breaking news
India A vs South Africa A
-
టీమిండియాకు భంగపాటు
రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఏతో ఇవాళ (నవంబర్ 19) జరిగిన మూడో వన్డేలో భారత-ఏ జట్టుకు భంగపాటు ఎదురైంది. ఈ మ్యాచ్లో భారత యువ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఫలితంగా పర్యాటకుల చేతిలో 73 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇది వరకే సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికాకు ఇది కంటితుడుపు విజయం. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.ఓపెనర్ల శతకాలుటాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ (325/6) చేసింది. ఓపెనర్లు లూహాన్ డ్రి ప్రిటోరియస్ (123), రివాల్లో మూన్సామి (107) అద్బుత శతకాలు సాధించారు. వీరిద్దరు ఔటయ్యాక సౌతాఫ్రికా స్కోర్ నెమ్మదించింది. ఆతర్వాత వచ్చిన రుబిన్ హెర్మన్ (11), క్వెషైల్ (1), కెప్టెన్ ఆకెర్మన్ (16), డియాన్ ఫార్రెస్టర్ (20) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వీరంతా కూడా రాణించి ఉంటే సౌతాఫ్రికా ఇంకాస్త భారీ స్కోర్ చేసేది. ఆఖర్లో డెలానో పాట్గెటర్ (30 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికా స్కోర్ను 300 మార్కు దాటించాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ 10 ఓవర్లలో 82 పరుగులిచ్చాడు (2 వికెట్లు). హర్షిత్ రాణా (10-1-47-2), ప్రసిద్ద్ కృష్ణ (10-0-52-2) సౌతాఫ్రికా బ్యాటర్లను కాస్త నిలువరించగలిగారు.టాపార్డర్ వైఫల్యం326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (25) సహా టాపార్డర్ అంతా దారుణంగా విఫలమైంది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ తిలక్ వర్మ తలో 11, రియాన్ పరాగ్ 17 పరుగులు చేసి ఔటయ్యారు. ఆతర్వాత ఇషాన్ కిషన్ (53), ఆయుశ్ బదోని (66) కాసేపు పోరాడారు. అయితే అప్పటికే భారత ఓటమి ఖరారైపోయింది. నకాబా పీటర్ (10-0-48-4), మొరేకి (9.1-0-58-3), ఫోర్టుయిన్ (10-0-48-2) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను 252 పరుగులకే కట్టడి చేశారు. చదవండి: 'మరో' చరిత్రకు అడుగు దూరంలో బంగ్లాదేశ్ దిగ్గజం -
భారత్తో వన్డేలో శతక్కొట్టిన ఓపెనర్లు.. సౌతాఫ్రికా భారీ స్కోరు
భారత్తో మూడో అనధికారిక వన్డేలో సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు (IND A vs SA A) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు శతక్కొట్టడంతో నిర్ణీత యాభై ఓవర్లలో ఏకంగా 325 పరుగులు చేసింది. కాగా రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు భారత్లో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా భారత్-‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ను 1-1తో సమం చేసిన సఫారీ జట్టు.. వన్డే సిరీస్ను మాత్రం కోల్పోయింది. తొలి, రెండో వన్డేలో తిలక్ వర్మ సేన చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాజ్కోట్ వేదికగా బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు బ్యాటింగ్తో అదరగొట్టింది.శతక్కొట్టిన ఓపెనర్లుఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్-‘ఎ’ జట్టు ప్రొటిస్ టీమ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు లువాన్ డ్రి ప్రిటోరియస్, రివాల్డో మూన్సామీ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రిటోరియస్ 98 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 123 పరుగులు చేయగా.. మూన్సామీ 130 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 107 పరుగులు సాధించాడు.మిగతా అంతా ఫెయిల్విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన ఈ ఓపెనింగ్ జోడీని భారత పేసర్ ప్రసిద్ కృష్ణ విడదీశాడు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ నెమ్మదించింది. మిగతా వాళ్లంతా పెలివియన్కు క్యూ కట్టారు. రుబిన్ హెర్మాన్ (11), సినెతెంబ కెషిలె (1), కెప్టెన్ మార్క్వెస్ అకెర్మాన్ (16) పూర్తిగా విఫలం కాగా.. డియాన్ ఫోరెస్టర్ 20, డిలానో పాట్గిటర్ 30 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు. డిజోర్న్ ఫార్చ్యూన్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా సౌతాఫ్రికా-‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో పేసర్లు ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా తలా రెండేసి వికెట్లు కూల్చారు. -
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్, అంతర్జాతీయ వన్డేలు సహా) అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికా-ఏ నిన్న (నవంబర్ 16) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అజేయ అర్ద సెంచరీ (83 బంతుల్లో 68 నాటౌట్) సాధించిన తర్వాత రుతురాజ్ లిస్ట్-ఏ సగటు 57.80కి చేరింది. తద్వారా చతేశ్వర్ పుజారాను (57.01) అధిగమించి లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్గా.. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ కంటే ముందు కేవలం ఒకే ఒక ఆటగాడు ఉన్నాడు. ఆస్ట్రేలియా వైట్ బాల్ దిగ్గజం మైఖేల్ బెవాన్ (57.86) మాత్రమే రుతురాజ్ కంటే ముందున్నాడు.లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన టాప్-5 బ్యాటర్లు..మైఖేల్ బెవాన్-57.86 (427 ఇన్నింగ్స్లు)రుతురాజ్ గైక్వాడ్-57.80 (85 ఇన్నింగ్స్లు)సామ్ హెయిన్-57.76 (64 ఇన్నింగ్స్లు)చతేశ్వర్ పుజారా-57.01 (130 ఇన్నింగ్స్లు)విరాట్ కోహ్లి-56.66 (339 ఇన్నింగ్స్లు)ఇప్పటివరకు కెరీర్లో 85 లిస్ట్-ఏ ఇన్నింగ్స్లు ఆడిన రుతురాజ్ 17 శతకాలు, 18 అర్ద శతకాల సాయంతో 4509 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యధిక స్కోర్ 220 నాటౌట్గా ఉంది.భీకర ఫామ్ప్రస్తుతం సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న మూడు అనధికారిక వన్డే సిరీస్లో రుతురాజ్ భీకర ఫామ్లో ఉన్నాడు. రెండో వన్డేలో అజేయ అర్ద శతకంతో భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అతను.. అంతకుముందు తొలి వన్డేలో అద్భుత శతకం (129 బంతుల్లో 117) బాదాడు. రెండో వన్డేలో గెలుపుతో భారత్, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే నవంబర్ 19న రాజ్కోట్లో జరుగనుంది. చదవండి: పాక్ ప్లేయర్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికా 'ఎ' తో జరిగిన రెండో అనధికారిక వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ 'ఎ' ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు విలవిల్లాడారు. స్పిన్నర్ నిశాంత్ సింధు 4 వికెట్లు పడగొట్టగా.. పేసర్లు హర్షిత్ రాణా 3, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్స్వామి(33) టాప్ స్కోరర్గా నిలవగా.. పొటిగిటర్(23), ప్రిటోరియస్(21) రాణించారు.రుతురాజ్ మెరుపులు.. అనంతరం 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇండియా జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 27.5 ఓవర్లలో చేధించింది. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 9 ఫోర్లతో 68) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుథో సిపామ్లా ఒక్కడే వికెట్ సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో అనధికారిక వన్డే రాజ్కోట్ వేదికగానే నవంబర్ 19న జరగనుంది.చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్ -
చెలరేగిన భారత బౌలర్లు.. 132 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భారత్-ఎ బౌలర్లు నిప్పలు చెరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా-ఎ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. యువ ఆల్రౌండర్ నిశాంత్ సింధు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. సింధు తన స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ హర్యానా ఆటగాడు 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు.సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్స్వామి(33) టాప్ స్కోరర్గా నిలవగా.. పొటిగిటర్(23), ప్రిటోరియస్(21) రాణించారు. మొత్తం ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. కాగా తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా-ఎ జట్టును 4 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్ మెన్ ఇన్ బ్లూ 1-0 ఆధిక్యంలో ఉంది.తుది జట్లుభారత్రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, తిలక్ వర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి,నిశాంత్ సింధు,హర్షిత్ రాణా, విప్రజ్ నిగమ్,అర్ష్దీప్ సింగ్,ప్రసిద్ కృష్ణసౌతాఫ్రికారివాల్డో మూన్సామి(వికెట్ కీపర్), లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్డాన్ హెర్మాన్, మార్క్వెస్ అకెర్మాన్(కెప్టెన్), సినెథెంబ క్వెషిలే, డయాన్ ఫారెస్టర్, ప్రెనెలన్ సుబ్రాయెన్, లూథో సిపమ్లా, డెలానో పోట్గీటర్, న్కాబయోమ్జి పీటర్, ఒట్నీల్ బార్ట్మన్ -
రుతురాజ్ సూపర్ సెంచరీ.. భారత్ ఘన విజయం
రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరిగిన తొలి అనధికారిక వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 286 పరుగుల లక్ష్య చేధనలో రుతురాజ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ను ఆరంభించిన గైక్వాడ్ వికెట్కు 64 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.వరుస క్రమంలో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ పెవిలియన్కు చేరినప్పటికి.. రుతురాజ్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఈ మహారాష్ట్ర బ్యాటర్ ఆచితూచి ఆడుతూ 110 బంతుల్లో తన 16వ లిస్ట్-ఎ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 129 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌతాఫ్రికా చిత్తు..రుతురాజ్తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ(39), నితీశ్ కుమార్ రెడ్డి(37), నిషాంత్ సింధు(29) రాణించారు. ఫలితంగా భారత-ఎ జట్టు ప్రోటీస్పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 286 పరుగుల లక్ష్యాన్ని ఇండియా-ఎ జట్టు 6 వికెట్లు కోల్పోయి 49.3 ఓవర్లలో చేధించింది.అంతకముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రోటిస్ పోట్గీటర్(88 పరుగులు; 103 బంతుల్లో), డెలనో పోట్గీటర్ (77 పరుగులు; 83 బంతుల్లో), బ్యోర్న్ ఫార్టూన్ (59 పరుగులు; 56 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.అభిషేక్ ఫెయిల్..కాగా 50 ఓవర్ల ఫార్మాట్లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్ దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఔటయ్యాడు. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా మలచడంలో అతడు విఫలమయ్యాడు. ఈ పంజాబ్ క్రికెటర్ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
దక్షిణాఫ్రికా బ్యాటర్ల విరోచిత పోరాటం
రాజ్కోట్ వేదికగా భారత్-ఎ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక వన్డేలో సౌతాఫ్రికా-ఎ లోయార్డర్ బ్యాటర్లు సత్తాచాటారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసన ప్రోటీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది.అయితే టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సఫారీలకు భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. అతడి బౌలింగ్ ధాటికి తొలి ఓవర్లోనే దక్షిణాఫ్రికా రెండు వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్లో ప్రసిద్ద్ కృష్ణ సైతం కెప్టెన్ మార్క్వెస్ అకెర్మాన్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత అర్ష్దీప్, సింధు వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు సాధించారు. దీంతో ప్రోటీస్ జట్టు కేవలం 53 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో దిల్దానో పోట్గీటర్(88 పరుగులు; 103 బంతుల్లో), డెలనో పోట్గీటర్ (77 పరుగులు; 83 బంతుల్లో) విరోచిత పోరాటం కనబరిచారు.వీరిద్దరూ ఆరో వికెట్కు వందకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అదేవిధంగా స్పిన్నర్ బ్యోర్న్ ఫార్టూన్ (59 పరుగులు; 56 బంతుల్లో) బ్యాట్తో సత్తాచాటాడు. దీంతో భారత్కు ఫైటింగ్ టార్గెట్ను సౌతాఫ్రికా ఉంచింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి తలో ఒక వికెట్ పడగొట్టారు. 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. 20 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(31), రియాన్ పరాగ్(8) వికెట్లను మెన్ ఇన్ బ్లూ కోల్పోయింది.చదవండి: ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే -
భారత్- ‘ఎ’ తరఫునా ఫెయిల్.. జట్టులోకి ఎలా వస్తారు?
సౌతాఫ్రికా- ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్లో భారత్- ‘ఎ’ (IND A vs SA A) జట్టు మిశ్రమ ఫలితం చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసుకుంది. రెండో టెస్టులో పంత్ సేన విజయం ఖాయమని భావించగా.. ప్రొటిస్ జట్టు సంచలన రీతిలో గెలుపును తన్నుకుపోయింది.ఈ మ్యాచ్లో అదే పెద్ద హైలైట్!ఏకంగా 400 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. భారత్లాంటి స్పిన్ వేదికలపై నాలుగో ఇన్నింగ్స్ (ఛేదించే జట్టు రెండో ఇన్నింగ్స్) అది కూడా చివరి రోజు చాలా కష్టం. అయినాసరే సఫారీ ‘ఎ’ జట్టు భారత రెగ్యులర్ టెస్టు బౌలర్లు సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్లను ఎదుర్కొని మరీ భారీ లక్ష్యాన్ని ఛేదించడమే ఈ మ్యాచ్లో పెద్ద హైలైట్! ఓవరాల్గా ‘ఎ’ జట్ల అనధికారిక నాలుగు రోజుల మ్యాచ్ల్లోనే ఇది అత్యధిక పరుగుల ఛేదనగా ఘనతకెక్కింది. ధ్రువ్ జురెల్ ఒక్కడే..ఇదిలా ఉంటే.. ఈ సిరీస్లో టీమిండియా స్టార్లలో ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. రెండో టెస్టులో రెండుసార్లు శతక్కొట్టి సత్తా చాటాడు. తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో కేవలం వికెట్ కీపర్ బ్యాకప్ ఆప్షన్గా కాకుండా.. స్పెషలిస్టు బ్యాటర్గా రాణించగలనని మరోసారి నిరూపించాడు.దారుణంగా విఫలంమరోవైపు.. తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudharsan), కర్ణాటక క్రికెటర్ దేవదత్ పడిక్కల్ మాత్రం ఈ సిరీస్లో విఫలమయ్యారు. సాయి నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 84 పరుగులు చేయగా.. పడిక్కల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఇన్నింగ్స్లో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 6,5,5,24.ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో బ్యాకప్ ఓపెనర్గా ఎంపికవుతూ.. ఇప్పటికీ అరంగేట్రం చేయలేకపోయిన బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ పూర్తిగా ఫెయిలయ్యాడు. రెండో టెస్టుతో జట్టులో చేరిన అతడు డకౌట్ అయ్యాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ సాయి, పడిక్కల్, అభిమన్యులపై విమర్శలు గుప్పించాడు. ‘‘విఫలమైనా... సాయి సుదర్శన్ ఇంకా యువకుడే కాబట్టి సెలక్టర్లు అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వవచ్చు. టెస్టు ఫార్మాట్లో బ్యాకప్ బ్యాటర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.భారత్- ‘ఎ’ తరఫునా పరుగులు చేయలేరు.. జట్టులో చోటెలా?పడిక్కల్ భారత్- ‘ఎ’ తరఫున కూడా పరుగులు రాబట్టలేకపోతున్నాడు. బ్యాకప్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఇలాగే కొనసాగితే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. జట్టులోకి రావడం కలగానే మిగిలిపోతుంది.స్పష్టతకు రావాలి..ఏదేమైనా జురెల్ ఒక్కడే ప్రస్తుతం నిలకడగా రాణిస్తున్నాడు. అయితే, అతడిని కేవలం బ్యాకప్ వికెట్ కీపర్గా మాత్రమే వాడకుంటామంటే.. రిషభ్ పంత్ కారణంగా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. కాబట్టి అతడి పాత్రపై సెలక్టర్లు స్పష్టతకు రావాలి.అంతేకాదు.. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లను సెలక్టర్లు కవర్ చేయాలి. సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలి. ఈ దేశీ సీజన్లో సెలక్టర్లు ఈ విషయంలో కఠినంగా శ్రమిస్తేనే మెరుగైన ఎంపికలు చేయగలరు’’ అని దేవాంగ్ గాంధీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చదవండి: వన్డే ఆల్టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్కు దక్కని చోటు -
సంచలనం.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన సౌతాఫ్రికా
భారత్-ఏ, సౌతాఫ్రికా-ఏ (India A vs South Africa A) జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 417 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. జోర్డన్ హెర్మన్ (91), లెసెగో సెనోక్వానే (77), జుబేర్ హంజా (77), టెంబా బవుమా (59), వికెట్ కీపర్ కాన్నర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికాను గెలిపించారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ జురెల్ (132 నాటౌట్) అజేయ సెంచరీతో గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అనంతరం సౌతాఫ్రికా కూడా తొలి ఇన్నింగ్స్లో తడబడింది. టీమిండియా పేసర్ల ధాటికి 221 పరుగులకే ఆలౌటైంది.34 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 7 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. జురెల్ రెండో ఇన్నింగ్స్లోనూ అజేయ సెంచరీతో (127 నాటౌట్) చెలరేగాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (65), హర్ష్ దూబే (84) అర్ద సెంచరీలతో రాణించారు.భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఐదుగురు అర్ద సెంచరీలు చేసి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లు పోరాడినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. కాగా, ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల అనధికారిక వన్డే సిరీస్ నవంబర్ 13 నుంచి మొదలవుతుంది.చదవండి: వరుసగా 8 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ -
టీమిండియాకు మరో షాక్
మరో ఐదు రోజుల్లో (నవంబర్ 14 నుంచి) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. సౌతాఫ్రికా-ఏతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లో భారత ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు.తొలుత కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant).. ఆతర్వాత ధృవ్ జురెల్ (Dhruv Jurel), తాజాగా మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గాయపడ్డ ఆటగాళ్ల జాబితాలో చేరారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పంత్ బ్యాటింగ్ చేస్తూ చాలా దెబ్బలు తిన్నాడు. అయినా అతడు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఆట నాలుగో రోజైన ఇవాళ (నవంబర్ 9) మరో వికెట్ కీపర్ బ్యాటర్, రెండు ఇన్నింగ్స్ల్లో సెంచూరియన్ ధృవ్ జురెల్ చేతి వేలి గాయానికి గురయ్యాడు. తాజాగా పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఫీల్డింగ్ చేస్తూ చేతి వేలికి గాయం చేసుకున్నాడు. నొప్పితో విలవిలలాడిన సిరాజ్ మైదానాన్ని వీడాడు. సిరాజ్ గాయం పెద్దదేమీ కానప్పటికీ.. ముందు జాగ్రత్తగా అతనికి విశ్రాంతి కల్పించారు.ఇదిలా ఉంటే, భారత్-ఏ, సౌతాఫ్రికా-ఏ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా లక్ష్యానికి మరో 70 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. ఇవాళ ఆట చివరి రోజు. 4:35 నిమిషాల సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 347 పరుగుల వద్ద ఉంది. టెంబా బవుమా (57), కాన్నర్ ఎస్టర్హ్యూజన్ (5) క్రీజ్లో ఉన్నారు.ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 255, రెండో ఇన్నింగ్స్లో 382/7 డిక్లేర్ స్కోర్లు చేసింది. రెండు ఇన్నింగ్స్ల్లో వికెట్కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ సెంచరీలు చేశాడు. సౌతాఫ్రికా తరఫున కెప్టెన్ అకెర్మన్ తొలి ఇన్నింగ్స్ల్లో (134) శతక్కొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో జోర్డన్ హెర్మన్ (91), సెనోక్వానే (77), జుబేర్ హంజా (77), బవుమా (57 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: లేడీ ధోనికి బంపరాఫర్ -
ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ను కనబరిస్తున్నాడు. సౌతాఫ్రికా-తో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్ సెంచరీల మోత మ్రోగించాడు. తొలి ఇన్నింగ్స్లో తన సూపర్ జెంచరీతో జట్టును ఆదుకున్న జురెల్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టాడు. జురెల్ 159 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో తన ఆరువ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తొలుత హర్ష్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ధ్రువ్.. ఆ తర్వాత కెప్టెన్ పంత్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జురెల్ ఓవరాల్గా 169 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 127 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్..ఇక ఇండియా-ఎ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను 382-7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో లభించిన 34 పరుగుల ఆధిక్యాన్ని జోడించి సఫారీల ముందు 416 పరుగుల టార్గెట్ను ఉంచింది. ఇక భారత బ్యాటర్లలో జురెల్తో పాటు రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.తొలుత రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగిన పంత్.. దూబే ఔటయ్యాక మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ఈసారి మాత్రం పంత్ చెలరేగిపోయాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఒకుహ్లే సెలె మూడు వికెట్లు పడగొట్టగా.. షెపో మోరెకి, వుర్రెన్, సుబ్రెయిన్, సిమండ్స్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు సఫారీ ‘ఎ’ జట్టు 47.3 ఓవర్లలో 221 పరుగుల వద్ద ఆలౌటైంది. మొత్తం 11 మందిలో ఏకంగా 8 మంది బ్యాటర్లు సెనొక్వనే (0), జుబేర్ హమ్జా (8), బవుమా (0), ఎస్తర్హ్యుజెన్ (0), టియాన్ వాన్ (6), కైల్ సిమండ్స్ (5), షెపొ మొరెకి (4 నాటౌట్), ఒకులె సెలె (0)లను భారత సీమర్లు సింగిల్ డిజిట్కే కట్టడి చేశారు. భారత పేస్ త్రయం ప్రసిధ్ కృష్ణ (3/35), ఆకాశ్ దీప్ (2/28), సిరాజ్ (2/61) నిప్పులు చెరిగారు. ప్రోటీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ మార్కెస్ అకెర్మన్ (118 బంతుల్లో 113; 17 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కాడు. కాగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. -
IND vs SA: టీమిండియాకు భారీ షాక్
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా (IND vs SA)కు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant Injured) మరోసారి గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ.. రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. కాగా సఫారీ జట్టుతో టీమిండియా స్వదేశంలో రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే.ఇందుకు సన్నాహకంగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా - ‘ఎ’ జట్లు ముందుగా అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ పంత్ భారత్- ‘ఎ’ కెప్టెన్గా తిరిగి వచ్చాడు. ఇక బెంగళూరులోని బీసీసీఐ (BCCI) ఆఫ్ ఎక్సలెన్స్ స్టేడియం వేదికగా.. తొలి అనధికారిక టెస్టులో పంత్ సేన గెలుపొందింది.ధ్రువ్ జురెల్ అజేయ శతకంఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో అనధికారిక టెస్టు మొదలుకాగా.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. ధ్రువ్ జురెల్ అజేయ శతకం (132) కారణంగా ఈ మేర స్కోరు సాధ్యమైంది.అయితే, తొలి ఇన్నింగ్స్ సందర్భంగా పంత్ గాయపడ్డాడు. సఫారీ పేసర్ షెపో మొరేకి వేసిన రాకాసి బౌన్సర్ పంత్ చేతి వేలికి బలంగా తాకింది. ఫిజియో వచ్చి పరిశీలించగా.. పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేసి మొరేకి బౌలింగ్లో అవుటయ్యాడు.34 పరుగుల స్వల్ప ఆధిక్యంఇక సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 221 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్కు.. 34 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కగా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్ 78 పరుగులు చేసింది.ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆదిలోనే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (60 బంతుల్లో 27) వికెట్ను భారత్ కోల్పోగా.. పంత్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు 108-4గా ఉన్న వేళ పంత్కు రెండుసార్లు గాయమైంది. రెండుసార్లు బంతి బలంగా తాకడంతోమొరేకి బౌలింగ్లో తొలుత పంత్ ఎడమ మోచేతికి గాయమైంది. తర్వాత గజ్జల భాగంలో బంతి బలంగా తాకింది. దీంతో 22 బంతులు ఎదుర్కొన్న పంత్.. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నవంబరు 14 నుంచి టెస్టు సిరీస్ మొదలు కానుండగా.. పంత్ రూపంలో కీలక ఆటగాడు గాయపడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో మ్యాచ్లో భారత్ 43 ఓవర్ల ఆట ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి.. 158 పరుగుల ఆధిక్యం సంపాదించింది.చదవండి: ఐసీసీ కీలక నిర్ణయంRishabh Pant retires hurt after taking three blows today. First on the helmet, second on the left-hand elbow, third on the abdomen. Tough day for the fighter. ❤️🩹 pic.twitter.com/kdTX8jdM8B— Harsh 17 (@harsh03443) November 8, 2025 -
నిలబడిన కేఎల్ రాహుల్.. ఆధిక్యంలో టీమిండియా
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు పట్టు సాధించింది. 34 పరుగుల కీలక ఆధిక్యం సాధించి, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 112 పరుగుల ఆధిక్యంలో ఉంది.రెండో ఇన్నింగ్స్లో భారత్ 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. అభిమన్యు ఈశ్వరన్ 0, సాయి సుదర్శన్ 23, దేవ్దత్ పడిక్కల్ 24 పరుగులు చేసి ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ బాధ్యతగా ఆడుతూ 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి జతగా నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్ (0) క్రీజ్లో ఉన్నాడు.అంతకుముందు భారత పేసర్లు ప్రసిద్ద్ కృష్ణ (3), సిరాజ్, ఆకాశ్దీప్ తలో 2 వికెట్లతో చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 47.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, హర్ష్ దూబే కూడా తలో వికెట్ తీశారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కెప్టెన్ అకెర్మన్ విధ్వంసకర శతకంతో ఒంటిపోరాటం చేశాడు. సహచరులు సహకరించకపోయినా ఒక్కడే నిలబడి 200 పరుగుల మార్కును దాటించాడు. కేవలం 118 బంతుల్లోనే 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అకెర్మన్ కాకుండా సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో జోర్డన్ హెర్మన్ (26), సుబ్రాయన్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో సీనియన్ టీమ్ కెప్టెన్ టెంబా బవుమా సహా నలుగురు డకౌట్లయ్యారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ జురెల్ (132) వీరోచిత శతకంతో టీమిండియా పరువు కాపాడాడు. 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జురెల్.. టెయిలెండర్లు కుల్దీప్ (20), సిరాజ్ (15) సహకారంతో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో సీనియర్లు కేఎల్ రాహుల్ (19), సాయి సుదర్శన్ (17), అభిమన్యు ఈశ్వరన్ (0), దేవదత్ పడిక్కల్ (5), రిషబ్ పంత్ (24) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 221 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్కు 34 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే అభిమన్యు ఈశ్వరన్ వికెట్ కోల్పోయింది. ఈశ్వరన్ వరుసగా రెండో ఇన్నింగ్స్లో కూడా డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్ (4), సాయి సుదర్శన్ క్రీజ్లో ఉన్నారు.కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్-ఏ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా జరుగుతుంది.చదవండి: ‘గిల్ కోసం బలి.. సంజూను కాదని జితేశ్ శర్మను అందుకే ఆడిస్తున్నారు’ -
టీమిండియా పేసర్ల విజృంభణ.. కుప్పకూలిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో (India A vs South Africa A) భారత-ఏ జట్టు పేసర్లు చెలరేగిపోయారు. ప్రసిద్ద్ కృష్ణ 3, సిరాజ్, ఆకాశ్దీప్ తలో 2 వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. వీరి ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 47.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, హర్ష్ దూబే కూడా తలో వికెట్ తీశారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కెప్టెన్ అకెర్మన్ విధ్వంసకర శతకంతో ఒంటిపోరాటం చేశాడు. సహచరులు సహకరించకపోయినా ఒక్కడే నిలబడి 200 పరుగుల మార్కును దాటించాడు. కేవలం 118 బంతుల్లోనే 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అకెర్మన్ కాకుండా సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో జోర్డన్ హెర్మన్ (26), సుబ్రాయన్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో సీనియన్ టీమ్ కెప్టెన్ టెంబా బవుమా సహా నలుగురు డకౌట్లయ్యారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ జురెల్ (132) వీరోచిత శతకంతో టీమిండియా పరువు కాపాడాడు. 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జురెల్.. టెయిలెండర్లు కుల్దీప్ (20), సిరాజ్ (15) సహకారంతో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో సీనియర్లు కేఎల్ రాహుల్ (19), సాయి సుదర్శన్ (17), అభిమన్యు ఈశ్వరన్ (0), దేవదత్ పడిక్కల్ (5), రిషబ్ పంత్ (24) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 221 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్కు 34 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే అభిమన్యు ఈశ్వరన్ వికెట్ కోల్పోయింది. ఈశ్వరన్ వరుసగా రెండో ఇన్నింగ్స్లో కూడా డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్ (4), సాయి సుదర్శన్ క్రీజ్లో ఉన్నారు.కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్-ఏ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా జరుగుతుంది.చదవండి: Hong Kong Sixes 2025: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. హ్యాట్రిక్ సహా..! -
IND vs SA: రీఎంట్రీలో బవుమా డకౌట్.. సౌతాఫ్రికాకు భారీ షాక్
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 ఫైనల్లో సౌతాఫ్రికాను విజేతగా నిలిపి ఘనత కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) సొంతం. ఇంగ్లండ్ వేదికగా పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి బవుమా బృందం ‘ఐసీసీ గద’ను గెలుచుకుంది. అయితే, ఈ మోగా ఫైనల్ తర్వాత ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా బవుమా టెస్టులకు దూరమయ్యాడు.ఈ క్రమంలో టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు సౌతాఫ్రికా- ‘ఎ’ తరఫున రెడ్బాల్ క్రికెట్లో బవుమా పునరాగమనం చేశాడు. భారత్- ‘ఎ’ (IND A vs SA A)తో గురువారం మొదలైన రెండో అనధికారిక టెస్టు తుదిజట్టులో ఈ కెప్టెన్ సాబ్ బ్యాటర్గా బరిలోకి దిగాడు.గోల్డెన్ డకౌట్శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా... అకెర్మాన్ సారథ్యంలోని ఈ టీమ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన బవుమా.. గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్లో ఒకే ఒక్క బంతి ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వికెట్ కీపర్ రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.ధ్రువ్ జురేల్ వీరోచిత అజేయ శతకంకాగా సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో సహచరులు తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... ధ్రువ్ జురేల్ పట్టుదలతో ఆడి వీరోచిత అజేయ శతకం సాధించాడు. జురేల్ (175 బంతుల్లో 132 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పుణ్యమాని... గురువారం మొదలైన ఈ మ్యాచ్లో భారత ‘ఎ’ జట్టు గౌరవప్రద స్కోరు నమోదు చేసింది.బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా- ‘ఎ’ కెప్టెన్ అకెర్మాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన భారత ‘ఎ’ జట్టు 77.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా... కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 19; 3 ఫోర్లు), సాయి సుదర్శన్ (52 బంతుల్లో 17; 3 ఫోర్లు) క్రీజులో కుదురుకుంటున్న దశలో అవుటయ్యారు.రాణించిన కుల్దీప్, సిరాజ్ఒకదశలో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును జురేల్ ఆదుకున్నాడు. ఎనిమిదో వికెట్కు కుల్దీప్ యాదవ్ (88 బంతుల్లో 20; 1 ఫోర్)తో కలిసి జురేల్ 79 పరుగులు జత చేసి భారత స్కోరును 200 దాటించాడు.కుల్దీప్ అవుటయ్యాక సిరాజ్ (31 బంతుల్లో 15; 3 ఫోర్లు)తో కలిసి జురేల్ 34 పరుగులు జోడించాడు. 62 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జురేల్... 145 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో సెంచరీ మైలురాయిని దాటాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వాన్ వురెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా... సుబ్రాయెన్, మోరెకిలకు రెండు వికెట్ల చొప్పున లభించాయి.చెలరేగిన భారత బౌలర్లుఇక రెండో రోజు ఆటలో భాగంగా తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. 44 ఓవర్ల ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో పేసర్లు ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, మొహమ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ప్రొటిస్ బ్యాటర్లలో కెప్టెన్ అకెర్మాన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.చదవండి: అందుకే వరల్డ్కప్ విన్నర్ని వదిలేశాం: అభిషేక్ నాయర్ -
