ట్రాక్టర్‌ బోల్తా: మహిళ మృతి | Woman Killed In Krishna District Tractor Accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా: మహిళ మృతి

Dec 26 2019 2:44 PM | Updated on Dec 26 2019 2:50 PM

Woman Killed In Krishna District Tractor Accident - Sakshi

సాక్షి, నందిగామ: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ కాల్వలోకి బోల్తా పడిన ఘటన వీరులపాడు మండలం పొన్నవరం గ్రామ శివారులో జరిగింది. ట్రాక్టర్‌ ఇంజన్‌ కింద డ్రైవర్‌తో సహా వ్యవసాయ కూలీలు ఇరుక్కుపోగా.. స్థానికులు వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తమ్మిశెట్టి ధనలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement