సంగారెడ్డి: జిల్లాలోని కల్హేర్ మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని బచేపల్లి గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ప్రయానిస్తున్న స్కార్పియో కారు ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయింది. ప్రమాదావశాత్తు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో కారులో ఉన్నటువంటి భార్యభర్తలతో పాటు 4ఏళ్ల కూతురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు నాందేడ్ వాసులుగా తెలుస్తోంది.