IND vs SA: కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్.. శతక్కొట్టిన జురెల్
సౌతాఫ్రికా- ‘ఎ’తో అనధికారిక రెండో టెస్టులో భారత్ -‘ఎ’ (IND A vs SA- Day 1) మెరుగైన స్కోరు సాధించింది. పర్యాటక జట్టు బౌలర్లు ఆది నుంచే చెలరేగి.. టాపార్డర్ను కుదేలు చేయగా.. ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) శతక్కొట్టి జట్టును ఆదుకున్నాడు. కాగా బెంగళూరు వేదికగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్లు రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో తలపడుతున్న విషయం తెలిసిందే.టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్ఇందులో భాగంగా తొలి టెస్టులో రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్సీలోని భారత జట్టు ప్రొటిస్ జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు మొదలైంది. బెంగళూరులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా- ‘ఎ’ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది.కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్ఇక ఈ మ్యాచ్తో జట్టులోకి వచ్చిన ఓపెనింగ్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (19), అభిమన్యు ఈశ్వరన్ (0) విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ (17) నిరాశపరచగా.. దేవదత్ పడిక్కల్ (5) మరోసారి ఫెయిల్ అయ్యాడు.ఇలాంటి దశలో ఐదో నంబర్ ఆటగాడు, కెప్టెన్ రిషభ్ పంత్ జట్టును ఆదుకునే క్రమంలో వేగంగా ఆడాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసిన పంత్.. షెపో మొరేకి బౌలింగ్లో ఎంజే అకెర్మన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.సౌతాఫ్రికా ఆనందం ఆవిరి చేసిన జురెల్దీంతో సౌతాఫ్రికా శిబిరం సంతోషంలో మునిగిపోయింది. హర్ష్ దూబే (14), ఆకాశ్ దీప్ (0)లను కూడా త్వరత్వరగా అవుట్ చేసింది. అయితే, వారి ప్రొటిస్ జట్టుకు ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవకుండా చేశాడు ధ్రువ్ జురెల్.సహచర ఆటగాళ్లు విఫలమైన చోట జురెల్ అద్భుత శతకంతో మెరిశాడు. మొత్తంగా 175 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్ (88 బంతుల్లో 20), మొహమ్మద్ సిరాజ్ (31 బంతుల్లో 15) వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ జురెల్కు సహకరించారు.భారత్ ఆలౌట్.. స్కోరెంతంటే?ఈ క్రమంలో 77.1 ఓవర్ వద్ద ప్రసిద్ కృష్ణ (0) పదో వికెట్గా వెనుదిరగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. తొలి రోజు పూర్తయ్యేసరికి77.1 ఓవర్లలో 255 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. జురెల్ అద్భుత శతకం కారణంగా భారత జట్టుకు ఈ మేర మెరుగైన స్కోరు సాధ్యమైంది. ఇక సఫారీ జట్టు బౌలర్లలో టియాన్ వాన్ వారెన్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. షెపో మొరేకి, ప్రెనేలన్ సుబ్రయాన్ చెరో రెండు, ఒకులే సిలీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.భారత్- ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా -‘ఎ’ రెండో అనధికారిక టెస్టు తుదిజట్లుభారత్కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), హర్ష్ దూబే, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికాజోర్డాన్ హెర్మాన్, లిసెగో సెనొక్వనే తెంబా బవుమా, జుబేర్ హంజా, మార్వ్కెస్ అకెర్మన్ (కెప్టెన్), కొనొర్ ఎస్తర్హుజీన్ (వికెట్ కీపర్), టియాన్ వాన్ వారెన్, కైలీ సైమండ్స్, ప్రెనేలన్ సుబ్రయాన్, షెపో మొరేకి, ఒకులే సిలీ.చదవండి: క్రీజులోకి వెళ్లు.. నీ తల పగలకొడతా! -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. ధ్రువ్ జురెల్ వీరోచిత సెంచరీ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ రెడ్ బాల్ క్రికెట్లో తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు.ఈ ఉత్తర్ప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ 145 బంతుల్లో తన నాలుగవ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 59 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ను జురెల్ తన విరోచిత శతకంతో ఆదుకున్నాడు. తొలుత పంత్ కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించిన జురెల్.. ఆ తర్వాత లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్యాదవ్తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.ఇండియా-ఎ జట్టు 70 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. క్రీజులో జురెల్(102)తో పాటు మహ్మద్ సిరాజ్(11) ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఇప్పటివరకు వాన్ వుర్రెన్ మూడు వికెట్లు పడగొట్టగా.. సుబ్రాయెన్, మొరేకీ తలా రెండు వికెట్లు సాధించారు. పంత్ రీ ఎంట్రీ.. కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నాడు. అయితే రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి రావడంతో జురెల్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అయితే గత నెలలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో జురెల్ సూపర్ సెంచరీతో అందరని ఆకట్టుకున్నాడు. ఇంతకుముందు కూడా తనకు వచ్చిన అవకాశాలను జురెల్ అందిపుచ్చుకున్నాడు. అతడు పంత్కు బ్యాకప్గా కొనసాగుతున్నాడు.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్ -
కష్టాల్లో టీమిండియా
దక్షిణాఫ్రికా-ఏతో ఇవాళ (నవంబర్ 6) మొదలైన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో (India A vs South Africa A) భారత-ఏ జట్టు (India A) కష్టాల్లో పడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లోనే అభిమన్యు ఈశ్వరన్ డకౌటయ్యాడు. ఆతర్వాత 19 పరుగులు చేసి కేఎల్ రాహుల్ కూడా ఔటయ్యాడు.17 పరుగులు చేసిన సాయి సుదర్శన్ జట్టు స్కోర్ 41 పరుగుల వద్ద ఉండగా మూడో వికెట్గా వెనుదిరిగాడు. ఆతర్వాత 5 పరుగులు చేసి దేవ్దత్ పడిక్కల్ కూడా పెవిలియన్కు చేరాడు. వాన్ వుర్రెన్ (2 వికెట్లు), సుబ్రాయెన్ (1), మొరేకీ (1) ధాటికి భారత టాపార్డర్ పేకమేడలా కూలింది.లంచ్ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 85/4గా ఉంది. రిషబ్ పంత్ (23), ధృవ్ జురెల్ (19) క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 26 పరుగులు జోడించి బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు.పంత్పై భారీ అంచనాలురెండు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్-ఏ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ (90) ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఇవాళ మొదలైన మ్యాచ్లో కూడా పంత్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లండ్లో గాయపడిన తర్వాత పంత్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే.బరిలో టీమిండియా స్టార్లుఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కస్ ఆకెర్మన్ టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో చాలామంది టీమిండియా స్టార్లు బరిలోకి దిగుతున్నారు.కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్కు దిగగా.. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్, రిషబ్ పంత్, హర్ష్ దూబే, ఆకాశ్దీప్, కల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఆతర్వాత స్థానాల్లో రానున్నారు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఆ జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లకు ప్రాక్టీస్ నిమిత్తం ఈ అవకాశం ఇచ్చారు. మరోవైపు దక్షిణాఫ్రికా-ఏ తరఫున ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగాడు. సౌతాఫ్రికా టెస్ట్ జట్టులోకి ప్రెనేలన్ సుబ్రాయన్ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నాడు.ఇండియా A (ప్లేయింగ్ XI): KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(w/c), హర్ష్ దూబే, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణదక్షిణాఫ్రికా A (ప్లేయింగ్ XI): జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, టెంబా బావుమా, జుబేర్ హంజా, మార్క్వెస్ అకెర్మాన్ (సి), కానర్ ఎస్టర్హుయిజెన్ (w), టియాన్ వాన్ వురెన్, కైల్ సిమండ్స్, ప్రేనెలన్ సుబ్రాయెన్, షెపో మోరేకి, ఒకుహ్లే సెలె -
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. బ్యాటింగ్కు దిగిన టీమిండియా
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో ఇవాళ (నవంబర్ 6) భారత్-ఏ, దక్షిణాఫ్రికా-ఏ (India A vs South Africa A) జట్ల మధ్య రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కస్ ఆకెర్మన్ టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో చాలామంది టీమిండియా స్టార్లు బరిలోకి దిగుతున్నారు.కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్కు దిగగా.. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్, రిషబ్ పంత్, హర్ష్ దూబే, ఆకాశ్దీప్, కల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఆతర్వాత స్థానాల్లో రానున్నారు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఆ జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లకు ప్రాక్టీస్ నిమిత్తం ఈ అవకాశం ఇచ్చారు. మరోవైపు దక్షిణాఫ్రికా-ఏ తరఫున ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగాడు. సౌతాఫ్రికా టెస్ట్ జట్టులోకి ప్రెనేలన్ సుబ్రాయన్ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నాడు.రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్-ఏ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ (90) ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఇవాళ మొదలైన మ్యాచ్లో కూడా పంత్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లండ్లో గాయపడిన తర్వాత పంత్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే.ఆదిలోనే షాక్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ మొరేకీ బౌలింగ్లో డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్కు జతగా సాయి సుదర్శన్ క్రీజ్లోకి వచ్చాడు.ఇండియా A (ప్లేయింగ్ XI): KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్, రిషబ్ పంత్(w/c), హర్ష్ దూబే, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణదక్షిణాఫ్రికా A (ప్లేయింగ్ XI): జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, టెంబా బావుమా, జుబేర్ హంజా, మార్క్వెస్ అకెర్మాన్ (సి), కానర్ ఎస్టర్హుయిజెన్ (w), టియాన్ వాన్ వురెన్, కైల్ సిమండ్స్, ప్రేనెలన్ సుబ్రాయెన్, షెపో మోరేకి, ఒకుహ్లే సెలెచదవండి: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్ -
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశారు. కంగారూ జట్టుతో మూడు వన్డేల్లో రో‘హిట్’ కాగా.. కోహ్లి మాత్రం తొలి రెండు మ్యాచ్లలో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.ఆసీస్ టూర్కు ముందుఅయితే, మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్భుత సెంచరీ (121)తో చెలరేగగా.. కోహ్లి భారీ అర్ధ శతకం (73)తో మెరిశాడు. ఇలా హిట్మ్యాన్ శతక్కొట్టడం.. కోహ్లి ఫామ్లోకి రావడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2027 నాటికి రో- కో జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్ కూడా ఆడాల్సి రావొచ్చని ఆసీస్ టూర్కు ముందు టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే.ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ప్రొటిస్ జట్టుతో వన్డే సిరీస్ సందర్భంగా రో- కో త్వరలోనే మరోసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు.నవంబరు 13, 16 19 తేదీల్లోఇక అంతకంటే ముందు భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్లు అనధికారిక టెస్టు సిరీస్తో పాటు.. అనధికారిక వన్డే సిరీస్లోనూ పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొలి అనధికారిక టెస్టు ముగియగా.. రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు మ్యాచ్ గెలిచింది.ఈ క్రమంలోనే టెస్టుల తర్వాత నవంబరు 13, 16 19 తేదీల్లో భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్లు అనధికారిక వన్డే సిరీస్లో తలపడనున్నాయి. ఈ మూడూ డే- నైట్ మ్యాచ్లే. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి కూడా భారత్- ‘ఎ’ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా జట్టును ప్రకటించింది.భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరుఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా ఎంపిక కాగా... రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల పేర్లు లేవు. దీంతో రో-కో ఆటను మరోసారి చూడాలన్న అభిమానుల ఆశలకు గండిపడినట్లయింది. ఇదిలా ఉంటే.. వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన నేపథ్యంలో.. తిలక్ వర్మ ‘ఎ’ జట్టుకు సారథి కాగా.. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్గా రీఎంట్రీ ఇచ్చాడు.అదే విధంగా.. ఇషాన్ కిషన్కు ఈ జట్టులో చోటు దక్కింది. టీమిండియా స్టార్లు అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఇందులో భాగం కానున్నారు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డేలకు భారత్- ‘ఎ’ జట్టు:తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్).చదవండి: నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా -
IND vs SA: సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో ఉత్కంఠ పోరులో భారత్- ‘ఎ’ జట్టు విజయం సాధించింది. టెయిలెండర్లు అన్షుల్ కాంబోజ్ (37 నాటౌట్), మానవ్ సుతార్ (Manav Suthar- 20 నాటౌట్) యాభైకి పరుగుల భాగస్వామ్యంతో రాణించి జట్టును గట్టెక్కించారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా.. అనధికారిక తొలి టెస్టులో భారత్.. సౌతాఫ్రికాను మూడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ టీమిండియా స్టార్ రిషభ్ పంత్.. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు ముందు భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్గా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. పంత్ సారథ్యంలో భారత్- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టు సిరీస్లు ఆడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా గురువారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది.తనుశ్ కొటియాన్కు నాలుగు వికెట్లుటాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జొర్డాన్ హెర్మాన్ (71), జుబేర్ హంజా (66), రుబిన్ హెర్మాన్ (66), టియాన్ వాన్ వారెన్ (46) రాణించారు.234 పరుగులకే ఆలౌట్భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ రెండేసి వికెట్లు కూల్చారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్.. 234 పరుగులకే ఆలౌట్ అయింది.ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (65), సాయి సుదర్శన్ (32)లతో పాటు ఆయుశ్ బదోని (38) రాణించగా.. కెప్టెన్ పంత్ (17) సహా దేవదత్ పడిక్కల్ (6), రజత్ పాటిదార్ (19) విఫలమయ్యారు. తనుశ్ కొటియాన్ 13 పరుగులు చేయగా.. టెయిలెండర్లు అన్షుల్ 5, మావన్ 4, ఖలీల్ 4 పరుగులే చేశారు.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 199 పరుగులకే కుప్పకూలింది. తనుశ్ మరోసారి నాలుగు వికెట్లతో చెలరేగగా.. అన్షుల్ 3, బ్రార్ రెండు, మానవ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 75 పరుగులు కలుపుకొని సౌతాఫ్రికా.. భారత్కు 275 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే, ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), ఆయుశ్ మాత్రే (6), వన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ (5) త్వరగా అవుట్ కావడంతో భారత్ చిక్కుల్లో పడింది.పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ దశలో రజత్ పాటిదార్ (28) సహకారం అందించగా.. పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. ఐదో స్థానంలో వచ్చి 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు. అయితే, పంత్ అవుటైన తర్వాత.. ఆ వెంటనే ఆయుశ్ బదోని (34) కూడా అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో కూరుకుపోయింది.గెలిపించిన అన్షుల్, మానవ్ఇలాంటి తరుణంలో తనుశ్ కొటియాన్ 23 పరుగులు చేయగా.. ఆశలు వదిలేసుకున్న సమయంలో మానవ్ 20, అన్షుల్ 37 (4 ఫోర్లు, 2 సిక్స్లు) పరుగులతో అజేయంగా నిలిచి భారత్కు విజయం అందించారు. ఆల్రౌండ్ ప్రతిభతో రాణించిన తనుశ్ కొటియాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.భారత్- ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా- ‘ఎ’తొలి అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1, బెంగళూరు👉టాస్: భారత్.. తొలుత బౌలింగ్👉సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 309👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 234👉సౌతాఫ్రికాకు 75 పరుగుల ఆధిక్యం👉సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 199👉భారత్ లక్ష్యం: 275 పరుగులు👉భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 277/7👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై భారత్ విజయం.చదవండి: ICC: గెలిచిన జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్మనీ!.. బీసీసీఐ బంపరాఫర్ -
IND vs SA: వన్డే తరహా బ్యాటింగ్!.. పాపం పంత్
సౌతాఫ్రికా- ‘ఎ’తో మ్యాచ్ భారత్- ‘ఎ’ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. వంద పరుగుల మార్కుకు పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. పంత్ ఐదో వికెట్గా వెనుదిరడంతో భారత జట్టు మరోసారి కష్టాల్లో పడింది. కాగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ వేదికగా భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్ల గురువారం తొలి అనధికారిక టెస్టు ఆరంభమైంది.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికా.. రెండో ఇన్నింగ్స్లో 199 పరుగులకే చాప చుట్టేసింది. అయితే, తొలి ఇన్నింగ్స్లో భారత్ 234 పరుగులకే ఆలౌట్ కావడం సౌతాఫ్రికాకు కలిసి వచ్చింది.భారత్కు 275 పరుగుల లక్ష్యంమొదటి ఇన్నింగ్స్ కలుపుకొని భారత్కు 275 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే (6), వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ (5) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (12) కూడా నిరాశపరిచాడు.ఈ క్రమంలో... గాయం నుంచి కోలుకొని తిరిగి మైదానంలో అడుగు పెట్టిన భారత స్టార్ రిషబ్ పంత్ (81 బంతుల్లో 64 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా గాయపడిన పంత్ దాదాపు మూడు నెలల తర్వాత పోటీ క్రికెట్లో అడుగుపెట్టగా... తొలి ఇన్నింగ్స్లో 17 పరుగులే చేశాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం అదరగొట్టాడు.వన్డే తరహా ఆటతీరుతోకీలక దశలో క్రీజులోకి వచ్చిన పంత్... తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వన్డే తరహా ఆటతీరుతో సఫారీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఒక ఎండ్లో పాటీదార్ క్రీజులో పాతుకుపోయి వికెట్ల పతనాన్ని అడ్డుకుంటే... మరో ఎండ్లో పంత్ ఫటాఫట్ ఆటతీరుతో పరుగులు రాబట్టాడు. నాలుగో వికెట్కు 87 పరుగులు జోడించిన అనంతరం రజత్ అవుటయ్యాడు. పంత్తో పాటు ఆయుశ్ బదోనీ (0 బ్యాటింగ్) క్రీజులో నిలిచాడు.ఫలితంగా 275 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత ‘ఎ’ జట్టు మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 39 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆఖరిదైన ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా తన ఓవర్నైట్ స్కోరుకు మరో 26 పరుగులు జత చేసిన పంత్ సెంచరీ దిశగా పయనించాడు. సెంచరీ మిస్అయితే, 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రొటిస్ బౌలర్ టియాన్ వాన్ వారెన్ అద్భుత బంతితో పంత్ను బోల్తా కొట్టించాడు. వారెన్ వేసిన బంతిని షాట్ ఆడే క్రమంలో లీసెగో సెనొక్వనేకు క్యాచ్ ఇచ్చి పంత్.. ఐదో వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆయుశ్ బదోని 34 పరుగుల వద్ద వారెన్కు తన వికెట్ సమర్పించుకున్నాడు.ఫలితంగా 53 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసిన భారత్.. విజయానికి ఇంకా 80 పరుగుల దూరంలో నిలిచింది. తనుశ్ కొటియాన్ (9), మానవ్ సుతార్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా రెండో ఇన్నింగ్స్లో పంత్.. 113 బంతులుఎదుర్కొని పదకొండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు. Update: లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు: 216-7 (61)తనుశ్ కొటియాన్ 23 పరుగులు చేసి ఏడో వికెట్గా వెనుదిరగగా.. మానవ్ సుతార్ 1, అన్షుల్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 59 పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో కేవలం కేవలం మూడు వికెట్లు (టెయిలెండర్లు) మాత్రమే ఉన్నాయి.Match Result: IND vs SA: వారెవ్వా అన్షుల్!.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్చదవండి: ICC: గెలిచిన జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్మనీ!.. బీసీసీఐ బంపరాఫర్! -
IND vs SA: రసవత్తర పోరు.. భారత్కు భారీ షాక్
భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్ల మధ్య అనధికారిక తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికాను.. రెండో ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే భారత్ పరిమితం చేసింది. ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ (Tanush Kotian) మరోసారి నాలుగు వికెట్లతో చెలరేగి సఫారీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.నాలుగు వికెట్లు తీసిన తనుశ్రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెంగళూరు వేదికగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ (IND A vs SA A) జట్ల మధ్య గురువారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మాన్ (71), వన్డౌన్ బ్యాటర్ జుబేర్ హంజా (66), రుబిన్ హెర్మాన్ (54) అర్ధ శతకాలతో రాణించారు. టియాన్ వాన్ వారెన్ 46 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.234 పరుగులకే ఆలౌట్భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ చెరో రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టీమిండియా ఆటగాళ్లతో నిండిన భారత ‘ఎ’జట్టు తొలి ఇన్నింగ్స్లో 58 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది.ఆయుశ్ మాత్రే (76 బంతుల్లో 65; 10 ఫోర్లు) అర్ధ శతకంతో టాప్ స్కోరర్గా నిలవగా... ఆయుశ్ బదోనీ (47 బంతుల్లో 38; 5 ఫోర్లు), సాయి సుదర్శన్ (94 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రిషబ్ పంత్ విఫలంఇంగ్లండ్ పర్యటన సందర్భంగా నాలుగో టెస్టులో గాయపడి ఆటకు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మైదానంలో అడుగు పెట్టగా... 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్ పాటీదార్ (19), దేవదత్ పడిక్కల్ (6), తనుశ్ కొటియాన్ (13), మానవ్ సుతార్ (4) విఫలమయ్యారు.దక్షిణాఫ్రికా ‘ఎ’బౌలర్లలో ప్రేనెలన్ సుబ్రాయన్ 61 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సిపామ్లా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా మరో 169 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.భారత్కు 275 పరుగుల లక్ష్యంఈసారి ఓపెనర్లలో జోర్డాన్ (12) విఫలం కాగా.. లెసెగో సెనోక్వానే (37).. వన్డౌన్ బ్యాటర్ జుబేర్ హంజా (37) రాణించారు. లోయర్ ఆర్డర్లో మొరేకి 25 పరుగులు చేశాడు. మిగతా వారంతా విఫలం కావడంతో 48.1 ఓవర్లలో 199 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని (75+199) భారత్కు 275 పరుగుల లక్ష్యం విధించింది.భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లతో మెరవగా.. అన్షుల్ కాంబోజ్ మూడు, గుర్నూర్ బ్రార్ రెండు, మానవ్ సుతార్ ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో భారత్కు భారీ షాక్ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. గత ఇన్నింగ్స్లో అర్ధ శతకం బాదిన ఓపెనర్ ఆయుశ్ మాత్రే 6 పరుగులకే అవుటయ్యాడు. మొరేకి బౌలింగ్లో బౌల్డ్ అయి తొలి వికెట్గా వెనుదిరిగాడు.ఇక వన్డౌన్లో వచ్చిన దేవ్దత్ పడిక్కల్ (5) మరోసారి విఫలం అయ్యాడు. సిలీ బౌలింగ్లో అతడు బౌల్డ్ అయ్యాడు. కాగా టీ విరామ సమయానికి ఓపెనర్ సాయి సుదర్శన్ 8, నాలుగో నంబర్ బ్యాటర్ రజత్ పాటిదార్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు: 25-2 (9). చదవండి: శివం దూబేను కాదని.. హర్షిత్ను ప్రమోట్ చేయడానికి కారణం అదే: అభిషేక్ శర్మ -
రీఎంట్రీలో రిషభ్ పంత్ ఫెయిల్.. భారత్ ఆలౌట్.. స్కోరెంతంటే?
దాదాపు మూడు నెలల విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) విఫలమయ్యాడు. సౌతాఫ్రికా-‘ఎ’ జట్టుతో భారత్-‘ఎ’ (IND A vs SA A) కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పూర్తిగా నిరాశపరిచాడు.ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన పంత్.. 20 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో కేవలం 17 పరుగులే చేసి నిష్క్రమించాడు. సౌతాఫ్రికా బౌలర్ ఒకులే సిలీ బౌలింగ్లో జుబేర్ హంజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మేరకు రీఎంట్రీలో రిషభ్ పంత్ ఇలా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు ముందు భారత్ రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా -‘ఎ’ జట్ల మధ్య గురువారం బెంగళూరు వేదికగా తొలి అనధికారిక టెస్టు మొదలైంది. తొలిరోజు ఇలాటాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగింది దక్షిణాఫ్రికా ‘ఎ’. భారత ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ (4/83) సత్తా చాటడంతో గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. జోర్డాన్ హెర్మాన్ (141 బంతుల్లో 71; 8 ఫోర్లు), జుబేర్ హమ్జా (109 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్), రుబిన్ హెర్మాన్ (87 బంతుల్లో 54; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. హెర్మాన్ బ్రదర్స్ అదుర్స్ జోర్డాన్ హెర్మాన్, జుబేర్ హమ్జా రెండో వికెట్కు 132 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుకు మంచి ఆరంభం లభించగా... ఆ తర్వాత మన బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. గుర్నూర్ బ్రార్ (1/45) బౌలింగ్లో ర్యాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హంజా కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ అకెర్మన్ (18) ఎక్కువసేపు నిలవలేకపోగా... మూన్స్వామి (5) విఫలమయ్యాడు.ఈ దశలో జోర్డాన్ హెర్మాన్ సోదరుడు రుబిన్ హెర్మాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. టియాన్ వాన్ వురెన్ (75 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. భారత ‘ఎ’ బౌలర్లలో తనుశ్ కొటియాన్ 4 వికెట్లు పడగొట్టగా... మానవ్ సుతార్ 2 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు. 309 పరుగులకు ఆలౌట్ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటను 299/9 ఓవర్నైట్ స్కోరుతో మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా పది పరుగులు జోడించి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 91.2 ఓవర్లలో 309 పరుగులు సాధించింది.ఆయుశ్ మాత్రే హాఫ్ సెంచరీఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్-‘ఎ’కు ఓపెనర్లు సాయి సుదర్శన్, ఆయుశ్ మాత్రే శుభారంభం అందించారు. ఆయుశ్ అర్ధ శతకం (65)తో మెరవగా.. సాయి 32 పరుగులు చేశాడు. వన్డౌన్లో దేవ్దత్ పడిక్కల్ (6), ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన రజత్ పాటిదార్ (19), రిషభ్ పంత్ (17) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వారిలో ఆయుశ్ బదోని 38 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ఆల్రౌండర్ తనుశ్ కొటియాన్ 13 పరుగులు చేయగా.. మానవ్ సుతార్ 4, అన్షుల్ కాంబోజ్ 5 పరుగులకే పెవిలియన్ చేరారు. ఖలీల్ అహ్మద్ నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్గా వెనుదిరిగాడు. భారత్ ఆలౌట్.. స్కోరెంతంటే?ఫలితంగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 58 ఓవర్లు ఆడి 234 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుకు 75 పరుగుల ఆధిక్యం లభించింది. సఫారీ బౌలర్లలో ప్రెనెలాన్ సుబ్రయేన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. షెపో మొరేకి, ఒకులే సిలీ, టియాన్ వాన్ వారెన్ ఒక్కో వికెట్ తీశారు. లుతో సింపాలా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: కేకేఆర్లోకి రోహిత్ శర్మ ‘కన్ఫామ్’!.. స్పందించిన ముంబై ఇండియన్స్ -
టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ ఫెయిల్! అయినా భారీ స్కోర్
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎ, భారత్-ఎ మధ్య జరుగుతున్న మొదటి అనధికారిక టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆటలో భారత్పై సౌతాఫ్రికా బ్యాటర్లు పై చేయి సాధించారు. ప్రోటీస్ ఎ జట్టు డే వన్ ఆట ముగిసే సమయానికి 85.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. క్రీజులో షెపో మోరెకి(4), కుహ్లే సెలె(0) ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జోర్డాన్ హెర్మాన్(71), హంజా(66), రుబిన్ హెర్మాన్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ మార్క్స్ అకెర్మాన్(18) పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ముంబై స్పిన్నర్ తనీష్ కొటియన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మానవ్ సుత్తర్ రెండు, అన్షుల్ కాంబోజ్, ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.పంత్ రీ ఎంట్రీ..ఇండియా-ఎ జట్టుకు సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. గాయం కారణంగా వెస్టిండీస్తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పంత్.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ కాలి మడమకు గాయమైంది.దీంతో అతడు దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో భారత్-ఎ తరపున ఆడాలని రిషబ్ నిర్ణయించుకున్నాడు. రెండో అనాధికారిక టెస్టులో కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఆడనున్నారు.చదవండి: IND vs SA: లంచ్కు ముందే టీ బ్రేక్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి -
IND vs SA: కోహ్లిని అవమానించిన రిషభ్ పంత్?!.. ఫ్యాన్స్ ఫైర్
టెస్టు క్రికెట్లో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. సంప్రదాయ ఫార్మాట్లో కెప్టెన్గా భారత్ను అగ్రస్థానంలో నిలిపిన కోహ్లి.. మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో జట్టును ఫైనల్కు చేర్చాడు.ఇక టీమిండియా తరఫున మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి.. 9230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు కూడా ఉన్నాయి. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు ముందు తనకు ఇష్టమైన టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లి.భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గాఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ సందర్భంగా పంత్ భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం బెంగళూరు వేదికగా తొలి టెస్టు మొదలైంది.కోహ్లిని అవమానించిన పంత్?!.. ఫ్యాన్స్ ఫైర్ఈ మ్యాచ్లో పంత్ ‘18’ నంబర్ ఉన్న జెర్సీ ధరించడం కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కాగా 18 నంబర్ విరాట్ కోహ్లిది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘‘రిషభ్ పంత్ కావాలనే 18వ నంబర్ జెర్సీ ధరించి కోహ్లిని అవహేళన చేయాలని చూస్తున్నాడా?.. కోహ్లి అంటే పడని.. హెడ్కోచ్ గౌతం గంభీర్ దృష్టిలో పడి.. అతడిని ఆకట్టుకోవాలనే ఇలా చేస్తున్నాడా?అది కింగ్ కోహ్లి నంబర్. క్రీడా ప్రపంచంలో దిగ్గజ ఆటగాడు రిటైర్ అయిన తర్వాత అతడి గౌరవార్థం జెర్సీ నంబర్కు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి’’ అంటూ తీవ్ర స్థాయిలో కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా ఇటీవల భారత్- ‘ఎ’ తరఫున ఇంగ్లండ్ లయన్స్తో మ్యాచ్లో పేసర్ ముకేశ్ కుమార్ కూడా 18 నంబర్ ఉన్న జెర్సీ ధరించగా ఇలాగే విమర్శలు వచ్చాయి.అసలు విషయం ఇదీ!ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘భారత్- ‘ఎ’ జట్టులో జెర్సీ నంబర్లు ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించబడవు. వాటిపై పేర్లు కూడా ఉండవు. కాబట్టి మ్యాచ్కు ముందు తమకు వచ్చిన జెర్సీలను ఆటగాళ్లు ధరిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రమే పర్టికులర్గా జెర్సీ నంబర్లకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని తెలిపాయి.కాగా సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో టాస్ గెలిచిన భారత్-‘ఎ’ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 79 ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్!? -
పంత్ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా గాయపడిన (పాదం) టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ (Rishabh Pant) మూడు నెలల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా-ఏతో (India A vs South Africa A) ఇవాళ (అక్టోబర్ 30) ప్రారంభమైన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్లో పంత్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తాడు.బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరుగుతున్న ఈ మ్యాచ్లో పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఎక్కడా ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. ఈ మ్యాచ్లో టీమిండియా తరఫున సాయి సుదర్శన్, ఆయుశ్ మాత్రే, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ లాంటి అప్ కమింగ్ బ్యాటర్లు బరిలోకి దిగారు.ఈ పర్యటనలో సౌతాఫ్రికా-ఏ, భారత్-ఏ జట్ల మధ్య 2 అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, 3 అనధికారిక వన్డేలు జరుగనున్నాయి. రెండో టెస్ట్ కూడా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లోనే జరుగనుండగా.. మూడు వన్డేలకు రాజ్కోట్ ఆతిథ్యమివ్వనుంది. తుది జట్లు.. ఇండియా-A: సాయి సుదర్శన్, ఆయుశ్ మాత్రే, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, తనుష్ కోటియన్, అన్షుల్ కాంబోజ్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్దక్షిణాఫ్రికా-A: మార్క్వెస్ అకెర్మాన్ (సి), జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, జుబేర్ హంజా, రూబిన్ హెర్మాన్, రివాల్డో మూన్సామి (w), టియాన్ వాన్ వురెన్, ప్రేనెలాన్ సుబ్రాయెన్, త్షెపో మోరేకి, లూథో సిపమ్లా, ఒకుహ్లే సెలెచదవండి: మళ్లీ ముంబై ఇండియన్స్లోకి పోలార్డ్, పూరన్ -
అందుకే అతడిని సెలక్ట్ చేయలేదు: స్పందించిన బీసీసీఐ!
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ఆడే భారత్- ‘ఎ’ జట్టు (IND A vs SA A)ను ప్రకటించిన నాటి నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై విమర్శలు కొనసాగుతున్నాయి. రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్గా వ్యవహరించే ఈ జట్టులో ఉద్దేశపూర్వకంగానే సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఇంటిపేరు కారణంగానే అంటూసొంతగడ్డపై సర్ఫరాజ్ ఖాన్ సత్తా చాటగలడని.. అయినా అతడిని పక్కనపెట్టడం ఏమిటని మాజీ క్రికెటర్లు సైతం విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేత షామా మొహమ్మద్ అయితే ఓ అడుగు ముందుకేసి.. ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్పై వేటు వేశారంటూ హెడ్కోచ్ గౌతం గంభీర్పై సంచలన ఆరోపణలు చేశారు.గజ్జల్లో గాయంఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఈ విషయంపై స్పందించినట్లు ఎన్డీటీవీ తెలిపింది. సర్ఫరాజ్ ఖాన్ను భారత్- ‘ఎ’ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి గల కారణం వెల్లడించినట్లు పేర్కొంది. ఈ మేరకు.. ‘‘సర్ఫరాజ్ గజ్జల్లో గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే రంజీ ట్రోఫీ మొదటి రౌండ్ సందర్భంగా ముంబై తరఫున కాంపిటేటివ్ క్రికెట్లో పునరాగమనం చేశాడు.త్వరలోనే తిరిగి జట్టులోకిరంజీ తాజా సీజన్లో అతడి ప్రదర్శన, ఫిట్నెస్ ఎలా ఉంటుందో అంచనా వేసిన తర్వాతే అతడిని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అందుకే భారత్-‘ఎ’ జట్టుకు ఎంపిక చేయలేదు. త్వరలోనే తిరిగి అతడు జట్టులోకి వస్తాడని నమ్ముతున్నాం’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు ఎన్డీటీవీ తెలిపింది.కాగా స్వదేశంలో దేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో ఈనెల 30 నుంచి నవంబర్ 9 వరకు జరిగే రెండు నాలుగు రోజుల (ఫస్ట్క్లాస్) అనధికారిక టెస్టు మ్యాచ్లలో తలపడే భారత ‘ఎ’ జట్టుకు పంత్ను కెప్టెన్గా ఎంపిక చేసింది బీసీసీఐ. పంత్ రీఎంట్రీబెంగళూరు వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్ల కోసం రెండు వేర్వేరు జట్లను మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తేదీలను దృష్టిలో ఉంచుకుంటూ ఆయా ఆటగాళ్ల అందుబాటును బట్టి జట్లను ఎంపిక చేశారు.కాగా ఇంగ్లండ్తో మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్టులో పేసర్ క్రిస్ వోక్స్ బంతి బలంగా తగలడంతో పంత్ కాలికి తీవ్ర గాయమైంది. దాంతో చివరి టెస్టు నుంచి తప్పుకున్న అతడు ఆ తర్వాత ఆసియా కప్ టీ20 టోర్నీ, వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్కు కూడా దూరమయ్యాడు. చికిత్స అనంతరం కోలుకున్న పంత్ ఆడేందుకు ఫిట్గా ఉన్నట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం ఇటీవలే సర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో అతడిని ముందుగా ‘ఎ’ జట్టు తరఫున ఆడించాలని సెలక్టర్లు నిర్ణయించారు.అన్నీ సానుకూలంగా ఉంటే దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం పంత్ను ఎంపిక చేయడం లాంఛనమే. పంత్తో పాటు యువ బ్యాటర్ సాయి సుదర్శన్కు మరింత మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని భావించి అతడిని రెండు మ్యాచ్ల కోసం ఎంపిక చేశారు. దేశవాళీలో రాణిస్తూ ఫామ్లో ఉన్న రజత్ పాటీదార్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్, ఆకాశ్దీప్లను రంజీ కారణంగా ఒకే మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. మరోవైపు టెస్టు సిరీస్కు ముందు తమ ఆటకు పదును పెట్టాలని భావిస్తున్న రెగ్యులర్ టెస్టు జట్టు సభ్యులు కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ధ్రువ్ జురేల్ కూడా రెండో మ్యాచ్లో ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. భారత్ ‘ఎ’ జట్టు (తొలి మ్యాచ్కు): రిషభ్ పంత్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ మాత్రే, జగదీశన్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, హర్ష్ దూబే, తనుశ్ కొటియాన్, మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుశ్ బదోని, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్. భారత్ ‘ఎ’ జట్టు (రెండో మ్యాచ్కు): పంత్ (కెప్టెన్), సాయిసుదర్శన్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుశ్ కొటియాన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్. చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా? -
ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?.. మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ కౌంటర్
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. రిషభ్ పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు వైస్ కెప్టెన్గా సాయి సుదర్శన్ (Sai Sudharsan)ను ఎంపిక చేశారు సెలక్టర్లు.కావాల్సినంత ప్రాక్టీస్అదే విధంగా రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ వంటి టీమిండియా స్టార్లకు కూడా చోటిచ్చారు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు సన్నాహకంగా ఉండే ఈ రెడ్బాల్ సిరీస్తో ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.పక్కనపెట్టడంపై విమర్శలుఇక ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్ ఖాన్కు ప్రధాన జట్టులో స్థానం దక్కదనే స్పష్టంగానే తెలుస్తోంది. ఇటీవలే పదిహేడు కిలోల బరువు తగ్గడంతో పాటు రెడ్ బాల్ టోర్నీల్లో సెంచరీ చేసినా సెలక్టర్లు అతడిని ఇలా పక్కనపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ సంచలన ట్వీట్ చేశారు.ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?‘‘ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు ఎంపిక కాలేదా?.. ఊరికే అడుగుతున్నా అంతే!.. ఈ విషయంలో గౌతం గంభీర్ విధానాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా!’’ అంటూ హెడ్కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్ను షామా మొహమ్మద్ టార్గెట్ చేశారు.కరెక్ట్ కాదు మేడమ్..ఈ నేపథ్యంలో షామా ట్వీట్పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే, మెజారిటీ మంది ఆమె ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నారు. మొహమ్మద్ సిరాజ్ జట్టులోని ప్రధాన బౌలర్లలో ఒకడన్న విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు. ఆటలో ఇలాంటి రాజకీయాలకు తావు లేదని.. ఇలాంటి మాటలతో చిచ్చు పెట్టాలని చూడటం సరికాదని పేర్కొంటున్నారు.భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదుఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్.. షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విషాదకరం. ఇలాంటి మాటలు వద్దు. సర్ఫరాజ్ ఖాన్ జట్టులో ఉండేందుకు అర్హుడు.అయితే, అతడికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదన్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు అర్థంలేనివి. భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదు. అజర్ హయాంలోనూ కొందరు ఇలాంటి మాటలే మాట్లాడారు.కానీ ఇందులో మతపరమైన కోణం ఉంటుందని నేను అస్సలు అనుకోను. సర్ఫరాజ్ ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగానే జట్టులోకి ఎంపిక కాలేడు. చాన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.సర్ఫరాజ్కు తగినన్ని ఛాన్సులు రాలేదు.. కానీఅయితే, ఓ ప్లేయర్ ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన పక్కన పెట్టడం సరికాదు. సర్ఫరాజ్ ఖాన్కు తగినన్ని ఛాన్సులు రాలేదు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన రిషభ్ పంత్.. తర్వాత విఫలమైనా అతడిని పక్కనపెట్టడం జరగదు.జట్టు ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని ఎవరూ మార్చలేరు’’ అని అతుల్ వాసన్ చెప్పుకొచ్చాడు. కాగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి ఓ సెంచరీ, మూడు అర్థ శతకాల సాయంతో 371 పరుగులు చేశాడు. రోహిత్ లావుగా ఉన్నాడని..కాగా షామా మొహమ్మద్ గతంలోనూ రోహిత్ శర్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉన్నాడని.. అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడే తప్ప అతడికి అంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. కాగా భారత్కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత రోహిత్ శర్మది.చదవండి: ఓపెనర్గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్ -
పంత్ కారణంగానే సర్ఫరాజ్ ఖాన్పై వేటు.. అసలు విషయమేంటి?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో గాయపడి ఆటకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తిరిగి మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో అక్టోబరు 30 నుంచి నవంబర్ 9 వరకు జరిగే రెండు నాలుగు రోజుల (ఫస్ట్క్లాస్) అనధికారిక టెస్టు మ్యాచ్లలో తలపడే భారత ‘ఎ’ జట్టుకు పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు.బెంగళూరు వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్ల కోసం రెండు వేర్వేరు జట్లను మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. అయితే, ఇందులో ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. కాగా స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ను ఆడిస్తామని సెలక్టర్లు నమ్మకంగానే అతడికి చెప్పినట్లు సమాచారం.పదిహేడు కిలోల మేర బరువు తగ్గి..ఈ నేపథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న వేళ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్నెస్పై మరింతగా దృష్టి సారించాడు. ఏకంగా పదిహేడు కిలోల మేర బరువు తగ్గి స్లిమ్గా మారాడు. అయితే, సెలక్టర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టులకు ముందు జరిగే అనధికారిక టెస్టు సిరీస్కు సెలక్టర్లు సర్ఫరాజ్ను ఎంపిక చేయలేదు. ఇందుకు ప్రధాన కారణం అతడి బ్యాటింగ్ ఆర్డరే అని తెలుస్తోంది. సాధారణంగా ముంబై జట్టులో సర్ఫరాజ్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.పంత్ రాకతోఅయితే, భారత- ‘ఎ’ జట్టు కెప్టెన్గా తిరిగి వచ్చిన పంత్ కూడా అదే స్థానంలో ఆడతాడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ టాపార్డర్కు ప్రమోట్ అవుదామనుకున్నా.. ఓపెనర్లుగా ఆయుశ్ మాత్రే- నారాయణ్ జగదీశన్ వచ్చే అవకాశం ఉండగా.. వన్డౌన్లో వైస్ కెప్టెన్ సాయి సుదర్శన్ ఉండనే ఉన్నాడు.ఇక ఆ తర్వాతి స్థానం కోసం దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ పోటీపడుతున్నారు. ఇక మిడిలార్డర్లో ఐదో నంబర్లో పంత్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఇక టీమిండియాలోనూ ఆరో స్థానం నుంచి ఆల్రౌండర్లే ప్రధానంగా బ్యాటింగ్కు వస్తున్నారు.బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలిఇలాంటి సమీకరణల నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్కు ‘ఎ’ జట్టులోనూ చోటు కరువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఒకరు పీటీఐతో మాట్లాడుతూ..‘‘ముంబై మేనేజ్మెంట్తో సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలి. లేదంటే.. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేతో మాట్లాడాలి. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కొత్త బంతిని ఎదుర్కునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.చాలానే ఆప్షన్లు ఉన్నాయివన్డౌన్లో నిలదొక్కుకుంటే భవిష్యత్తులోనైనా అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతానంటే సర్ఫరాజ్ కెరీర్ ప్రశ్నార్థకమే అవుతుంది. ఎందుకంటే.. ఐదో స్థానంలో పంత్తో పాటు.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి రూపంలో మేనేజ్మెంట్కు చాలానే ఆప్షన్లు ఉన్నాయి.ఈ ముగ్గురు ఫిట్గా ఉండి.. సెలక్షన్కు అందుబాటులో ఉంటే సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి తప్పదు. ఒకవేళ పంత్ గాయపడినా ధ్రువ్ జురెల్ ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతాడు. కాబట్టి సర్ఫరాజ్ మూడో స్థానంలో ఆడటంపై దృష్టి పెడితే బాగుంటుంది’’ అని సదరు సెలక్టర్ అభిప్రాయపడ్డాడు.కాగా ముంబై తరఫున రంజీల్లో పరుగుల వరద పారించిన 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
పాపం సర్ఫరాజ్ ఖాన్.. ఎందుకిలా..?
త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికా-ఏతో జరుగబోయే రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్ల కోసం రెండు వేర్వేరు భారత-ఏ జట్లను ఇవాళ (అక్టోబర్ 21) ప్రకటించారు. రెండు జట్లకు రిషబ్ పంత్ కెప్టెన్గా, సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన పంత్ ఈ సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు. దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మొహమ్మద్ సిరాజ్ రెండో టెస్ట్ జట్టుకు మాత్రమే ఎంపికయ్యారు.కాగా, ఈ రెండు జట్లలో ఇన్ ఫామ్ ఆటగాళ్లు మహ్మద్ షమీ (Mohammed Shami), సర్ఫరాజ్ ఖాన్కు (Sarfaraz Khan) చోటు దక్కకపోవడం అందరికీ ఆశ్యర్యాన్ని కలిగించింది. షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్లో 7 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. వాస్తవానికి షమీ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులోనే చోటు ఆశించాడు. అయితే ఫిట్నెస్పై అప్డేట్ లేదన్న కారణం చెప్పి సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు సౌతాఫ్రికా-ఏతో సిరీస్కు కూడా షమీని ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లపై విమర్శలు వస్తున్నాయి. ఫిట్గా ఉండి, ఫామ్లో ఉన్నా షమీని సౌతాఫ్రికా-ఏతో సిరీస్కు ఎందుకు ఎంపిక చేయలేదని అభిమానులు నిలదీస్తున్నారు. మరోవైపు యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ సెలెక్టర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు అంచనాలకు మించి బరువు తగ్గి, ఫామ్ను చాటుకున్న సర్ఫరాజ్ ఖాన్ను సౌతాఫ్రికా-ఏతో సిరీస్కు ఎందుకు ఎంపిక చేయలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్లో 74 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అంతకుముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరిగిన బుచ్చిబాబు టోర్నీలో వరుసగా రెండు సెంచరీలు చేశాడు. దీనికి ముందు భారత్-ఏ తరఫున కూడా సర్ఫరాజ్ సత్తా చాటాడు. ఇంగ్లండ్ పర్యటన తొలి మ్యాచ్లో 92 పరుగులు చేశాడు. ఇంత చేసినా సర్ఫరాజ్ను ఏ జట్టుకు కూడా ఎంపిక చేయకపోవడం విచారకరమని అభిమానులు అంటున్నారు. సర్ఫరాజ్, షమీ.. ఏం నేరం చేశారని వారికి అవకాశాలు ఇవ్వడం లేదని అభిమానులు సెలెక్టర్ల నిలదీస్తున్నారు.సౌతాఫ్రికా-ఏతో తొలి మ్యాచ్కు భారత జట్టు (అక్టోబరు 30- నవంబరు 2):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్.సౌతాఫ్రికా-ఏతో రెండో మ్యాచ్కు భారత జట్టు (నవంబరు 6- నవంబరు 9):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.చదవండి: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్ -
సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పునరాగమనం ఖరారైంది. గాయం నుంచి కోలుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు (Ind A vs SA A)తో జరిగే నాలుగు రోజుల మ్యాచ్ల రెడ్బాల్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడిని సారథిగా ఎంపిక చేసింది.కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్న టీమిండియా.. నవంబరు 14 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో వరుస సిరీస్లు ఆడనుంది. సఫారీలతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.ముందుగా నాలుగు రోజుల మ్యాచ్లు అయితే, అంతకంటే ముందే.. భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య అక్టోబరు 30- నవంబరు 9 వరకు రెడ్బాల్ ఫార్మాట్లో నాలుగు రోజుల మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్ కాగా.. టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్కు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ దక్కింది.పంత్ సేనలోకి ఆ టీమిండియా స్టార్లు కూడాఇక సౌతాఫ్రికా- ‘ఎ’తో రెండో మ్యాచ్ నుంచి టీమిండియా స్టార్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా పంత్ సేనలో చేరనున్నారు. కాగా భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగే ఈ రెడ్బాల్ సిరీస్కు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదిక. కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా పంత్ కుడికాలికి గాయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ విశ్రాంతి తర్వాత అతడు ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి ఫోర్-డే మ్యాచ్కు భారత జట్టు (అక్టోబరు 30- నవంబరు 2):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్.సౌతాఫ్రికా- ‘ఎ’తో రెండో ఫోర్-డే మ్యాచ్కు భారత జట్టు (నవంబరు 6- నవంబరు 9):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులో బవుమా దక్షిణాఫ్రికా రెగ్యులర్ టెస్టు కెప్టెన్ తెంబా బవుమా... టీమిండియా పర్యటన కోసం కసరత్తులు చేస్తున్నాడు. గాయం కారణంగా పాకిస్తాన్తో సిరీస్కు దూరమైన బవుమా... ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో పాటు భారత్కు రానున్నాడు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.నవంబర్ 14న ప్రారంభం కానున్న ఈ పర్యటన... డిసెంబర్ 19తో ముగియనుంది. దానికి ముందు ఇక్కడి పరిస్థితులపై అంచనా కోసం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు... భారత ‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది. ఈ నెల 30న బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుండగా... నవంబర్ 6 నుంచి రెండో మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్ల్లో బవుమా... దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో ఇక్కడి పరిస్థితులపై అవగహనకు రావొచ్చని దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్యం భావిస్తోంది. అకెర్మన్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులో బవుమాతో పాటు జుబేర్ హంజా, ప్రెనెలన్ సుబ్రాయన్ కూడా ఉన్నారు. చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి


