Woman killed
-
ముంబైలో దారుణం.. రోడ్డుపై ప్రియురాలి హత్య
ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పెద్ద ఇనుప రెంచీతో దారుణంగా హత్య చేశాడు. అక్కడున్న వారు ఈ దారుణాన్ని చూస్తూ నిల్చుండిపోయారు. ఆపేందుకు ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముంబయికి చెందిన రోహిత్ యాదవ్ ఓ యువతితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఏవో కొన్ని కారణాల వల్ల వారి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. దీంతో యువతి రోహిత్ను దూరం పెట్టింది. ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటుందేమోనని రోహిత్ అనుమానం పెంచుకున్నాడు.అదే యువతి పాలిట శాపంగా మారింది. మంగళవారం(జూన్18) ఉదయం పనికి వెళుతున్న ఆమెను రోహిత్ వెంబడించాడు. ఇనుప రెంచీతో ఆమెపై దాడికి దిగాడు. తలపై బలంగా కొట్టడంతో ఆమె నేలకొరిగింది. అయినా సరే యువతిని విడిచిపెట్టకుండా పలుమార్లు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. -
తల్లి కడుపు చీల్చి మరీ.. వెలుగులోకి హమాస్ అరాచకాలు
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. వారం రోజులుగా ఇరు వర్గాల మధ్య భయంకరమైన పోరు కొనసాగుతోంది. బాంబులు, వైమానిక దాడులతో నువ్వా-నేనా అనే రీతిలో ఇరు వర్గాలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 1,417 మంది మృత్యువాడినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మహాస్ ఉగ్రవాదులకు చెందిన 1500 మృతదేహాలను ఇజ్రాయెల్లో గుర్తించారు, మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్కు చంఎదిన 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందిని బంధీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. గాజా సరిహద్దుల్లో హమాస్ దాడుల్లో మరణించిన ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు రోడ్లపై, వీధుల్లో కుప్పలుకుప్పలుగా పడి ఉండిపోయాయి. ఈ మృతదేహాలను వివిధ స్వచ్చంద సంస్థలకు చెందిన వాలంటీర్లు సేకరిస్తున్నారు. అష్దోద్ ప్రాంతానికి చెందిన యోసి లాండౌ.. జాకా అనే సంస్థలో గత 33 ఏళ్లుగా వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థ ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అసహజ మరణాలు సంభవించినప్పుడు అక్కడి మృతదేహాలను సేకరిస్తుంటుంది. దశాబ్ధాలుగా ఇదే పని చేస్తున్న యోసి.. తాజాగా హమాస్తో జరుగుతున్న యుద్ధంలోనూ ఈ విధులే నిర్వర్తిస్తున్నారు. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో బందీల మృతి ఈ క్రమంలో గాజా సరిహిద్దులో మరణించిన వారి మృతదేహాలను సేకరించే పనిలో పడ్డ యోసి.. హమాస్ మరణహోమంలో బలైన వారి శవాలను చూసి అతని గుండె తరుక్కుపోయింది. రోడ్డుపై శవాల కుప్పల, అత్యంత ఘోర స్థితిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను చూసి అతడికి కన్నీళ్లు ఆగలేదు. గర్భిణి అయిన మహిళ పొట్టను చీల్చి మరీ లోపలున్న శిశువును చంపడం చూసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ భయానక దృశ్యాల అనుభవాలను అతను ఓ మీడియాతో పంచుకున్నాడు. ‘రాకెట్ దాడులు జరుగుతున్నట్లు శనివారం ఉదయం నేను సైరన్ శబ్ధాలు రావడంతో క్షణాల్లోనే షెల్టర్లలోకి వెళ్లిపోయాం. అప్పటికే ప్రధాన భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొచ్చుకొచ్చారని మాకు తెలిసింది. అనంతరం మృతదేహాలను సేకరించేందుకు మా బృందంతో కలిసి గాజా సరిహద్దుకు బయల్దేరాం. ఆ దారిలో మేం చూసిన దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. గాజా సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో కార్లు బోల్తా పడి ఉన్నాయి. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఇంత దారుణ విధ్వంసాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒక రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలను సేకరించేందుకు మేం వెళ్లాం. సాధారణంగా ఆ రోడ్డును దాటాలంటే 15 నిమిషాలు పడుతుంది. కానీ ప్రతి మృతదేహాన్ని సేకరించి బ్యాగుల్లో పెడుతూ ఆ రోడ్డు దాటేసరికి 11 గంటలు పట్టింది. బుల్లెట్లు దిగి, ధ్వంసమైన అనేక కార్లు ఇప్పటికీ దక్షిణ ఇజ్రాయెల్లో చెత్తకుప్పల్లా పడి ఉన్నాయి. పదుల సంఖ్యలో మృతదేహాలను గుర్తించి ట్రక్కులో ఎక్కించాం. అక్కడి నుంచి కిబ్బుట్జ్లోని బీరీ ప్రాంతానికి చేరుకున్నాం. ఈ ప్రాంతం గాజాకు కేవలం 5 కి.మీల దూరంలోనే ఉంటుంది. అక్కడ మొదట ఓ మహిళ మృతదేహాన్ని చూడగానే నాతో పాటు మా బృందం మొత్తానికీ స్పృహ కోల్పోయి కళ్లు తిరిగి పడిపోయినంత పనైంది. గర్భవతైన మహిళ పొట్టను చీల్చి శిశువును బయటకు తీసి చంపారు. ఆ బిడ్డకు బొడ్డుతాడు ఇంకా అలానే ఉంది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ఇక విధ్వంసమే.. 'వైట్ పాస్పరస్ ఆయుధాలతో ఇజ్రాయెల్ దాడి' 20 మంది చిన్నారులతో సహా కొందరు పౌరుల చేతులను వెనక్కి కట్టి వారిని కాల్చి చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని లాండౌ తెలిపారు. కొందరు యువతలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కిబ్బుట్జ్ ప్రాంతంలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్పై హమాస్ జరిపిన మారణహోమంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
ప్రియురాలిని చంపి ఉప్పు పాతరేశాడు!
శంషాబాద్, చైతన్యపురి, హుడా కాంప్లెక్స్: గుడికి వచ్చిన యువతితో వివాహితుడైన పూజారికి ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు బాగానే గడిపారు. తీరా తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం నగర శివార్లలోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని సరూర్నగర్ మండల ఆఫీసు వెనుక ఉన్న పాత సెప్టిక్ ట్యాంక్లో పడేసి ఉప్పు, ఎర్రమట్టి నింపాడు. వాసన బయటకు రాకుండా దానికి ఉన్న రెండు మ్యాన్హోల్స్కు కాంక్రీట్ చేశాడు. తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ఆర్జీఐఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గుడిలో ఏర్పడిన పరిచయం కాస్తా .. చెన్నైకి చెందిన కురుగంటి అరుణ, శ్రీకర్ దంపతుల కుమార్తె అప్సర (30) అక్కడే సినీ రంగంలో పని చేశారు. ఓ చిత్రంలో పాత్ర కూడా పోషించారు. తండ్రి కాశీకి వెళ్లిపోవడంతో కూతురును తీసుకొని తల్లి హైదరాబాద్కు వలస వచ్చింది. వీళ్లు సరూర్నగర్ వెంకటేశ్వరకాలనీ రోడ్ నం.15 లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. స్వతహాగా భక్తురాలైన అప్సర తరచూ తన ఇంటికి సమీపంలో ఉన్న బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్లేది. ఈ క్రమంలో ఆలయ ప్రధాన పూజారి, రియల్టర్ అయిన అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణతో గతేడాది ఏప్రిల్లో పరిచయమైంది. ఇరువురిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఓ పాపకు తండ్రి కూడా అయిన సాయికృష్ణ తరచు అప్సర ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఆమెను తీసుకుని తన ద్విచక్ర వాహనం, కార్లలో గోశాలలు, దేవాలయాలకు వెళ్తుండేవాడు. ఎలాంటి సందేహం రాని అరుణ వారికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో... సాయికృష్ణతో సన్నిహితంగా మెలుగుతున్న అప్సర గతంలో పలుమార్లు తనను రెండో వివాహం చేసుకోవాల్సిందిగా కోరింది. అతడు దాటవేస్తుండటంతో ఈ ఏడాది మార్చి నుంచి ఒత్తిడి పెంచింది. దీంతో ఆమెను హత్య చేయాలనే నిర్ణయానికొచ్చిన సాయికృష్ణ.. ఈ నెల 3వ తేదీ రాత్రి 8.15 గంటల ప్రాంతంలో తన కారులో (ఫోర్డ్ ఫిగో, టీఎస్ 07హెచ్జే 2172) అప్సర ఇంటికి వెళ్లాడు. కోయంబత్తూరు వెళ్దామని చెప్పి బయటకు తీసుకొచ్చాడు. 11 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలో భోజనం చేశారు. తర్వాత కాస్త అస్వస్థతకు గురైన అప్సర కారు ముందు సీట్లో నిద్రకు ఉపక్రమించింది. సాయికృష్ణ అక్కడినుంచి సుల్తాన్పూర్ గోశాల వైపు కారు తీసుకెళ్లాడు. కారు బాడీ కవర్తో చంపేందుకు విఫలయత్నం... తెల్లవారుజామున 3.50 గంటలకు అప్సర నిద్రలో ఉండగా.. కారు బాడీ కవర్ బయటకు తీసిన సాయికృష్ణ వెనుక సీటులోకి వచ్చాడు. అక్కడ నుంచే బాడీ కవర్ను ఆమె మెడకు చుట్టి, ఊపిరి ఆడకుండా చేసి చంపాలని ప్రయత్నించాడు. కానీ అప్సర ప్రతిఘటించడంతో వెనుక సీటు కింద ముందే ఉంచిన బెల్లం కొట్టే రాయి తీసి దాదాపు పదిసార్లు కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని అదే కవర్లో చుట్టిన సాయికృష్ణ కారు డిక్కీలో పెట్టి మరుసటి రోజు (ఈ నెల 4న) తెల్లవారుజామున 4:45 గంటలకు సరూర్నగర్లోని తన అపార్ట్మెంట్కు చేరుకుని కారును మృతదేహంతో పాటే పార్కింగ్లో ఉంచాడు. ఉదయం అరుణ ఇంటికి వెళ్లిన సాయికృష్ణ అప్సర తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని నమ్మించాడు. తర్వాత అప్సర ఆచూకీ తెలియడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పి, ఈ నెల 5వ తేదీన అరుణతో కలిసి ఆర్జీఐఏ పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అప్సరను తన మేనకోడలిగా పేర్కొన్నాడు. భద్రాచలం వెళ్తానని చెప్పడంతో తన కారులోనే శంషాబాద్ వరకు తీసుకువచ్చి అక్కడి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె ఫ్రెండ్స్ కారులో ఎక్కించానని, మరుసటి రోజు నుంచి ఆమె ఫో¯న్ స్విచ్చాఫ్ వస్తోందని తెలిపాడు. మృతదేహం నుంచి వాసన వస్తుండటంతో... అప్సర మృతదేహం 5వ తేదీ సాయంత్రం వరకు సాయికృష్ణ కారులోనే ఉంది. దుర్వాసన వస్తున్నట్టు గమనించిన అతను రాత్రి వేళ కారు తీసుకుని సరూర్నగర్ తహశీల్దార్ కార్యాలయం వెనుక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వినియోగంలేని సెప్టిక్ ట్యాంక్లో మృతదేహాన్ని గన్నీ బ్యాగ్లో కుక్కి పడేసి, దాదాపు 2 బస్తాల ఉప్పు దానిపై పోశాడు. నిత్యాన్నదానం చేస్తున్న ఇతను దానికి వా డే ఉప్పునే దీనికీ ఉపయోగించాడు. మరుసటి రో జు తెల్లవారుజామున 2 టిప్పర్ల ఎర్రమట్టి తెప్పించి సెప్టిక్ ట్యాంక్లో పోయించాడు. ఆమె హ్యాండ్ బ్యా గ్, లగేజీ బ్యాగ్ కాల్చేశాడు. ఇంటికి వెళ్లి కారును శుభ్రం చేసి దాచిపెట్టాడు. ఈ నెల 7న మరోసారి అక్కడకు వెళ్లిన సాయికృష్ణ సెప్టిక్ ట్యాంక్కు ఉన్న రెండు మ్యాన్హోల్స్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించాడు. దీంతో ఎల్బీనగర్ లోని లేబర్ అడ్డాకు వెళ్లి కొత్త మ్యాన్హోల్ మూతలు తెచ్చాడు. వీటిని మ్యాన్హోల్స్పై ఉంచి కాంక్రీట్ పోశాడు. ఆ సమీపంలో ఓ బోరు కూడా వేయించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ స్థలాన్ని బాగు చేయించాడు. ఇదంతా సామాజిక సేవలో భాగమనే భావన స్థానికులకు కల్పించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు అప్సర ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. శంషాబాద్లోని వివిధ ప్రాంతాల్లోని నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీలు, అప్సర, సాయికృష్ణ ఫోన్ల టవర్ లొకేషన్లు తదితర సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీలో సాయికృష్ణ కారులోనే అప్సర షాబాద్ రోడ్డు మీదుగా నర్కూడ వైపు వెళ్లినట్లు కనిపించింది. దీంతో పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడు. శుక్రవారం ఆర్జీఐఏ పోలీసులు సెప్టిక్ ట్యాంక్ను పగులగొట్టి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న అప్సర మృతదేహాన్ని బయటకు తీశారు. సాయికృష్ణను అరెస్టు చేసి కారు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ కె.నారాయణరెడ్డి శుక్రవారం ప్రకటించారు. హత్య జరిగిన ప్రాంతం శంషాబాద్ గ్రామీణ పోలీసుస్టేషన్పరిధిలోకి వస్తుంది. దీంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి ఆ పోలీసుస్టేషన్కు బదిలీ చేయనున్నారు. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేయడంతోనే అప్సరను చంపానని సాయికృష్ణ పోలీసు విచారణలో చెప్పినట్లు తెలిసింది. అప్సర గతంలోనూ గర్భం దాల్చిందని, దీంతో తనను పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పినట్లు తెలిసింది. తన వల్లే అప్సర గర్భం దాల్చలేదని, ఆమెకు ఇతరులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నట్లు సమాచారం. గతంలో ఆమెకు తానే అబార్షన్ చేయించానని చెప్పాడని తెలుస్తోంది. మా అబ్బాయి మంచివాడు మా అబ్బాయి సాయికృష్ణ చాలా మంచివాడు. దైవసేవ తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అప్సర చనువుగా ఉండటం గమనించి ఆడవాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెప్పాం. మా అబ్బాయే హత్య చేశాడని అనుకోవటం లేదు. – నిందితుడి తండ్రి లక్ష్మినర్సింహమూర్తి సాయికృష్ణను ఉరితీయాలి అక్కయ్యా అని పిలుస్తూ మా ఇంటికి వచ్చేవాడు. అభం శుభం తెలియని నా బిడ్డకు మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. చివరకు పొట్టన పెట్టుకున్నాడు. వాడిని బహిరంగంగా ఉరి తీయాలి. – అప్సర తల్లి అరుణ ఇంత కర్కోటకుడు అనుకోలేదు సాయికృష్ణ గత పదేళ్లుగా సరూర్నగర్ పరిసరాల్లోని ఆలయాల్లోనే పని చేస్తున్నాడు. అందరికీ సుపరిచితుడు. నమ్మకంగా ఉండటంతో ఆలయం ప్రధాన పూజారిగా నియమించాం. కానీ ఇంత కర్కోటకుడు అనుకోలేదు. – ఆకుల అరవింద్కుమార్, ట్రస్టీ, బంగారు మైసమ్మ దేవాలయం -
మేనమామ కుమారుడుతో వివాహేతర సంబంధం.. భర్తను చంపిన భార్య
కర్ణాటక: ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను హత్య చేయించిన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని జన్నగట్ట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు..జానపద కళాకారుడు జన్నఘట్ట కృష్ణమూర్తి(50) హత్యకు గురైన వ్యక్తి. ఘటనకు సంబంధించి కోలారు రూరల్ పోలీసులు కృష్ణమూర్తి భార్య సౌమ్య, ప్రియుడు శ్రీధర్, హత్యకు సహకరించిన మరో వ్యక్తి శ్రీధర్ను అరెస్టు చేశారు. తాలూకాలోని జన్నఘట్ట రైల్వే బ్రిడ్జి వద్ద జానపద కళాకారుడు జన్నఘట్ట కృష్ణమూర్తి ద్విచక్రవాహన రోడ్డు ప్రమాదంలో మరణించాడనే వార్తలు వెలువడ్డాయి. అయితే కృష్ణమూర్తి తలకు తగిలిన గాయాలపై పలు అనుమానాలు రేకెత్తాయి. పోలీసు విచారణలో గుట్టురట్టు అనంతరం పోలీసుల విచారణలో భార్య సౌమ్యే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా కృష్ణమూర్తి కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి. సౌమ్య తన మేనమామ కుమారుడు శ్రీధర్తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో భర్త జన్నఘట్ట కృష్ణమూర్తి, సౌమ్యల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు పెద్దలు న్యాయ పంచాయతీ కూడా చేసినట్లు తెలిసింది. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగుతుండడంతో సౌమ్య భర్త కృష్ణమూర్తిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. పక్కా ప్రణాళికతో హత్య ప్రియుడితో కలిసి ప్రణాళికను సిద్ధం చేసి సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జన్నఘట్ట రైల్వే బ్రిడ్జి వద్ద ద్విచక్రవాహనంలో వస్తున్న కృష్ణమూర్తిని డ్రాప్ అడిగే నెపంతో బైక్ను ఆపి సౌమ్య ప్రియుడు శ్రీధర్, అతని స్నేహితుడు శ్రీధర్ ఇనుప రాడ్తో దాడి చేసి తల వెనుక భాగాన గట్టిగా కొట్టడంతో కృష్ణమూర్తి రక్తగాయంతో అక్కడికక్కడే మరణించాడు. అనంతరం భార్య సౌమ్య దీనిని ద్విచక్రవాహన ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయట పడింది. రూరల్ పోలీసులు సౌమ్య, ప్రియుడు శ్రీధర్, హత్యకు సహకరించిన మరో వ్యక్తి శ్రీధర్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు. కృష్ణమూర్తి, సౌమ్య దంపతులకు ముగ్గురు పిల్లలు ఉండగా, వారు ప్రస్తుతం అనాథలయ్యారు. -
ప్రేమోన్మాది ఘాతుకం.. బెంగుళూరులో కాకినాడ యువతి దారుణ హత్య
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై యువతిని కిరాతకంగా కత్తితో నరికిచంపాడు. పెళ్లికి ఒప్పుకోలేదని మాజీ ప్రియుడే ఆమెను క్రూరంగా 16 కత్తిపోట్లతో హతమార్చాడు. మృతురాలిని లీలా పవిత్రగా గుర్తించారు. ఈమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ. గత ఐదేళ్లుగా బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ప్రేమిస్తున్నానని ఓ యువకుడు ఈమె వెంటపడి వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అత్యంత దారుణంగా నడిరోడ్డుపై హత్య చేశాడు. ఆమె పనిచేసే ఆఫీస్ పక్కనే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు. నిందితుడి పేరు దినకర్. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి -
హైదరాబాద్ బాలాపూర్ లో దారుణం
-
మెహందీ పెట్టడానికి వెళ్తూ మృత్యువాత
తూర్పు గోదావరి: ఓ శుభకార్యంలో మెహందీ పెట్టడానికి అమలాపురం వెళ్తున్న ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన ఎల్లే రత్నమాల (19), రాజమహేంద్రవరానికి చెందిన తమ్మనబోయి సుధారాణి స్నేహితులు. వీరు శుభకార్యాల్లో మేకప్, మెహందీ పెట్టడం చేస్తూంటారు. ఇదే క్రమంలో ఆలమూరు మండలం మోదుకూరుకు చెందిన మరో స్నేహితుడు కట్టుంగ కాశీతో కలిసి మోటార్ సైకిల్పై రాజమహేంద్రవరం నుంచి అమలాపురం మెహందీ పెట్టేందుకు శుక్రవారం బయలుదేరారు. కాశీ మోటార్ సైకిల్ నడుపుతూండగా.. ఇద్దరు యువతులూ వెనుక కూర్చున్నారు. జాతీయ రహదారిపై రావులపాలెం సీఐ కార్యాలయం వద్ద ఉన్న వంతెన మీదకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రత్నమాల కింద పడిపోయింది. తల పైనుంచి లారీ చక్రాలు దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సుధారాణి ఎడమ చేతికి గాయమైంది. కాశీ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని రావులపాలెం ఎస్సై ఎం.వెంకట రమణ పరిశీలించారు. రత్నమాల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. దాని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన రత్నమాల పేరవరానికి చెందిన వీర్రాజు, నాగమణి దంపతుల కుమార్తె. వీర్రాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తెకు వివాహం అయ్యింది. వీర్రాజు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బతుకుతెరువు కోసం నాగమణి మూడు నెలల క్రితం దుబాయ్ వెళ్లింది. ఈ నేపథ్యంలో రెండో కుమార్తె రత్నమాల మెహందీ, మేకప్లు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. ఆమె ఈ ప్రమాదంలో మరణించడంతో తండ్రి వీర్రాజు దుఃఖానికి అంతు లేకుండా పోయింది. -
ప్రతి 11 నిమిషాలకు.. ఒక యువతి బలి.. సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే..
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ/బాలిక తమ భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో దారుణ హత్యకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.. మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై జరిగే హింస ముందు వరసలో ఉందని పేర్కొంది. నవంబర్ 25న ‘‘మహిళలపై హింసా నిర్మూలన‘‘ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై హింస విస్తృతమైనది. ప్రతీ 11 నిమిషాలకు ఒక మహిళ తన భాగస్వామి లేదంటే సొంత కుటుంబానికి చెందిన వారి చేతిల్లోనే ప్రాణాలు కోల్పోతోంది. కోవిడ్–19, ఆర్థిక వెనుకబాటుతనం, ఇతర ఒత్తిళ్లతో మహిళలపై శారీరక, మానసిక హింస ఎక్కువైపోతోంది’’ అని గుటెరస్ పేర్కొన్నారు. దీనిని ఎదుర్కోవడానికి దేశాలన్నీ కార్యాచరణ రూపొందించాలన్నారు. ‘‘మహిళలపై హింస అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పాటు పడే సంస్థలకు నిధులను 2026 నాటికి 50 శాతం పెంచాలి. మనందరం ఫెమినిస్టులమని గర్వంగా ప్రకటించుకోవాలి’’ అన్నారు. చదవండి: ఇండోనేసియా భూకంపం.. 268కి చేరిన మృతులు -
‘నేను చాలదా.. ఇంకొకడు కావాల్న’ అంటూ సజీవదహనం
చెన్నె: ముందే వివాహేతర సంబంధం. ఆపై అతడు కాకుండా మరొక వ్యక్తితో సంబంధం కొనసాగించడంపై ఆమె ప్రియుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి బంధం కొనసాగించకూడదని హెచ్చరించాడు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి చివరకు ఆమెను హతమార్చాడు. బస్టాండ్లో నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు చెన్నెలోని కొయంబేడులో చోటుచేసుకుంది. కొయంబేడులో ముత్తు (48), శాంతి (46) ఫుట్పాత్ నివాసితులు. వీరిది వివాహేతర సంబంధం. అయితే శాంతి అతడిని కాకుండా వేరే వ్యక్తితో కూడా సంబంధం కొనసాగిస్తోంది. ఇది తెలుసుకున్న ముత్తు ఆమెను వారించాడు. ఆమె వినిపించుకోకపోవడంతో శనివారం తెల్లవారుజామున 1.30 ప్రాంతంలో బస్టాండ్లోని ఫుట్పాత్పై నిద్రిస్తున్న శాంతిపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానిక వ్యాపారులు, ప్రయాణికులు వెంటనే ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే శాంతి మృతిచెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కొద్దిసేపటికి ముత్తు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: సెల్ఫీ తీసుకుంటూ ఫోన్తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
ప్రియుడే హంతకుడు
చేవెళ్ల: సంపన్న కుటుంబానికి చెందిన ఆమె.. ఫేస్బుక్లో పరిచయమైన ఓ ఫ్రెండ్ మాయలో పడింది. భర్త, పిల్లల్ని వదిలేసి అతడి వద్దకు వెళ్లిపోయింది. చివరకు కోరుకున్న ప్రియుడే కాలయముడై ఆమె ప్రాణాలు తీశాడు.. ఇదీ కొద్దిరోజుల క్రితం ‘దిశ’ఘటన తరహాలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా తంగడపల్లి బ్రిడ్జి కింద వెలుగు చేసిన మహిళ (36) హత్య కేసు మిస్టరీ. తన స్నేహితుడి సాయంతో ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేల్చారు. ప్రియుడి స్నేహితుడిని పట్టుకున్న పోలీసులు ఈ మేరకు కీలక ఆధారాలు సేకరించారు. అతడిని రిమాండ్కు తరలించినట్టు తెలుస్తోంది. ఆ రోజేం జరిగిందంటే.. మార్చి 17న చేవెళ్ల మండలం తంగడపల్లి శివారులోని బ్రిడ్జి కింద యువతి మృతదేహం కనిపించింది. నగ్నంగా పడి ఉన్న ఆమె ముఖం పూర్తిగా ఛిద్రమైంది. ఒంటిపై ఖరీదైన నగలున్నాయి. పక్కనే నైలాన్ తాడు పడి ఉంది. ఇది మరో ‘దిశ’ఘటనలా ఉందంటూ అప్పట్లో ప్రచారమైంది. చేవెళ్ల పోలీసులు మహిళ ఆచూకీ కోసం రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల పోలీసులకు తెలిపారు. మృతదేహం కుళ్లిపోతుండటంతో ఇటీవల చేవెళ్లలోనే పూడ్చిపెట్టారు. మృతురాలిని సిక్కింకు చెందిన మహిళగా గుర్తించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబీకులు నిరాకరించినట్లు తెలుస్తోంది. సంపన్న కుటుంబానికి చెందిన ఈ మహిళ భర్త వ్యాపారవేత్త అని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఫేస్బుక్ ద్వారా పరిచయం ముంబైలో ఉండే ప్రధాన నిందితుడికి ఈ మహిళ ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. అది ప్రేమ, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె భర్త, పిల్లల్ని వదిలేసి సిక్కిం నుంచి 4 నెలల క్రితం ముంబైకి వెళ్లి అక్కడే ఉండేది. ప్రియుడు మరో మహిళతో చనువుగా ఉంటున్నట్టు గుర్తించిన ఆమె.. తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు పథకం పన్నాడు. చంపేసి ముంబైకి చెక్కేసి.. సీసీ కెమెరాల పుటేజీలు, సెల్ఫోన్ సిగ్నళ్ల జీపీఎస్ ట్రాక్ను సేకరించడం ద్వారా పోలీసులు ఓ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడికి బంధువు, స్నేహితుడైన యువకుడు హైదరాబాద్లో ఇంటర్న్షిప్ కోసం ఉంటున్నాడు. ప్రధాన నిందితుడు తాను హైదరాబాద్ వస్తున్నానని, కారు ఏర్పాటు చేయాలని కోరటంతో ఈ యువకుడు అద్దె కారును ఏర్పాటు చేశాడు. గత నెల 15న ముంబై నుంచి నిందితుడు తన ప్రియురాలిని తీసుకొని విమానంలో హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడి యువకుడితో కలిసి అద్దె కారులో లాంగ్ డ్రైవ్ కోస మని ముగ్గురూ వికారాబాద్కు వచ్చారు. పథకం ప్రకారం నైలాన్ తాడుతో కారులోనే మహిళ మెడకు ఉరిబిగించి హత్య చేశారు. తంగడపల్లి బ్రిడ్జి వద్ద వాహనం ఆపి మృతదేహాన్ని తాడుతో కిందికి దించారు. ముఖం గుర్తించకుండా బండరాయితో మోది ఛిద్రం చేశారు. రాయితోపాటు మహిళ దుస్తులను తమతో తీసుకెళ్లారు. కారు తంగడపల్లి ప్రగతి రిసార్టు మీదుగా ప్రొద్దటూరు నార్సింగి మీదుగా ఔటర్ రింగ్రోడ్డుకు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అనంతరం ప్రధాన నిందితుడు ముంబై వెళ్లిపోయాడు. కారు నంబర్ ఆధారంగా దానిని అద్దెకు తీసుకున్న యువకుడిని అదుపులోకి తీసుకోవటంతో ఈ కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. -
పద్మావతి హత్యకేసులో పురోగతి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): భవానీపురంలో జరిగిన మహిళ దారుణ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన పాత నేరస్తుడే హంతకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆరేళ్లుగా నిందితుడు పోలీసులకు చిక్కకుండా నేరాలకు పాల్పడుతున్నాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ సంఘటనతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన పని లేదని పోలీసులు భరోసా ఇస్తున్నారు. కాగా ఒంటరిగా ఉన్న మహిళను గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం విజయవాడ భవానీపురంలో జరిగిన విషయం తెలిసిందే. భవానీపురం క్రాంబ్వే రోడ్కు అనుసంధానంగా ఉన్న కెనరా బ్యాంక్ రోడ్లో యేదుపాటి వెంకటేశ్వర్లు, పద్మావతి(55) దంపతులు నివసిస్తున్నారు. వెంకటేశ్వర్లు ఇసుక, ఇటుక, కంకర వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరూ స్థానికంగా ఉన్న అమ్మపాద అపార్ట్మెంట్లో ఫంక్షన్కు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. భార్య పద్మావతిని ఇంటి దగ్గర దింపేసిన వెంకటేశ్వర్లు పనులపై బయటకు వెళ్లిపోయారు. ఇంటికి వచ్చిన తరువాత పద్మావతి తమ సమీప బంధువుకు ఫోన్ చేశారు. అయితే, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ఫోన్లో మిస్డ్ కాల్ చూసుకున్న బంధువు తిరిగి పద్మావతికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు. దీంతో ఆమె మిన్నకుండిపోయింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య జరిగిన తీరు చూస్తుంటే పాత నేరస్తుల పని అయి ఉంటుందని భావిస్తున్నామని డీసీపీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. దుండగులు పద్మావతిని దారుణంగా గొంతు కోసి హత్య చేశారని చెప్పారు. బాధితురాలి ఒంటిపై ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని తెలిపారు. కప్ బోర్డ్లో ఉన్న నగలు, నగదు ముట్టుకోలేదని తెలుస్తోందన్నారు. వేలి ముద్రలు కనిపించకుండా కారం చల్లారని చెప్పారు. గతంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో జరిగిన హత్య కేసులో దొరికిన వేలి ముద్రలు ఉత్తరప్రదేశ్కు చెందిన పాత నేరస్తుడి వేలి ముద్రలతో సరిపోయాయని, అయితే సదరు నేరగాడు ఇంకా దొరకలేదని అన్నారు. పద్మావతి హత్య కూడా ఆ తరహాలోనే జరిగింది కాబట్టి ఉత్తరప్రదేశ్ నేరస్తుల పనేనా అన్నది విచారణలో తేలుతుందన్నారు. కాగా, డాగ్ స్క్వాడ్ టీమ్ తీసుకొచ్చిన జాగిలం పీఆర్కే బిల్డింగ్ వద్ద కాసేపు ఆగి, తిరిగి స్వాతి సెంటర్ వరకు వెళ్లింది. -
భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం
కంచిలి: భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం చెందిన ఘటన మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. కవిటి మండలం కాజూరు గ్రామానికి చెందిన బందరు రోజా (46) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త మోహన్రావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కాజూరు గ్రామానికి చెందిన బందరు మోహన్రావు, భార్య రోజా తమ సామాజిక వర్గానికి చెందిన వనభోజనాలను సోంపేట మండలం ఎకవూరు సముద్రపు తీరం వద్ద ఆదివారం ఏర్పాటు చేయడంతో వెళ్లారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత వీరి కుమారుడు హరీష్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు. మోపెడ్పై మోహన్రావు, రోజా తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. జాడుపూడి కాలనీ వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న కంటైనర్ మోపెడ్ హ్యాండిల్కు రాసుకొని వెళ్లింది. దీంతో మోపెడ్ అదుపుతప్పి భార్యాభర్తలు రోడ్డుపై పడిపోయారు. రోజా తలపై నుంచి లారీ(కంటైనర్) వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మోహన్రావు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. మోహన్రావు హెల్మెట్ ధరించడంతో తలకు గాయాలు కాలేదు. కంటైనర్ ఆపకుండా వెళ్లిపోవడంతో హైవే పోలీసులు కొజ్జిరి జంక్షన్ వద్ద పట్టుకొన్నారు. క్షతగాత్రుడు మోహన్రావు కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తె ధనలక్షి్మకి వివాహం చేశారు. కుమారుడు హరీష్ చదువు పూర్తిచేసుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. రోజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త మోహన్రావుకు ఈ ఆస్పత్రిలోనే చికిత్స చేయించారు. మోహన్రావు ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ సి.హెచ్.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా: మహిళ మృతి
సాక్షి, నందిగామ: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కాల్వలోకి బోల్తా పడిన ఘటన వీరులపాడు మండలం పొన్నవరం గ్రామ శివారులో జరిగింది. ట్రాక్టర్ ఇంజన్ కింద డ్రైవర్తో సహా వ్యవసాయ కూలీలు ఇరుక్కుపోగా.. స్థానికులు వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తమ్మిశెట్టి ధనలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెప్పపాటులో ఘోరం
చోడవరం/మాడుగుల: చోడవరం పెట్రోల్ బంకు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన కోనేటి జగదీష్ తన భార్య నూకరత్నం(30), నాలుగేళ్ల కుమార్తెతో కలిసి స్కూటర్పై లంకెలపాలెంలో తన బంధువుల ఇంట్లో జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి బుధవారం ఉదయం వెళ్లారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి ముగ్గురూ స్కూటర్పై తిరుగు పయనమయ్యారు. బీఎన్ రోడ్డుపై చోడవరం ఊర్లోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటర్పై వెనుక కూర్చున్న నూకరత్నం రోడ్డుపై పడింది. స్కూటర్ నడుపుతున్న జగదీష్ తన ముందు కూర్చున్న కుమార్తెను పట్టుకొని రోడ్డు పక్కన ఎడమ వైపునకు పడిపోయారు. రోడ్డుపై పడిపోయిన నూకతర్నం తలపై నుంచి బస్సు వెనుక చక్రం ఎక్కేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జగదీష్, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదుటే భార్య చనిపోవడంతో జగదీష్ కన్నీటి పర్యంతమయ్యాడు. రక్తపుమడుగులో పడి ఉన్న నూకరత్నం మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అక్కడి వారిని శోకసముద్రంలో ముంచెత్తింది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు ఎంత ప్రయతి్నంచినా రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న భార్య మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి నూకరత్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన జగదీష్, అతని కుమార్తెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే చోడవరం పోలీసు స్టేషన్కు వెళ్లి సమాచారమిచ్చాడు. -
స్టేషన్ ఎదుటే మహిళను కొట్టి చంపారు
రాజమహేంద్రవరం క్రైం: అష్టా చెమ్మా ఆటలో యువకుల మధ్య నెలకొన్న వివాదం ఓ మహిళ మృతికి కారణమయ్యింది. తన కొడుకుపై దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను మరో వర్గం వారు పోలీస్ స్టేషన్ ఎదుటే కొట్టి చంపారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. ఈ మరణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు అక్కడే ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రెడ్డీలపేటకు చెందిన వల్లెపు శేఖర్, అదే ప్రాంతానికి చెందిన వేముల ఆంజనేయులు అనే యువకులు శనివారం అష్టా చెమ్మా ఆట ఆడుతూ డబ్బుల కోసం గొడవ పడ్డారు. శేఖర్పై ఆంజనేయులు దాడి చేశాడు. శేఖర్ తల్లి వల్లెపు బుజ్జమ్మ (35) పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చింది. అప్పుడు ఆంజనేయులు కుటుంబీకులు వచ్చి ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పిడిగుద్దులు గుద్దుకుంటూ పోలీస్ స్టేషన్ చివరకు తీసుకువెళ్లి సొమ్మసిల్లేలా కొట్టారు. దాడి జరుగుతున్న సమయంలో కానిస్టేబుల్ అక్కడే ఉన్నా అడ్డుకోలేదని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బుజ్జమ్మను ఆమె కుమారుడు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. కుటుంబీకులు పోలీసు స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ సంతో‹Ù బాధితులతో చర్చించి నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ట్రాక్టర్ కింద పడీ మహిళ మృతి
-
చీపురుతో కొడితే చనిపోయారా?
సాక్షి, హైదరాబాద్: చీపురు కట్ట.. అది కూడా విరిగిపోయిన చీపురుతో కొట్టడం వల్లే ఓ మహిళ మృతి చెందిందన్న పోలీసుల ఆరోపణపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చీపురుతో కొడితే చనిపోతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొడితే చనిపోవడానికి చీపురు ఏమైనా మారణాయుధమా అంటూ ప్రాసిక్యూషన్ను ప్రశ్నించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా హత్యారోపణలు ఎదుర్కొంటున్న తల్లీ కొడుకులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జ్లిలాకు చెందిన తూర్పాటి కామాక్షి అనే మహిళను యు.వెంకటమ్మ, ఆమె కుమారుడు రాజశేఖర్లు చీపురు కట్టతో కొట్టి చంపారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు.. వీరిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై వారు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై విచారణ సందర్భంగా వెంకటమ్మ, రాజశేఖర్ల తరఫు న్యాయవాది ఎన్.హరినాథ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మహిళను నడిరోడ్డుపై విరిగిన చీపురుతో కొట్టి చంపారని పోలీసులు ఆరోపిస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. డాక్టర్ నివేదిక ప్రకారం పక్కటెముకలు విరిగి, బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టడం వల్ల చనిపోయినట్లు తేలిందని చెప్పారు. ఇది హత్య కాదని పేర్కొన్నారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ మహిళది హత్యేనని పోలీసుల తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. తాము ఈ కేసు పూర్వాపరాల్లోకి ప్రస్తుతం వెళ్లట్లేదని తెలిపింది. నిందితులిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరువురూ చెరో రూ.30 వేల చొప్పున పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన వెంటనే నివాస ధ్రువీకరణ పత్రాలు పోలీసులకు ఇవ్వాలని, అలాగే ప్రతి సోమవారం పోలీసుల ముందు హాజరు కావాలని సూచించింది. కేసు విచారణ సందర్భంగా కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. -
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి, ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఓ మహిళ తీవ్ర గాయాలపాలై మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఐఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం టోలిచౌకీలో నివాసముండే మహ్మద్ ఇక్రమ్అలీ (26) ఓ కాల్సెంటర్లో పనిచేస్తూ 20 రోజుల క్రితమే ఉద్యోగం మానేశాడు. ఆదివారం రాత్రి బార్కాస్లో జరిగిన పార్టీలో పీకలదాకా మద్యం తాగాడు. సోమవారం ఉదయం ఇంటికి కారులో బయలుదేరాడు. మద్యం మత్తులో ఉన్న అలీ ఔటర్పై దారితప్పి గచ్చిబౌలి, గౌలిదొడ్డి మీదుగా అతివేగంగా గోపన్పల్లి వైపు వెళ్లాడు. ఉదయం 6.30 గంటల సమయంలో గౌలిదొడ్డిలోని ప్రభుత్వ పాఠశాల వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా 60 మీటర్ల దూరంలో పార్క్చేసి ఉన్న స్కూటర్ను ఢీకొట్టి ఓ ఇంట్లోకి దూసుకుపో యింది. ఇంటి గోడలు ధ్వంసం కావడంతో ఇంట్లో ఉన్న మధుబాయ్(45) అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. హౌస్కీపింగ్ పనులు చేసుకునే మధుబాయ్ భర్త సట్వాజీ 2010లోనే మృతి చెందాడు. వారికి ఐదుగురు సంతానం. నిందితుడు ఇక్రమ్ అలీని స్థానికులు పోలీ సులకు అప్పగించారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా నిందితుడిని పరీక్షించగా ఆల్కహాల్ శాతం 168 ఎంఎల్గా నమోదైంది. పోలీసులు అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈవీఎంలు తరలిస్తున్న బస్సు ఢీకొని మహిళ మృతి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల పండుగ ఓ ఇంట్లో విషాదం నింపింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు తరలిస్తున్న బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని యాప్రాల్లో శుక్రవారం రాత్రి జరిగింది. బస్సు డ్రైవర్కు ఫిట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మృతిచెందిన మహిళ భర్త, ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జంట హత్యలు
గుత్తి రూరల్: రజాపురంలో దారుణం జరిగింది. జంట హత్యలతో కలకలం రేగింది. బండరాయితో మోది మహిళను, గొంతు నులిమి ఐదు నెలల పసికందును దుండగులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం గుత్తి మండలం రజాపురం శివారులో జాతీయ రహదారి పక్కన కంకర కుప్పల్లో 28 – 30 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ, 4 – 5 నెలల వయసు కలిగిన మగ శిశువు మృతదేహాలను ఆటోడ్రైవర్లు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ ప్రభాకర్గౌడ్, ఎస్ఐ వలిబాషు, యువరాజులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలకు కొద్ది దూరంలో జీఎస్బీసీ కాలువలో రక్తపు మరకలు, ఓ బ్యాగు లభించాయి. మహిళ మృతదేహానికి కొద్ది దూరంలో మట్టి తవ్వి కింద దాచిపెట్టిన రక్తపు మరకలు ఉన్న షర్టు కూడా దొరికింది. బ్యాగును తెరచి చూడగా అందులో మృతురాలి దుస్తులు, శిశువుకు పాలు తాపే గ్లాసులు, మందులు, మాత్రలు కనిపించాయి. సంఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. పెనుగులాటలో ఒక పాదరక్ష, చేతి గాజులు విరిగి కిందపడినట్లున్నాయి. మహిళ మృతదేహం పక్కన శిశువుకు తాపేందుకు వెంట తెచ్చుకున్న బాటిల్లోని పాలు, బేబీ బెడ్ పడి ఉన్నాయి. హత్యాస్థలిని పరిశీలించిన డీఎస్పీ హత్య జరిగిన ప్రదేశాన్ని తాడిపత్రి ఇన్చార్జ్ డీఎస్పీ విజయకుమార్ శనివారం పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయాలని, 24 గంటల్లోగా హతుల ఆచూకీ తెలుసుకోవాలని, విచారణ నిమిత్తం వైఎస్సార్ జిల్లాకు ఓ బృందాన్ని పంపాలని సీఐ ప్రభాకర్గౌడ్ను ఆదేశించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం విచారణ సంఘటనపై పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించారు. పోలీసులు జాగిలం హత్య జరిగిన ప్రదేశంతో పాటు పరిసరాలు మొత్తం కలియతిరిగింది. క్లూస్ టీం సంఘటనా స్థలంలో వేలి ముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. మృతురాలు వైఎస్సార్ కడప జిల్లా వాసి? సంఘటన స్థలంలో లభించిన బ్యాగులోని ఆధారాలను బట్టి మృతురాలు వైఎస్సార్ జిల్లా బద్వేల్కు చెందిన లక్ష్మిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఆమె బద్వేల్లో ఓ ముస్లిం యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. మృతులను తల్లీ కుమారుడిగా అనుమానిస్తున్నారు. బ్యాగులో లభించిన ఫోన్ నంబర్ బద్వేల్కు చెందిన వారివిగా గుర్తించి మృతదేహాల ఫొటోలను అక్కడి వారికి, పోలీసులకు వాట్సాప్ ద్వారా పంపారు. వాటి ఆధారంగానే సదరు మహిళ నాలుగు రోజుల నుంచి బద్వేల్లో కనిపించడంలేదని అక్కడి పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
చెట్టును ఢీకొట్టిన కారు.. మహిళ మృతి
పశ్చిమ గోదావరి జిల్లా : దైవ దర్శనానికి వెళుతుండగా కారు ప్రమాదానికి గురవటంతో ఓ మహిళ మరణించగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. జాతీయ రహదారిపై పెరవలి మండలం ఖండవల్లి వద్ద శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై పి.నాగరాజు తెలిపిన వివరాలు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తాటికొండ వెంకటసుబ్రహ్మణ్యం ఉద్యోగ రీత్యా హైదరాబాదులో ఉంటున్నారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాలకు చెందిన గెల్లి మహాలక్ష్మి(58) కొద్ది రోజుల క్రితం హైదరాబాదు కుమార్తె ఇంటికి వెళ్లారు. మహాలక్ష్మి, ఆమె అల్లుడు వెంకటసుబ్రహ్మణ్యం, కుమార్తె జానకీరమాదేవి, ఇద్దరు మనవరాళ్లు కలిసి శుక్రవారం రాత్రి సుమారు 11 గంటలకు హైదరాబాదు నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి కారులో బయలు దేరారు. కారును తాత్కాలికంగా కుదుర్చుకున్న డ్రైవర్ నడుపుతున్నాడు. వేగంగా వెళుతున్న కారు శనివారం ఉదయం ఖండవల్లి సమీపంలోకి వచ్చేప్పటికి ముందు వెళుతున్న ట్రాలీ లారీని తప్పించబోగా అదుపు తప్పింది. రోడ్డు మార్జిన్లో ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న మహాలక్ష్మి అక్కడికక్కడే మరణించింది. కారులోని వెంకటసుబ్రహ్మణ్యం, జానకీరమాదేవి దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం రాజమండ్రి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగరాజు తెలిపారు. -
అనుమానంతో నాలుగోభార్యను అతిదారుణంగా..
భోపాల్: వేధింపులకు తాళలేక మొదటి ఇద్దరు భార్యలు అతణ్ని వదిలేసి పోయారు.. మూడోభార్య అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.. ఇప్పుడు నాలుగోభార్యను అతికిరాతకంగా చంపేశాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో గురువారం వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి అశోకా గర్డెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ సునీల్ శ్రీవాస్తవ చెప్పిన వివరాల ప్రకారం.. భోపాల్లోని ప్రగతి నగర్ ప్రాంతంలోని ఓ గదిలో దంపతులు అద్దెకుంటున్నారు. మూడురోజులుగా రాకపోకలులేకపోవడం, గదిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. గదితలుపులు పగులగొట్టగా.. దాదాపు కుళ్లిపోయే దశకు చేరిన మహిళ మృతదేహం కనిపించింది. పోస్ట్మార్టంలో.. మృతురాలిపై అత్యాచారం జరిగినట్లు, శరీరభాగాల్లోకి బీరు సీసాలు దించినట్లు గుర్తించారు. గంటలపాటు సాగిన వేటలో పోలీసులు నిందితుణ్ని పట్టుకున్నారు. పోలీసుల దర్యాప్తులో స్థానికుల సాక్ష్యాలు కీలకంగా మారాయి. సదరు నిందితుడు రోజుకూలీగా పనిచేసేవాడని, ఆమె మాత్రం ఇంట్లోనే ఉండేదని స్థానికులు చెప్పారు. ఇంటి యజమానితో మహిళకు సంబంధం ఉందేమోనన్న అనుమానంతో అతను నిత్యం గొడవపడేవాడని పేర్కొన్నారు. పోలీసు కస్టడీలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, ఆమె అతనికి నాలుగోభార్య అని, ఇంతకుముందు మూడో భార్య కూడా అనుమానాస్పద రీతిలో మరణించిందని ఎస్సై శ్రీవాస్తవ వివరించారు. -
విద్యుత్ షాక్తో మహిళ మృతి
సంతబొమ్మాళి: మోటార్ అన్ చేయడానికి వెళ్లిన మహిళ విద్యుత్ షాక్తో మృతిచెందింది. మండలంలోని లక్ష్మీపురం జంక్షన్లో ఉన్న ఇటుకల బట్టీ వద్ద ఈ సంఘటన సోమవారం జరిగింది. పొట్టకూటి కోసం స్థానిక గురువులకు చెందిన ఇటుకల బట్టీలో ఎండమూరి రాజులు(40) పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం నీటి కోసం మోటారు ఆన్ చేసింది. ఎంతకూ నీరు రాకపోవడంతో మోటారు బోటు వద్దకు వెళ్లింది. అప్పటికే అక్కడ కట్టి ఉన్న ఆవు వైరును బయటకు లాగేసింది. ఇది గమనించని రాజులు ఆ వైరును పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి మృతిచెందింది. ఆమె స్వగ్రామం విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని కొటగాం. ఆమె అవివాహిత. రాజులు మూగ, చెముడు. ఆమె మృతిపై సంతబొమ్మాళి ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి ఆస్పత్రికి తరలించారు. -
జాతరకు వెళ్తూ మృత్యుఒడిలోకి..
నిడదవోలు (పశ్చిమ గోదావరి) : తోబుట్టువులు.. బంధువులు.. స్నేహితులు జాతర సందర్భంగా ఆనందంగా గడుపుతున్న సమయంలో విషాదవార్త ఆ కుటుంబాన్ని కలచివేసింది. అర గంటలో బంధువుల చెంతకు చేరే సమయంలో క్వారీ లారీ మృత్యురూపంలో కబళించింది. నిడదవోలు రైల్వే గేటు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. చాగల్లు మండలం కలవలపల్లి గ్రామంలో ఆదివారం జాతర కావడంతో కృష్ణా జిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామానికి చెందిన ఒడుగు గంగారావు, సూర్యకళ (50) దంపతులు ఉదయం స్కూటర్పై కలవలపల్లి గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో నిడదవోలు రైల్వే గేటు వద్దకు వచ్చేసరికి గేటు వేసి ఉండటంతో గంగారావు స్కూటర్ను ఆపి వేచి చూస్తున్నారు. గంగారావు దంపతులు గేటు తెరుస్తారని చూస్తుండగా తాడేపల్లిగూడెం వైపు నుంచి పంగిడి వెళ్తున్న క్వారీ లారీ వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్ను పది అడుగుల దూరం లారీ ఈడ్చుకెళ్లింది. గంగారావు, వెనుక కూర్చున్న సూర్యకళకు తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే సూర్యకళ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గంగారావుకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, బంధువులు నిడదవోలు వచ్చారు. ప్రభుత్వాస్పత్రి వద్ద వీరి రోదనలు మిన్నంటాయి. పట్టణ ఎస్సై జి.సతీష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. -
ఆస్తి కోసం మహిళ దారుణ హత్య
మెదక్ మున్సిపాలిటీ : ఆస్తి కోసం అన్న భార్యను తమ్ముడు కిరాతకంగా హతమార్చిన సంఘటన మెదక్ పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన నంగి బీరమ్మ(44) భర్త ప్రకాశ్ గతంలో మరణించాడు. అయితే వీరికి సంతానం లేకపోవడంతో బీరమ్మ ఓ చిన్నారిని దత్తత తీసుకొని పెంచుకుంటోంది. కాగా బీరమ్మ భర్త ప్రకాష్ తమ్ముడు రాంసురేందర్కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. బీరమ్మ పేరున ఒక ఎకరంన్నర పొలం ఉంది. ఈ క్రమంలో తన పిల్లలను దత్తత తీసుకోకుండా ఎక్కడి నుండో పిల్లను తెచ్చుకొని సాకడం ఏంటని రాంసురేందర్ బీరమ్మతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి ముందు బీరమ్మ తను దత్తత తీసుకున్న కూతురు తేజకు అన్నం తినిపిస్తోంది. ఇదే సమయంలో రాంసురేందర్ అక్కడికి కత్తితో వచ్చి బీరమ్మను నరికాడు. దీంతో బీరమ్మ రక్తం మడుగులో కొట్టుకొని అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వెంటనే రాంసురేందర్ అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ భాస్కర్, క్లూస్టీం సహాయంతో వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. తీవ్ర ఉద్రిక్తత: ఆస్తి కోసం అన్న భార్యను చంపేయడంతో నవాబుపేట వీధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాంసురేందర్ తన పిల్లలను బీరమ్మ దత్తత తీసుకుంటే ఆమె ఆస్తి కూడా తనకే వచ్చేదని ఆశపడేవాడని స్థానికులు ఆరోపించారు. బీరమ్మ మృతి పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. బీరమ్మ దుర్మరణంతో దత్తత తెచ్చుకున్న చిన్నారి అనా«థగా మారింది. ఆ చిన్నారిని చూసి స్థానికులు కంటతడిపెట్టారు. -
తోడుగా ఉంటామన్నారు.. ప్రాణం తీశారు !
టీ.నగర్: భర్త, పిల్లలను కాదనుకుని వెళ్లిన ఆమె జీవితం దారి తప్పి వ్యభిచార కూపం చేరింది. అక్కడ ఏర్పడిన పరిచయాలే ఆమె ప్రాణం తీశాయి. దాదాపు నెలన్నర క్రితం జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. వివరాలు కరూర్ జిల్లా ఏమూరు సమీపంలోని నడుపాళయానికి చెందిన ఇళయరాజాకు భార్య పర్వీన్భాను (28), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిది ప్రేమ వివాహం. వీరి మధ్య విబేధాలు రావడంతో 2015లో పర్వీన్భాను ఇల్లు విడిచి వెళ్లింది. అనేక చోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో భార్య ఆచూకీ కోసం భర్త పోలీసులను ఆశ్రయించాడు. గొంతుకు టవల్ బిగించి చంపేశారు.. కరూరు నుంచి చెన్నై చేరుకున్న పర్వీన్భానుకు పెరుంగళత్తూరు బస్టాండులో ఆటో డ్రైవర్ రాజా (30)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతనితో ఉంటూనే వ్యభిచార వృత్తిలో కొనసాగింది. కొన్నాళ్ల తర్వాత రాజాను నుంచి విడిచి ఇరుంబులియూర్ ఏరికరై ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మాణిక్కం (28)తో జీవించసాగింది. ఆ తర్వాత మరైమలైనగర్లో కిషోర్తో సహజీవనం చేసింది. గతేడాది నవంబర్ 9వ తేదీన పర్వీన్భాను మరైమలర్ నగర్లో మరో వ్యక్తితో వెళ్లేందుకు సిద్ధమై గుండుమేడుకు చేరుకుంది. మాణిక్కం, రాజా గుండుమేడు ఇంటికి వెళ్లారు. అక్కడ రాజా మిద్దెపై దాక్కొనగా మాణిక్కం ఇంట్లోకి వెళ్లి పర్వీన్భానుతో మద్యం సేవించారు. తనను విడిచి వెళ్లకూడదంటూ మాణిక్కం బెదిరించాడు. మిద్దెపై నున్న రాజా, మాణిక్కం ఇద్దరు కలిసి పర్వీన్భానును గొంతుకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ముగ్గురు ఆటో డ్రైవర్లే.. మహిళ హత్యకు గురైందనే సమాచారం మేరకు చెన్నై నగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తరలించేందుకు సహకరించిన ఆటో డ్రైవర్ పెరుంగళత్తూరుకు చెందిన కిషోర్ (36)ను అదుపులోకి తీసుకుని విచారించగా పర్వీన్ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఆటోడ్రైవర్లు మాణిక్కం, రాజా, కిషోర్ను అరెస్టు చేశారు. -
తమ భూమి తమకు కాకుండా చేసినందుకే హత్య
-
విషాదం నింపిన భూవివాదం
చిత్తూరు, సాక్షి: మహిళా రైతు విమల(52)ను శుక్రవారం కర్కశంగా చంపిన ఘటనతో చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలోని వరిగపల్లెలో విషాదం అలుముకుంది. భూ తగాదాల నేపథ్యంలో రంజిత్ అనే వ్యక్తి శుక్రవారం అత్యంత కిరాతకంగా ట్రాక్టర్ రొటోవేటర్తో విమలను తొక్కించి హత్య చేసిన విషయం తెలిసిందే. అంతేగాక అడ్డువచ్చిన ఆమె భర్తను సైతం ఇనుప రాడ్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రశాంతంగా ఉండే ఊళ్లో ఇలాంటి దారుణ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామమంతా ఉలిక్కిపడింది. గ్రామంలో అందరికీ తల్లో నాలుకగా వ్యవహరించే మనిషి దూరమవడంతో ఊళ్లోని చిన్నాపెద్దా కన్నీరు పెట్టారు. విమల అంత్యక్రియలు వరిగపల్లెలో శనివారం సాయంత్రం 5 గంటలకు జరిగాయి. మృతదేహాన్ని చూసి కూతురు భవ్యశ్రీ గుండెలవిసేలా ఏడ్వడం అందర్నీ కదిలించింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, నిందితులు రంజిత్, గోవిందరాజు, రంజిత్ తండ్రి గోవిందయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగింది? విమల(52), జగన్నాథరెడ్డి(59) భార్యాభర్తలు. జగన్నాథరెడ్డికి శ్రీరాములురెడ్డి అనే తమ్ముడు ఉన్నాడు. శ్రీరాములురెడ్డికి వరిగపల్లె చెరువు సమీపంలో 14 గుంటల వ్యవసాయ పొలం ఉంది. ఈ పొలాన్ని ఐదు సంవత్సరాల క్రితం చిత్తూరుకు చెందిన ఏకాంబరమేస్త్రీ అనే వ్యక్తి వద్ద కుదువ పెట్టి కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. డబ్బు తీసుకున్న సంవత్సరం తరువాత శ్రీరాములురెడ్డి చనిపోయాడు. దీంతో ఏకాంబరమేస్త్రీ డబ్బు విషయం జగన్నాథరెడ్డి దృష్టికి తీసుకొచ్చాడు. ఆయన నాకు సంబంధం లేదు అని చెప్పడంతో ఏకాంబర మేస్త్రీ వరిగపల్లి గ్రామానికే చెందిన రంజిత్ అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం విక్రయించాడు. ఎంత ఒత్తిడి చేసినా ఏకాంబర మేస్త్రీకి రంజిత్ డబ్బు చెల్లించలేదు. దీంతో ఏకాంబర మేస్త్రీ జగన్నాథరెడ్డితో కలిసి చిత్తూరు సివిల్ కోర్టులో కేసు వేశాడు. ఇన్జంక్షన్ ఆర్డర్ రావడంతో... శ్రీరాములురెడ్డి, జగన్నాథరెడ్డి అన్నదమ్ములు కాబట్టి భూమి జగన్నాథరెడ్డికి చెందుతుందని ఈ నెల 8న కోర్టు ఇన్జంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో ట్రాక్టర్తో పనులు చేసుకునేందుకు పొలానికి వెళ్లారు జగన్నాథరెడ్డి దంపతులు. పొలంలో పనులు చేస్తుండగా రంజిత్ స్నేహితుడు గోవిందరాజులు చూసి పనులు అడ్డుకున్నాడు. రంజిత్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న రంజిత్ పొలం మాది.. పనులు ఎలా చేస్తారని ప్రశ్నించాడు. దీంతో మాటామాటా పెరిగింది. పట్టారాని కోపంతో రంజిత్ వివాదాస్పద పొలం పక్కనే ఉన్న జగన్నాథరెడ్డి జొన్న పంటను ట్రాక్టర్తో తొక్కించేశాడు. పంటను నాశనం చేయొద్దని పొలం గట్టుపై నుంచి విమల అరవడం మొదలు పెట్టింది. దీంతో రంజిత్ విచక్షణ మరచి.. ఆమెను ట్రాక్టర్తో ఢీకొట్టారు. ఆమె రొటోవేటర్లో ఇరుక్కొని దుర్మరణం చెందింది. -
విజయవాడలో రెచ్చిపోయిన దొంగలు
-
బరితెగించిన దొంగలు..మహిళ హత్య
-
నారాయణవనంలో మహిళ హత్య
చిత్తూరు , నారాయణవనం : మండల కేంద్రమైన నారాయణవనంలో సోమవారం మహిళ హత్యకు గురైంది. బావే అక్కను హత్య చేయించాడని మృతురాలి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన శివకుమార్ కొన్నేళ్ల క్రితం నారాయణవనంలో క్లినిక్ పెట్టుకుని ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. అలాగే మెడికల్ షాపును నిర్వహిస్తున్నాడు. హైవే సమీపంలో సొంత ఇంటిలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు ఆర్ఎంపీ శివకుమార్ భార్య సుజాత(32) మెడకు బాలికలు వేసుకునే లెగ్గిం గ్స్తో బిగించి హత్య చేయడానికి ప్రయత్నించారు. ఆమె కేకలు విని ఇంటిపై అద్దె కు ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థి కౌశిక్ కిందకు వచ్చేలోపు దుండగులు పారిపోయారు. కొన ఊపితో ఉన్న సుజాతను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. అదే సమయంలో రోడ్డుపై పరుగులు తీస్తున్న ఇద్దరు యువ కులను స్థానికులు దొంగలుగా భావించి పోలీసులకు అప్పగించారు. సుజాత సోదరుడు వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న శివకుమార్ను పుత్తూరు సీఐ హనుమంతప్ప అదుపులో తీసుకున్నారు. పుత్తూరు ఇన్చార్జి డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ అనుమానితులతో పాటు సుజాత భర్త శివకుమార్ను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతురాలి సోదరుడు వినోద్ మాట్లాడుతూ తన అక్కను బావ శివకుమారే చంపించాడని ఆరోపించాడు. -
చీర కోసం క్యూలో నిల్చున్న మహిళ మృతి
కౌడిపల్లి (నర్సాపూర్): బతుకమ్మ చీర కోసం క్యూలో నిల్చున్న ఓ మహిళ కిందపడి అక్కడికక్క డే మృతి చెందింది. ఈ ఘటన కౌడిపల్లి మండలం కొట్టాల పంచాయతీ కార్యాలయం వద్ద మంగళ వారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చౌదరిపేట బంజ విజయమ్మ (55) చీర కోసం వచ్చి వరుసలో నిలబడిన కాసేపటికే కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, విజయమ్మకు అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేదని గ్రామస్తులు తెలిపారు. -
తలపై వేడి నూనె పోసి.. కత్తితో నరికి!
చీటి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తుండటంతో విసిగిపోయిన ఓ మహిళ చీటి నిర్వాహకురాలిని దారుణంగా చంపేసింది. తలపై వేడి నూనె పోసి.. కత్తితో పొడిచి హతమార్చింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి చీటిల వ్యాపారం నిర్వహిస్తోంది. సత్యనారాయణమ్మ అనే మహిళ దగ్గర నుంచి 4లక్షల చీటి డబ్బులు తీసుకుని ఏడేళ్ల నుంచి ఇవ్వకుండా వేధిస్తోంది. దీంతో విసిగిపోయిన సత్యనారాయణమ్మ.. వెంకటలక్ష్మి తలపై వేడి నూనె పోసి.. కత్తితో దారుణంగా నరికి చంపింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. -
వివస్త్రను చేసి..నోట్లో యాసిడ్ పోసి..
- చనిపోయిందని భావించి మహిళను నీటిగుంతలో పడేసిన వైనం - చికిత్స పొందుతూ మృతి వర్గల్ (గజ్వేల్): ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. నోట్లో యాసిడ్ పోసి.. వివస్త్రను చేశారు. చనిపోయిందని భావించి నిర్జన ప్రదేశంలోని రోడ్డు పక్కన బురద గుంటలో పడేశారు. సుమారు 12 గంటలపాటు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ స్థానికుల దృష్టిలో పడిన ఆ మహిళ చివరకు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి శివారులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మర్కూక్ మండలం పాములపర్తి శివారులో సింగాయపల్లి అటవీ క్షేత్రం సమీపాన రోడ్డు పక్కన బురద నీటిలో సోమవారం మధ్యాహ్నం గొర్రెల కాపరులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మహిళను గమనించారు. పోలీసులు వచ్చి ఆమెకు సపర్యలు చేసి,వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. తన పేరు ఇట్టుపల్లి కవిత అని.. తమది యాదాద్రి జిల్లా ఆలేరు గ్రామం పోచమ్మబస్తీ అని, భర్త రాములు మేడ్చల్లోని చాక్లెట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డు అని వివరించింది. కొమురవెల్లికి వచ్చామని, భర్త రాములు తనను కొట్టాడని, వెంట రేణుక అనే మరో మహిళ ఉందని, భర్త ఫోన్ నంబరు చెప్పింది. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉండటాన్ని బట్టి యాసిడ్ పోసినట్టు తెలుస్తోంది.నోటిలో యాసిడ్ పోయడంతో సరిగ్గా మాట్లాడలేక పోవడంతో పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. భర్తపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆవును కాపాడబోయి.. మహిళను చంపేశాడు!
మన దేశంలో సగటున రోజుకు 400 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అయితే, ప్రస్తుతం అంతా ఆవుల సీజన్ నడుస్తోంది. ఏదైనా ఘటనకు ఆవుతో సంబంధం ఉందంటే చాలు.. ఒక్కసారిగా అది ప్రధాన వార్తల్లోకి ఎక్కేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో ఇలాంటిదే ఓ ప్రమాదం సంభవించింది. పోలీసు జీపు నడుపుతున్న డ్రైవర్కు రోడ్డుమీద ఉన్నట్టుండి ఓ ఆవు అడ్డొచ్చింది. దాన్ని కాపాడేందుకు సడన్గా అతడు స్టీరింగ్ను పక్కకు తిప్పాడు. అయితే అదే సమయానికి ఆ పక్కనే ఓ వృద్ధురాలు కూడా ఉంది. ఆమెను చూసేసరికే జీపు అతడి అదుపు తప్పి.. ఆమెను ఢీకొంది. ఆమెతో పాటు ఆమె పక్కనే ఉన్న ముగ్గరు మనవలు కూడా గాయపడ్డారు. వారిలో వృద్ధురాలు ఉషాదేవి (60) అక్కడికక్కడే మరణించారు. పిల్లలు ముగ్గురినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. జీపు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళను నరికి.. శవంతో వీడియో!
పట్టపగలు అందరూ చూస్తుండానే 40 ఏళ్ల మహిళను ఓ యువకుడు నరికి చంపేశాడు. ఈ దారుణం పంజాబ్లోని ఖిలా రాయ్ పూర్ గ్రామంలో జరిగింది సరబ్జీత్ కౌర్ అనే బాధితురాలు ఇంటికి తిరిగి వెళ్తుండగా మణీందర్ సింగ్ అనే నిందితుడు గొడ్డలితో ఆమెను నరికేశాడు. పదే పదే మెడమీద, గుండెల మీద నరకడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె చనిపోయినట్లు ఖరారు చేసుకున్న తర్వాత.. తన ఫోన్ తీసుకుని రక్తపు మడుగులో పడి ఉన్న సరబ్జీత్ మృతదేహాన్ని వీడియో తీసుకున్నాడు. తర్వాత కెమెరాను తనవైపు తిప్పుకొని, ఏదో మాట్లాడాడు. మహిళను చంపిన తర్వాత ఆమె మృతదేహం పక్కనే నిలబడి వీడియో తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మణీందర్ సింగ్ నేరుగా పోలీసులకు ఫోన్ చేసి, తాను హత్య చేశానని చెప్పాడు. దాంతో వాళ్లు వచ్చి అతడిని అరెస్టు చేసినట్లు లూధియానా డీసీపీ ధ్రుమన్ నింబ్లే తెలిపారు. సరబ్జీత్ కుమార్తె లఖ్వీందర్ కౌర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన మరో మహిళతో మణీందర్ సింగ్కు వివాహేతర సంబంధం ఉన్న విషయం సరబ్జీత్కు తెలుసని అంటున్నారు. దాంతో ఆమె తనను ఆ విషయం గురించి పదే పదే బ్లాక్ మెయిల్ చేస్తోందని, అందుకే ఆమెను చంపేశానని మణీందర్ చెప్పాడు. -
రామజన్మభూమికి పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట
అయోధ్య: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రామ జన్మభూమికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. సరయూ నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు ఒక్కసారిగా భక్తులు పోటీలుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలివీ.. శ్రీరాముని కల్యాణం తిలకించేందుకు సుమారు 10 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచి వచ్చిన భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామజన్మభూమి మందిరం సమీపంలోని తులసి ఉద్యాన్లో జరిగిన తోపులాటలో దులారీ దేవి(65) మృతి చెందగా లక్పతి దేవి(70) తీవ్రంగా గాయపడింది. మృతురాలు దులారీ దేవి సిద్ధార్ధనగర్ జిల్లాకు చెందిన సాధురాం భార్యగా గుర్తించారు. అయితే, దులారీ దేవి గుండెపోటుతో చనిపోయినట్లు ఎస్పీ అనంత్దేవ్ తెలిపారు. అదేవిధంగా బాంధా తిరహా ప్రాంతంలో జరిగిన మరో తొక్కిసలాటలో సుమారు 12 మంది భక్తులు గాయపడ్డారని ఆయన చెప్పారు. -
గుర్తు తెలియని వస్తువు రాలిపడి..
వేలూరు : పైనుంచి గుర్తు తెలియని వస్తువు రాలిపడి పేలుడు సంభవించడంతో తీవ్రంగా గాయపడిన మహిళ శుక్రవారం మృతి చెందారు. వేలూరు జిల్లా వానియంబాడి సమీపంలోని తురింజికుప్పంకు చెందిన భువనేశ్వరి(38) మార్చి 24న రాత్రి నిద్రిస్తుండగా ఆమె ఇంటిపై అంతుచిక్కని వస్తువు పడి పెద్ద శబ్దంతో పేలింది. పేలుడు తీవ్రతకు ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు ఇంట్లో వస్తువులు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఇంట్లో నిద్రిస్తున్న భువనేశ్వరి, ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిని చికిత్స నిమిత్తం వానియంబాడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. భువనేశ్వరి పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి వేలూరు ప్రభుత్వ ఆసుపత్రి, తరువాత చెన్నై కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్సలు ఫలించక భువనేశ్వరి శుక్రవారం ఉదయం 3గంటలకు మృతి చెందారు. దీనిపై ఆలంగాయం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పేలుడు జరిగిన వస్తువు గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కావలూర్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త అన్బుయగన్ బృందం ఇంటిపై పడిన వస్తువు గురించి పరిశోధనలు చేశారు. వారు ఆకాశం నుంచి తోక చుక్క రాలిపడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ఇది ప్రమాదంగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఆరు నెలల కిందట నాట్రంబలి్లలోని ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలపై ఇదే తరహాలో పేలుడు సంభవించడంతో బస్సు డ్రైవర్ మృతి చెందాడు. వానియంబాడిలోని వ్యవసాయ పంటలపై ఇదే తరహాలో పేలుడు సంభవించింది. దీనిపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన రైలు..
హైదరాబాద్: రైల్వే క్రాసింగ్ లేని చోట పట్టాలు దాటుతున్న మహిళను వేగంగా వస్తున్న రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం నగరంలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదే ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు మృతిచెందినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రెండేళ్ల క్రితమే ఫ్లై ఓవర్ మంజూరైంది. కాని ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. దీంతో ఆ ప్రాంతంలో తరచు ప్రమాదాలు జరగుతున్నాయి. ఇప్పటికైన అధికారులు నిద్ర వదలి వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాలని స్థానికులు ఆందోళన నిర్వహించారు. -
యువతి అనుమానాస్పద మృతి
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో దారుణం వెలుగుచూసింది. స్థానిక జయశంకర్ పార్క్ సమీపంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆదివారం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు రాజీవ్నగర్కు చెందిన బానోతు అమల(19)గా గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హతమార్చి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు ఢీకొని మహిళ మృతి
దురాజ్పల్లి(చివ్వెంల) : అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నడుస్తున్న ఇద్దరిని ఢీకొట్టడంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన దురాజ్పల్లి గ్రామ శివారులో హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని జి.తిర్మలగిరి ఆవాసం గుంపుల గ్రామానికి చెందిన పచ్చిపాల రాములమ్మ (50), నకిరేకంటి లక్ష్మయ్యలు హరితహరం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు గార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో రహదారి పక్కన నిలబడి ఉండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వై పు అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములమ్మ అక్కడికక్కడే మృతిచెందగా, లక్ష్మయ్యకు కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యారుు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ సునీతామోహన్, ఎస్ఐ బి.ప్రవీణ్కుమార్లు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్ట నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
బాణసంచా పేలి వివాహిత దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు ఇందుకూరుపేట : బాణసంచా పేలి ఓ వివాహిత దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని నిడిముసలిలో చేపల గుంత వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నిడిముసలికి చెందిన గాలి యాకోబు తుమ్మాలమ్మ గుడి వద్ద చేపల గుంత సాగు చేస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన గోని విజిత (37)తో వివాహేతర సంబందం ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురు ఇంటి నుంచి వెళ్లి శుక్రవారం అర్ధరాత్రి గుంత వద్దనే ఉన్నారు. వేకువ జామున సమయంలో చలిగా ఉండటంతో చలిమంట వేసుకున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గుంతల మీద పిట్టలను తరిమేందుకు తీసుకు వచ్చి వసారాలో ఉంచిన బాణసంచాపై నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి. దీంతో అవి పేలడంతో ఇద్దరు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో విజిత మృతి చెందగా తీవ్రంగా గాయపడిన యాకోబు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు. డీఎస్పీ పరిశీలన ప్రమాదం విషయం తెలుసుకున్న డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షరీఫ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై స్థానికులతో వివరాలు ఆరా తీశారు. -
ట్రాక్టర్ కింద పడి వృద్ధురాలు మృతి
ఆత్మకూరురూరల్ : ట్రాక్టర్ కింద పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని దేపూరు శుక్రవారం రాత్రి జరిగింద చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. చెందిన వై ఎల్లమ్మ (పుల్లమ్మ )(78) రజక వృత్తి చేసుకుంటూ జీవిస్తుంది. శుక్రవారం ఆత్మకూరుకు వచ్చి కొన్ని దుస్తులు తీసుకుని గ్రామానికి వెళ్తుంది. అదే సమయంలో సిమెంట్ ఇటుకలు, వరలు వేసుకుని వస్తున్న ట్రాక్టర్ వెనక్కు వచ్చే క్రమంలో వృద్ధురాలిని ఢీకొంది. దీంతో ట్రాక్టర్ వెనుక చక్రాలు ఆమె రెండు కాళ్లపై వెళ్లడంతో నుజ్జునుజ్జు అయి తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆత్మకూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతదేహానికి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ముదిగుబ్బ: రోడ్డు ప్రమాదంలో రంగనాథమ్మ (45) అనే మహిళ మృతి చెందిన ఘటన మడల పరిధిలోని దొరిగిల్లు మలుపు వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. ముదిగుబ్బ మండలం మారాలకు చెందిన చండ్రాయుడు, రంగనాథమ్మలు తన ఆరేళ్ల మనువడితో కలిసి, పులివెందుల వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో మారాల నుంచి బయలు దేరారు. బైక్ మార్గమధ్యంలో ముదిగుబ్బ మండలం దొరిగిల్లు క్రాస్ వద్ద ఉన్న మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపతప్పి సైడ్వాల్ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు చెల్లా చెదురుగా పడిపోయారు. గమనించిన స్థానికులు హుటాహుటిన రంగనాథమ్మ, చండ్రాయడులను ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్సచేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంగనాథమ్మ మృతి చెందగా ఆమె భర్త చండ్రాయుడు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఆరేళ్ల మనుమడికి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కావలిఅర్బన్ : డిష్ ప్లగ్ సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన స్థానిక చంద్రబాబునగర్ కాలనీలో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కాలనీకి చెందిన బాబు జలదంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్గా పని చేస్తున్నాడు. ఆయన భార్య వరమ్మ(38) ఇంట్లో డిష్ సక్రమంగా పనిచేయకపోవడంతో వైరును సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన పక్కింటి మహిళ ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె కూడా షాక్కు గురైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు విద్యుత్ను నిలిపి వేసి 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఆమె మృతితో భర్త, కుమారులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
బుచ్చిరెడ్డిపాళెం : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందిన సంఘటన స్థానిక కనిగిరి రిజర్వాయర్ సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... పప్పులవీధికి చెందిన పుట్టుబోయిన పద్మ (39), ఆమె కుమారుడు కార్తీక్ (19)తో కలిసి బైక్పై ఈ నెల 25వ తేదీన ఏఎస్పేట మండలం గంగవారిపల్లిలోని బంధువుల వివాహానికి వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం ఆత్మకూరు మండలం నల్లరాజుపాళెంలోని బంధువుల ఇంట్లో ఉండి శనివారం ఉదయం నెల్లూరుకు బయల్దేరారు. కనిగిరి రిజర్వాయర్ సమీపంలోని ఫిష్ సెంటర్ వద్ద ఉన్న కల్వర్టు వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పద్మ, కార్తీక్కు గాయాలయ్యాయి. ఇరువురిని 108 సిబ్బంది బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి పద్మ మృతి చెందిదని నిర్ధారించారు. కార్తీక్కు స్వల్పగాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆటో బోల్తా: వృద్ధురాలు దుర్మరణం
ఓజిలి : అతివేగంగా ప్రయాణిస్తున్న ఆటోబోల్తా పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మానమాల సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని కొండవల్లిపాడుకు చెందిన ఏల్చూరు ఆదెమ్మ (70) నేరేడు పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తుంది. రోజులానే గ్రామం నుంచి పండ్లు తీసుకుని కురుగొండలోని పాఠశాల వద్దకు Ðð ళ్లేందుకు మానమాలకు వచ్చింది. ఓజిలి నుంచి కురుగొండ వైపు ప్రయాణిస్తున్న ఆటోలో ఎక్కింది. గ్రామం సమీపంలోకి వచ్చే సరికి ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆదెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే స్థానికులు ఆదెమ్మను కురుగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బతుకుతెరువు కోసం వెళ్లిన ఆదెమ్మ అంతలోనే మృతి చెందిందని తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కొండవల్లిపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. -
వ్యాన్ ఢీకొని మహిళ మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బొంతుపేట గ్రామ శివారులోని జాతీయరహదారిపై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. మహిళ రోడ్డు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన వ్యాన్... ఆమెను ఢీకొట్టింది. ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. వ్యాన్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు. -
కారు బోల్తా : మహిళ మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి వద్ద శనివారం కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కుటుంబం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కారులో బయలుదేరింది. బేలుపల్లి క్రాస్ రోడ్డు వద్ద కారు అదుపు తప్పి.. పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రియ (35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, కుమారవేలు (35), లక్ష్మీకుమారి (65), శివమణి (49), విసు (35) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రియ మృతదేహాన్ని బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘తూర్పు’న ఘాట్ రోడ్లో..బస్సు బోల్తా
రాష్ట్రానికి చెందిన మహిళ మృతి చింతూరు/మారేడుమిల్లి: తూర్పు గోదావరి జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్లో సోమవారం వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన చింతగింజల విజయ(50) అనే మహిళ మృతి చెందింది. మరో 8 మంది గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 45 మంది భక్తులు గతనెల 29న తీర్థయాత్రలకు బయలుదేరారు. ఈ క్రమంలో సోమవారం మారేడుమిల్లి నుంచి భద్రాచలం బయలుదేరారు. బస్సు ఘాట్ రోడ్లో ఇజ్జలూరు సమీపంలో యూ టర్న్ తీసుకునే క్రమంలో అదుపు తప్పి పక్కనే లోయలోకి బోల్తా పడింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపుర్కు చెందిన విజయ బస్సులో ఇరుక్కుని మృతి చెందగా, డ్రైవర్, క్లీనర్తో పాటు ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. -
రైలు ఢీకొని... ఇద్దరు మహిళలు మృతి
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్లో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. రైలు దిగి పట్టాలు దాటుతున్న ఇద్దరు మహిళలను మరో రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మహిళలు అక్కడికక్కడే మరణించారు. వెంకటగిరి పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు గూడూరు సమీపంలోని కొండాయగుంట వద్ద పచ్చి మిరపకాయలు కొనుగోలు చేసి... వాటిని వెంకటగిరి మార్కెట్లో విక్రయించుకునేందుకు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చారు. వెంకటగిరి రైల్వే స్టేషన్లో దిగి ట్రాక్ దాటి పక్క ప్లాట్ఫామ్పైకి వెళుతున్న క్రమంలో ఆ ట్రాక్లో వచ్చిన రైలు వారిని ఢీకొంది. దీంతో వారు అక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నైటీతో భార్యను హతమార్చిన భర్త
కాకినాడ రూరల్ : నువ్వే ప్రాణమన్నాడు.. ఊపిరిగా ఉంటానన్నాడు.. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అనుమాన భూతం ఆవహించడంతో అతడికి కన్నూమిన్నూ ఆనలేదు. ఆమెను ఊపిరాడకుండా చేసి అంతమొందించాడు. నైటీతో భార్య గొంతు నులిమి హతమార్చిన భర్త ఉదంతం కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో గురువారం చోటుచేసుకుంది. సర్పవరం సీఐ మురళీకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.ముక్తేశ్వరం గ్రామానికి చెందిన కార్పెంటర్ కొప్పాడ సత్తిబాబు, పూజలక్ష్మి ఐదేళ్లు క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో కాపురం ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర పాప ఉంది. భార్య ప్రవర్తనపై సత్తిబాబు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. భార్యపై చేయి కూడా చేసుకునేవాడు. కార్పెంటర్ పని కోసం బయటకు వెళ్లొచ్చిన వెంటనే భార్యతో గొడవలు పడుతుండడంతో, పలుమార్లు పెద్దల దృష్టికి వివాదం వెళ్లేది. భార్యాభర్తల మధ్య సఖ్యత కుదిర్చి, కాపురానికి పంపేవారు. ఇలాఉండగా బుధవారం అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సత్తిబాబు తన భార్య మెడకు నైటీని బిగించి, ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉసురు తీసిన అనుమానం
భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త పొదిలి మండలం గోగినేనివారిపాలెంలో ఘటన.. గోగినేనివారిపాలెం (పొదిలి) : అనుమానపు భర్త చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన మండలంలోని గోగినేనివారిపాలెం ఎస్సీ కాలనీలో బుధవారం వేకువ జామున జరిగింది. హతురాలి బంధువుల క థనం ప్రకారం.. వివరాలు.. గ్రామానికి చెందిన దాసరి తిరుపతమ్మ(30)కు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుతో సుమారు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటేశ్వర్లు లారీ డ్రైవర్కాగా తిరుపతమ్మ ఇంటి వద్ద పనులకు వెళ్తుంటుంది. భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశ్వర్లు.. రెండేళ్ల నుంచి ఆమెను మానసికంగా.. శారీరకంగా హింసిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలం బెంగళూరు తదితర ప్రాంతాల్లో బేల్దారి పనులకు కూడా వెళ్లి వచ్చారు. ఇటీవల భర్త నుంచి హింస ఎక్కువ కావటంతో పెద్దలు జోక్యం చేసుకుని దంపతులకు సర్ది చెప్పారు. అయినా పరిస్థితి మారకపోవటంతో తిరుపతమ్మ కొన్ని రోజులుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో పుట్టింట్లో ఉన్న తిరుపతమ్మ బహిర్భూమి కోసం తెల్లవారు జామున ఒంటరిగా బయటకు వెళ్తుండగా వెంకటేశ్వర్లు ఆమెను అనుసరించి కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. విడాకుల కోసం నోటీసులిచ్చి.. కాపురానికి రాకపోవడంతో విడాకులు ఇవ్వాలని వెంకటేశ్వర్లు ఇటీవల తన భార్య తిరుపతమ్మకు నోటీసులు కూడా పంపాడు. నోటీసుల విషయమై ఆమె గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లగా మళ్లీ ఒకసారి సర్ది చెప్తామని, వ్యవహారం నోటీసుల వరకు ఎందుకని అన్నారని, ఇంతలోనే దారణం జరిగిందని బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కోడిపిల్ల కోసేందుకని కత్తి.. కోడిపిల్లను కోసుకునేందుకు కత్తి కావాలని పొరుగింటి వారిని వెంకటేశ్వర్లు అడిగాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో కోడిపిల్లను కోసుకోవటమేమిటని వారు ప్రశ్నించగా ఇప్పుడు దొరికితే ఇప్పుడు కోస్తాను.. లేదంటే తెల్లారి దొరికినా కోస్తానని నమ్మబలికాడు. వారు నిజమేననుకుని కత్తి ఇచ్చారు. ఆ కత్తితోనే భార్యను హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శశికుమార్లు పరిశీలించారు. బంధువుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఒంటికి నిప్పంటుకుని మహిళ మృతి
► కుమారుడి వివాహానికి వచ్చి దుర్ఘటన పాలు ► పెళ్ళింట అలుముకున్న విషాదం గుంటూరు రూరల్ : కట్టెల పొయ్యిలోని మంటలు ఒక్కసారిగా రేగి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన మహిళ మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం నగరంలో చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రి ఔట్ పోస్టు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన తియ్యగూర సుజాత(42) సినిమాల్లో అసిస్టెంట్ మేకప్ ఉమన్గా పనిచేస్తుంటుంది. ఈనెల 11న తన పెద్దకుమారుడు మాధవరెడ్డి వివాహం నిమిత్తం హౌసింగ్ బోర్డ్లోని తన తండ్రి పాములరెడ్డి ఇంటిలో వివాహం జరిపించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. 11న వెనిగళ్ళలో వివాహం పూర్తవగా, ఆదివారం హౌసింగ్ బోర్డ్లో సత్యనారాయణ వ్రతం జరిపారు. వెనిగళ్లలోని పెళ్లికూతురు ఇంటికి వెళ్లేందుకు సోమవారం ఉదయం బయలుదేరే క్రమంలో బంధువులకు నీళ్లు కాగబెట్టేందుకు సుజాత ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసింది. పొయ్యిలో కిరోసిన్ పోసి, పక్కన గోడపై ఉన్న కట్టెలను తీస్తుండగా, ఒక్కసారిగా కట్టెలు పొయ్యి పక్కనే ఉన్న కిరోసిన్ డబ్బా పడ్డాయి. దీంతో కిరోసిన్ మొత్తం పొయ్యిలో ఒలికిపోయి ఒక్కసారిగా మంటలు లేచి సుజాత చీరకు అంటుకున్నాయి. మంటలనుంచి తప్పించుకునే ప్రయత్నంలో సుజాత పొయ్యిలో పడిపోవడం గమనించి కొడుకు మాధవరెడ్డి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సుజాత శరీరం వెనుకభాగం 40 శాతం కాలిపోయింది. వెంటనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం బాధితురాలి బంధువులు ఎన్నారై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలు కొడుకు మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రూ.వెయ్యి కోసం మహిళ హత్య!
పోలీసుల అదుపులో నిందితులు అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు పీలేరు: మండలంలోని కంచెంవారిపల్లెలో బుధవారం తెల్లవారుజామున ఒక మహిళను దుండగులు రూ.1000 కోసం హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. పీలేరు మండలం తలపుల పంచాయతీ చిన్నయ్యగారిపల్లెకు చెందిన జె.మల్లయ్య కుమార్తె ఈశ్వరమ్మ(35)ను 15 ఏళ్ల క్రితం వేపులబైలు పంచాయతీ కంచెంవారిపల్లెకు చెందిన నరసింహులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె భార్గవి(14), కుమారుడు నరేంద్ర(5) ఉన్నారు. మూడేళ్ల క్రితం నరసింహులు మృతిచెందాడు. ఈశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. మంగళవారం వితంతు పెన్షన్ రూ.1000 తీసుకుంది. రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసి ఇంట్లో పడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈశ్వరమ్మ ఇంటిపక్కన శవమై పడి ఉండడాన్ని మరిది లక్ష్మినారాయణ గుర్తిం చాడు. ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వారికి, బంధువులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న పీలేరు ఎస్ఐ సురేష్బాబు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈశ్వరమ్మ ఐదేళ్లుగా స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో సహాయకురాలిగా పనిచేస్తోంది. అనాథలైన చిన్నారులు అనారోగ్యంతో తండ్రి మృతిచెందాడు. తల్లి హత్యకు గురికావడంతో పిల్లలు భార్గవి, నరేంద్ర అనాథలయ్యారు. భార్గవి స్థానిక జంగంపల్లె ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కుమారుడు నరేంద్ర అంగన్వాడీ కేంద్రానికి వె ళుతున్నాడు. తల్లికోసం చిన్నారులు విలపిస్తుంటే పలువురు కంటతడి పెట్టారు. అది పెన్షన్ డబ్బు పోలీసులు కంచెంవారిపల్లెకు చేరుకుని హత్యకు దారి తీసిన కారణాలపై గ్రామస్తులను ఆరా తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చంద్ర, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈశ్వరమ్మ మంగళవారం తీసుకున్న వితంతు పెన్షన్ రూ.1000ల కోసం గొంతునులిమి చంపేసినట్లు చంద్ర అంగీకరించినట్టు సమాచారం. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ తెలిపారు. -
రెప్పపాటులో ప్రాణాలు పోయాయి
ముంబై: ముంబైలోని బోరివాలి రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. రైల్వే ప్లాట్పాంకి, పట్టాలకు మధ్యనున్న గ్యాప్ కిరణ్ కొఠారి (55)ని పొట్టనపెట్టుకుంది. అనారోగ్యంతో ఉన్న సోదరుడిని పరామర్శించేందుకు వచ్చిన తమ బంధువు, తిరిగిరాని లోకాలకు తరలిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కిరణ్ కొఠారి ముంబైలో తన సోదరుడిని చూసి తిరిగి గుజరాత్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. పొరపాటున వేరే రైలు ఎక్కిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆమె.. కదులుతున్న రైల్లోంచి దిగుతూ.. రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఉన్న సందులో చిక్కుకుపోయింది. వెంటవున్న బంధువు తరుణ్ సిధ్వి ఆమెను రక్షించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అందరూ చూస్తుండగానే.. విలవిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో అక్కడున్నవారంతా దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఈ దృశ్యాలు స్టేషన్ లోని సీసీ టీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో రైల్వేశాఖ నిర్లక్ష్యంపై విమర్శలు చెలరేగాయి. ఇది చాలా విచారకరమైన సంఘటన అని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కాగా అధికారిక గణాంకాల ప్రకారం బోరివలి స్టేషన్ లో ఇలాంటివి మొత్తం 28 అటువంటి సంఘటనలు చోటుచేసుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ప్లాట్పాంకి, పట్టాలకు మధ్య గ్యాప్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. -
క్రికెట్ బాల్ తగిలి మహిళ మృతి
బహదూర్పురా (హైదరాబాద్): క్రికెట్ బాల్ తగిలి ఓ మహిళ మృతిచెందిన ఘటన హైదరాబాద్లోని ఓల్డ్సిటీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలాపత్తర్ బిలాల్నగర్ ప్రాంతానికి చెందిన ఎంఏ ఖయ్యూం కూతురు సబాన్ తస్లీమీన్ (31) గత నెల 26న మధ్యాహ్నం టెర్రాస్ పైకి వెళ్లింది. ఆ సమయంలో కింద కొందరు క్రికెట్ ఆడుతున్నారు. ఆటగాడు కొట్టిన బంతి టైరాస్పై ఉన్న తస్లీమీన్కు తగలింది. దీంతో ఆమె గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా నిమ్స్కు పంపించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న తస్లీమీన్ సోమవారం ఉదయం మృతి చెందింది. తస్లీమీన్ సోదరుడు మహ్మద్ డ్యానీస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు బోల్తా : మహిళ మృతి
విజయనగరం : విజయనగరం జిల్లా కూనేరు వద్ద శనివారం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాలోని రాయగఢ్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పారు. కారులోని వారు కోటపల్లికి చెందిన వారని చెప్పారు. -
గంగానమ్మకు గిరిజన మహిళ బలి
-
కరెంటు షాక్తో మహిళ మృతి
విద్యాదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. వలిగొండ మండలం మందవాగిలి గ్రామంలో కరెంటు షాక్తో మహబూదీ(35) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లో గోడలకు సున్నం వేస్తుండగా.. గోడకు కరెంటు సరఫరా అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందింది. -
వాహనం ఢీకొని మహిళ మృతి
గచ్చిబౌలి (రంగారెడ్డి): కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున గచ్చిబౌలిలోని హుందాయ్ షోరూం వద్ద రోడ్డు దాటుతున్న మహిళ(45)ను గచ్చిబౌలి వైపు నుంచి వచ్చిన ఓ కారు ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళా సర్పంచ్ మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద పడ్డ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా గండే డ్ మండలం మహ్మదాబాద్ గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.,.. మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండలం పల్లెల్ర గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి(31) తన సోదరుడు అనిల్(24)తో కలిసి మహబూబ్నగర్ నుంచి కోస్గి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన రెండు బైకులు పరిగి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడ్డాయి. దీంతో విజయలక్ష్మి, అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
వికటించిన కు.ని. ఆపరేషన్ !
మదనపల్లె రూరల్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. దీంతో బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సోమవారం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ములకలచెరువు మండలం చెరువుకిందపల్లెకు చెం దిన ఎం.నరసింహులు భార్య కల్పన(19)కు ఆరునెలల క్రితం రెండో కాన్పు లో బాబు పుట్టాడు. బి.కొత్తకోటలో సోమవారం జరిగిన కుటుంబ నియం త్రణ ఆపరేషన్కు తీసుకెళ్లారు. డాక్టర్ ఆమెతో పాటు మరో 15 మందికి కు.ని ఆపరేషన్లు నిర్వహించారు. అయితే కల్పన పొత్తికడుపు నుంచి రక్తస్రావం అధికం కావడంతో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. 108 ద్వారా మదనపల్లెకు వచ్చిన కల్పనను వైద్యులు బతికించడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. చివరకు కల్పన మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి భర్త నరసింహులు, సీపీఐ, బాస్ నాయకులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బైఠాయించి డాక్టర్ల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రాస్తారోకో నిర్వహించా రు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ, బాధ్యులైన డాక్టర్లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టూ టౌన్ సీఐ హనుమంతునాయక్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఇద్దర్ని మింగేసిన మలేరియా !
సాలూరురూరల్ : సాలూరు మండలంలో మలేరియా విజృంభించింది. పలుగ్రామాల్లో ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. మలేరియా కాటుకు శుక్రవారం రాత్రి ఓ చిన్నారి, మహిళ బలయ్యారు. తోణాం పంచాయతీ సిమిడివలస కొత్తూరు గ్రామానికి చెందిన గెమ్మెల సమీర(4), కొత్తవలస పంచాయతీలో గల గదబకరకవలస గ్రామానికి చెందిన మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు మజ్జి బుచ్చమ్మ(60) అనే మహిళ మృత్యువాత పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సిమిడివలస గ్రామంలో 20 మంది జ్వరాలతో మంచం పట్టారు. కొర్ర సింహాద్రి, గెమ్మెల చరణ్, గెమ్మెల రాజు,గెమ్మెల కమల, గెమ్మెల నర్సమ్మ,కొర్ర సీతమ్మ, గర్బిణి కొర్ర లక్ష్మి, ఆమె కుమార్తె కొర్ర స్వప్న ఇలా గ్రామంలో ఇంటికి ఒకఇద్దరు చొప్పున జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో జ్వరాలు ప్రబలినా వైద్య సిబ్బంది గాని, ఆశ వర్కర్లు గాని , ఏఎన్ఎంలుగానీ తమ గ్రామానికి రాలేదని గ్రామస్తులు తెలిపారు. వైద్యం అందకే ... మృతి చెందిన చిన్నారి సమీర తల్లి మాట్లాడుతూ తన కుమార్తె మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ మృతి చెందిందని భోరున విలపిస్తూ తెలిపింది. తమ గ్రామం నుంచి 20 కిలోమీటర దూరంలో గల మామిడిపిల్లి పీహెచ్సీకి వెళ్లలేక, తమ గ్రామంలో వైద్య సేవలందించవలసిన తోణాం పీహెచ్సీ వైద్య సిబ్బంది ఇక్కడకు రాకపోవడంతో తన పాపకు వైద్యం అందలేదని ఆమె తెలిపింది. రెండు సంవత్సరాల క్రితం రెండో పాప కడుపులో ఉండగా, మలేరియా జ్వరంతో తన భర్త చనిపోయాడని, ఇప్పుడు పెద్ద కుమార్తెను కూడా జ్వరం పొట్టనపెట్టుకుందని రోదిస్తూ తెలిపింది. మలేరియాతో మృతి చెందిన బుచ్చమ్మ....మధ్యాహ్న భోజన పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచి పనిచేస్తోందని, ఆమె మృతితో కుటుంబం రోడ్డున పడిందని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.వై నాయుడు తెలిపారు. ఆమె కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వణికిపోతున్న మన్యం మలేరియా మహామ్మారి విజృంభిస్తుండడంతో మన్యం ప్రజలు వణికిపోతున్నారు. ఏటా వర్షకాలంలో వస్తే చాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బితుకుబితుకుమంటూ గడపవలసి వస్తోంది. ఇప్పటకే జిల్లా 2,115 మందికి పైగా మలేరియాతో బాధపడుతున్నారు. వీరిలో 1900 మంది వ్యాధిగ్రస్తులు గిరిజన ప్రాంతానికి చెందిన వారే. దోమ తెరల పంపిణీ, దోమల నివారణ మందు స్ప్రెయింగ్ తదితర కార్యక్రమాలు వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్నప్పటికి మలేరియాను మాత్రం అదుపుచేయలేకపోతున్నారు. -
పరువుతీస్తోందని ప్రాణం తీశాడు
- వీడిన మహిళ హత్య మిస్టరీ - భర్తే నిందితుడు - వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ శివశంకర్ తాండూరు రూరల్: విచ్చలవిడిగా తిరుగుతూ కుటుంబం పరువు తీస్తోందని అవమానానికి గురైన భర్త భార్యను చంపేశాడు. ఈనెల 15న యాలాల మండల పరిధిలోని బండమీదిపల్లి శివారులో వెలుగుచూసిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన మృతురాలి ఫొటో ఆధారాల ద్వారానే హతురాలిని కుటుంబీకులు గుర్తించారు. ఈక్రమంలేనే కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం కరన్కోట్ ఠాణాలోని తన కార్యాలయంలో రూరల్ సీఐ శివశంకర్ కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 15న తిమ్మాయిపల్లి అనుబంధ బండ మీదిపల్లి శివారులోని అడవిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శివశంకర్ వివరాలు సేకరించారు. మహిళ తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. మృతదేహం కాలిపోయింది. దీంతో హతురాలిని గుర్తించే వీలులేకుండా పోయిం ది. ఘటనా స్థలంలో లభించిన చెప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హతురాలి చేతిపై పచ్చబొట్టు, రోల్డ్గోల్డ్ గాజలు ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ రమేష్ క్రైం విభాగం కానిస్టేబుళ్లు హరీశ్వర్రెడ్డి,ప్రేమ్కుమార్, రమేష్తో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం హతురాలికి సంబంధించిన ఆధారాలతో కూడిన పోస్టర్ ఈనెల 17న ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైంది. దీని ఆధారంగా హతురాలిని దోమ మండలం గుండాల గ్రామానికి చెందిన చాకలి ఎర్ర గంగమ్మగా ఆమె కూతురు ఏడో తరగతి చదువుతున్న స్వప్న గుర్తించింది. గ్రామస్తుల సహాయంతో దోమ పోలీసులకు సమాచారమిచ్చింది. అక్కడి పోలీసులు జరిగిన విషయాన్ని తాండూరు పోలీసులకు తెలిపారు. ఇక్కడి పోలీసులు స్వప్న నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. తన తల్లి హత్య విషయమై తండ్రి చెన్నయ్యపై స్వప్న అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు హతురాలి భర్త చెన్నయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా తానే గంగమ్మను చంపేసినట్లు అంగీకరించారు. చంపేసి తలనీలాలు సమర్పించి.. దోమ మండలం గుండాల గ్రామానికి చెందిన చాకలి చెన్నయ్య, ఎర్ర గంగమ్మ(35) దంపతులు. చెన్నయ్య కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి ఓ కొడుకు, కూతురు స్వప్న ఉన్నారు. చాకలి చెన్నయ్యకు ముగ్గురు భార్యలు. మొదటి భార్య ఎర్ర గంగమ్మ. రెండో భార్య సువర్ణ, మూడో భార్య కళమ్మ ఉన్నారు. సువర్ణ గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. అయితే గంగమ్మ కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా తిరుగుతోంది. ఆమె తాండూరులోని ఇందిరానగర్లో ఓ అద్దెగదిలో ఒంటరిగా ఉంటోంది. చెడుతిరుగుడు మానుకోవాలని పలుమార్లు చెన్నయ్య భార్యను మందలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గంగమ్మ కుటుంబ పరువు పోతోందని చెన్నయ్య మనోవేదనకు గురయ్యాడు. ఎలాగైనా భార్యను చంపేయాలనుకొని పథకం పన్నాడు. ఈక్రమంలో ఈనెల 12న చెన్నయ్య కత్తి, పెట్రోల్ తీసుకొని తాండూరుకు బైక్పై వచ్చాడు. పట్టణంలోని బసవణ్ణ కట్ట వద్ద ఉన్న భార్య గంగమ్మ వద్దకు వెళ్లి కూతురు స్వప్న ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆమెను వాహనంపై ఎక్కించుకొని బయలుదేరాడు. మార్గమధ్యంలో యాలాల మండలం బండమీదిపల్లి గ్రామ శివారులోని అడవిలోకి తీసుకెళ్లి రాళ్లతో గంగమ్మ తలపై మోదాడు. ఆమె చనిపోయిన తర్వాత తలను మొండెం నుంచి వేరుచేశాడు. పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్చివేసి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత చెన్నయ్య తన కూతురు స్వప్నను తీసుకొని శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి తలనీలాలు సమర్పించాడు. ఈవిషయమై తండ్రిని ప్రశ్నించగా మీ అమ్మ గంగమ్మ శని నాపై ఉంది అందుకే తలనీలాలు తీసేశానని నమ్మించాడు. స్వప్న తన తండ్రిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు చెన్నయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించి పైవిషయాలు తెలిపాడు. ఈమేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చే సి రిమాండుకు తరలించారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన యాలాల ఎస్ఐ రమేష్తో పాటు కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు. కేసు ఛేదనకు పరోక్షంగా సహకరించిన ‘సాక్షి’ దినపత్రికను సీఐ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
పిడుగుల బీభత్సం
- అర్లెలో మహిళ మృతి - చింతలూరులో రెండు గేదెలు.. - చీడికాడలో ఆవు, దూడ - పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం - చోడవరం, మాడుగుల, పాడేరుల్లో భారీ వర్షం చోడవరం/మాడుగుల: మాడుగుల, చోడవరం, పాడేరు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. సమారు 30 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. పెద్ద పెద్ద శబ్ధాలతో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. పిడుగుల ధాటికి మాడుగుల నియోజకవర్గం పరిధిలో ఒక మహిళ, రెండు గేదెలు, ఆవు, దూడ దుర్మరణం చెందాయి. గాలులకు చెట్ల కొమ్మలు తీగలపై పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మాడుగుల మండలంలోని వివిధ గ్రామాల్లో చీకడి అలుముకుంది. మరి కొన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఎయిర్టెల్ నెట్ వర్క పూర్తిగా నిలిచిపోయింది.సెల్ సిగ్రల్ లేక వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. చింతలూరులో పిడుగు పడి రెండు పాడి గేదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఏడువాక గణేష్ వర్షం పడుతోందని బయట ఉన్న రెండు గేదెలను పాకలోకి చేర్చాడు. మరో రెండింటిని తీసుకురావడానికి వెళుతుండగా వాటిపై పిడుగు పడింది. అవి అక్కడికక్కడే చనిపోయాయి. గణేష్ స్పృహతప్పి పడిపోయాడు. ఇంటికి తీసకొచ్చి సపర్యలు చేపట్టడంతో కోలుకున్నాడు. చోడవరం, కె.కోటపాడు, దేవరాపల్లి ,బుచ్చయ్యపేట, చీడికాడ, మాడుగుల ,రావికమతం మండలాలతో పాటు పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. బుచ్చెయ్యపేట , చోడవరం మండలాల్లో పలుచోట్ల పిడుగులు పడినప్పటికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పిడుగుపడి మహిళ మృతి కె.కోటపాడు: మండలంలోని ఆర్లె గ్రామానికి చెందిన నంబారు పెంటమ్మ(57) పిడుగుపాటుకు శుక్రవారం మృతిచెందింది. పొలానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా ఆమె సమీపమలో పిడుగు పడి చనిపోయింది. మండలమంతటా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పెద్ద ఎత్తున పిడుగులు పడ్డాయి. ఆవు,దూడ మృతి చీడికాడః మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. పిడుగులకు చీడికాడలో ఒక ఆవు,ఒక దూడ మృతి చెందాయి. ఈ ప్రమాదం నుంచి రెప్పపాటులో ఓ రైతు బయట పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పోతల చిన్నంనాయుడు కల్లంలో ఆవు,దూడ,మరో గెదే సమీపంలోని చింత చె ట్టుకు కట్టేసి ఉన్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. పశువులు తడిసిపోతున్నాయని చిన్నంనాయుడు వదిన కొడుకు తురువోలుకు చె ందిన పాత్రిని సన్యాసినాయుడు తొలుత గేదెను పశువుల పాకలో కట్టాడు. ఆవు, దూడ దగ్గరకు వెళుతుండగా చింత చెట్లుపై పెద్ద శబ్ధంతో పిడుగుపడింది. క్షణంలో అవి గింజుకుంటూ చనిపోయాయి. మరో ఐదు అడుగుల వెసివుంటే సన్యాసినాయుడు పిడుగుపాటుకు గురయ్యేవాడు. సంఘటన స్థలాన్ని చీడికాడ పశువైద్యాధికారి భాస్కరరావు పరిశీలించారు. -
వడగాలులు..చిరుజల్లులు
ఎండలకు పెద్దలే తల్లడిల్లిపోతుంటే.. పసివాళ్లేం భరించగలరు. అందుకే గొంతెండిపోతుంటే ఓ బాలుడు వీధి కొళాయి నీటి ధారల్ని ఆత్రంగా తాగాడు. రావికమతం సినీమాహాలు సమీపంలో సోమవారం కనిపించిందీ దృశ్యం. - ఈదురుగాలులతో వింత వాతావరణం - ఓ మహిళ దుర్మరణం సాక్షి, విశాఖపట్నం : తీవ్ర వడగాడ్పులతో జిల్లా, నగరం అట్టుడుకిపోతోంది. వడదెబ్బకు మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజు రోజు రోజుకూ పెరిగిపోతోంది. సోమవారం మరో 31 మందిని పొట్టనబెట్టుకుంది. వీరిలో జిల్లాలో 20 మంది, నగర పరిధిలో 11 మంది ఉన్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. నగరం (విమానాశ్రయం)లో సోమవారం 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదివారం (45 డిగ్రీలు)తో పోల్చుకుంటే ఇది దాదాపు 4 డిగ్రీలు తక్కువ. అయినా ఉష్ణతీవ్రత అటు నగరంలోను, ఇటు జిల్లాలోనూ బాగానే కనిపించింది. ఉదయం నుంచి ఉడుకును వెదజల్లుతూనే ఉంది. అయితే ఆరు రోజుల నుంచి అదే పనిగా వణికిస్తున్న వడగాడ్పులతో అల్లాడుతున్న జనానికి సోమవారం సాయంత్రం ఒకింత సాంత్వన చేకూర్చింది. సాయంత్రం అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో పాటు తేలికపాటి జల్లులు కురిసి వాతావరణాన్ని చల్లబరిచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ గాలులకు దుమ్ము, ధూళి ఎగసి పడింది. నగరంలోని మురళీనగర్, శివారు ప్రాంతాలు, పెందుర్తి, అడవివరం, గాజువాక, దబ్బందతో పాటు చోడవరం, చీడికాడ, కె.కోటపాడు ప్రాంతాల్లో కొన్నిచోట్ల జల్లులు, మరికొన్ని చోట్ల వర్షం కురిసింది. తొలుత భారీ ఈదురుగాలులు హడావుడి చేశాయి. తర్వాత జల్లులు కురిసి వేడి తీవ్రతను కాస్త తగ్గించడంతో జనం ఊరట చెందారు. జిల్లాలోని ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు శివారు నీలాద్రిపురంలో ఈదురుగాలులకు చెట్టుపడి నూకరత్నం అనే మహిళ దుర్మరణం పాలయింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి పగలు వేడిగాలులు కొనసాగుతూ సాయంత్రం వేళ ఇలాంటి వాతావరణమే కొన్నాళ్లు ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
మహిళ దారుణహత్య.. ప్రియుడే కాలయముడు ఖమ్మం: వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం శాంతినగర్ ప్రాంతంలో నివసిస్తున్న గంధం కళావతి(45)కి 20 ఏళ్ల క్రితం ఓ కానిస్టేబుల్తో పెళ్లయింది. వీరికి ఓ కొడుకున్నాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఖమ్మంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కళావతి జీవిస్తుంది. ఆమెతోపాటు ఆమె కుమారుడు ఉంటున్నాడు. కొడకు రాజేష్ (18) లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రవీణ్తో కళావతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. మద్యం తాగి కళావతిని ప్రవీణ్ నిత్యం వేధించేవాడు. తన తల్లిని వేధించడం మానుకోవాలని రాజేష్ హెచ్చరించినా.. ప్రవీణ్లో మార్పురాలేదు. బుధవారం రాత్రి కుమారుడు ఇంటికి వచ్చే సరికి గదిలో కళావతి చాపమీద నిర్జీవంగా పడి ఉంది. వెంటనే రాజేష్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు స్థానికులు విచారించగా ఉదయం నుంచి ప్రవీణ్ ఆమెతోనే ఉన్నట్లు, ఆమెతో గొడవ జరిగినట్లు తెలిపారు. తన తల్లిని ప్రవీణే చంపాడని పోలీసులకు రాజేష్ ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్ ఆమెతో గొడవపడి వెనుక గదికి తీసుకోని వచ్చి ముఖంపై దిండు పెట్టి హత్య చేసి ఉండొచ్చని తేదా గొంతు నులిమి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని మార్చురికీ తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రేణిగుంటలో మహిళ హత్య
రేణిగుంట: రేణిగుంట బుగ్గవీధి వీధిలో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేణిగుంట పోలీసుల కథనం మేరకు.. బేల్దారి శివ బుగ్గవీధిలో నివాసముంటున్నా డు. తరచూ అతని ఇంటికి 35 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ వచ్చి వెళ్లేది. మూడు రోజులుగా తాళం వేసిన శివ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, సీఐ బాలయ్య, ఎస్ఐ మధుసూదన్రావు, ఏఎస్ఐ భక్తవత్సలం అక్కడికి చేరుకుని ఇంటి తాళం పగులగొట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. డీఎస్పీ నంజుండప్ప స్థానికులను విచారిం చగా గురువారం రోజున శివ తన ఇం టికి వచ్చే మహిళతో గొడవపడినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఆయన కనబడడం లేదని తెలిపారు. శివే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని అక్కడే ఉంచి సోమవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. రేణిగుంట సీఐ బాలయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలోమహిళ మృతి
రంగారెడ్డి : దోమ మండలం ఐనాపురం గ్రామంలో ఓ మహిళ(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఐనాపురం గ్రామానికి చెందిన మహిళ ఆదివారం రాత్రి నుంచి కనిపించలేదు. ఈ క్రమంలో ఆమె గ్రామ సమీపంలోని పొలాలల్లో సోమవారం ఉదయం శవమై కనిపించింది. ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమదాలవలసలో మహిళ హత్య
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని 13వవార్డు కొత్తకోటవారి వీధికి చెందిన అన్నపూర్ణసాహు (55) అనే మహిళ సోమవారం తెల్లవారు హత్యకు గురయ్యారు. బంగారం కోసమే ఆమెను దుండగలు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పెనుగులాటలో దుండగలు నెట్టేయడంతో ఆమె చనిపోయి ఉంటారని చెబుతున్నారు. కానీ మృతురాలి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. సాహు ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమెను సోమవారం తెల్లవారు కొంతమంది దుండగులు హతమార్చి ఇంట్లోని 5 తులాల బంగారంతో పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఆ ఇంటి మేడపై అద్దెకు నివాసముంటున్న ఓ మహిళ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సాహుకు ఒక కుమార్తె. అన్నపూర్ణ భర్త రఘునాథ్ చాన్నాళ్ల క్రితం చనిపోయారు. ఈమే పిల్లలను పెంచి పెద్దచేసింది. కుమారుడు ఓ ఘటనలో 5 ఏళ్లక్రితం మృతి చెందాడు. కుమార్తె మానసకుమారికు వివాహం చేయడంతో ఆమె ఇచ్ఛాపురంలో ఉంటోంది. సాహు హత్యతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. జాడ పట్టలేని డాగ్స్కాడ్: శ్రీకాకుళం డాగ్స్క్వాడ్, క్లూస్టీం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. క్లూస్టీం ఇంట్లో కొన్ని ఆధారాలు సేకరించింది. డాగ్స్క్వాడ్ ఆ ఇంటి ఎదురుగా ఉన్న సందులోంచి పరుగులు పెడుతూ కొత్తకోటవారివీధి చివర ప్రధాన రహదారిపైకి వచ్చింది. అక్కడ నుంచి డాగ్ హంతుకు జాడ తెలియకపోవడంతో వెనుదిరిగింది. అప్పటికే రోడ్లపై జనసంచారం ఎక్కువగా ఉండడంతో హంతకులు వెళ్లే జాడ కనిపెట్టలేక పోయిందని డాగ్స్క్వాడ్ సిబ్బంది చెప్పారు. హత్యపై ఎలాంటి ఆధారాలు లభించలేదని.. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేసి హంతకులను పట్టుకుంటామని సీఐ సింహాద్రి నాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు ఎస్ఐ కె.గోవిందరావు కేసు నమోదు చేశారు. ప్రజల్లో ఆందోళన: పట్టణ నడిబొడ్డున జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఓ మహిళ హత్యకు గురికావడంతో పట్టణ వాసులు భయాందోళనకు గురౌతున్నారు. రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అప్రమత్తం అయి నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు. -
తిరుపతి విఎన్ఆర్ అపార్ట్మెంట్లో మహిళ హత్య
-
మహిళలే అతడి టార్గెట్..
ఒంటరిగా ఉన్న మహిళలే అతడి టార్గెట్. భార్య సహాయంతో వారితో మాటలు కలుపుతాడు. తర్వాత కిడ్నాప్ చేస్తాడు. ఆభరణాలు దోచుకుని కొట్టి చంపేస్తాడు. తర్వాత ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని దూరంగా తీసుకెళ్లి తగలబెట్టేస్తాడు. ఇలా ఐదు హత్యలు చేశాడు. పాపం పండింది. గుర్తుతెలియని మహిళల హత్యల మిస్టరీ వీడింది. హంతకుడు కటకటాల పాలయ్యాడు. కామారెడ్డి : సెప్టెంబర్ 30.. పూర్తిగా తెల్లవారకముందే నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. జాతీయ రహదారి పక్కన టేక్రియాల శివారులో ఓ మహిళ మృతదేహం ఉందని కాల్ సారాంశం. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. హంతకులు హత్య చేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. శవం పూర్తిగా కాలిపోయి ఉండడంతో గుర్తుపట్టడానికి వీలు కాలేదు. దీంతో హతురాలెవరో.. హంతకులెవరో తెలుసుకోవడం సవాల్గా మారింది. గుర్తు తెలియని మహిళ హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత.. నవంబర్ 4వ తేదీన ఇదే రకంగా జాతీయ రహదారిపై దగ్గి చౌరస్తా వద్ద మరో మహిళ శవం పడిఉందని పోలీసులకు సమాచారం అందింది. టేక్రియాల వద్ద మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోగా.. ఇక్కడ ముఖం కొంచెం గుర్తుపట్టే విధంగా ఉండడంతో పోలీసులు మృతదేహాన్ని ఫొటోలు తీయించి జిల్లాలోని పోలీసు స్టేషన్లతోపాటు పొరుగు జిల్లాలకు పంపించారు. అంతటితో ఆగకుండా ఆయా ప్రాంతాల్లో అదృశ్యం కేసులను పరిశీలించారు. కామారెడ్డి డీఎస్సీ ఏ.భాస్కర్ ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ సీఐ కోటేశ్వర్రావు పరిశోధన మొదలుపెట్టారు. ఫోటో ఆధారంగా హతురాలి గుర్తింపు ఫొటో ఆధారంగా హతురాలెవరో తెలిసిపోయింది. హత్యకు గురైన మహిళను మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గౌరిశెట్టి పుష్ప(53)గా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు పోస్టుమార్టం గదిలో శవాన్ని పరిశీలించి, ఆమె పుష్ప అని నిర్ధారించారు. నవంబర్ 3న రాత్రి పుష్పకు ఎవరో ఫోన్ చేయడంతో ఇప్పుడే వస్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదని వారు పోలీసులతో తెలిపారు. ఆమె ఫోన్ కాల్ లిస్ట్ను పోలీసులు పరిశీలించారు. చివరి కాల్స్ ఆధారంగా కేసు ఓ కొలిక్కి వచ్చింది. హతురాలు పుష్ప ఇంటి పనిమనిషి మల్లవ్వ నంబర్ నుంచి ఫోన్ రావడంతో బయటికి వెళ్లిందని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. సిద్దిపేటకు సమీపంలోని నారాయణరావుపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ సలీం భార్య మల్లవ్వ. ఆమె పుష్ప ఇంట్లో పనిమనిషిగా ఉండేది. ఆమె ద్వారా సలీం పుష్పను ఇంటి నుంచి బయటకు రప్పించాడు. మాయమాటలు చెప్పి తన కారులో తీసుకెళ్లాడు. పుష్ప మెడలో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలను వారు దోచుకున్నారు. పుష్ప తలపై కర్రతో కొట్టడంతో ఆమె చనిపోయింది. అదే కారులో మృతదేహాన్ని తీసుకుని దగ్గి చౌరస్తా వద్దకు వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు. బంగారం కోసమే హత్య చేసినట్లు అంగీకరించారు. సిద్దిపేటకే చెందిన మరో మహిళ టేక్రియాల వద్ద మహిళను తగలబెట్టిందీ తామేనని నిందితులు అంగీకరించారు. హతురాలు సిద్దిపేటకు చెందిన గోదాం రాజవ్వ అని పేర్కొన్నారు. ‘సిద్దిపేటకు చెందిన గోదాం రాజవ్వ(60) సెప్టెంబర్ 29 వ తేదీ రాత్రి సిద్దిపేట బస్టాండ్లో మల్లవ్వ, సలీంలకు కనిపించింది. ఆమెకు మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకున్నారు. సిద్దిపేట దాటగానే రాజవ్వను చంపేసి, ఆమె మెడలోఉన్న రెండున్నర తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం శవాన్ని కారులో వేసుకుని, టేక్రియాల శివారులో తగలబెట్టారు. కరీంనగర్ జిల్లాలో.. సిద్దిపేట నుంచి వృద్ధ మహిళలను కిడ్నాప్ చేసి ఆభరణాలు దోచుకున్న తర్వాత కొట్టి చంపి తీసుకెళ్లి కామారెడ్డి ప్రాంతంలో పడేసి దహనం చేసిన హంతకుడు సలీం.. కరీంనగర్ జిల్లాలోనూ పలు హత్యలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ జిల్లాలో ముగ్గురిని చంపినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. బంగారం కోసమే హత్యలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మాయమాటలతో మహిళలను కారులో ఎక్కించుకుని, ఆభరణాలు దోచుకుని, చంపి, తగలబెట్టడం సలీంకు అలవాటుగా మారింది. ఎక్కడా పోలీసులకు చిక్కకుండా సలీం జాగ్రత్తపడేవాడు. అయితే దగ్గి వద్ద దహనం చేసిన మహిళ ముఖం పూర్తిగా కాలకపోవడం వల్ల హతురాలిని గుర్తించడం సులువైంది. తద్వారా హంతకుడు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. -
నగరం ఘోరం
భాగ్యనగరం నేరాలు... ఘోరాలకు రాజధానిగా మారుతోంది. డబ్బుపై ఆశ... అడ్డదారిలో సంపాదించాలనే దురాశతో కొంతమంది రాక్షసులుగా మారుతున్నారు. విలువైన ప్రాణాలను హరిసృ్తన్నారు. హత్యాయత్నాలకు ఒడిగడుతున్నారు. యుక్తవయస్సులోనే అనేక మంది నేరస్తులుగా మాృుతున్నారు. ఈ క్రమంలో పసిపిల్లల ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఇక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. బాటసింగారంలో డబ్బు కోసం మిత్రులతో కలసి బంధువుల కుమారుణ్ణి అపహరించిన ఓ వృక్తి...తన పన్నాగం బెడిసికొడుతుందని గ్రహించి ఆ పిల్లాడిని అంతమొందించగా... నిజాం పేట్లో నగల కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను హత్య చేశారు. సూరారంలో ఓ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన ఓ వ్యక్తి...నగల కోసం ఆ ఇంట్లోని మహిళపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలు నగరంలో సంచలనం సృష్టించాయి. సాయంత్రం 3.45 గంటలు... సూరారం గ్రామం. మాధవి అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. బంధువైన గడ్డం శ్రీనివాసరెడ్డి ఆమె భర్త కోసం వచ్చానని చెప్పి..ఇంట్లోకి ప్రవేశించాడు. తన మిత్రులతో కలసి ఆమె మెడలోని పుస్తెలతాడును కాజేయాలని ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో గొంతు కోసేశాడు. ఆమె కేకలు విని చుట్టు పక్కల వారు స్పందించడంతో నిందితులు పరారయ్యారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఉదయం 11.30- 12 గంటలు... నిజాంపేట్ బృందావన్ కాలనీ ప్లాట్ నెం.39. ఇంట్లో ఒంటరిగా ఉన్న అన్నపూర్ణ(54) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు పొట్టన పెట్టుకున్నారు. ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. పోలీసులు తమ ఆచూకీ తెలుసుకోకుండా ఉండేందుకు నిందితులు ఆమె మృతదేహంపై కారం చల్లి పరారయ్యారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
-
భార్య శవంతో పోలీసుల ఎదుట లొంగిపోయిన భర్త
-
భార్య శవంతో పోలీసుల ఎదుట లొంగిపోయిన భర్త
చిత్తూరు: చిత్తూరు జిల్లా సంగరాయకుంటలో దారుణం చోటు చేసుకుంది. సలీం అనే వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఆమెను గత అర్థరాత్రి కత్తితో పొడిచి పాశవికంగా హత్య చేశాడు. అనంతరం అతడు భార్య శవంతో పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడ్ని విచారిస్తున్నారు. -
క్షుద్ర పూజలతోనే వివాహిత మృతి
బాధితుల ఆరోపణ, మాంత్రికుడితో వాగ్వాదం.. పోలీసుల అదుపులో లక్ష్మీనారాయణ చిన్నకోడూరు : చేతబడి చేయడం వల్లే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ మండలం చౌడారం గ్రామానికి చెందిన బాధిత కుటుంబీకులు బుధవారం రాత్రి మంత్రాలు వేసే వ్యక్తితో గొడవకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చౌడారం గ్రామానికి చెందిన పండుగ రజిత (24) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలు ఆస్పత్రులు తిరిగినా జబ్బు నయం కాలేదు. అయితే రజితకు ఎవరో చేతబడి చేశారని, తనకు కొంత డబ్బులు ఇస్తే పూజలు చేసి నయం చేస్తానని అదే గ్రామానికి చెందిన కట్కోజుల లక్ష్మీనారాయణ నమ్మించాడు. దీంతో రజిత కుటుంబసభ్యులు లక్ష్మీనారాయణకు రూ. 50 వేలు ఇచ్చారు. అతను నెల రోజులుగా క్షుద్ర పూజలు చేస్తూ, వివిధ మందును రజితకు తాపించాడు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి బుధవారం సాయంత్రం మృతి చెందింది. దీంతో భర్త రమేష్తో పాటు కుటుంబీకులు లక్ష్మినారాయణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్, ఎస్ఐ ఆనంద్గౌడ్లు అక్కడికి చేరుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఎస్ఐను వివరణ అడగగా లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నామని, అయితే కేసు నమోదు చేయలేదని తెలిపారు. -
అంతుచిక్కని వ్యాధితో యువతి మృతి
మక్కువ : స్థానిక ఆగూరు వీధికి చెందిన ఆగూరు కుమారి (21) అనే వి ద్యార్థిని అంతుచిక్కని వ్యాధితో శనివారం మృతి చెందింది. ఇరవై రోజు లుగా ఆమెను కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేకపోయింది. కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కుమారికి కొద్దిరోజుల కిందట జ్వరం రావడంతో ఆమెకు స్థానిక ప్రైవేటు వైద్యుడు (ఆర్ఎంపీ) వారం రోజులు పాటు వైద్యసేవలందించారు. అయితే ఆరోగ్యం బాగుపడకపోవడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి పార్వతీపురంలోనే ఓ ప్రై వేటు ఆస్పత్రికి, అక్కడ నుంచి రాజాం జీఎం ఆర్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఎ క్కడా ఆమెకు నయం కాలేదు. దీంతో మెరుగైన వైద్యసేవల కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వారం కిందట తీసుకెళ్లారు. ఆ ఆస్పత్రిలోనే వైద్య సేవలు పొందుతూ శనివారం ఈ విద్యార్థిని మృతి చెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. కుమారి పార్వతీపురం మండలం మరిపివలస సమీపంలో ఉన్న కళాశాలలో బీఈడీ విద్యార్థిని. ముగ్గురు కుమార్తెల్లో ఈమె రెండో కుమార్తె. తల్లిదండ్రులు లక్ష్మి, శ్రీరాములు గుండెలవిసేలా రోదించారు. సెరిబ్రల్ మలేరియాతోనేనా..? కుమారి సెరిబ్రల్ మలేరియాతో మరణించినట్లు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఆస్పత్రిలో మలేరియా వ్యాధికి సంబంధించిన మందులు అందించినా కుమారికి నయం కాలేదు. విశాఖపట్నానికి చెందిన వైద్యాధికారులు టెస్ట్లు, స్కానింగ్ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించ లేదు. వైద్యాధికారులు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేసినా రిజల్ట్ రాకముందే కుమారి మృతి చెందడంతో వెంటనే విశాఖపట్నం నుంచి గ్రామానికి తీసుకువచ్చారు. దీంతో ఆమెకు ఏ వ్యాధి సోకిందో కుటుంబసభ్యులకు కూడా తెలీకుండా పోయింది. అయితే సెరిబ్రల్ మలేరియా, బ్రెయిన్ ట్యూమర్ సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. -
మహిళను తొక్కి చంపేసిన ఏనుగు
పశ్చిమబెంగాల్లోని జల్పాయిగురి అడవుల్లో ఓ గిరిజన మహిళను ఏనుగు తొక్కి చంపేసింది. ఆమె మృతదేహం మారాఘాట్ రేంజిలో మంగళవారం కనిపించినట్లు అటవీ శాఖాధికారి ఒకరు తెలిపారు. అడవిలో వంటచెరుకు తెచ్చుకోడానికి నలుగురు మహిళలు కలిసి వెళ్లారని, అప్పుడే వారికి పెద్ద ఏనుగు కనిపించిందని, వాళ్లలో ముగ్గురు ఎలాగోలా తప్పించుకున్నా.. నాలుగో మహిళ మాత్రం బలైపోయిందని డివిజనల్ అటవీ శాఖాధికారి బిద్యుత్ సర్కార్ తెలిపారు. ఇంతకుముందు శుక్రవారం కూడా అలీపుర్దార్ జిల్లాలో కూడా ఓ ఏనుగు ఇంటిపై దాడి చేసి, అందులో ఉన్న ఒక బాలికను తొక్కి చంపేసింది. -
మహిళను లాక్కెళ్లి చంపేసిన మొసలి
పశ్చిమబెంగాల్లోని సుందర్బన్ అడవుల్లో దారుణం జరిగింది. ఛోటో మొల్లాఖలీ ప్రాంతంలో రొయ్య పిల్లలను ఏరుకుంటున్న 40 ఏళ్ల మహిళను ఓ మొసలి నీళ్లలోకి లాక్కెళ్లిపోయి చంపేసింది. రంభా మొండల్, ఆమె భర్త శ్యామపాద కలిసి గోసబా నది పాయలోని ఫెర్రీ ఘాట్లో టైగర్ ప్రాన్ రొయ్యపిల్లలను ఏరుకోడానికి వెళ్లారు. అప్పుడే మొసలి ఆమెను లాక్కుని నీళ్లలోకి వెళ్లిపోయింది. ఆమె గట్టిగా అరవడంతో భర్త శ్యామపాద, మరికొందరు స్థానిక మత్స్యకారులు కలిసి నాలుగు పడవల్లో ఆమెను కాపాడేందుకు వెళ్లారు. ఆ పడవలు మొసలిని చుట్టుముట్టినా, మహిళను మాత్రం కాపాడలేకపోయాయి. కొన్ని గంటల తర్వాత మహిళ మృతదేహం రెండు కాళ్లు, కుడి చేయి లేకుండా కొంత దూరంలో కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు పోలీసులు తెలిపారు. -
ఉగ్రమూక దాడి
-
కేజీఎస్ను తనిఖీ చేసిన ఇన్చార్జ్ డీఎం హెచ్ఓ
చేగుంట : మండల కేంద్రంలోని కేజీఎస్ ఆస్పత్రిని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి పద్మ బుధవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. గతంలో కేజీఎస్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనలో ఆస్పత్రి స్కానింగ్ సెంటర్, ఆపరేషన్ థియేటర్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆస్పత్రి నిర్వాహకులు సీజ్ చేసిన గదుల పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడం, రోగులకు సేవలందించే నర్సులు లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. క నీసం ఓపీలు కూడా చూసేవారు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి వాటిలో లోపాలు గుర్తించి అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జోగిపేటలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రి, వైద్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పద్మ తెలిపారు. ఆమె వెంట వసంత్రావ్ ఉన్నారు. -
పిడుగుల వాన
పడమటి మండలాల్లో గాలీవాన బీభత్సం పిడుగుపడి మహిళ మృతి చెట్టు కూలి మరో యువకుడి మృతి నేలకొరిగిన భారీ వృక్షాలు రహదారుల్లో నిలిచిపోయిన రాకపోకలు సాక్షి, తిరుపతి: జిల్లాలోని పడమటి మండలాల్లో సోమవారం సాయంత్రం పెనుగాలులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. పూతలపట్టు మండలంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. పుంగనూరు మండలంలో చెట్టుకొమ్మ కూలి ఓ యువకుడు చనిపోయాడు. బావిలో పడి ఒక ఎద్దు చనిపోయింది. చౌడేపల్లెలో పిడుగుపాటు కు మరో ఎద్దు మృతిచెందింది. చంద్రగిరి రహదారిలో భారీ చింతచెట్టు నేలకొరిగి ఓ కారు ధ్వంసమైంది. ముగ్గురు గాయపడ్డారు. రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాల్మీకిపురం శివార్లలోని వ్యవసాయ భూముల్లో సోమవారం సాయంత్రం రెండు పిడుగులు పడడంతో కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. సమీపంలో కట్టేసి ఉన్న ఆవులు పిడుగుల శబ్దానికి తాళ్లు తెంపుకుని పరుగులు తీశాయి. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సోమవారం సాయంత్రం హోరు గాలితో కూడిన వాన కురిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేని గాలులతో కూడిన వర్షం కురిసింది. పుంగనూరు మండలంలోని మంగళం గ్రామంలో నాగరాజు(23) అనే యువకుడిపై చింతచెట్టుకొమ్మ విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళ ం గ్రామంలో శంకరమ్మకు చెందిన ఎద్దు ఉరుములు, మెరుపులకు పరుగులుతీసి బావిలో పడి మృతి చెందింది. చౌడేపల్లె మండలం మల్లెలవారిపల్లెలో పిడుగుపడి ఒక ఎద్దు మృతి చెందింది. మామిడి, టమోటా పంటలకు నష్టం వాటిల్లింది. పూతలపట్టు మండలంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీచాయి. తలపులపల్లె పంచాయతీ అలగానిపల్లెలో పిడుగుపడడంతో సంపూర్ణమ్మ(45) అనే గొర్రెల కాపరి మృతి చెందింది. బి.కొత్తకోట మండలంలోని సుంకరవారిపల్లెలో సోమవారం సాయంత్రం పిడుగుకుపాటుకు ఒక పూరిల్లు దగ్ధమైంది. చంద్రగిరి మండలం ఎం. కొంగరవారిపల్లె సమీపంలో భారీ చింతచెట్టు ఒక్కసారిగా నేలకూలింది. అదే సమయంలో చెట్టు కింద ఉన్న షిప్ట్ కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గుడిపాల మండలంలో గాలి, వాన బీభత్సానికి లక్షలాది రూపాయలు ఆస్తినష్టం వాటిల్లింది. నరహరిపేట, గుడిపాల క్రాస్లోని జాతీయరహదారి పక్కన ఉన్న పెద్దవృక్షాలు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్కు రెండుగంటలకు పైగా తీవ్ర అంతరాయం కలిగింది. వెదురుకుప్పం మండలంలో ఈదురు గాలులకు ఒక రేకుల ఇల్లు ధ్వంసమైంది. శాంతిపురం మండలంలో వడగళ్ల వాన కురిసింది. పెనుగాలుల కారణంగా వృక్షాలు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్దపంజాణి మండలంలో కుండపోత వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది. మదనపల్లె పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. -
రెప్పపాటులో పెనువిషాదం
తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం లారీ, బస్సు డ్రైవర్లతో పాటు మహిళ దుర్మరణం రాజమండ్రి , న్యూస్లైన్ : అర్ధరాత్రి... బస్సులోని ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్నారు. డ్రైవర్కు నిద్రమత్తు ఆపుకోలేక రెప్పవాల్చాడు.. ఆ రెప్పపాటు కాలంలోనే ఆపద ముంచుకొచ్చింది. డివైడర్ పైనుంచి దూసుకుపోయిన బస్సు రోడ్డుకు అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. 16వ నంబర్ జాతీయ రహదారిపై తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లా కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి 36 మంది ప్రయాణికులతో భద్రాచలం బయలుదేరింది. మురారి గ్రంథాలయం సమీపానికి వచ్చేసరికి ఆర్టీసీ బస్ డ్రైవర్ కునికిపాటుకు లోనయ్యాడు. అతడు రెప్పవాలడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ పైనుంచి రోడ్డు అవతలివైపు దూసుకెళ్లింది. పంచదార లోడుతో విశాఖపట్నం వైపు వెళుతున్న లారీని అతి వేగంగా ఢీకొంది. లారీ ముందు భాగంలోకి బస్సు డ్రైవర్ క్యాబిన్ వరకు దూసుకుపోవడంతో రెండు వాహనాలు నుజ్జయ్యాయి. ఏం జరిగిందో కూడా తెలియని బస్సు ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ముందు నుంచి బస్సు దిగే దారిలేకపోవడంతో అందరూ లోపలే చిక్కుకుపోయారు. గ్రామస్తులు, హైవే నిర్వహణ సిబ్బంది వెనుక అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు లాగారు. లారీని నడుపుతున్న క్లీనర్ అట్టా రోణిరాజు (22) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్, ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మూడు 108 అంబులెన్సుల్లోను, ఒక రాజకీయ పార్టీ ప్రచార వాహనంలోనూ రాజానగరం జీఎస్ఎల్కు, రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కశింకోటకు చెందిన పొనకంపల్లి రమ్యకృష్ణ (25) బుధవారం ఉదయం మృతిచెందింది. ఖమ్మంలోని అత్తింటికి వెళ్లేందుకు ఆమె ఈ బస్సు ఎక్కింది. అలాగే ఆర్టీసీ బస్ డ్రైవర్ సులేమాన్ బేగ్ను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుంటే మార్గమధ్యంలో మృతి చెందాడు. పెద్దాపురం సీఐ నాగేశ్వరరావు, జగ్గంపేట ఎస్సై సురేష్బాబు, సిబ్బంది, హైవే మెయింటెనెన్స్ సిబ్బంది, గ్రామస్తులు సంఘటన స్థలం వద్ద సహాయ కార్యక్రమాలు చేపట్టారు. -
లారీ బోల్తా: ఇద్దరు మహిళలు మృతి
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం ఏలూరుపాడు సమీపంలో బాతుల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఆ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన మహిళల మృతదేహలను స్వాధీనం చేసుకుని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కూడా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. -
ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలసి హత్య చేసిన సంఘటన తూర్పు గోదావరి, రాజోలు మండలం ములికిపల్లిగా గ్రామంలో గత అర్థరాత్రి చోటు చేసుకుంది. అనంతరం నిందితురాలు బత్తుల దుర్గా ఆమె ప్రియుడితో కలసి పరారైంది. దీంతో గురువారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్య వివాహేతర సంబంధాన్ని భర్త నిలదీయటంతో భార్య బత్తుల దుర్గా ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు స్థానికులు పోలీసులుకు వెల్లడించారు. గతంలో ఆమె భర్తపై హత్యాయత్నం చేసి జైలు కూడా వెళ్లి వచ్చిందని వారు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
మద్యం తాగేందుకు పైకం ఇవ్వమని కట్టుకున్న భార్యను తాగుబోత్తు భర్త గద్దించాడు. అందుకు ఆ ఇల్లాలు నిరాకరించింది. అప్పటికే మైకంలో ఉన్న భర్త గొడ్డలితో భార్యపై దాడి చేశాడు. ఆ ఘటనతో భయపడిన ఆ ఇల్లాలు నడివీధిలోని పరుగు తీసింది. అయిన భర్త ఆమెను వదలలేదు. నడి రోడ్డుపై గొడ్డలితో భార్యను నరికి చంపేశాడు. ఆ దుర్ఘటన వెల్దుర్తి మండలం గంగిరెడ్డిపల్లెలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. అయితే తాగుబోతును అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. కానీ అతడు ఆగ్రహంతో ఉండటంతో ఎవరు అందుకు సాహసించలేదు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా పోలీసులు ఇంకా సంఘటన స్థలానికి చేరుకోలేదని సమాచారం. -
గుంటూరు జిల్లాలో దారుణం
-
ప్రేమించలేదని.. విషం తాగించి చంపారు!
తన ప్రేమను నిరాకరించినందుకు ఓ యువతికి తన స్నేహితుడి సాయంతో విషం తాగించి మరీ చంపాడో దుర్మార్గుడు. ఈ దారుణ సంఘటన కర్ణాకటలోని రాయచూరు ప్రాంతం మీరాపుర గ్రామంలో జరిగింది. మహాదేవి అనే యువతి తండ్రికి మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. దాంతో ఆమె చిన్నప్పటి నుంచి బంధువుల ఇంట్లో ఉండేది. పొలం పనులకు వెళ్తున్న ఆమెను పొరుగున నివసించే నాగరాజు, మారెప్ప అనే యువకులు ఆమె వెంటపడి ప్రేమించాలంటూ వేధించేవారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. దాంతో వాళ్లు ఆ యువకులను మందలించారు. ఆ యువతిపై కక్ష పెంచుకున్న మారెప్ప.. నాగరాజుతో కలిసి ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి మూత్రవిసర్జన కోసం బయటకు రాగా బలవంతంగా విషం తాగించారు. ఆమెను చికిత్సకు తరలించేలోపే మరణించింది. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఉద్యోగులకిచ్చి చేస్తే పిల్లలు సుఖపడతారని తన ఇద్దరు కుమార్తెలను అన్నదమ్ములిద్దరికీ ఇచ్చి పెళ్లి చేశారు. తొమ్మిది నెలల కిందట చిన్న కూతురు ఆత్మహత్య వార్త వారికి అశనిపాతంలా తగిలింది. కట్టుకున్నవాడే కడతేర్చాడనే అనుమానం ఉన్నా... ఆ కుటుంబంలోనే కోడలిగా ఉన్న మూడో కుమార్తె కాపురానికి ఇబ్బంది కలగకూడదని మారుమాట్లాడలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి వార్తే...ఏడాది వ్యవధిలో ఇద్దరు కూతుళ్లూ విగతజీవులై ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఖాన్ని మిగిల్చివెళ్లారు. పిట్టలవానిపాలెం,న్యూస్లైన్ : పిట్టలవానిపాలెం శివారు డేగలవారి పాలెంకు చెందిన వివాహిత శీలం తిరుపతమ్మ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. మృతురాలి తల్లిదండ్రులు,గ్రామస్తుల కథనం ప్రకారం చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెం గ్రామ పంచాయతీలోని మోరవాగుపాలెంకు చెందిన దొంతిరెడ్డి కొండలురెడ్డి, వెంకటేశ్వరమ్మలకు నలుగురు కుమార్తెలు వీరిలో మూడో, నాల్గో కుమార్తెలను పిట్టలవానిపాలెం గ్రామ శివారు డేగలవారిపాలెంకు చెందిన శీలం పోతురాజు రెడ్డి,వెంకటేశ్వరమ్మల కుమారులకు ఇచ్చి పెళ్లిచేశారు. ఆర్మీలో పనిచేస్తున్న పోతురాజురెడ్డి పెద్దకొడుకు నాగరాజురెడ్డికి నాలుగేళ్ల కిందట మూడో కుమార్తె తిరుపతమ్మతో వివాహం చేయగా, ఏడాది కిందట నాలుగో కుమార్తె వీరస్వామమ్మను సీఆర్పీఎఫ్లో పనిచేస్తున్న చిన్న కొడుకు కోటిరెడ్డికి ఇచ్చి పెళ్లిచేశారు. తొమ్మిది నెలల కిందట వీరస్వామమ్మ ఆత్మహత్య చేసుకుందని ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారు. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని తెలిసినా మూడో కుమార్తె తిరుపతమ్మ కాపురం బాగుండాలనే ఉద్దేశంతో ఎలాంటి కేసులు పెట్టకుండా కొండలురెడ్డి మిన్నకుండిపోయాడు. ఇంతలో శుక్రవారం ఆ దంపతులకు మరో పిడుగుపాటు లాంటి వార్త చెవినపడింది. తిరుపతమ్మ ఉరి వేసుకుని చనిపోయిందని మోరవాగుపాలెంకు చెందిన అక్కల శ్రీనివాసరెడ్డికి తమ అల్లుడు నాగరాజురెడ్డి ఫోన్చేసి చెప్పినట్లు మృతురాలి తండ్రి చందోలు పోలీసులకు పిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. చెల్లికి పట్టిన గతే పడుతుంది... అదనపు కట్నం తీసుకురావాలని, లేకపోతే నీ చెల్లిలికి పట్టిన గతే నీకూ పడుతుందని ఇటీవల అనేకసార్లు నాగరాజు రెడ్డి తిరుపతమ్మను శారీరకంగా, మానసికంగా వేధించాడు. దీంతో తిరుపతమ్మ పుట్టింటికి వచ్చింది. ఆర్మీ నుంచి సెలవులో 10 రోజుల క్రితం గ్రామానికి వచ్చిన నాగరాజు ఈ నెల 12న తల్లిదండ్రులు, బంధువులతో కలిసి మోరవాగుపాలెం వచ్చి, ఇక నుంచి ఎలాంటి గొడవలు లేకుండా కాపురం చేసుకుంటానని హామీ ఇవ్వడంతో కొండలురెడ్డి దంపతులు తమ కుమార్తెను అత్తవారింటికి పంపించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తిరుపతమ్మ ఉరివేసుకుని చనిపోయిందనే కబురు అందింది. నాకే పాపం తెలియదు... తన భార్య తిరుపతమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని, తనకు ఏపాపం తెలియదని మృతురాలి భర్త నాగరాజు రెడ్డి చెబుతున్నాడు.పొలంలో నాటు వేస్తున్నామని మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపు వేసి ఉందన్నారు. లోపలికి చూస్తే ఉరికి వేలాడుతోందని, వెంటనే చెరుకుపల్లి ప్రైవేట్ వైద్యశాలకు తీసుకువెళ్లగా, చనిపోయినట్లు వైద్యులు చెప్పారని తెలిపాడు.