వ్యాన్ ఢీకొని మహిళ మృతి | woman killed in road accident in srikakulam district | Sakshi
Sakshi News home page

వ్యాన్ ఢీకొని మహిళ మృతి

Aug 13 2016 11:16 AM | Updated on Sep 29 2018 5:26 PM

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బొంతుపేట గ్రామ శివారులోని జాతీయరహదారిపై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బొంతుపేట గ్రామ శివారులోని జాతీయరహదారిపై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. మహిళ రోడ్డు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన వ్యాన్... ఆమెను ఢీకొట్టింది. ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. వ్యాన్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement