రైలు ఢీకొని... ఇద్దరు మహిళలు మృతి | woman killed in train accident in nellore district | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని... ఇద్దరు మహిళలు మృతి

May 8 2016 10:01 AM | Updated on Sep 3 2017 11:41 PM

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్‌లో ఆదివారం దారుణం చోటు చేసుకుంది.

నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్‌లో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. రైలు దిగి పట్టాలు దాటుతున్న ఇద్దరు మహిళలను మరో రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మహిళలు అక్కడికక్కడే మరణించారు. వెంకటగిరి పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు గూడూరు సమీపంలోని కొండాయగుంట వద్ద పచ్చి మిరపకాయలు కొనుగోలు చేసి... వాటిని వెంకటగిరి మార్కెట్‌లో విక్రయించుకునేందుకు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కి వచ్చారు.

వెంకటగిరి రైల్వే స్టేషన్‌లో దిగి ట్రాక్ దాటి పక్క ప్లాట్‌ఫామ్‌పైకి వెళుతున్న క్రమంలో ఆ ట్రాక్‌లో వచ్చిన రైలు వారిని ఢీకొంది. దీంతో వారు అక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement