ఢిల్లీలోనే కాదు.. ఇక్కడ కూడా జంతర్‌ మంతర్‌ | A Historical Overview of India's Five Jantar Mantars | Sakshi
Sakshi News home page

ఢిల్లీలోనే కాదు.. ఇక్కడ కూడా జంతర్‌ మంతర్‌

Jul 22 2026 11:32 AM | Updated on Jul 22 2026 11:40 AM

A Historical Overview of India's Five Jantar Mantars

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ)నిరసనల కారణంగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ పేరు మారుమోగిపోతోంది. ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశంలోని మరో ఐదు ప్రదేశాల్లో జంతర్‌ మంతర్‌లు ఉన్నాయి. 18వ శతాబ్దంలో జైపూర్ మహారాజా సవాయి జై సింగ్ II దేశంలోని వివిధ ప్రాంతాలలో ఐదు ఖగోళ పరిశోధనశాలలను (జంతర్ మంతర్) నిర్మించారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ 
1720లలో (1721-1724 మధ్య) నిర్మించిన ఈ తొలి జంతర్‌ మంతర్‌లో ఖగోళ వస్తువుల గమనాన్ని అధ్యయనం చేసేవారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ సమీపంలో ఉన్న ఈ చారిత్రాత్మక వేదిక నేడు శాంతియుత నిరసనలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

జైపూర్‌లో..
ఈ ఐదు జంతర్‌ మంతర్‌లలో ఇది అత్యంత విశిష్టమైనది. దీని పరిమాణం, అద్భుతమైన పరిరక్షణను గుర్తించి 2010లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఇందులో ప్రపంచంలోని అతిపెద్ద రాతి సూర్య గడియారాలలో ఒకటైన ప్రసిద్ధ ‘సమ్రాట్ యంత్రం’ సహా సుమారు 20 పెద్ద ఖగోళ పరికరాలు ఉన్నాయి.

ఉజ్జయినిలో.. 
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రాచీన కాలం నుంచే ఖగోళ, గణిత శాస్త్రాలకు బలమైన సంబంధం ఉంది. జైపూర్ జంతర్‌ మంతర్‌ కంటే పరిమాణంలో చిన్నదైనప్పటికీ, ఖగోళ వస్తువుల స్థానాలు, చలనాలను లెక్కించడానికి దీనిని నిర్మించారు.

వారణాసిలో..
గంగా నది ఒడ్డున ఉన్న మాన్ మహల్ సముదాయానికి అనుసంధానమై ఉన్న ఈ బనారస్ జంతర్‌ మంతర్‌ నాటి విద్యా, విజ్ఞాన కేంద్రాల ప్రాధాన్యతను చాటుతుంది. ఇక్కడి పరికరాలు కాలక్రమేణా దెబ్బతిన్నప్పటికీ, 18వ శతాబ్దపు శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

మధురలో..
ఈ జాబితాలోని ఐదో జంతర్‌ మంతర్‌ విషాదకర ముగింపును చవిచూసింది. 1857 విప్లవానికి ముందే మధురలోని జంతర్‌ మంతర్‌ కోటను కూల్చివేయడంతో నేడు అక్కడ ఎలాంటి అవశేషాలు కనిపించవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement