసింది. కాపులంటేనే చంద్రబాబు కక్ష సాధింపు. వంగవీటి రంగాను హత్య చేశారు. ముద్రగడను అనేక రకాలుగా వేధించారు. అంబటి మీద దాడి చేసి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. రేపు ఉదయం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నాం. దాడులు చేసిన వారిని వదిలేశారు. అంబటి రాంబాబుపై తప్పుడు కేసులు వ్యవహారంలో న్యాయ పరంగా పోరాటం చేస్తాము.మేము చేసేది సంఘీభావ యాత్ర మాత్రమే.. రాజకీయ యాత్ర కాదు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ నివేదిక జంతు కొవ్వు కలవలేదని చెప్పిన తర్వాత కూడా మరొక కమిటీ ఎందుకు?. టీటీడీ లడ్డూలో జంతు కొవ్వు ఉందని చెప్పించడం కోసం చంద్రబాబు కమిటీ వేశారా?. వైఎస్సార్సీపీ మీద నెపం నెట్టడం కోసం మరొక కమిటీ వేస్తున్నారా. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు లేదని వచ్చిన నివేదికపై మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది. గతంలో తాను నాస్తికుడుని అని ప్రకటించుకున్న నాగేంద్రబాబు నేడు సనాతన ధర్మం కోసం ఎలా మాట్లాడుతున్నారు. నాగబాబు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో ఉంది. కల్తీ లడ్డుపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది’ అని ఎద్దేవా చేశారు.కరణం ధర్మ శ్రీ మాట్లాడుతూ..‘కాపులను కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. తప్పుడు కేసులు పెడుతోంది. అంబటి రాంబాబు కుటుంబానికి కాపులు అందరూ అండగా ఉంటారు. రేపు అంబటి రాంబాబు కుటుంబాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు అందరూ పరామర్శిస్తారు. రాంబాబుపై అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. అంబటిని చంపేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నం చేశారు. కాపు అనే వారికి అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి,విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అంబటి రాంబాబుపై కేసును క్వాష్ చేయాలని రిమాండ్ చట్ట విరుద్ధమని అంబటి న్యాయవాది కోర్టులో వాదించారు.పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదిపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది. అంబటి రాంబాబు అరెస్టుఅంతకుముందు అంబటి రాంబాబును పోలీసులు గుంటూరులోని తన నివాసం వద్ద అరెస్టు చేశారు. గత శనివారం రాత్రి గం. 10.30 ప్రాంతంలో అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆయనను నల్లపాడు పీఎస్కు తరలించారు. అంబటి రాంబాబు కేసును సమోటోగా తీసుకొని బీఎన్ఎస్ 126(2),132, 196(1), 352, 351(2),292 రెడ్విత్ 3(5),-BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైకోర్టులోఅంబటి సతీమణి హౌస్ మోషన్ పిటిషన్ అరెస్టుపై అంబటి సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్భందించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతి భద్రతల సమస్య ఉందని పిటిషన్లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరిన విషయం తెలిసిందే. -
అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు
-
మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్
-
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు. -
చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా?
మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కూడా ఇలాగే ఉంది. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో టీడీసీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేస్తూ... భౌతిక దాడులకు దిగుతూ రెడ్బుక్ అరాచకం సృష్టిస్తున్న పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు... వీటన్నింటికీ కారణం వైసీపీనేనని, వారి ట్రాప్లో పడవద్దని కేడర్కు చెబుతున్నారట. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని టెలికాన్ఫరెన్స్లో ఆయనగారు వక్కాణించిన మాటలను కొన్ని విశేషణాలు చేర్చి యథాతథంగా ప్రచురించుకుని తరించింది ఎల్లో మీడియా! ప్రజలు మాత్రం ఇదేం చోద్యమన్నట్టు నోళ్లెళ్లబెడుతున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడినే ఉదాహరణగా తీసుకుందాం. పక్కా రౌడీలు మాత్రమే అలాంటి విధ్వంసం సృష్టించగలరు. లకారాలతో ఈ దాష్టీకంలో పాల్గొన్న టీడీపీ మహిళ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావులు మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ కూడా కాలేదు. తెలుగుదేశం కార్యకర్తలు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రమంతటా అనుచితమైన ఫ్లెక్సీలు కట్టడంతోనే ఈ సమస్యంతా మొదలైంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేయడంతో చంద్రబాబు బృందం,ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతుల సాయంతో ఈ ఫ్లెక్సీల డ్రామాకు తెరలేపారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై నెపం నెట్టేస్తూ తప్పుడు ఆరోపణలతో కట్టిన ఈ ఫ్లెక్సీలను పోలీసులు సకాలంలో తీసివేసి ఉంటే పరిస్థితి చేయిజారేదీ కాదు. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించి.. ఆ ఫ్లెక్సీలను తామే తొలగిస్తామనడం అంబటి పాపమైంది. ఫ్లెక్సీ కట్టిన రోడ్డు ద్వారా గుడికి వెళ్లి వస్తూంటే... టీడీపీ కార్యకర్తలో లేక వారు తెచ్చుకున్న కిరాయి మూకో కర్రలతో అంబటి కారుపై దాడి చేశారు. కర్రలు, రాడ్లతో వీరు దాడులు చేస్తూంటే.. పోలీసులు వారికి రక్షణగా ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతుంది. ఇది హింస అన్న విషయం చంద్రబాబుకు తెలియదా!. అంతేకాదు. గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ అయిన టీడీపీ మహిళా నేత అకారణంగా అంబటిని బండబూతులు తిట్టడం ఏ రకమైన సభ్యతో వారికే తెలియాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఖండించాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆయన నిస్సహయత అనుకోవాలి. ఇంత జరిగిన తరువాత కదా అంబటి కూడా ఆవేశానికిలోనై ప్రతి దూషణకు దిగింది. అయితే ఆ వెంటనే ఆయన తన తప్పు తెలుసుకుని అలా మాట్లాడకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా... తాను ‘ఆ’ మాటలు అన్నది చంద్రబాబును ఉద్దేశించి కాదని కూడా స్పష్టం చేశారు. తనను అదే మాటలతో తిట్టిన వారినే తాను దూషించానని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ వారు వైసీపీ కార్యాలయం, అంబటి ఇంటిపై దాడులకు తెగబడ్డారు. విధ్వంసం సృష్టించారు. ఇళ్లపై దాడులు చేసి కార్లు, ఫర్నీచర్ పగులగొట్టిన టీడీపీ వాళ్లు అమాయకులు, శాంతికాముకులని చెప్పడం చంద్రబాబు మాటల్లోని ఉద్దేశమా? అంబటిపై జరిగింది హత్యా యత్నం! ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తామని స్వయంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్న కొన్ని గంటలకే అంబటి ఇంటిపై దాడి జరిగిన విషయం చంద్రబాబుకు తెలియదా? పైగా దీనికి నేతృత్వం వహించింది స్వయానా టీడీపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త. సిగ్గుచేటు. అంబటి దొరికి ఉంటే.. చంపేసేవారమని టీడీపీ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే ఎవరు ఎవరి ట్రాప్లోపడ్డట్టు? బాధితులు ఎవరు?.. అంబటి భార్య, కుమార్తెలు ఇంటిలో ఉంటే మహిళా ఎమ్మెల్యే ఆద్వర్యంలో దాడి చేస్తారా? వారిని భయభ్రాంతులను చేస్తారా? వారు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. స్ల్రీల పట్ల కూడా కనికరం లేకుండా చంద్రబాబు మాట్లాడడమా! దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంత పాడడమా! ఎంత అన్యాయం. రెచ్చగొట్టేది, హింసకు తెగబడేది, బూతులు తిట్టేది, విధ్వంసం చేసేది టీడీపీ వారే. ఆఖరికి విధ్వంసకారులకు పోలీసులు తోడుగా నిలబడటం, రక్షించాలని వేడుకున్నా ఓ పోలీసు ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి దర్పణంగా నిలిచింది. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి, చివరికి బాధితుడైన రాంబాబును అరెస్టు చేసి రిమాండ్కు పంపడం ఎంత దారుణం? ఇలాంటి ఘటనలే కదా దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువును పలుచన చేస్తున్నది? జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా ఈ ఘటనపై స్పందించిందంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత టర్మ్లోనూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులతో ఎలా వేధించిందీ, ఆయన కుటుంబ మహిళలను ఎంత దారుణంగా దూషించిందీ కంటతడి పెట్టుకుని ముద్రగడే ఆవేదనతో చెప్పుకోవల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇంకో కాపు నాయకుడు అంబటి రాంబాబు కుటుంబంపై టీడీపీ గూండాలు దాడి చేయడం సహజంగానే ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అంబటి కుమార్తె మౌనిక ఒక ప్రశ్న వేశారు. తన తండ్రి ఆ క్షణంలో ఆవేశానికిలోనై ఒక మాట అన్నా... వెంటనే సారీ చెప్పారని, చంద్రబాబు గతంలో వైసీపీ నేత జగన్ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ గూండాలు ఒక కాపు మహిళపై దాడికి తెగబడితే కనీసం ప్రశ్నించలేవా? అని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ను నిలదీశారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. టీడీపీ సోషల్ మీడియా వారు తన కుటుంబాన్ని దూషిస్తూ పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేసేందుకు అంబటి సాక్షాత్తూ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇక మరో మాజీమంత్రి జోగి రమేష్ మంత్రి లోకేశ్ను రాజకీయంగా విమర్శిస్తే ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పు పెట్టారు. ఇలా దాడి చేసినవారి వెంట పోలీసులు ఉన్నా కనీసం ఆపే యత్నం చేయలేదు. మొక్కుబడిగా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాజీమంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరీ బస్సులు దగ్దం చేయించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో బంద్లలో హింస ఎలా చేయాలో చంద్రబాబు చెప్పేవారని తెలిపిన విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి హింసలకు టీడీపీ తెగబడుతోందంటే అధికార అహంకారంతో కాక మరేమిటి? చంద్రబాబు, లోకేశ్ల ప్రోద్బలం కాదని ఎవరైనా అనుకుంటారా? ఇలా ఈ రెండేళ్లలో కనీసం ఇరవై మంది వైసీపీ నేతలపై దాడులు జరిగాయి. కార్యకర్తలపై ఎన్ని దాడులు చేసింది లెక్క చెప్పలేం. తిరిగి వీరిపైనే కేసులు పెట్టే ధోరణి ఇప్పడే చూస్తున్నాం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
-
బాబు జంగిల్ రాజ్ – భయానక పాలనతో 'ప్రజాస్వామ్యం ఖూనీ'!
కచ్చితంగా ప్రతిఘటన.. ఇలాంటివి మళ్లీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. దానికి కచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే రాష్ట్రవ్యాప్త బంద్కి కూడా పిలుపునిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. అన్నిరకాల పోరాటాలు చేస్తాం.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితనకు కావాల్సిన వారిని నియమించుకుని..చంద్రబాబు తనకు కావాల్సిన కొంతమందిని మాత్రమే సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలు, డీఐజీలుగా నియమించుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. బిహార్లో ఏం జరుగుతోందో తెలియదు కానీ రాష్ట్రంలో వీరందరితో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. దాదాపు 200 మంది సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. అలా రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది.అలా అనుకుంటే బాబు మూర్ఖుడే!వైఎస్సార్ సీపీపై ఈ రకంగా దాడులు చేస్తే కార్యకర్తలు భయపడతారని చంద్రబాబు అనుకుంటే ఆయన కన్నా మూర్ఖుడు ఇంకొకరు లేనట్టే. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతకన్నా నాలుగింతలు బలంగా పైకి లేస్తుందన్నట్లుగా.. మా కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తారు.- మీడియాతో వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు జంగిల్ రాజ్ను నడుపుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని దేశంలోనే ప్రఖ్యాత ల్యాబ్లు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ నిర్థారిస్తూ రిపోర్టులు ఇచ్చినా.. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచినా.. పాపభీతి లేకుండా, తప్పు ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి దీనిపై ప్రశ్నిస్తుంటే భౌతిక దాడులు, విధ్వంసం, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో టీడీపీ గూండాల చేతిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం వైఎస్ జగన్ పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులోని చుట్టుగుంట సెంటర్లో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం అబద్ధాలతో ఫ్లెక్సీలు..తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తమ తప్పులకు లెంపలు వేసుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారిని, ప్రజలను క్షమాపణ కోరాల్సిందిపోయి.. అంతా కూడబలుక్కుని మళ్లీ అవే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారాలతో, కులమతాలను రెచ్చగొట్టే విధంగా, అబద్ధాలతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇదే చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చి అబద్ధాలతో మోసగించారని మేం కూడా ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా? ఇది హత్యాయత్నం కాదా..? కుట్రలో భాగం కాదా?ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు జరిగాయి. పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఇంట్లో అద్దాలు, సామగ్రిని, ఆఫీసులో ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా లోపలికి వచ్చి ధ్వంసం చేశారు. ఇది హత్యాయత్నం కాదా..? పోలీసులు దగ్గరుండి మరీ ఈ కుట్రలో భాగం కాలేదా? పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ మాదిరిగా జరిగేదా? ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ఎంత మంది డీఎస్పీలు, సీఐలు లేరు..? మంగళగిరిలో పోలీసు బెటాలియన్ కూడా ఉంది. కనీసం ఫోన్ చేస్తే కూడా పోలీసులు స్పందించలేదు. మా పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ తదితరులు ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ, ఐజీ, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ ఆఫీసులకు ఫోన్లు చేస్తే స్పందించలేదు. మరి ఇది కుట్రలో భాగంగా కాదా? సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా విధ్వంసం చేశారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఇంతటితో ఆగకుండా ఆ రాత్రి రాంబాబు అన్నను అరెస్టు చేశారు. చంద్రబాబును తిట్టాడని కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుని తిట్టినందుకు రాంబాబును అరెస్టు చేసినప్పుడు.. మరి రాంబాబు ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించి, ఐదు కార్లను ధ్వంసం చేసి, అద్దాలన్నీ పగలగొట్టి, ఆఫీసుకు నిప్పంటించడం అంతా ఎమ్మెల్యే, ఆమె భర్త సమక్షంలో జరిగితే వారివీుద ఏం యాక్షన్ తీసుకున్నారు? సింపుల్గా స్టేషన్ బెయిలిచ్చి పంపేశారు. అంబటి మీడియా సమక్షంలో వివరణ ఇచ్చారు. జరిగిన దానికి క్షమాపణ కూడా కోరారు. అయినా ఆయన ఇంటిపై దాడి చేశారు. అసలు మీరు మనుషులేనా? ఇది జంగిల్రాజ్ కాదా? రాంబాబును అక్రమంగా అరెస్టు చేయడమే కాదు.. అర్థరాత్రి దాటిన తరువాత ఆయన్ను నల్లపాడు స్టేషన్లో ముగ్గురు సీఐలు దారుణంగా హింసించి వేధించారు. ఓ మాజీ మంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడం, టార్చర్ చేయడం ఏం న్యాయం? మరి ఇది జంగిల్రాజ్ కాకపోతే మరేమిటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్... విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని అనుమానం కలుగుతోంది. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు...!మరుసటి రోజు జోగి రమేష్ ఇంటిపై దాడి! అక్కడా మళ్లీ పోలీసుల సమక్షంలోనే. అక్కడ ఏకంగా పెట్రోల్ బాంబులు. బాటిళ్లలో పెట్రోల్ పోసి వాటిని ఇంట్లోకి విసిరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు విధ్వసం సృష్టించారు. దాదాపు 300–400 మంది పోగయ్యారు. వారంతా అక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసుల సమక్షంలో అదంతా జరుగుతున్నా చూస్తుండిపోయారు. పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటికి నిప్పంటించారు.పోలీసుల సమక్షంలోనే..అంతకు ముందు రోజు విడదల రజిని గుడిలో పూజ చేసుకుని వస్తుంటే ఆమెను అడ్డగించి తిట్టారు. దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి యత్నించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తిరిగి ఆమె మీదే కేసు పెట్టారు. అది కూడా ఏమని? ఆమె గుడికి వెళ్లి వారందరిపై అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారని! మాట్లాడటానికి హద్దూ పొద్దూ ఉండాలి! ఇది జంగిల్ రాజ్ కాదా? బొల్లా బ్రహ్మనాయుడు అన్న చేసిన పాపం ఏమిటి..? చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్కు జ్ఞానోదయం కలగాలని కోరుతూ పూజ చేయటానికి ఆయన గుడికి బయలుదేరారు. దారిలో ఆయన మీద అటాక్ చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాకాణి గోవర్ధన్రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు తప్పు చేసింది బాబేఅసలు తప్పు చేసింది చంద్రబాబు. తప్పుడు ఆరోపణలు చేసిందీ చంద్రబాబే. అవి తప్పుడు ఆరోపణలనీ దేవుడు మొట్టికాయలు వేసినా.. ఏకంగా సీబీఐ చార్జిషీట్లోనే చెప్పినా.. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు నెయ్యిపై క్లీన్ చిట్ ఇస్తే... దేవుడు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి చంద్రబాబు చేస్తున్నదేమిటి? ప్రతి విషయంలోనూ దుర్మార్గమైన రాజకీయాలే! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ఎన్నికలప్పుడు మాట ఇచ్చారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుందో చెబుతూ సంతకాలతో సహా హామీ ఇచ్చారు. మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.36 వేలు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇదిగో మీకు రూ.15 వేలు. మీ ఇంట్లో రైతులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు 55 ఏళ్ల వయసులో ఉన్నారా? వాళ్లకు రూ.48 వేలు అంటూ ప్రజలను మోసం చేశారు. సూపర్ సిక్స్, సెవెన్ అమలు చేశామంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు చేస్తున్నది తప్పని, మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాడు. చివరకు పిల్లలని కూడా చూడకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులపై గంజాయి కేసులు పెట్టి జైలుకు పంపి వారి కెరీర్ నాశనం చేస్తున్నాడు.బాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే!చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే! టీడీపీ సైన్యానికి లాటరీలో ప్రైవేటు మద్యం షాపులన్నీ కట్టబెడతాడు. ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గరుండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. లిక్కర్ షాపుల పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అవి పక్కదోవలో చంద్రబాబుకింత... ఎమ్మెల్యేల కింత... వారి మాఫియా సైన్యానికింత.. అని లూటీ పద్ధతిలో పంచుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఒకటి, రెండు కాదు. పది వరకు బెల్టు షాపులున్నాయి. లిక్కర్ ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అది సరిపోదన్నట్లు ఏకంగా ప్రతి ఐదు బాటిళ్లకు ఒకటి నకిలీ. వీళ్లే కుటీర పరిశ్రమను పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. ఆ కల్తీ లిక్కర్ తాగి ఇంజనీరింగ్ విద్యార్థులు నలుగురు చనిపోయారు. నకిలీ లిక్కర్ను టీడీపీ నాయకులే తయారు చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీచేసిన జయచంద్రారెడ్డి కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఇదే. ఎక్సైజ్ అధికారులకు, జయచంద్రారెడ్డికి వాటాలు పంచుకోవడంలో తేడాలొచ్చి దొరికిపోతే మా నాయకుడు జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఒకపక్క రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీ నాయకులతో కలిసి మా పార్టీకి చెందిన జోగి రమేష్ కల్తీ లిక్కర్ తయారు చేయడం సాధ్యమేనా? వీళ్లు నకిలీ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు తీసుకొచ్చిన బెల్ట్ షాపుల్లో జోగి రమేష్ అమ్ముతున్నాడని అక్రమ కేసు పెట్టారు. నకిలీ, కల్తీ లిక్కర్ తయారు చేసేది వారే! బెల్ట్ షాపులు తీసుకొచ్చిందీ వారే! వాటిలో కల్తీ లిక్కర్ అమ్మకాలు చేసేదీ వారి మనుషులే! కానీ కేసు మాత్రం జోగి రమేష్ మీద పెట్టి జైలుకు పంపారు. విచారణ చేయిస్తాం... వడ్డీతో చెల్లిస్తాంఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసి తెరిచేలోపు మరో మూడేళ్లు గడిచిపోతాయి. అప్పుడు వచ్చేది మా ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆయనకు కొమ్ము కాస్తున్న ఇతర పార్టీ నాయకులకు, కొంతమంది పోలీసు అధికారులకు కూడా చెబుతున్నా.. ఎల్లకాలం ఇలాగే అన్యాయం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా వీరికి మొట్టికాయలు పడతాయి. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాల్నంటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నా.మా కార్యకర్తలూ ఇలాగే స్పందిస్తే..రాష్ట్రంలో విషపు విత్తనాలు నాటుతున్నారు. ఈ సంస్కృతిని ఇప్పటికైనా ఆపండి. ఈ విషపు విత్తనాలు, కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాల కారణంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు దెబ్బతిని ఉన్నారు. ఈ విషపు విత్తనాలు పెరిగి పెద్దవై చెట్టుగా మారినప్పుడు, రేప్పొద్దున్న మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా నాయకులు, కార్యకర్తలు ఇలాగే స్పందిస్తే మీకు ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలని చంద్రబాబుని గట్టిగా హెచ్చరిస్తున్నా.అంబటి నివాసంలో టీడీపీ మూకల దాడిలో ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న వైఎస్ జగన్ చేతనైతే ఇవన్నీ చెయ్ బాబూ..!ఇప్పటికైనా దేవుడంటే భయం, భక్తితో వ్యవహరించి బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మంచి పరిపాలనతో ప్రజలకు మేలు చేసి వారి వద్ద మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేయాలి. చేతనైతే సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ విషయంలో అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా నెరవేర్చే కార్యక్రమం చేయాలి. కూటమి వచ్చాక నిర్వీర్యం అయిన స్కూళ్లను బాగుచేయాలి. 8 క్వార్టర్లకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలి. పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే ఆలోచన చేయాలి. చేతనైతే ఆపేసిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి పేద, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చేసి చూపించాలి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలిచ్చి వదిలేశారు. బకాయి పడ్డ రూ.30 వేలు కూడా తక్షణం చెల్లించాలి. వ్యవసాయాన్ని చక్కబెట్టే కార్యక్రమం చేయాలి. కానీ మీకు వీటన్నింటి మీద ధ్యాస లేదు. అన్నీ అబద్ధాలు, మోసాలు, ప్రశ్నించే గొంతులు నొక్కడమే. తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకే కమిషన్!చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు.వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, విడదల రజిని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, నంబూరు శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవినేని అవినాష్, వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరీ ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పలువురు రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు.దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా..రాష్ట్రంలో ఈరోజు జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం జరుగుతోంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి.. జోగి రమేష్ ఇంటి మీద దాడి.. విడదల రజినిపై అటాక్.. బొల్లా బ్రహ్మనాయుడు మీద అటాక్.. ఇవన్నీ జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు కొన్ని ఉదంతాలు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినమ్మ, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డి, కాకాణి గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి? చంద్రబాబు దాదాపు ఏడాదిన్నరగా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసిందంటూ రకరకాలుగా చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు.ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీనెయ్యిపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవం అని ఎన్డీఆర్ఐ (నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) రిపోర్టు ఇచ్చాయి. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్లు. వీళ్ల హయాంలో.. వీళ్లే ఇచ్చిన టెస్ట్ శాంపిళ్లు అవి. వాటిని విశ్లేషించి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వుగానీ, గొడ్డు మాంసం కొవ్వులు గానీ, పందికొవ్వు గానీ, చేప నూనెగానీ.. ఇటువంటివి ఇంకొకటిగానీ ఇంకొకటి గానీ లేవని నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాయి. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ సర్టిఫికెట్లను జత చేసి క్లోజర్ కూడా ఇచ్చింది. సీబీఐ క్లీన్చిట్ ఇస్తోంది. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు కూడా క్లీన్ చిట్లు ఇస్తున్నాయి.ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్..ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి తప్పు చేసి ఉంటే వారి పేర్లు ఎందుకు చేర్చలేదు? వారు ఒకవేళ తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు? వారు ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి తప్పూ జరగలేదు కాబట్టే వారి పేర్లు చార్జిషీట్లో పెట్టలేదు. తప్పు చేయలేదు కాబట్టే అరెస్టు చేయలేదు. అసలు ఈ వ్యవహారంలోకి సీబీఐ ఎలా వచ్చిందో తెలుసా..?రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని, దీనిపై విచారణకు ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారు కాబట్టే దీనిపై స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది.ప్రశ్నిస్తుంటే దాడులు...దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న చంద్రబాబును.. ఎందుకయ్యా అబద్ధాలు చెప్పావు? అన్యాయం చేశావు? ఎందుకయ్యా శ్రీవారి ప్రసాదం ప్రతిష్టను దెబ్బ తీశావు? అని ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఆయన ఏం చేశారో తెలుసా..? అంబటి రాంబాబు అన్న మీద దాడి! ఆ రోజు (శనివారం) ఉదయం ఆయన గుడికి వెళ్లి చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని పూజ చేసి బయటకు వస్తుంటే.. గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా కట్టెలు పట్టుకుని, పోలీసులను పెట్టుకుని అడ్డుకున్నారు. (కర్రలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తల ఫోటోలను చూపారు). కారులో ఉన్న రాంబాబును అడ్డగించి, కారును కర్రలతో బాదుతూ, పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిట్టారు. ఒకేసారి అంతమంది దుండగులు చేతిలో కర్రలతో కారుపైకి దూసుకు రావడం.. బూతులు తిడుతూ మీదకు రావడంతో ఆయన కాస్త ఘాటుగా స్పందించాడు. ఆయన నోటి నుంచి ఒక తిట్టు పదం వచ్చింది. ఒక రియాక్షన్గా జరిగింది. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ మీద ఎటువంటి అటాక్ లేకపోయినా రొటీన్గా తిడుతున్నారు. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకు వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిడితే మాత్రం ఇంకో రకంగా చిత్రీకరిస్తున్నారు. అయినప్పటికీ రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ప్రెస్మీట్ పెట్టి జరిగిన విషయమంతా వివరించారు. ఆయన పెద్ద మనిషి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి తాను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. కానీ వాళ్లు దాన్ని కూడా వక్రీకరిస్తూ ఏకంగా రాంబాబు అన్నను హత్య చేయడానికి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు సాక్షాత్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మనుషులను వేసుకుని వచ్చి అంబటి ఇంటిపై దాడి చేశారు. ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో కిటికీల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. పక్కనున్న ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. వారి ప్రాణాలకు నష్టం జరిగే విధంగా.. వారిని తిడుతూ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. -
జనం కేక.. జంగిల్రాజ్ను తరిమికొడదాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డుపై కిలోమీటర్ల కొద్దీ కనుచూపు మేర జనం.. జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా ఏకమయ్యారు.. చంద్రబాబు సర్కారు దుర్మార్గాన్ని ధైర్యంగా దుయ్యబట్టారు.. సర్కారు ఆంక్షలను లెక్క చేయకుండా రోడ్డుపైకి వచ్చారు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అడుగులో అడుగేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా జై జగన్ అంటూ నినాదాలు చేశారు.. జంగిల్ రాజ్కు రోజులు దగ్గర పడ్డాయని గర్జించారు.. ఇందుకు బుధవారం గుంటూరు వేదికైంది.. గుంటూరు నగరం జన సంద్రమైంది.. నినాదాలతో దద్దరిల్లింది. తెలుగుదేశం పార్టీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన సందోహం అపూర్వ స్వాగతం పలికింది. జగన్ పర్యటన ఖరారైందని తెలిసిన వెంటనే జిల్లాలో 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించి, నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటి వరకు మార్గ మధ్యంలో అనేక చోట్ల బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్ను మాత్రం అనుమతించి.. ఆయన వెనుక వస్తున్న వాహనాలను, జన సందోహాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని అడ్డంకుల మధ్య కూడా వైఎస్ జగన్ పర్యటన విజయవంతమైంది. 35 కిలోమీటర్లు.. ఆరు గంటలు » తాడేపల్లి నుంచి గుంటూరు నగరంలోని అంబటి రాంబాబు నివాసం వద్దకు 35 కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి వైఎస్ జగన్కు ఏకంగా ఆరు గంటల సమయం పట్టిందంటే జనం ఎంతగా పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ను చూడటానికి స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. » జగన్ కాన్వాయ్ తాడేపల్లిలో బయలుదేరిన తర్వాత కాజా టోల్గేట్ వద్ద వాహనాలను ఆపారు. ఆయనతోపాటు కొద్ది వాహనాలు మాత్రమే పంపి మిగతా వాటిని నిలువరించారు. అనంతరం కాన్వాయ్ గుంటూరు ఆటోనగర్ వై జంక్షన్కు చేరుకోగానే అక్కడ బారికేడ్లు అడ్డుగా పెట్టి పూర్తి స్థాయిలో వాహనాలు ఆపేశారు. » ఏటుకూరు బైపాస్ వద్ద కూడా కార్యకర్తలు పత్తిపాడు నుంచి గుంటూరు నగరంలోకి రాకుండా బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ నిలువరించారు. బైక్లపై వస్తుంటే బైక్ల తాళాలు లాక్కున్నారు. గుంటూరు జిల్లాను దిగ్బంధనం చేశారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు.» ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారు.. అంటూ ఆరా తీశారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని అడ్డుకొని వెనక్కి పంపారు. కొందరిని పోలీసు స్టేషన్లకు తరలించి సాయంత్రం ఐదు గంటల తర్వాత వదిలిపెట్టారు.జననేతకు జనం జేజేలు» గుంటూరు నగరానికి వచ్చిన జననేత వైఎస్ జగన్కు ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జేజేలు పలికారు. విద్యార్థి విభాగం నేతలు, యువజన విభాగం నేతలు, అనుబంధ విభాగాల నేతలు, యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జన నేతకు ఎదురేగి స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ లీగల్ విభాగం నేతలు, న్యాయవాదులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ వైఎస్ జగన్ పర్యటనకు మద్దతు తెలిపారు.» కంకరగుంట ఓవర్ బ్రిడ్జి, పట్టాభిపురం స్వామి థియేటర్ వద్ద సైతం ప్రజలు భారీగా చేరుకుని పూల వర్షం కురిపించారు. చేబ్రోలు హనుమయ్య కంపెనీ, గుజ్జనగుండ్ల సెంటర్లో తీన్మార్ డప్పు వాయిద్యాలతో స్థానిక నేతలు స్వాగతం పలికారు. యువత భారీగా బైక్ ర్యాలీలతో సందడి చేశారు. జగన్ గుంటూరు చేరుకున్న తర్వాత ఏటుకూరు వద్ద సర్వీస్ రోడ్డు మీదుగా వీఐపి రోడ్లోకి రావడానికి ముందుగా పోలీసులు ఆ దారిన వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం దాటిన తర్వాత కంకర్ గుంట ఓవర్ బ్రిడ్జి వద్ద సైతం వాహనాలను నిలువరించారు. అయినా జన సందోహం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. » గుంటూరు రోడ్లన్నింటిపై ప్రజలు, అభిమానుల కోలాహలం కనిపించింది. ఉదయం 10 గంటల నుంచే రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేత కోసం ఎదురు చూశారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేసినప్పటికీ.. సాయంత్రం 5 గంటలయ్యే సరికి ఆ ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. » గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు ఏకంగా 3 గంటలకుపైగా సమయం పట్టింది. అంబటి రాంబాబు నివాసంతో పాటు చుట్టుపక్కల ఇళ్లపైన, గోడలపైకి ఎక్కి ప్రజలు తమ అభిమాన నేతను చూశారు. పర్యటన ఈ స్థాయిలో విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతల్లో గుబులుపుట్టింది.అడుగడుగునా అడ్డంకులే..సాక్షి, నరసరావుపేట: జంగిల్ రాజ్ అరాచకాలను ఎండగట్టేందుకు గుంటూరు నగరానికి వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. జగన్ను చూడటానికి వెళ్తున్న వారిని గుర్తించి వెనక్కు పంపారు. ఉదయం 7 గంటల నుంచే వాహనాల తనిఖీలు ప్రారంభించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వద్ద, సత్తెనపల్లి మండలం నందిగం అడ్డరోడ్డు వద్ద పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ల, రాజుపాలెం, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు వెళ్తున్న వాహనాలను సత్తెనపల్లి నందిగం అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆపేశారు. వారిని సత్తెనపల్లి పోలీస్స్టేషన్కు తరలించి సాయంత్రం 6 గంటల వరకు స్టేషన్లోనే నిర్బంధించారు. సత్తెనపల్లి కార్యకర్తలను సైతం ఇదే స్టేషన్లో సాయంత్రం వరకు ఉంచారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు అనుమతి లేదంటూ పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు గుంటూరులోని నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఎంత కట్టడి చేసినా పల్నాడు జిల్లా మీదుగా గుంటూరు నగరానికి వేలాది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అంబటి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర
-
కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్
-
మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?
-
గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్
-
అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?
-
YS Jagan: ముగ్గురూ లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి..లేదంటే
-
LIVE: YS జగన్ సంచలన ప్రెస్ మీట్
-
నేనున్నా తల్లీ.. బాధపడకు.. అంబటి కుటుంబానికి జగన్ ఓదార్పు
-
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ గూండాల దాడితో వణికిపోయిన కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన జన సందోహం నడుమ సాగింది. సాయంత్రం అంబటి నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్.. తొలుత టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీస్ను పరిశీలించారు. ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ సమయంలో జగన్ వెంట పార్టీ ముఖ్య నేతలు పలువురు ఉన్నారు. -
అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ప్రియతమ నేత వైఎస్ జగన్ వస్తున్నారనే సమాచారంతో అంబటి ఇంటికి భారీగా తరలి వచ్చినవారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ గూండాలు అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని హతమార్చాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉల్టా అంబటిపైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించింది చంద్రబాబు ప్రభుత్వం. దాడితో భయాందోళనకు గురైన అంబటి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించేందుకు వచ్చారు. జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో అంబటి నివాసం వద్దకు తరలి వచ్చారు. అయితే.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాళ్లను అడ్డుకుని బారికేడ్లు పెట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడం పరిస్థితి హీటెక్కింది. అయితే.. జగన్ వచ్చాక మరోసారి అలాంటి పరిస్థితే కనిపించింది.అంతకు ముందు.. గుంటూరు నగరంలో అంతకు ముందు గుంటూరు నగరంలోకి వచ్చే సమయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. గుంటూరు నగరంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్కు స్వాగతం చెప్పేందుకు వైఎస్సార్సీసీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అయితే, వైఎస్ జగన్ కాన్వాయి వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతిచ్చారు.ఫాలో ఆప్ వాహనాలను చెక్పోస్ట్ వద్ద అడ్డుకున్నారు. అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తమను పోలీసులు అడ్డుకున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణుల్ని నెట్టే ప్రయత్నం చేయగా అక్కడ సైతం ఉద్రిక్తత నెలకొంది. ఇలా అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు చేపట్టిన వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున్నా అడ్డంకులు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అయినప్పటకీ జగన్పై ఉన్న అమితమైన అభిమానం ఎప్పటికీ తగ్గదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు. భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన జనసంద్రాన్ని తలపించింది. -
పట్టాభిపురం చేరుకున్న YS జగన్
-
గుంటూరుకు చేరుకున్న YS జగన్ కాన్వాయ్
-
ఏమి జనం సామీ..! గుంటూరులో జన సునామి
-
జగన్ అభిమానులను ఆపేదెవడు.... చేతులెత్తేసిన పోలీసులు..


