ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు
ఒకే ట్రాక్పైకి రైళ్లను అనుమతించడంపై చర్చ
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయ స్టేషన్ భువనేశ్వర్లో గురువారం రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శుభ్రత పనుల నిర్వహణలో భాగంగా ఖాళీ రైళ్లను ఒకే ట్రాక్పై నడిపించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఖాళీ రైళ్లు కావడంతో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదు.
లోకో పైలెట్లు క్షేమంగానే ఉన్నారు. రైళ్ల రాకపోకల్లో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు. ఝరపడా వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే రైల్వే యంత్రాంగం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగే శుభ్రత కార్యకలాపాల్లో ఒకే ట్రాక్పైకి రెండు రైళ్లను ఎలా అనుమతించరనేది చర్చనీయాంశమవుతోంది.


