ఆటో బోల్తా: వృద్ధురాలు దుర్మరణం | Woman killed in auto accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: వృద్ధురాలు దుర్మరణం

Aug 14 2016 12:04 AM | Updated on Aug 30 2018 4:07 PM

ఆటో బోల్తా: వృద్ధురాలు దుర్మరణం - Sakshi

ఆటో బోల్తా: వృద్ధురాలు దుర్మరణం

ఓజిలి : అతివేగంగా ప్రయాణిస్తున్న ఆటోబోల్తా పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మానమాల సమీపంలో శనివారం జరిగింది.

 
ఓజిలి : అతివేగంగా ప్రయాణిస్తున్న ఆటోబోల్తా పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన  మానమాల సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని కొండవల్లిపాడుకు చెందిన ఏల్చూరు ఆదెమ్మ (70) నేరేడు పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తుంది. రోజులానే గ్రామం నుంచి పండ్లు తీసుకుని కురుగొండలోని పాఠశాల వద్దకు Ðð ళ్లేందుకు మానమాలకు వచ్చింది. ఓజిలి నుంచి కురుగొండ వైపు ప్రయాణిస్తున్న ఆటోలో ఎక్కింది. గ్రామం సమీపంలోకి వచ్చే సరికి ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆదెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే స్థానికులు ఆదెమ్మను కురుగొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ఆటోడ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బతుకుతెరువు కోసం వెళ్లిన ఆదెమ్మ అంతలోనే మృతి చెందిందని తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కొండవల్లిపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement