breaking news
family suicide
-
చేదు మిగిల్చిన ఉగాది
మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఉగాది పండుగ నాడు ఒక స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు కుమారులు మృతి చెందడం విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. మడకశిర గాందీబజార్లో సొంతింట్లో స్వర్ణకారుడు క్రిష్ణాచారి కుటుంబం నివాసం ఉంటోంది. ఏమైందో ఏమో కానీ క్రిష్ణాచారి (45), భార్య సరళ (38), పెద్ద కుమారుడు సంతోష్ (15), రెండో కుమారుడు భువనేష్ (13) మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వెలుగులోకి వచి్చంది. మృతుడు క్రిష్ణాచారికి తండ్రితోపాటు గోపి, సురేష్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. చిన్న సోదరుడు సురేష్ ఇంట్లో ఉంటున్న తండ్రి ఉదయాన్నే క్రిష్ణాచారికి ఫోన్ చేశారు. ఫోన్ తీయకపోవడంతో సురేశ్ తన అన్న కిృష్ణాచారి ఇంటి వద్దకు వెళ్లి చూడగా లోపల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశాడు. క్రిష్ణాచారి జేబులో సైనేడ్ డబ్బా.. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఇంటిని క్షుణ్నంగా పరిశీలించింది. క్రిష్ణాచారి జేబులో సైనేడ్ డబ్బా ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే క్రిష్ణాచారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. క్రిష్ణాచారి ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు ముందు బెంగళూరులో ఉన్న తన అక్కతో ఫోన్లో మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయ్యో పిల్లలు.. ఉగాదికి ఇంటికొచ్చి.. క్రిష్ణాచారి పెద్ద కుమారుడు సంతోష్ మడకశిర సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ.. పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. చిన్న కుమారుడు భువనేష్ అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ పాఠశాల హాస్టల్లో ఉంటూ.. ఉగాది సందర్భంగా ఇంటికొచ్చారు. వీరిద్దరూ తల్లిదండ్రులతోపాటు ప్రాణాలు కోల్పోయారు. -
వెండి వ్యాపారి కుటుంబం ఆత్మహత్య
సేలం (తమిళనాడు): రుణ వేధింపులతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడన ఘటన సేలంలో మంగళవారం కలకలం రేపింది. వివరాలు.. సేలం జిల్లా అరిసిపాళయం ముత్యాల్ స్ట్రీట్ ప్రాంతానికి చెందిన బాల్రాజ్ (46) వెండి పని చేస్తున్నాడు. అతని భార్య రేఖ (40). వీరి కూతురు జనని(17). ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతుంది. బాల్రాజ్ కొద్ది నెలల క్రితం కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాడు. ఈ స్థితిలో ఆయన చేస్తున్న వెండి వ్యాపారంలో నష్టం ఏర్పడడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. అప్పు ఇచ్చిన వారు సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి మంగళవారం ఉదయం అప్పు చెల్లించాలని, లేకుంటే పరువు తీస్తామని బెదిరించినట్లు సమాచారం. దీంతో బాల్రాజ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఇరుగుపొరుగు వారు తెలిపారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం బంధువు పరామర్శకు వెళ్లగా.. ఇంటి మేడ గదిలో బాల్రాజ్, రేఖ, జనని ముగ్గురు ఉరి వేసుకుని మృతదేహాలుగా వేలాడుతూ కనిపించారు. దిగ్భ్రాంతికి గురైన బంధువును, ఇరుగుపొరుగు వారు అక్కడికి వెళ్లారు. ఈ ఆత్మహత్య ఘటనపై పల్లపట్టి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో కుటుంబ సమేతంగా వెండి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపడమే కాకుండా విషాదాన్ని నింపింది. కాగా ఘటనా స్థలంలో.. పోలీసులు బాల్రాజ్ రాసిన లేఖను స్వాదీనం చేసుకున్నారు. -
ముగ్గురి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్..
రాజేంద్రనగర్ (హైదరాబాద్): ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవలే ఈ మరణాలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ (38) ఇందిర (36) దంపతులు. వీరికి శ్రేయాన్స్ (4) ఒక్కడే కొడుకు. పాల వ్యాపారం చేసే ఆనంద్ మూడేళ్ల క్రితం నుంచి బండ్లగూడజాగీర్ సన్సిటీ ఏరియాలోని యమున అపార్ట్మెంట్స్లో ఉంటున్నాడు. ఆనంద్ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ బెట్టింగ్ల కారణంగా దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి, ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. 15 రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన వారితోపాటు స్నేహితులు వచ్చి ఆన్లైన్లో గేమ్స్ ఆడొద్దని, బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు. అయినా ఆనంద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడురోజుల క్రితం మరోసారి ఆనంద్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్టు సమాచారం. ఇదే విషయమై సోమవారం ఉదయం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన సమయంలో ఇందిర తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆనంద్ కూడా తన స్నేహితులతోపాటు బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతోపాటు బంధుమిత్రులు ఫోన్లు చేసినా, ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారంతా కంగారుపడి అపార్ట్మెంట్ వచ్చి చూడగా, మృతదేహాలు కనిపించాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను చంపి.. ఆపై ఆత్మహత్య ! ఘటనాస్థలిని పరిశీలించాక...దంపతులు మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, ఆ క్రమంలోనే పెనుగులాటలో భార్య చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కొడుకుకు క్రిమిసంహారక మందు తాగించి, ఆనంద్ కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీకొడుకు నోటి నుంచి నురగలు వస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఇందిర నోటి నుంచి ఎలాంటి నురుగులు రాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఉదయం నుంచే దంపతులు గొడవ పడుతున్నట్టు వాచ్మెన్ పోలీసులు తెలిపాడు. -
Anakapalle: జ్యూయలరీ వ్యాపారి కుటుంబం ఆత్మహత్య
పనులు పూర్తి చేసుకొని నాన్న ఇంటికొస్తే పిల్లలకు ఆనందం. భర్త కోసం ఎదురుచూసే గృహిణి మనసుకు నిశ్చింత. ఆయన వస్తూ వస్తూ తినడానికేమైనా తెస్తే పిల్లలు ఎగబడి తింటారు. ఈరోజూ అలాగే చేశారు. ఆయన బిర్యానీ తెస్తే అందరూ చక్కగా తిన్నారు. ముద్ద నోట్లో పెట్టే సరికి వారికి తెలీదు.. క్షణాల్లో ప్రాణం తీసే సైనెడ్ అందులో ఉందని. తెలుసుకునే లోగానే విగత జీవులయ్యారు.. తొమ్మిదేళ్ల పాపాయిని ఒంటరిగా ఒదిలేసి. తింటుండగా వాంతి కావడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. సాక్షి, అనకాపల్లి: పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక జ్యూయలరీ వ్యాపారి కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బిర్యానీలో ౖసైనెడ్ కలిపి భార్య, ముగ్గురు పిల్లలతో తినిపించి బలవన్మరణానికి యత్నించాడు. ఈ హృదయవిదారక ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వీరిలో నలుగురు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జ్యూయలరీ వ్యాపారి కొడవలి శివరామకృష్ణ తన కుటుంబంతో ఏడాది క్రితం అనకాపల్లికి వచ్చారు. అనకాపల్లి టౌన్లో పెరుగుబజారు సమీపంలో జ్యూయిలరీ షాపును ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్వస్థలాన్ని వీడిన రామకృష్ణ స్థానిక ఉడ్ పేటలో ఫైర్ స్టేషన్ పక్కన లక్ష్మీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో భార్య మాధవి దేవి (40), కుమార్తెలు వైష్ణవి (15), జాహ్నవి (12), కుసుమప్రియ తో కలిసి నివాసముంటున్నారు. తన పిల్లలను స్థానిక సిటీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నారు. పిల్లలు తొమ్మిది, ఏడు, మూడు తరగతులు చదువుతున్నారు. అనకాపల్లికి వచ్చిన ప్రారంభంలో రామకృష్ణ ఓ బంగారం షాపులో ఉద్యోగం చేసేవాడు. ఆ తరువాత సొంతంగా జ్యూయలరీ షాపు పెట్టుకున్నాడు. ఏడాదిన్నర నుంచి అనకాపల్లి టౌన్లోనే ఉన్నా వ్యాపారరీత్యాగానీ, పని నిమిత్తంగానీ ఎవరితోనూ వివాదం పెట్టుకున్న సందర్భాలు లేవు. అయితే ఆ కుటుంబం చుట్టుపక్కల వారితో కలివిడిగా ఉండేవారు కాదని, ముభావంగా అంటీముట్టనట్టు ఒంటరిగా ఉండేవారని స్థానికులు తెలిపారు. భార్యాపిల్లలకు తెలీకుండా! రామకృష్ణ గురువారం రాత్రి 9 గంటలకు దుకాణం నుంచి ఇంటికి వచ్చాడు. ౖసైనెడ్ కలిపిన బిర్యానీ తీసుకొచ్చాడు. ఆ విషయం భార్యాపిల్లలకు తెలీదు. కుటుంబమంతా బిర్యానీ తిన్నారు. అంతలో చిన్న కూతురు కుసుమ వాంతి చేసుకుంది. కొద్ది క్షణాల్లోనే మిగతావారంతా నేలకొరిగారు. ఈ విషయం గమనించిన కుసుమ పక్కింటికి వెళ్లి అమ్మ, నాన్న నిద్రపోయి లేవలేదు అని ఏడుస్తూ చెప్పింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాంతులు చేసుకున్న చిన్నారిని హుటాహుటిన స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం కేజీహెచ్కు తరలించారు. మూడేళ్లుగా దూరం రామకృష్ణ అప్పులు చేసి ఎవరికీ తెలియకుండా అనకాపల్లి టౌన్లో నివసిస్తున్నట్టు అనకాపల్లి చేరుకున్న అతని సోదరుడు వెంకటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం తెలుస్తోంది. సుమారుగా మూడేళ్లుగా కుటుంబ సభ్యులతో సఖ్యత లేదని తెలుస్తోంది. మృతదేహాలను చూసేందుకు ఒక సోదరుడు మినహా కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. ఆధారాలు లేవు ఘటన స్థలంలో ఆత్మహత్యకు సంబంధించిన ఎటువంటి ఆధారాలూ లభించలేదని డీఎస్పీ వి.సుబ్బరాజు చెప్పారు. క్లూస్టీమ్ ఇంటిలో అన్ని గదులనూ క్షణంగా పరిశీలించిందని పేర్కొన్నారు. బిర్యానీ ప్యాకెట్లతో భోజనం చేస్తూ అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా, కుసుమప్రియ అపాయం నుంచి తప్పించుకుందని, ప్రస్తుతం కేజీహెచ్లో కోలుకుంటోందన్నారు. శివరామకృష్ణ అన్నయ్య వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దాడి మోహనరావు చెప్పారు. -
ఏం కష్టం వచ్చిందో.. ముగ్గురు చిన్నారులు సహా కుటుంబం ఆత్మహత్య
సూరత్: గుజరాత్లో విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో ఏమో ఓ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబంలోని ఏడుగురు విగతజీవులుగా మారారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు విషమిచ్చిన ఓ వ్యాపారి ఉరేసుకొని తాను కూడా ప్రాణాలు వదిలాడు. కుటుంబం మొత్తం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా అలజడి నెలకొంది. ఈ ఘోర ఘటన సూరత్లో శుక్రవారం అర్ధరాత్రి వెలుగుచూసింది. వివరాలు.. సూరత్లోని పాలన్ పూర్లోని ఓ అపార్ట్ మెంట్లో ఫర్నీచర్ వ్యాపారి మనీష్ సోలంకి కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి మనీష్ తన పిల్లలకు, తల్లిద్రండులకు, భార్యకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో సహా కుటుంబంలోని ఏడుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం మనీష్ సహోద్యోగి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులు కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చి వెనక డోర్ వద్దనున్న కిటీకిని ధ్వంసం చేసి ఇంట్లోగా వెళ్లగా ఈ దారుణం గురించి తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృతులను మనీష్ సోలంకి(35) అతని భార్య రీటా(32), ముగ్గురు పిల్లలు, మనీష్ తల్లిదండ్రులు కాంతిలాల్(65), శోభన(60) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అప్పు తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువకావడంతో మనీష్ సోలంకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. యువతి హత్య -
భార్య అప్పులు.. భర్త కుంగుబాటు.. పిల్లలతో సహా అఘాయిత్యం
సాక్షి,చైన్నె: కట్టుకున్న భార్య ఇష్టానుసారంగా చేసిన అప్పుల కారణంగా ఓ భర్త కుంగి పోయాడు. తీసుకున్న అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఈ దారుణ ఘటన కోయంబత్తూరులో వెలుగు చూసింది. వివరాలు.. కోయంబత్తూరు నగరం పరిధిలోని వడ వెళ్లి వేంబు అవెన్యూలోని ఆ బహుళ అంతస్తుల భవనంలోకి కొంతకాలం క్రితం రాజేష్ (34) కుటుంబం అద్దెకు చేరింది. రాజేష్ ఇంజినీరుగా పనిచేస్తూ వచ్చాడు. అతడి భార్య లక్ష్య(29) ఫ్రెంచ్ కోర్సులో పట్ట భద్రురాలు. వీరికి యక్షిత(10) అనే కుమార్తె ఉంది. వీరితో పాటు రాజేష్ తల్లి ప్రేమ (70) ఆ ఇంట్లో ఉన్నారు. వీరి ప్లాట్ తలుపులు గత రెండు రోజులుగా తెరచుకోలేదు. ఆదివారం ఉదయం దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపు పగల కొట్టి చూడగా, ఓ గదిలో రాజేష్ ఉరివేసుకుని మరణించి ఉండటం వెలుగు చూసింది. మరో గదిలో లక్ష్య, యక్షిత, ఇంకో గదిలో ప్రేమ విషం తాగి మరణించి ఉండడం వెలుగు చూసింది. ఆ ఇంట్లో లభించిన లేఖతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. నాలుగో తరగతి విద్యార్థిని అయిన తన కుమార్తె చదువుతున్న పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఒకరితో తన భార్యకు పరిచయం ఏర్పడిందని రాజేష్ ఆలేఖలో వివరించాడు. అతడి వద్ద కొంత మొత్తాన్ని తన భార్య అప్పుగా తీసుకుని ఉందని, అతడికి కావాల్సి వ్యక్తులు వద్ద కూడా అప్పులు చేసి ఆ సొమ్మును ఏం చేసిందో తనకు తెలియదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ అప్పు మొత్తం 31 లక్షలకు చేరిందని వివరించాడు. ఈ సొమ్ము చెల్లించాలని సంబంధిత ఉపాధ్యాయుడు, అతడికి చెందిన వారు ఒత్తిడి తెస్తూవచ్చారని, ఈ అప్ప చెల్లించలేని పరిస్థితుల్లో తామంతా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ లేఖలో రాజేష్ పేర్కొన్నాడు. దీంతో వీరికి అప్పు ఇచ్చిన వారి వద్ద పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించారు. వీరికి స్నేహితులు,బంధవులు ఎవురైనా ఉన్నారా..? అని విచారిస్తున్నారు. రాజేష్ కుటుంబానికి సన్నిహితంగా ఎవరూ లేదని తేలడంతో ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతంరం మార్చురీలోనే ఉంచారు. సోమవారం లేదా మంగళవారం వారి అంత్యక్రియల విషయంపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
తార్నాకలో ప్రైవేట్ ఉద్యోగి ఘాతుకం.. కాపాడాల్సినవాడే.. కడతేర్చాడు
కంటికిరెప్పలా ఇంటిల్లిపాదినీ కాపాడేవాడే, కుటుంబానికి అండగా ఉండాల్సినవాడే దారుణానికి ఒడిగట్టాడు. కన్నతల్లిని, కట్టుకున్న ఇల్లాలిని, అభమూ శుభమూ లియని కన్న కూతురునూ కడతేర్చాడు. కడకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. తనతో చెన్నై రావడానికి నిరాకరించిన భార్యతో పాటు కుమార్తెను, కన్నతల్లిని చంపేశాడు. ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ప్రైవేట్ ఉద్యోగి. సోమవారం మధ్యాహ్నం ఈ విషాద ఉదంతం వెలుగులోకి వచి్చంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. చెన్నైకి చెందిన ప్రతాప్ (34) అక్కడి ఓ కార్ల కంపెనీలో డిజైన్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఈయనకు దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తార్నాక ప్రాంతానికి చెందిన సింధూర (32)తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఆద్య ఉంది. సింధూరకు రెండు నెలల క్రితం హిమాయత్నగర్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం వచి్చంది. దీంతో ఆమెతో పాటు ఆద్య, ప్రతాప్ తల్లి రాజతి నగరానికి వచ్చారు. తార్నాకలోని రూపాలీ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. చెన్నైలోనే ఉద్యోగం చేస్తున్న ప్రతాప్ వారాంతాల్లో ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడు. చెన్నై వెళదామనే విషయంపై కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బెడ్రూంల్లో నిద్రిస్తుండగా.. చెన్నైలో స్థిరపడటానికి ఉద్యోగం వదిలి రావాలంటూ భార్య సింధూరపై ప్రతాప్ ఒత్తిడి తెస్తున్నాడు. దీనికి ఆమె అంగీకరించడంపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వీకెండ్లో రావడంతో శుక్రవారం ప్రతాప్ నగరానికి వచ్చాడు. చెన్నై వెళ్లే విషయమై రెండు రోజులుగా వీరి మధ్య గొడవలు జరిగి ఆదివారం రాత్రి తారస్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రతాప్.. కుటుంబాన్ని హతమార్చి తానూ తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ప్రధాన బెడ్రూంలో నిద్రిస్తున్న భార్య, కుమార్తెను, కొద్దిసేపటి తర్వాత పక్కనే మరో బెడ్రూంలో పడుకుని ఉన్న తల్లినీ చంపివేశాడు. హాల్లో సీలింగ్ ఫ్యాన్కు తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సింధూర సహోద్యోగులు ఫోన్ చేయడంతో.. సింధూర సోమవారం విధులకు హాజరుకావాల్సి ఉంది. ఆమె బ్యాంక్కు రాకపోవడంతో ఆరా తీసేందుకు సహోద్యోగులు ఫోన్ చేశారు. సింధూర నుంచి స్పందన రాకపోవడంతో మధ్యాహ్నం వరకు ప్రయత్నించారు. చివరకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సింధూర అపార్ట్మెంట్కు వచ్చారు. ఎంత పిలిచినా లోపల నుంచి స్పందన లేకపోవడంతో పక్కన అపార్ట్మెంట్లో నివసించే సింధూర తల్లి జమునను తీసుకువచ్చారు. వీరికి ఫ్లాట్లోకి హాల్లో ఫ్యాన్కు వేలాడుతున్న ప్రతాప్ మృతదేహం కనిపించింది. బెడ్స్పై ఉన్న సింధూర, ఆద్యలను పరిశీలించారు. సింధూర కొన ఊపిరితో ఉండటంతో సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స ప్రారంభించడానికి ముందే ఆమె తుది శ్వాస విడిచింది. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మార్చురీకి తరలించారు. సింధూర తల్లి జమున ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు: సింధూర తల్లి జమున ‘ప్రతాప్ మాకు దగ్గరి బంధువు హైదరాబాద్ నుంచి చెన్నై షిఫ్ట్ కావాలనే విషయంపై భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. కానీ.. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు’ అని జమున మీడియాతో అన్నారు. రాజతి మెడపై ఉన్న గుర్తుల్ని బట్టి ఉరి బిగించి లేదా గొంతు నులిమి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. సింధూర, ఆద్యల మృతికి కారణాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పోస్టుమార్టం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్ తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సింధూర కోసం వాళ్ల ఆఫీస్ వారు వచ్చి చూసేదాకా ఇంతటి ఘోరం జరిగిందని నాకు తెలియదు. ఆమె ఫోన్ ఎత్తట్లేదు అని ప్రతాప్ కూడా స్పందించట్లేదని కంగారు పడుతూ వచ్చి చెప్పారు. ఎంత కొట్టినా తలుపులు కూడా తీయట్లేదని ఆందోళన చెందారు. అప్పుడు వచ్చి చూస్తే ఈ ఘోరం కనిపించింది. మేం పక్క అపార్ట్మెంట్లో ఉంటాం. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మా దగ్గరికి వస్తే సరిపోయేది కదా. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా. -
చేదు మిగిల్చిన షుగర్ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా..
సాక్షి, తమిళనాడు: బిడ్డలు మధుమేహం (షుగర్) బారిన పడడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చికిత్స అందిస్తున్నా.. వ్యాధి అదుపులోకి రాకపోవడంతో తట్టుకోలేకపోయారు. దీంతో కుటుంబమంతా పాలారులో దూకి మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. సేలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. సేలం నగరంలో పరిధిలోని దాదగాపట్టి నెసవాలర్ కాలనీకి చెందిన యువరాజ్ (35) పాన్విళి (30) దంపతులకు నితీషా (7), అక్షర (5) అనే కుమార్తెలున్నారు. నితీషా మూడేళ్ల క్రితం మధుమేహం బారిన పడింది. అప్పటి నుంచి బాలికకు చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో మూడు రోజుల క్రితం అక్షర కూడా మధుమేహం బారినపడినట్టు వైద్య పరిశోధనల్లో తేలింది. దీంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమార్తెలిద్దరూ పడుతున్న వేదనను చూసి తట్టుకోలేక పోయారు. ఈ క్రమంలో సోమవారం యువరాజ్ తన తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లకు ఓ లేఖ రాసి పెట్టి కుటుంబంతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మేట్టూరు సమీపంలోని తమిళనాడు – కర్ణాటక సరిహద్దుల్లోని ఈరోడ్ జిల్లా పరిధిలోని అడి పాలారు నదిలో యువరాజ్, పాన్విలి, నితిషా, అక్షర మృతదేహాలు మంగళవారం సాయంత్రం తేలాయి. సమాచారం అందుకున్న భవానీ డీఎస్పీ అమృత వర్షిణి ఘటనా స్థలానికి చేరుకుని ఆ నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అందియూరు జీహెచ్కు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ లేఖ ఆధారంగా కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు నిర్ధారించారు. -
బెంగళూరులో విషాదం.. విగతజీవులుగా తల్లీ, కొడుకు, కూతురు
సాక్షి, బెంగళూరు: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన బెంగళూరు మహాలక్ష్మీ లేఔట్లో చోటుచేసుకుంది. యశోద (70), కుమార్తె సుమన (41) కుమారుడు నరేశ్గుప్తా (36) మృతులు. విషం తాగి ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానం ఉందని మంగళవారం ఉత్తరవిభాగ డీసీపీ వినాయకపాటిల్ తెలిపారు. ఇంటి పెద్ద మరణంతో కుంగుబాటు వివరాలు.. యశోదకు ముగ్గురు సంతానం. వీరిలో ఒక కుమార్తెకు పెళ్లయి రాజాజీనగరలో ఉంటోంది. కుమారుడు నరేశ్గుప్తా కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. యశోద భర్త నాలుగునెలల క్రితం చనిపోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. భర్త వినియోగిస్తున్న వస్తువులను అనాథ ఆశ్రమానికి అందజేసి ఆ ఇంటిని ఖాళీ చేసి మహాలక్ష్మీలేఔట్ ఆంజనేయ గుడి వద్ద అపార్టుమెంటులోని రెండో అంతస్తులో ఓ ఫ్లాటులోకి మారారు. ఇద్దరు పిల్లలతో కలిసి యశోద ఉంటున్నారు. కుమార్తె సుమనకు ఆరోగ్య సమస్య ఉండటంతో ఇంకా వివాహం కాలేదు. అంతేగాక నరేశ్గుప్తా కూడా అవివాహితుడు. ఘటన జరిగిన అపార్టుమెంటు ఫోన్ చేసినా స్పందన లేదని.. మంగళవారం యశోదకు బంధువులు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ తీయలేదు. కూతురు వచ్చి ఫ్లాట్ కాలింగ్బెల్ నొక్కినా స్పందన లేదు. ఆమె సెక్యూరిటీ గార్డుకు చెప్పగా, అతడు వచ్చి తలుపు తీసి చూడగా ముగ్గురూ మరణించి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాలను ఎంఎస్.రామయ్య ఆసుపత్రికి తరలించారు. రెండురోజుల క్రితం యశోద, సెక్యూరిటీగార్డును పిలిచి రెండురోజులు ఉండటం లేదు, పాలు, పేపరు మీరే తీసుకోండి అని చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలున్నాయి. -
ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య.. ఏం కష్టమొచ్చిందో పాపం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదారాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18లో నివాసముంటున్న కుటుంబం... ఆదివారం అర్ధరాత్రి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కుటుంబ కలహాలా? లేదా అప్పుల వ్యవహారం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదీ చదవండి: తండ్రి కొడుకుల జంట హత్య కేసు: చీకటి జీవితాల్లో వెలుగు దివ్వెలు -
కుమార్తె డ్రైవర్తో వెళ్లిపోయిందని.. ఫ్యామిలీ మొత్తం..
సాక్షి, బెంగళూరు: కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోయిందని తీవ్ర ఆవేదనకు గురైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో కోలారు జిల్లా హండిగనాళ గ్రామంలో మంగళవారం జరిగింది. శ్రీరామప్ప (69) తన భార్య సరోజ (55), కుమారుడు మనోజ్ (25), కూతురు అర్చనతో హండిగనాళలో ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన డ్రైవర్ నారాయణ స్వామిని ప్రేమించిన అర్చన సోమవారం ఇల్లు వదిలి అతనితో వెళ్లిపోయింది. అర్చన ఒక్కలిగ అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి కాగా, నారాయణస్వామి దళిత వ్యక్తి. కూతురు కనిపించడం లేదని అదే రోజు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో తమ పరువు పోయిందని, ఇక జీవించలేమని నిర్ణయించుకున్నారు. తమ మరణానికి అర్చనే కారణమంటూ సూసైడ్నోట్ రాసి పురుగుల మందు తాగి శ్రీరామప్ప, భార్య, కుమారుడు ప్రాణాలు తీసు కున్నారు. అదనపు ఎస్పీ కుశాల్ చౌక్సే, పోలీసు లు సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటికి తిరిగి రావాలని, లేకపోతే అందరం చచ్చిపో తామని అక్కకు తమ్ముడు మనోజ్ పంపిన మెసేజ్లను ఫోన్లో పోలీసులు గుర్తించారు. చదవండి: (భార్యను పుట్టింటికి పంపించి.. అక్క కూతురితో పెళ్లికోసం.. బావపై..) -
అతని బతుకు లెక్క తప్పింది
రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా): అప్పుడప్పుడు ఆ చిన్నారులిద్దరూ తండ్రితో సరదాగా హోటల్కు వెళ్లేవారు. ఆదివారం కూడా అదే తరహాలో నాన్న వెళ్దామంటే ఆ చిన్నారులు సంబరపడిపోయారు. తనతోపాటు మృత్యుఒడికి తీసుకుపోతాడని వారికి తెలియదు. కంటికి రెప్పలా చూసుకున్న తండ్రే ప్రాణాలను చిదిమేస్తాడని అనుకోలేదు. పిడింగొయ్యి బుచ్చియ్యనగర్కు చెందిన పక్కి సత్యేంద్రకుమార్(40) ఆదివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలు రిషిత(12), హిద్విక(07)లు కూడా తండ్రితోపాటు చెరువులో విగత జీవులుగా తేలారు. ఈ ఘటన హృదయాలను కలచివేసింది. రాజమహేంద్రవరం వీఎల్పురం కనకదుర్గమ్మ గుడివీధిలో భార్యాపిల్లలతో ఉండేవాడు. అకౌంటెంట్గా జీఎస్టీలు ఫైల్ చేసేవాడు. డాన్బాస్కో స్కూల్లో రిషిత ఏడవ తరగతి, హిద్విక రెండవ తరగతి చదివేవారు. ఆదివారం అతని భార్య స్వాతి, తల్లిదండ్రులతో కలిసి విశాఖ వెళ్లింది. మానసికంగా తీవ్ర దిగులు చెందుతున్న సత్యేంద్రకుమార్ తనువు చాలించాలనుకుంటున్నాడని కుటుంబ సభ్యులెవరూ గుర్తించలేకపోయారు. పిల్లలంటే ఎంతో మమకారం. విడిచి ఉండలేకపోయేవాడు. తాను లేకపోతే పిల్లలేమవుతారని భావించాడో ఏమో గాని తనతోపాటు వారినీ విషాదాంతమొందించాడు. ఆదివారం సాయంత్రం హోటల్లో భోజనం పేరిట పిల్లలిద్దరినీ తీసుకెళ్లాడు. తర్వాత వీరి ఆచూకీ కనిపించలేదు. విశాఖ నుంచి తిరుగు ప్రయాణమైన భార్య స్వాతి ఫోన్ చేసినా ఎత్తలేదు. ఇంటికొచ్చి చూస్తే పిల్లలు కూడా కనిపించలేదు. దీంతో కంగారు పడి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం రాజవోలు చెరువులో ముందుగా కుమార్తెలిద్దరి శవాలు బయటపడ్డాయి. తర్వాత సత్యేంద్రకుమార్ విగతజీవిగా తేలాడు. చెరువులోకి దూకేముందు గట్టుపై బైక్, సెల్ఫోన్ విడిచి పెట్టాడు. లెటర్ రాశాడు. తానెందుకు ప్రాణాలు తీసుకుంటున్నదీ అందులో వివరించాడు. ధవళేశ్వరం, బొమ్మూరు పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్లు మంగాదేవి, విజయకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. రైలు టిక్కెట్లు తీసి పంపించి... ఏ శుభకార్యానికి వెళ్లినా అందరం కలిసి వెళ్లే వాళ్లం.. విశాఖపట్నం శుభకార్యానికి వెళ్దామంటే ఈసారి తనకు పని ఉంది రాలేనని సత్యేంద్రకుమార్ చెప్పారని అతని భార్య స్వాతి పేర్కొంది. తనకు, అత్తమామలకు టిక్కెట్లు తీసి పంపించి ఇలా శోకం మిగిల్చారంటూ కన్నీరుమున్నీరవుతోంది. తిరిగి వెళ్లి వచ్చేసరికి అందనంత దూరానికి వెళ్లిపోయి తనను ఒంటరి దాన్ని చేసేవా బావా రోదిస్తున్న తీరు స్థానికుల గుండెల్ని పిండేసింది. అందరితోను కలివిడిగా నవ్వుతూ పలకరించే సత్యేంద్రకుమార్, ఇద్దరు కుమార్తెలు మృత్యువాతపడడాన్ని అతని సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీఎల్పురం, బుచ్చియ్యనగర్ ప్రాంతాల్లో విషాధ చాయలు అలుముకున్నాయి. కష్టాన్ని తమతో పంచుకుంటే ఇంత దారుణం జరిగేది కాదంటూ మృతుని తల్లితండ్రులు సుశీల, సత్యనారాయణ కన్నీటి పర్యంతమవుతున్నారు. పార్థివ దేహాలకు నివాళి వీఎల్పురంలో తండ్రీ కుమార్తెల పార్థివ దేహాలకు సోమవారం రాత్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని బొమ్మూరు సీఐ విజయ్ కుమార్కు ఆదేశించారు. బతకాలని ఉన్నా... సత్యేంద్రకుమార్ తనతోపాటు పిల్లలనూ మృత్యుఒడికి చేర్చిన ఘటనపై ఆయన నివాస ప్రాంత వాసులకు కన్నీరు తెప్పించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమార్తెలకు తాను చనిపోతే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉండదని..అందుకే వెంట తీసుకువెళ్లినట్లు సత్యేంద్రకుమార్ సూసైడ్నోట్లో పేర్కొన్నాడు. అకౌంట్స్ కన్సల్టెన్సీ ఆఫీసు నిర్వహించేవాడు. అనుకున్న మేర ఆదాయం రాలేదని ఆందోళన చెందేవాడు. ఆర్థికంగా ఎదిగే అవకాశం లేని దురదృష్టవంతుడ్ని అంటూ సత్యేంద్రకుమార్ లేఖలో ప్రస్తావించాడు. మరణానికి మూడొంతులు అకౌంట్స్ టెన్షనే కారణమన్నాడు. బతకాలనే ఉంది..కానీ జీవితం ఇలాగే ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. సున్నితంగా తాను ఆలోచించానని అనుకోవద్దన్నాడు. చావడానికి కూడా చాలా ధైర్యం కావాలంటూ లేఖ ముగించాడు. ఈ లేఖ అందరి హృదయాలనూ కదిలించింది. -
కుర్మల్ గూడలో కుటుంబం ఆత్మహత్య
-
రాఘవ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలించాం: ఏఎస్పీ రోహిత్ రాజ్
-
భద్రాచలం జైలుకు వనమా రాఘవ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేంద్రరావు (రాఘవ) కటకటాల్లోకి వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి రాఘవపై ఐపీసీ సెక్షన్లు 302, 306, 307 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నాటకీయ పరిణామాల మధ్య శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం రెండో అదనపు ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముద్దసాని నీలిమ ఎదుట హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ రాఘవకు 14 రోజులు రిమాండ్ విధించడంతో.. వెంటనే భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య.. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో రాఘవను పాల్వంచలోని ఏఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని పోలీసు బలగాలు తమ అధీనంలోకి తీసుకుని.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాయి. శనివారం తెల్లవారుజాము నుంచే వనమా బాధితులు, ప్రజలు, బీజేపీ, ఇతర పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏసీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రాఘవను ఉరితీయాలని, లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు పాల్వంచ నుంచి కొత్తగూడేనికి పోలీసు వాహనంలో తీసుకొస్తున్న క్రమంలో.. కొత్తగూడెం శివారులోని బ్రిడ్జి వద్ద బీజేపీ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. రాఘవను ఎన్కౌంటర్ చేయాలని, కోర్టుకు తీసుకెళ్లి సమయం వృథా చేయొద్దని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరగగా.. పోలీ సులు, బీజేపీ శ్రేణులను చెదరగొట్టి ముందు కు కదిలారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాక.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భద్రాచలం సబ్జైలు అధికారులకు అప్ప గించారు. రాఘవకు దుస్తులతో కూడిన సంచీని ఇచ్చారు. తొలిరోజు మొదటి బ్యారక్లో ఇతర ఖైదీలతో పాటే రాఘవను ఉంచినట్టు జైలువర్గాలు తెలిపాయి. బాధితులు ముందుకు రావాలి రాఘవను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చే ముందు ఏఎస్పీ రోహిత్రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 7న కారు (నెక్సాన్– టీఎస్28ఎల్ 0001)లో ఏపీ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న రాఘవేంద్రరావు, అతడి అనుచరులు గిరీష్, మురళీకృష్ణను దమ్మపేటలోని మందలపల్లి క్రాస్రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. రాఘవపై మరో 12 కేసులున్నాయని, వాటిపైనా దర్యాప్తు చేపట్టామని, బాధితులెవరైనా ముందుకొస్తే వారి ఫిర్యాదులనూ పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఎనిమిది మందిపై కేసు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవడంతోపాటు భార్య, ఇద్దరు పిల్లల చావుకు కారణమైన మండిగ నాగరామకృష్ణ (40)ను ఏ1గా చూపారు. ఏ2గా వనమా రాఘవేంద్రరావు, ఏ3గా రామకృష్ణ తల్లి సూర్యవతి, ఏ4గా అక్క మాధవి, తర్వాతి నిందితులుగా రాఘవకు సహకరించిన అనుచరులు ముక్తిని గిరీష్, దావా శ్రీని వాస్, రమాకాంత్, కొమ్ము మురళీకృష్ణలను చేర్చారు. ఇందులో రాఘవ, గిరీష్, మురళీకృష్ణలను అరెస్టు చేశామని, మిగతావారు పరారీలో ఉన్నారని చెప్పారు. రామకృష్ణ తల్లి సూర్యావతి, అక్క మాధవి శుక్రవారం వరకు మీడియాతో మాట్లాడగా.. వారు పరారీలో ఉన్నట్టు చూపడం గమనార్హం. క్యాంపు కార్యాలయంలోనే రాసలీలలు? కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని ఓ మండల స్థాయి మహిళా ప్రజాప్రతినిధితో అత్యంత సన్నిహితంగా ఉండే రాఘవ.. ఇటీవల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే ఆమెతో గడిపారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ విషయం తెలిసిన కొందరిని రాఘవ మచ్చిక చేసుకున్నారని సమాచారం. ఈ విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. పోలీసులతో టచ్లోనే రాఘవ? ఐదు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న రాఘవ.. గతంలో పాల్వంచలో పనిచేసిన కొం దరు పోలీసు అధికారులతో టచ్లోనే ఉన్న ట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారి సూచ నల ప్రకారమే.. రాఘవ వివిధ ప్రాంతాలు, సిమ్కార్డులు మారుస్తూ ఆచూకీ తెలియ కుండా జాగ్రత్తపడినట్టు ఓ పోలీసు అధికారి తెలి పారు. అయితే రాఘవ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవు తుండటంతో.. అతడికి సహకరించిన పోలీసులను ఉన్నతాధికారులు తీవ్రంగా మందలించారని సమాచారం. ఈ క్రమంలో వారు ఇచ్చిన సమాచారంతోనే రాఘవను, అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కాగా.. ఈనెల 3న అజ్ఞాతంలోకి వెళ్లిన రాఘవ.. శుక్రవారం దాకా కూడా గిరీశ్కు చెందిన నెక్సాన్ (టీఎస్28ఎల్ 0001) కారులోనే తిరిగినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో మహబూబాబాద్, వరంగల్తోపాటు ఖమ్మం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లినట్టు సమాచారం. -
వనమా రాఘవపై 12 కేసులున్నాయి: ఏఎస్పీ
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావుపై ఇప్పటివరకూ 12 కేసులున్నట్లు కొత్త గూడెం జిల్లా ఏఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. రాఘవ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. నిన్న(శుక్రవారం) దమ్మపేట వద్ద రాఘవను అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ.. అతని డ్రైవర్ మురళీ, అనుచరుడు గిరీష్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ఈరోజు రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు రోహిత్రాజ్ స్పష్టం చేశారు. రాఘవ డబ్బులే కాకుండా రామకృష్ణ భార్యను కూడా ఆశించినట్లు సెల్ఫీ వీడియోలో ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. -
మ్యాగజైన్ స్టోరీ 8th January 2022
-
అతన్ని వదలొద్దు.. నాకు కడుపుకోత మిగిల్చాడు
-
వనమా రాఘవేంద్ర అరెస్ట్
-
మాతో చెబితే ఇలా జరిగేది కాదు!
పాల్వంచ: ‘మా ఆస్తుల పంపకాల విషయంలో వనమా రాఘవేందర్రావును కలిశాం. కానీ ఆయన ఏం మాట్లాడాడో మా తమ్ముడికే తెలుసు. మాతో చెబితే పరిష్కారమార్గం ఆలోచించే వాళ్లం. కానీ ఇం టికి పెద్దదిక్కుగా ఉండాల్సిన తమ్ముడే ప్రాణా లు తీసుకున్నాడు. భార్యాపిల్లల్ని కూడా చంపుకున్నాడు..’అని రామకృష్ణ సోదరి కొమ్మిశెట్టి లోగ మాధవి చెప్పారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మా నాన్న విధి నిర్వహణలో భాగంగా తహసీల్దార్ ఎక్కిన జీపులో ప్రయాణిస్తుండగా నక్సల్స్ మందుపాతరలో చనిపోయారు. మరో తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నా భర్త కూడా ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఇక మిగిలింది మా అమ్మ, నేను, రామకృష్ణ. మా కుటుంబంలో మగదిక్కు తమ్ముడే. మాకు ఏం కావాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయనే చూసుకుంటాడనుకున్నాం. అయితే రామకృష్ణకు వ్యాపారాల్లో నష్టం వచ్చి అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చి మిగిలిన ఆస్తుల పంపకాన్ని చూసుకోవాలని భావించినా సాధ్యపడలేదు. మా నాన్న ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుటుంబం బాగా తెలుసు. అందుకే వనమా వెంక టేశ్వరరావుతో మాట్లాడేందుకు వెళ్తే ఆరోగ్యం బాగో లేకపోవడంతో రాఘవేందర్ మాట్లాడాడు. అయితే ఆయ నేం మాట్లాడాడో.. మా తమ్ముడు ఎలా క్షోభకు గురయ్యాడో మాకు తెలియదు. తెలిస్తే మా సమస్యను మరోలా పరిష్కరించుకునే వాళ్లం. ఆస్తుల పంపకాలు కూడా నాలుగైదు రోజుల్లోనే సెటిల్ అయ్యేవి. ఇంతలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంత మానసిక బాధ పడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.’అంటూ మాధవి విలపించారు. కావాలనే రాఘవను ఇరికిస్తున్నారు పాల్వంచ: ‘ఆస్తి పంపకాల విషయంలో పెద్ద మనిషి అని వనమా రాఘవేందర్రావును కలిశాం. ఆయన మా మేలు కోరి పలు సూచనలు చేశాడు. కానీ ఎవరో కావాలనే ఈ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో నా కొడుకును ప్రేరేపించి తప్పుదోవ పట్టించి చావుకు కారణమయ్యారు..’ అని రామకృష్ణ తల్లి సూర్యావతి కన్నీటి పర్యంతమయ్యారు. పాత పాల్వంచలో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. ఆస్తి కోసం కుమారుడు రామకృష్ణ తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని చెప్పారు. చాలాచోట్ల అప్పులు చేసిన అతను ఒకే సారి రూ.లక్షల్లో అప్పు ఉందని చెప్పాడని తెలిపారు. రాఘవతో మాటల సందర్భంగా జరిగిన విషయాలేవీ మా వద్ద ప్రస్తావించకుండా భార్య, పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడడం తనను ఎంతో బాధకు గురిచేసిందన్నారు. తన భర్త నక్సల్స్ పేల్చిన మందుపాతరలో చనిపోతే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కలెక్టర్ స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. -
‘నాలుగో సింహం’ బోనులో.. ‘వనమా’లు జనంలో
సాక్షి, హైదరాబాద్: అది శాంతిభద్రతలను రక్షించే కీలకమైన పోలీసు విభాగం.. కానీ మంచి పోస్టింగ్ కావాలంటే ‘సిఫార్సు’ కావాల్సిందే, లేదంటే లూప్లైన్లో కాలం వెళ్లదీయాల్సిందేనన్నది ఆ శాఖలో అనధికార నినాదం! కొన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయి నుంచి ఎస్సై దాకా నేతల సిఫార్సు లేనిదే పోస్టింగ్ దక్కలేని పరిస్థితి ఉందన్నది బహిరంగంగా మాట్లాడుకునే రహస్యం! ఇలా మంచి పోస్టింగ్ కోసం రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్న కొందరు పోలీసు అధికారులు.. సంబంధిత నేతకుగానీ, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకుగానీ వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలరా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు రాఘవేంద్రరావు ఘటనతో ఈ ‘సిఫార్సు’ల వ్యవహారం పోలీసుశాఖలో తీవ్ర కలవరం రేపుతోంది. వనమా రాఘవేంద్రరావుపై ఎన్నో ఏళ్లుగా ఫిర్యాదులున్నా పోలీసు అధికారులు పెద్దగా స్పందించకపోవడానికి కారణమూ ఇదేనన్న చర్చ జరుగుతోంది. ఇంటెలిజెన్స్ వర్గాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండటం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. చెప్పినట్టు వినాల్సిందే.. కొత్తగూడెం పాల్వంచలో జరిగిన వ్యవహారంలో పోలీసుశాఖ ముందే స్పందించి ఉంటే.. ఈ స్థాయిలో వ్యవహారాలు జరిగేవి కాదన్న వాదన వినిపిస్తోంది. 2017 నుంచే వనమా రాఘవేంద్రరావుపై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసులు ఉన్నా యి. 2018లో ఒక క్రిమినల్ కేసు, 2019లో మరొకటి, 2020లో ఇంకొకటి.. ఇలా నాలుగుకుపైగా క్రిమినల్ కేసులున్నాయి. అయితే రామ కృష్ణ కుటుంబం ఆత్మహత్యతో పాటు మరికొన్ని కేసుల్లోనూ బాధితులు పోలీసులపైనా ఆరోపణలు చేస్తున్నారు. తాము స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తున్నారు. దీనికి కారణం రాఘవ తన తండ్రి సిఫార్సు లేఖలతో ఇప్పించిన పోస్టింగ్లే అనడంలో ఏమాత్రం సందేహం లేదన్న వాదన వినిపిస్తోంది. రాఘవ ఇప్పించిన పోస్టింగ్లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడం వివాదాస్పదంగా మారిందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం, సదరు సెల్ఫీ వీడియో సోషల్మీడియాలో సంచలనం కావడంతో.. ఇప్పుడు తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. పోస్టింగ్కో రేటు పెట్టి.. రాష్ట్ర పోలీసుశాఖలో కొన్నిచోట్ల ఎస్పీ స్థాయి అధికారులకు పోస్టింగ్ దక్కాలంటే భారీ రేటు ఉందని.. డీఎస్పీ, ఇన్స్పెక్టర్, ఎస్సై పోస్టింగులకు ఒక్కో రేటు ఉందని ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు పోస్టింగ్ సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులకు లక్షల రూపాయలు ఇస్తున్నారని పోలీసు వర్గాలే చెప్తున్నాయి. ఎస్సై పోస్టింగ్ సిఫార్సు కోసం రూ.5లక్షలు, సీఐ స్థాయిలో రూ.10 లక్షలదాకా.. డీఎస్పీ/ఏసీపీ పోస్టింగ్ కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలవుతున్నట్టు పేర్కొంటున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఎస్పీ బదిలీ వివాదాస్పదంగా మారుతోంది. ఏకంగా రూ.45 లక్షలు ఇచ్చి సంబంధిత అధికారి ఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా.. బెదిరింపులు, కబ్జాలు.. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సహకరించకపోతే ఏకంగా ఏసీబీ దాడులు చేయిస్తామని పోలీస్, రెవెన్యూ సిబ్బందిని బెదిరించే స్థాయికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే కుమారుడు ఇసుక రవాణాలో తమకు పూర్తిగా సహకరించే అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే తరఫున ఆయన సోదరుడు పోలీసు అధికారులతో సెటిల్మెంట్లు చేస్తున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే భార్య, ఇద్దరు అల్లుళ్ల పెత్తనం మరీ మితిమీరినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. బెదిరింపులు, కబ్జాలు సహా సదరు నియోజకవర్గంలో వారు ఎలా చెప్తే పోలీసు అధికారులు అలా వినాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే కుమారుడు అన్నీ తానై డీఎస్పీ నుంచి ఎస్సై దాకా పోస్టింగ్లకు సిఫార్సులు చేయిస్తున్నట్టు చెప్తున్నారు. ►నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఓ కీలక ఎమ్మెల్యే సోదరుడు నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ నడిపిస్తున్నాడన్న ఫిర్యాదులు వస్తే.. సదరు బాధితులపైనే ఉల్టా కేసులు పెట్టించి హింసించారన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు తన ఇసుక దందాకు అడ్డొస్తున్న వారిపై పోలీసుల సాయంతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఓ సీనియర్ ఎమ్మెల్యే తనయులపైనా భూకబ్జా, ఇసుక దందా ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. భూకబ్జాదారులతో చేతులు కలిపి విలువైన భూములను కాజేసినట్టు నిఘా విభాగం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చింది. ►ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుమారుడు పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాకు సహకరిస్తున్నారని ఫిర్యాదులున్నా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే జిల్లాలో ఓ ఎమ్మెల్యేకన్నా ఆయన కుటుంబ సభ్యులదే ఎక్కువ పెత్తనమన్న విమర్శలున్నాయి. వారు ఏకంగా రూ.2 వేల కోట్ల విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేశారని.. దానిపై ఫిర్యాదు చేసిన వారిపై అక్రమంగా కేసులు పెట్టించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ►ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తానే ఎమ్మెల్యే అయినట్టుగా వ్యవహరించడం, భూకబ్జా వ్యవహారాలు మానవ హక్కుల సంఘం దాకా వచ్చాయి. సదరు ఎమ్మెల్యే సోదరుడు బెదిరింపులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ మూడు ఫిర్యాదులు అందాయి. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే భార్య పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా వసూలు చేస్తున్న కమిషన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఉల్టా వారిపైనే కేసులు నమోదుచేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ►ఖమ్మంలో వనమా రాఘవ వ్యవహారం ఇటీవలే బయటపడింది. మరో ఎమ్మెల్యే భర్త కూడా ప్రతీదందాలో తన వాటా అంటూ వసూలు చేస్తున్నారని.. ఇవ్వకపోతే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా ఓ ఎమ్మెల్సీకి వరుసకు సోదరుడయ్యే వ్యక్తి చేస్తున్న పనులు ఎస్పీస్థాయి అధికారులకు కూడా చికాకు తెప్పించాయని, వారు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్లిందని సమాచారం. ►వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఓ సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు ప్రభుత్వ పోస్టింగ్లలో జోక్యం చేసుకుంటున్నారని.. పోలీసు, రెవెన్యూ అధికారుల ద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్లలో వాటాలు వసూలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే చీకటి వ్యవహారాలకు పోలీసులు సెక్యూరిటీ కల్పించడం ఇటీవల వివాదాస్పదమైంది. ►మెదక్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తప్పుడు కేసులు నమోదు చేయిస్తానంటూ కొందరిపై బెదిరింపులకు దిగినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సిఫార్సులతో చేతులు కట్టేస్తున్నారు! ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలుంటే తప్ప పోస్టింగులు ఇవ్వద్దొన్న మౌఖిక ఆదేశాలుండటంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం చేతులు కట్టేసుకోవాల్సి వస్తోందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 80శాతం పోస్టింగులు సిఫార్సు లేఖల ద్వారానే జరుగుతున్నాయని.. ప్రతిభ, అంకితభావ సేవలను దృష్టిలో పెట్టుకొని మిగతా వారికి అవకాశం కల్పిస్తున్నా నాలుగు రోజుల ముచ్చటగానే మిగిలిపోతోందని ఉన్నతాధికారవర్గాలు చెప్తున్నాయి. సమర్థవంతమైన అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని, అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు సహకరిస్తున్న అధికారులపై ఎప్పటిప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలిస్తున్నా మార్పు రావడం లేదని వాపోతున్నాయి. వ్యవస్థలో మార్పు రాకపోతే మరింత విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సిఫార్సు లేఖలతో కాకుండా.. సమర్థత ఆధారంగా పోస్టింగులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. -
వనమా రాఘవేంద్ర అరెస్ట్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆయనను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రకటించగా.. రాత్రి 10 గంటలకు రాఘవను అదుపులోకి తీసుకున్నట్టు కొత్త గూడెం జిల్లా ఎస్పీ సునీల్దత్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పరిసరాల్లో రాఘవ ఉన్నట్టు సమాచారం అందిందని.. దమ్మ పేట మీదుగా రాజమండ్రికి వెళ్తున్న రాఘవ వాహనాన్ని పోలీసులు వెంబడించి పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడి వద్ద అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రాఘవను పాల్వంచకు తరలించామని.. ప్రాథమిక విచారణ పూర్తిచేశాక కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. పరారీపై ప్రచారాల మధ్య.. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నాగ రామ కృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు సాహిత్య, సాహితితో కలిసి ఈనెల 3న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తమ ఆత్మహత్యలకు రాఘవ కారణమంటూ చనిపోయే ముందు రామృకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో ఈ నెల 6న వైరల్గా మారింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. అప్పటి నుంచే రాఘవ పరారీలో ఉన్నారు. ఆయనను ఆరో తేదీనే కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారని, శుక్రవారం రాత్రి వరకు రాఘవ పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం జరిగింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతోపాటు పాత కేసులకు సం బంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేసి రౌడీషీట్ తెరుస్తామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్రాజ్ ప్రకటించా రు కూడా. ఇది జరిగిన మరుసటి రోజే రాఘవను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించ డం గమనార్హం. అయితే శని, ఆదివారాలు కోర్టుకు సెలవులని.. రాఘవకు బెయిల్ రాకుండా ఉండేం దుకే శుక్రవారం రాత్రి అరెస్ట్ చూపారనే ప్రచారం జరుగుతోంది. రాఘవ వ్యవహారాలన్నింటినీ తిరగదోడిన పోలీసులు.. కేసుల నమోదుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. పోలీసుల అదుపులో మరో నలుగురు రాఘవ అక్రమాల వివరాలు తెలుసుకునేందుకు రెండు రోజుల క్రితమే ఆయన అనుచరులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వస నీయంగా తెలిసింది. పాల్వంచకు చెందిన ఇద్దరు, లక్ష్మీదేవిపల్లి మండలం, కొత్తగూడెం పట్టణానికి చెందిన ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని.. కీలక సమాచారాన్ని రాబట్టినట్టు సమాచారం. వారిలో ఇద్దరు అప్రూవర్గా మారినట్టు తెలిసింది. కొత్తగూడెం బంద్ రాఘవను వెంటనే అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల నేతలు శుక్రవా రం కొత్తగూడెం నియోజకవర్గ బంద్ నిర్వహించారు. ఆందోళనకు దిగిన పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కేసులో ఎమ్మెల్యే ఇంటిగోడకు నోటీసు పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొం టూ, బెయిల్పై ఉన్న రాఘవను విచారణ రావాలం టూ పోలీసులు శుక్రవారం పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా ఇంటి గోడకు నోటీసు అంటించడం చర్చనీయాంశమైంది. వెంకటేశ్వరరావు గతేడాది జూలై 29న తన చావుకు రాఘవ, మరో 42 మంది కారణమంటూ సూసైడ్ నోట్ రాసి.. పురుగుల మందు తాగాడు. విచారణలో ఉన్న ఆ కేసుకు సంబంధించి రాఘవ ముందస్తు బెయిల్పై ఉన్నారు. నోరువిప్పుతున్న రాఘవ బాధితులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య అనంతరం నెలకొన్న పరిస్థితులు, చోటు చేసుకుంటోన్న పరిణామాలను చూసి రాఘవ బాధితులు ఒక్కరొక్కరుగా తెరపైకి వస్తున్నారు. బాధిత మహిళలు కొందరు శుక్రవారం ‘సాక్షి’తో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమకు జరిగిన అన్యాయం గురించి పోలీసులతో పాటు ఉన్నతాధికారులను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి ఉంటే రాఘవ దాష్టీకాలకు అప్పుడే తెరపడేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం వెళితే డాక్యుమెంట్లు చింపేశారు.. నవభారత్ (పాల్వంచ)లో రూ.50 లక్షల విలువైన స్థలాన్ని రాఘవ అనుచరులు 2020 ఏప్రి ల్లో కబ్జా చేశారు, న్యాయం కోసం వెళ్తే రాఘవ నా వద్ద ఉన్న స్థలం డాక్యుమెంట్లు చించివేశారు, తర్వాత నాతో పాటు నా అన్నపైనా ఆయన అనుచరులు దాడి చేశారు. న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే ఫిర్యాదు కూడా తీసుకోలేదు. నన్ను, నాన్న, అన్నను అకారణంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. చివరకు రెవెన్యూ అధికారులూ నా గోడును పట్టించుకోలేదు. దీంతో పురుగుల మందు తాగి ఎలాగో బయటపడ్డా. అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఈ రోజు పచ్చని కుటుంబం బతికి ఉండేది. – జ్యోతి, పాల్వంచ వారసత్వ భూమిని కాజేశారు.. పాల్వంచ పట్టణంలోని కాంట్రాక్టర్ కాలనీలో మా మామ గారికి మూడెకరాల ఖాళీ స్థలం ఉంది. అది నా భర్త జాన్రాంకుమార్కు వారసత్వ ఆస్తిగా వచ్చింది. 2020 మార్చిలో ఆ భూమిని చదును చేస్తుంటే రాఘవ.. అనుచరులు, పోలీసులతో అక్కడికి వచ్చాడు. ఆ భూమి తనదని బెదిరించాడు. పోలీసులు ఏ విషయం ఆరా తీయకుండా నన్ను, నా భర్తను జీపులో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. మరుసటి రోజు భూమి కాగితాలతో రాఘవ ఇంటికి వెళ్తే ఆయన దుర్భాషలాడారు. ఆ స్థలం జోలికి వస్తే చంపుతానని బెదిరించారు. ఇప్పటికీ ఆ భూమి రాఘవ అధీనంలోనే ఉంది. – శ్రీదేవి, పాల్వంచ చదవండి: వనమా రాఘవేంద్ర అరెస్ట్ పై కొనసాగుతున్న సస్పెన్స్ -
టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
-
టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
హైదరాబాద్: ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాఘవను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వనమా రాఘవేంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వనమా అరాచకాలను చెబుతూ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఈ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు రామకృష్ణ. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే వనమా రాఘవను సస్పెండ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. -
వనమా రాఘవేంద్ర అరెస్ట్ పై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్రరావు చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వనమాకు సంబంధించి మరో కేసు వెలుగులోకి వచ్చింది. మనుగురు ఫైనాన్స్ వ్యాపారి మలిపెద్ది వెంకటేశ్వర్లు సూసైడ్ కేసులో ఎఎస్పీ శబరిష్ ఎదుట విచారణకు హాజరవ్వాలని అధికారులు నోటీసులు జారీచేశారు. వనమాను శుక్రవారం మధ్యాహ్నంకల్లా లొంగిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. పోలీసులు రాఘవకు సంబంధించి పాత కేసులపై మరోసారి విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి.. వనమాను వెతకడానికి 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిన్న (గురువారం)వనమాను అరెస్టు చేసినట్లు కొన్నివదంతులు వ్యాపించాయి. దీన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అయితే, వనమా.. రాజమండ్రిలో ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని టీంలు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వనమా వ్యవహరం ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. గడువులోగా రాఘవేంద్ర అరెస్టా? లొంగుబాటా? అనేదానిపై సస్సెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: ఎమ్మెల్యే తనయుడితో పోరాడలేకే వెళ్లిపోతున్నాం -
వనమా రాఘవేందర్ అరెస్టుపై హైడ్రామా!
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్రావు అరెస్టుపై హైడ్రామా కొనసాగుతోంది. కొత్తగూడెం పోలీసులు గురువా రం మధ్యాహ్నం రాఘవేందర్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యేనే తన కుమారుడిని పోలీసులకు అప్పగించారని, విచారణ నిమిత్తం రాఘవేందర్ను పోలీసులు కొత్తగూడెం తీసుకెళ్లారనే ప్రచారం సాగింది. కానీ రాత్రి వరకు జిల్లా పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మీడి యాతో మాట్లాడిన పాల్వంచ ఏఎస్పీ రోహిత్రాజ్.. రాఘవేందర్ కోసం తెలంగాణ, ఏపీలో ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఆయన గత నేరచరిత్రనూ వెలికితీసి పాత కేసులకు సంబంధించి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా రౌడీషీట్ తెరుస్తామని వెల్లడించారు. ఒకవేళ రాఘవేందర్ బెయిల్ పిటిషన్ దాఖలుచేసినా గట్టిగా కౌంటర్ దాఖలు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. కాగా, వీలైనంత త్వర లో అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేసులో కీలకంగా కారు ఇదిలాఉంటే.. రామకృష్ణకు చెందిన కారు (ఏపీ 28 బీ2889) ఈ కేసును కీలక మలుపు తిప్పింది. భార్య, ఇద్దరు పిల్లలతో సహా తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న రామకృష్ణ.. తన కారులోనే ఆత్మహత్యకు కారణాలపై సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. అనంతరం ఫోన్ను అదే కారులో పెట్టారు. ఇటు సూసైడ్ నోట్ కూడా పోలీసులకు రామకృష్ణ కారు నుంచే లభ్యమైంది. ఫోన్, సూసైడ్ నోట్ తన తల్లి, సోదరికి చిక్కుతుందనుకున్నారో లేక మంటల్లో కాలి సాక్ష్యాలు పోలీసులకు దొరకవనుకున్నారో తెలియదు గానీ.. ఫోన్, సూసైడ్ నోట్ను కారులోనే ఉంచి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
ఎమ్మెల్యే తనయుడితో పోరాడలేకే వెళ్లిపోతున్నాం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఉదంతంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన తల్లి సూర్యావతి, అక్క మాధవితోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్రావు పెట్టిన బాధలను ఆ వీడియోలో వివరించారు. చనిపోయే ముందు తన కారులో కూర్చొని 8:55 నిమిషాల నిడివి గల వీడియో తీసిన రామకృష్ణ తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, మానసిక క్షోభను వివరించారు. ఇది అందరినీ కలచివేస్తోంది. వీడియోలో రామకృష్ణ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే... ►వాళ్లుండేది (తల్లి, అక్క) సొంతిళ్లు.. రూ. పది వేల అద్దె వస్తుంది. వాళ్లకు సంవత్సరానికి పంట కౌలు వస్తుంది. నాకు పొలం మీద ఆదాయం రాదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేను వనమా రాఘవేందర్రావు గారి వద్దకు వెళ్లా. ఈ సమస్య తేలాలంటే నీ భార్యను తీసుకొని హైదరాబాద్కు రా. పిల్లలు లేకుండా. అప్పడు నీ సంగతి చూస్తా. అప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాదు. ఎక్కడికి వెళ్లినా ఎవరూ ఏమీ చేయలేరు. నయాపైసా నీకు రాకుండా చేస్తానని రాఘవేందర్రావు నాతో చెప్పారు. ►సాయం కోసం వెళ్తే నా భార్యను పంపాలన్న ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలి? కనీసం డబ్బు రూపంలో అడిగినా నేను ఇచ్చేవాడిని. కానీ నా భార్యను కోరుకున్నాడు. దాన్ని జీర్ణించుకోలేకపోయా (ఈ విషయం నా భార్యకు తెలియదు). వీళ్లతో పోరాడే స్థితిలో నేను లేను. రాజకీయ, ఆర్థిక అండదండలూ లేవు. నేనొక్కడినే ఏదైనా చేసుకుంటే రేపు నా భార్య పరిస్థితి ఏంటి? ఆమెను అసలు వీళ్లు ఏం చేస్తారో, నా పిల్లలు ఏమైపోతారో కూడా అర్థంకావడం లేదు. నడిరోడ్డుపై వదిలేసి నా దారి నేను చూసుకోవడం బాధ్యత కాదు. కాబట్టి నాతోపాటే వారినీ తీసుకెళ్లిపోతున్నా. ►నా జీవితం ఎలాగైనా ఫర్వాలేదు. ఇంకా వేరే కుటుంబాలు పాడవకుండా ఊళ్లో మిగిలిన పెద్దలు, నాయకులంతా కలిసి నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిని.. నాకు ఆర్థికసాయం చేసిన వారికిచ్చి నా అప్పు తీర్చండి. మిగిలింది వారి (అమ్మ, అక్క)కే వదిలేయండి. ►రాఘవేందర్రావు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. ఇంకా చాలా కుటుంబాలు నాశనమవుతాయి. ఈ మధ్య కాలంలోనే పాల్వంచలో ఒకతను ఆయన పేరు రాసి చనిపోయాడు. నెల రోజులు ఎక్కడో దాక్కొని ఆ తర్వాత వచ్చాడు. మూడు, నాలుగు నెలల్లోనే మళ్లీ ఇలా దురాగతాలు చేస్తోంటే సామాన్యులు ఎలా బతుకుతారు? కుదిపేసిన సెల్ఫీ వీడియో... ఎమ్మెల్యే తనయుడిపై రామకృష్ణ చేసిన ఆరోపణలు ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. అజ్ఞాతంలో ఉన్న రాఘవను అరెస్ట్ చేసి శిక్షించాలంటూ మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పీ శ్రేణులు గురువారం ఆందోళనను ఉధృతం చేశాయి. పాల్వంచలోని ఎమ్మెల్యే నివాసాన్ని బీజేపీ నాయకులు ముట్టడించగా పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొత్తగూడెంలో వనమా రాఘవ దిష్టిబొమ్మను దహనం చేశారు. వామపక్ష నేతలు శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గ బంద్కు పిలుపునిచ్చారు. రాఘవేందర్పై ఆరు కేసులు.. వనమా రాఘవేందర్రావుపై పాల్వంచ పట్టణం, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు కేసులున్నాయి. 2013లో పాల్వంచ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి చీరలు పంపిణీ చేసిన ఘటనలో ఐపీసీ 336, 353, 171, 188 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ►2017లో పాల్వంచలోని కేటీపీఎస్ సెంటర్లో ఆర్టిజన్లకు ఉద్యోగాలు కల్పించాలని ఆందోళన చేస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగించినట్లు ఐపీసీ 427, 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ►2020లో ఓ స్థల వివాదంలో రాఘవేందర్ అనుచరులు గిరిజన మహిళపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో రాఘవపై ఐపీసీ 158, 307 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు ఎస్సీ, ఎస్టీ కమిషన్కు వెళ్లడం సంచలనంగా మారింది. ►2020లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు కేసు నమోదైంది. ►2021లో పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన మలిపెద్ది వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. అందుకు కారకుల్లో రాఘవ పేరు కూడా ఉండటంతో ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ►తాజాగా నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో రాఘవేందర్పై 302, 307, 306 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయన ఏ2గా ఉన్నారు. -
వనమా రాఘవ అరెస్ట్
-
నా కొడుకును పోలీసులకు అప్పగిస్తా: ఎమ్మెల్యే వనమా
సాక్షి, హైదరాబాద్: తన కొడుకు వనమా రాఘవపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు. రాఘవను నియోజకవర్గానికి, పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాఘవ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. వనమా రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానని తెలిపారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా తన కొడుకును అప్పగిస్తానని వెల్లడించారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. భార్య గురించి ఏ భర్త వినకూడని మాటలు రాఘవేందర్ నోటి నుంచి విన్నానంటూ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం తాజాగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం వనమా రాఘవ పరారీలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో వనమా రాఘవకు ఉచ్చు బిగుసుకుంటుండటంతో కొడుకు నిర్వాకంపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తాజాగా స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. చదవండి: సంచలనం రేకెత్తిస్తున్న రామకృష్ణ సెల్ఫీ వీడియో.. -
సంచలనంగా మారిన రామకృష్ణ సెల్ఫీ వీడియో
-
ఏ భర్తకూడా వినకూడని మాటలు విన్నాను..
సాక్షి, ఖమ్మం: పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మీ సేవ నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీవీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో రామకృష్ణ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన సోదరుడు, అక్క కూడా ఇబ్బందిపెట్టారన్నారు. వనమా.. నా భార్యను హైదరాబాద్ తీసుకొస్తేనే నా సమస్యను పరిష్కారిస్తానని నీచంగా మాట్లాడాడు. వీరివల్ల మానసికంగా కృంగిపోయి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీజేపీ నాయకులు వనమా ఇంటిని ముట్టడించారు. తక్షణం రాఘవను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు? -
అప్పుల బాధలు: గతంలో భర్త, చిన్నకుమారుడు, అల్లుడు.. ఇప్పుడేమో
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): అప్పుల బాధ తాళలేక, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందనే మనస్తాపంతో పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు సాహిత్య, సాహితిపై పెట్రోల్ పోసి నిప్పటించిన విషయం విదితమే. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రామకృష్ణ, ఆయన భార్య ఓ కుమార్తె మృతి చెందగా, మరో కుమార్తె సాహితి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతోంది. అయితే, రామకృష్ణ తన కుటుంబీకులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సమయంలో మరో గదిలో నిద్రిస్తున్న ఆయన తల్లి సూర్యావతి మంటల్లో కాలిపోతున్న కొడుకు, కోడలు, మనవరాళ్ల పరిస్థితిని కళ్లారా చూసింది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడంతో వారు మంటల్లో మాడిపోయారు. ఈ దృశ్యాలు కళ్ల ముందే కదలాడుతుండగా సూర్యావతి గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఆమెను పలకరించగా..కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ కుటుంబ స్థితిని వెల్లడించింది. గతంలో రెండు మరణాలు.. సూర్యావతి భర్త చిట్టెబ్బాయ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని మోతుగూడెంలో వైద్య, ఆరోగ్య శాఖలో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తించేవారు. 1992లో ఆయన ప్రయాణిస్తున్న జీప్లో తహసీల్దార్ ఎక్కగా.. తహసీల్దార్ లక్ష్యంగా మావోలు పేల్చిన మందుపాతరలో చిట్టెబ్బాయ్ కూడా మృతి చెందారు. ప్రస్తుతం కుమారుడు, కోడలు మాదిరిగానే మాంసం ముద్దగా ఇంటికి మృతదేహం వచ్చిందని సూర్యావతి బోరున విలపించింది. అంతేగాక చిన్న కారణంతో క్షణికావేశానికి లోనైన చిన్న కుమారుడు సురేష్ 1999లో ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడని గుర్తు చేసుకుంది. ఇక మిగిలిన కొడుకు నాగ రామకృష్ణ, కోడలు, పిల్లలను అపురూపంగా చూసుకుంటున్నట్లు తెలిపింది. అయితే, వ్యాపారాల్లో నష్టపోవడమే కాక ఇష్టమొచ్చిన చోట అప్పులు చేసినా విషయం తనకు ఏనాడూ చెప్పలేదని వాపోయింది. తీరా రూ.30లక్షలు ఇవ్వాలని, లేదంటే ఇళ్లు అమ్మాలని అడుగుతుండడమే కాక నెలనెలా రూ.వేలల్లో డబ్బు ఇవ్వాలని గొడవ చేసేవాడని తెలిపింది. ఆస్తి పంపకాల్లోనూ తాను అన్యాయం చేయలేదని, డబ్బు వృథా చేయొద్దని మాత్రమే చెప్పానని వెల్లడించింది. హైదరాబాద్లో ఉన్న ఇంటి స్థలాన్ని కూడా అతడికే ఇవ్వగా, రెండు, మూడు రోజుల్లో అన్నీ సవ్యంగా జరుగుతాయని ఆశిస్తున్న నేపథ్యంలో ఎవరో చెప్పిన మాటలు నమ్మి తనతో పాటు సోదరిపై కక్ష పెట్టుకుని అన్యాయంగా కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడని రోదిస్తోంది. ఇప్పుడు తనకు దిక్కెవరని ఆమె విలపిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టించింది. కాగా, సూర్యావతి కూతురు భర్త సైతం కరోనాతో మృతి చెందడం గమనార్హం. చావుబతుకుల మధ్యే సాహితి మంటల్లో కాలిపోయి రామకృష్ణ, ఆయన భార్య, ఓ కుమార్తె మృతి చెందగా.. మరో కుమార్తె సాహితి మాత్రం ప్రాణాపాయ స్థితిలో బయటపడింది. ఘటన జరిగిన సమయంలో ఆమె ఇంట్లో నుండి బయటకు పరుగెత్తుకొచ్చింది. తనను ఎవరైనా కాపాడుతారని, ఆస్పత్రికి తీసుకెళ్తారని ఆశగా ఎదురుచూసింది. అయితే, చుట్టుపక్కల వారు, ఫైర్ ఇంజన్, పోలీసులు, అంబులెన్స్ వచ్చే సరికి గంటకు పైగా సమయం పట్టడం, ఆమెపై సకాలంలో నీళ్లు పోసి కాపాడకపోవడంతో ఒళ్లంతా కాలిపోయి చావుబతుకుల మధ్యే కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, 90శాతానికి పైగా సాహితి శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ముగిసిన అంత్యక్రియలు నాగ రామకృష్ణ, ఆయన భార్య, ఓ కుమార్తె మృతదేహాలు మంటలో మాడిపోయాయి. ఈ మేరకు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం పాత పాల్వంచ హిందూ శ్మశాన వాటికలో ముగ్గురి అంత్యక్రియలను నాగరామకృష్ణ భార్య శ్రీలక్ష్మి సోదరుడు జనార్దన్ పూర్తిచేశారు. -
భద్రాద్రి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త మలుపు
-
కుటుంబం ఆత్మహత్య.. సంచలనంగా మారిన సూసైడ్ నోట్
-
కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు?
సాక్షి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వనమా రాఘవేందర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పాల్వంచ ఎఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం వనమా రాఘవేందర్ పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నామని తెలిపారు. సూసైడ్ లెటర్లో రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవీ పేర్లు కూడా ఉన్నాయనీ.. ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని ఎఎస్పీ తెలిపారు. చదవండి: భార్యతో వివాహేతర సంబంధం.. భర్త, మరో ముగ్గురు కలిసి.. పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్లీక్ చేసుకుని కుటుంబం సాముహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు. వీరికి సాహితి, సాహిత్య అనే ఇద్దరు పిల్లలు. నాగ రామకృష్ణ మీ సేవాలోఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో దంపతులతో సహా చిన్న కూతురు సజీవ దహనమయ్యారు. మరో కూతురుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. -
కాలువలో దూకిన ఏఈ కుటుంబం.. భార్య, కుమార్తె మృతి
తుమకూరు (బెంగుళూరు): నీటిపారుదల శాఖ సహాయ ఇంజినీర్ కుటుంబం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య, కుమార్తె మృతదేహాలు లభ్యం కాగా ఇంజినీర్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈఘటన తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకా సాగరహళ్లి గేట్ వద్ద చోటు చేసుకుంది. కే.బీ.క్రాస్ హేమావతి కాలువ కార్యాలయంలో సహాయ ఇంజినీర్గా పనిచేస్తున్న రమేష్(55) తుమకూరు నగరంలోని రింగ్ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. భార్య మమత(46), కుమార్తె శుభ(25)తో కలిసి గురువారం సాయంత్రం కారులో గుబ్బి తాలూకాలోని నిట్టూరు సమీపంలో ఉన్న సాగరనహళ్లి గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే కారు నిలిపి ముగ్గురూ హేమావతి కాలువలో దూకారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వచ్చి పరిశీలించగా మృతులను మమత, శుభగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే రమేష్ కూడా కాలువలోకి దూకినట్లు తెలుసుకొని గాలింపు చేపట్టారు. -
విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..
బెంగళూరు(తుమకూరు): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హేమావతి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తుమకూరు జిల్లా చేళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులను కేబీ క్రాస్ హేమావతి కాలువ కార్యాలయంలో సహాయ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న రమేష్(55), అతని భార్య మమత(46), కుమార్తె శుభ(25)గా గుర్తించారు. ఈ ముగ్గురు గురువారం సాయంత్రం కారులో సాగరనహళ్లి గేట్ వద్దకు చేరకుని హేమావతి కాలువలోకి ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కాలువలో శవాలు తేలుతుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పాపం ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు.. అదే శాపమై..) -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య..అసలేం జరిగింది?
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి/ జోగిపేట /రాంచంద్రాపురం: టీసీఎస్లో ఉద్యోగం.. నెలకు రూ.80 వేలకుపైగా వేతనం.. ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు.. అందమైన కుటుంబం.. కానీ ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని మింగేశాయి. అప్పులు తీర్చలేమోనన్న మనస్తాపంతో భర్త ఉరివేసుకోగా.. ఆ విషయం తెలిసిన భార్య పిల్లలతో సహా చెరువులో దూకింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో గురువారం ఈ ఘటన జరిగింది. అసలేం జరిగింది? సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన నాగేశ్వరరావు కుమారుడు బాయికాడోల్ల చంద్రకాంత్రావు. ఆయనకు కామారెడ్డి జిల్లా చిట్యాలకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ కుమార్తె లావణ్యతో వివాహం జరిగింది. వారికి కుమారుడు ప్రీతమ్ (10), కుమార్తె సర్వజ్ఞ (2) ఉన్నారు. చంద్రకాంత్ తండ్రి నాగేశ్వర్రావు బీహెచ్ఈఎల్ ఉద్యోగి కావడంతో.. కుటుంబమంతా హైదరాబాద్లోనే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఎంఐజీ విద్యుత్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రకాంత్ కొంతకాలంగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాడు. తన అప్పులు తీర్చేందుకు సొంతూరు గార్లపల్లిలో ఉన్న భూమినిగానీ, ప్రస్తుతం ఉంటున్న ఇంటినిగానీ అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగారు. ఇందుకు తండ్రి నాగేశ్వర్రావు అంగీకరించలేదు. ఈ క్రమంలో తండ్రీకొడుకు మధ్య మాటామాటా పెరిగినట్టు సమాచారం. ఈ విషయంగా కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంట్లో మళ్లీ గొడవ జరగడంతో.. గురువారం చంద్రకాంత్ భార్య లావణ్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని బీరంగూడలోని తమ బంధువుల గృహప్రవేశానికి వెళ్లింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తిరిగి తమ ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత విద్యుత్నగర్లో ఇల్లు అమ్మకం, అప్పుల విషయంగా తండ్రీకొడుకుల గొడవ జరిగిందని.. లావణ్య పిల్లలను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిందని తెలిసింది. కాసేపటికి చంద్రకాంత్ ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపోయిన లావణ్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆందోల్ చెరువులో దుకింది. శుక్రవారం ఉదయం వారి మృతదేహాలు చెరువులో పైకి తేలాయి. చనిపోవాలని నిర్ణయించుకునే.. విద్యుత్నగర్లో గొడవ జరిగాక లావణ్య తన సెల్ఫోన్ను ఇంట్లోనే వదిలేసి.. పిల్లలను తీసుకుని బయటికి వచ్చేసిందని ఆమె సోదరి సౌజన్య తెలిపారు. కొంతసేపటి తర్వాత ముత్తంగి ప్రాంతం నుంచి వేరేవారి ఫోన్తో విద్యుత్నగర్లోని పక్కింటి వారికి ఫోన్ చేసిందని.. ‘మా ఆయన బాగానే ఉన్నాడా’అని అడిగిందని చెప్పారు. గొడవ జరిగాక ‘ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయట పడలేం, చావే శరణ్యం, నేను ఇక్కడే చనిపోతా. నువ్వు ఎక్కడికైనా వెళ్లిపో..’అని భర్త చెప్పి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రకాంత్ ఉరివేసుకున్నాడని పక్కింటివారు చెప్పడంతో.. తాను పిల్లలతో సహా చెరువులో దూకి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆందోలు–జోగిపేట వైపు బంధువులు, పరిచయస్తులు ఎవరూ లేకున్నా.. లావణ్య అటువైపు ఎందుకు వెళ్లిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పులు ఎందుకయ్యాయి? చంద్రకాంత్రావు ఇటీవల లింగంపల్లి ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. దానికోసం అప్పులు అయ్యాయా? షేర్లు, ఆన్లైన్ పెట్టుబడులు ఏమైనా పెట్టి నష్టపోయాడా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు. లావణ్య కుటుంబ సభ్యులు మాత్రం.. ఇంటి కోసమే చంద్రకాంత్ అప్పులు చేశాడని చెప్తున్నారు. క్రెడిట్ కార్డులపైనా లోన్లు తీసుకున్నాడని అంటున్నారు. చదవండి: హైదరాబాద్ అమ్మాయితో ప్రేమ.. కొద్ది రోజులుగా ఆమె మాట్లాడటం లేదని.. -
పోలీసుల వేధింపుల వల్లనే కుటుంబం ఆత్మహత్య.. యువతి డెత్నోట్
సాక్షి, కోలారు(కర్ణాటక): శిశువు కిడ్నాప్ కేసు కేసులో తమను మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది వేధించారనే అవమానంతో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నగర మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని వివిధ సంఘాలు డిమాండ్ చేశాయి. కోలారు నగరంలో తల్లితండ్రులు, కొడుకు, ఆరోపణలు వచ్చిన కూతురు, మనవరాలు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఆరోపి పుష్ప రాసిన నాలుగు పేజీల డెత్నోట్లో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, కుటుంబమంతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్ఐతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువ అవుతోంది. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సంఘాల కార్యకర్తలు కోరారు. -
పోలీసుల టార్చర్.. పురుగుల మందు తాగి ఐదుగురు మృతి..
సాక్షి, కోలారు(కర్ణాటక): సంబంధం లేకపోయినా పోలీసులు కేసు పెడతామని బెదిరించారనే ఆవేదనతో కుటుంబంలోని 5 మంది ఆదివారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వారిలో అందరూ కన్నుమూశారు. మునియప్ప (75), భార్య నారాయణమ్మ(70), కుమారుడు బాబు (45), మనవరాలు గంగోత్రి (17) కోలారులోని జాలప్ప ఆస్పత్రిలో సోమవారం వేకువన చనిపోయారు. కుమార్తె పుష్ప రాత్రికి కన్నుమూసింది. కేసుతో సంబంధం లేదన్నా.. వివరాలు.. నగరంలోని గల్పేట పరిధిలోని కారంజికట్టలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 18వ తేదీన తాలూకాలోని హొన్నేహళ్లి గ్రామానికి చెందిన సత్య, సుమిత్ర దంపతుల ఆడ శిశువును వారికి తెలిసిన మహిళ ఎత్తుకెళ్లింది. ఇందులో పుష్ప కూడా నిందితురాలని కోలారు నగర మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసులు.. గీతా, పుష్పలను స్టేషన్కు తీసుకువచ్చి విచారించగా ఏ సంబంధం లేదని పుష్ప తెలిపింది. నేరం ఒప్పుకోక పోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు ఆమెను ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో పుష్ప, ఆమె కుటుంబీకులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబం పరువు పోతుందనే ఆవేదనతో ఆదివారం ఐదుగురూ కలిసి పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక మృతి చెందారు. చదవండి: పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేస్తున్నాడు! -
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ముగ్గురు పిల్లలతో సహా..
చండీగఢ్: హర్యానాలోని పాల్వాల్ జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులతో పాటు ముగ్గురు చిన్నపిల్లలు మృతి చెంది ఒక గదిలో విగతజీవులుగా కనిపించారు. ప్రస్తుతం ఈ సంఘటన ఔరంగాబాద్ ప్రాంతంలో కలకలంగా మారింది. కాగా, కుటుంబంలో ఏర్పడిన గొడవల కారణంగానే సాముహిక ఆత్మహత్యలకు పాల్పడినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. మృతి చెందిన వారి ముఖాలపై, గొంతులపై కత్తిపోట్లు ఉన్నాయి. కాగా, కుటుంబ పెద్ద మాత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ సజ్జన్ సింగ్ తెలిపారు. చదవండి: Traffic Challan కమిషనర్ ఆఫీస్ ఎదుట బుల్లెట్ యజమాని ఆత్మహత్యాయత్నం -
కుటుంబం ఆత్మహత్య: అతని వివాహేతర సంబంధమే కారణమా?
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో గత శుక్రవారం వెలుగుచూసిన ఒకే కుటుంబంలో తల్లీ ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఆత్మహత్య, మగశిశువు మృతి కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. తమ ఆత్మహత్యకు తండ్రి శంకర్కు మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే కారణమని కొడుకు మధుసాగర్ రాసిన డెత్నోట్ పోలీసుల సోదాల్లో ఆదివారం ఉదయం బయటపడింది. తండ్రి వల్ల ఇంట్లో కలహాలు ఏర్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రాశాడు. తన లాప్టాప్లో అన్ని వివరాలు ఉన్నట్లు తెలిపాడు. చదవండి: బెంగళూరులో సామూహిక ఆత్మహత్యల కలకలం కూతుళ్లదీ అదేమాట కూతుళ్లు సించన, సింధూరాణి గదులలో లభించిన డెత్నోట్లలోనూ తండ్రి వివాహేతర సంబంధం గురించి ప్రస్తావించారు. సించన అత్తవారింట్లో సంతోషం లేదని రాసింది. దీంతో లేఖలను, లాప్టాప్ను బ్యాడరహళ్లి పోలీసులు క్షుణ్ణంగా పరిశోధిస్తున్నారు. కేజీ బంగారం, రూ.12 లక్షలు సీజ్.. శంకర్ ఇంట్లో సోదాల్లో దొరికిన కేజీ బంగారం, రూ.12 లక్షలు నగదును కూడా పోలీసులు సీజ్ చేసి ఇంటికి తాళాలు వేశారు. శంకర్ విజ్ఞప్తి మేరకు పంచనామా సమయంలో విజయనగర ఎసీపీ నంజుండేగౌడ నేతృత్వంలో సీఐ రాజీవ్లు ఇంటిలోని ప్రతిభాగాన్ని వీడియో చిత్రీకరణ చేశారు. మృతుల మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విశ్లేషించే పనిలో ఉన్నారు. అల్లుళ్లు ప్రవీణ్, శ్రీకాంత్లను ప్రశ్నించారు. ఇక శంకర్పై కుటుంబీకులే ఆరోపణలు చేయడంతో పోలీసులు ఆయన మీద దృష్టి సారించారు. మరోవైపు అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో తన భార్యే గొడవలకు కారణమని శంకర్ రోదించాడు. చదవండి: సరిగా కూర్చోవాలని అన్నందుకు ఐరన్ రాడ్తో టీచర్పై.. -
పచ్చని కాపురంలో ‘అతడు’ రేపిన చిచ్చు
మామిడికుదురు: ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి నలుగురి ఆత్మహత్యకు కారణమైంది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు సహా ఆ దంపతులను సామూహిక ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది. చించినాడ బ్రిడ్జిపై నుంచి శుక్రవారం రాత్రి వశిష్ట గోదావరి నదిలో దూకినట్టుగా భావించిన నలుగురిలో ఆదివారం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనలో మొగలికుదురుకు చెందిన కంచి సతీశ్ (32)తో పాటు అతని కుమార్తె ఇందు శ్రీదుర్గ (2) మృతదేహాలను వశిష్ట నదిలో గుర్తించారు. సతీశ్ భార్య సంధ్య (22)తో పాటు వారి కుమారుడు జస్వన్ (4) మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మొగలికుదురులో తాపీ పని చేసుకుంటూ జీవించే సతీష్ మరికాస్త సంపాదించుకొని తమ బతుకురాత మార్చుకోవాలని కలలుగన్నాడు. ఈ క్రమంలో మెరుగైన ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఆ సమయంలో అతడి భార్య సంధ్యకు సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడటం ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ అయ్యింది. కుల పెద్దల సమక్షంలో రాజీ యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్దలు పిల్లలు జస్వన్, శ్రీదుర్గలను మొగలికుదురులోనే ఉంచి, సంధ్యను ఆమె పుట్టిల్లయిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు పంపించినట్టు చెబుతున్నారు. విషయం తెలిసి మనస్తాపం చెందిన సతీష్ పది రోజుల కిందట సౌదీ నుంచి స్వగ్రామం వచ్చాడు. మద్యానికి బానిసైన అతడిని కుటుంబ పెద్దలు ఓదార్చారు. పిల్లలతో సహా కేశవదాసుపాలెంలోని అక్క ఇంటికి పంపించారని చెబుతున్నారు. ఈ విషయంపై తన భార్య సంధ్యను కలిసి మాట్లాడాలని సతీశ్ నిర్ణయించుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ మండలం వెలివలలోని పినమామ ఇంటి వద్ద ఆమె ఉంటోందని తెలుసుకుని.. కేశవదాసుపాలెం నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లాడు. అక్కడ రెండు రోజులు ఉన్నాడు. అనంతరం శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ పిల్లలతో కలిసి చించినాడ వంతెన పైకి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న సూసైడ్ నోట్ను, పిల్లల దుస్తులను, బైక్ను వంతెనపై వదిలేసి, గోదావరిలో దూకేశారని భావిస్తున్నారు. కుటుంబంలో వరుసగా జరిగిన పరిణామాలు అవమానకరంగా ఉండటం, సమాజంలో తలెత్తుకునే పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎంతో సౌమ్యంగా ఉండే సతీశ్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. అతడి తండ్రి భగవాన్దాసు, తల్లి లక్ష్మి, బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. -
మానసిక సంఘర్షణతోనే.. జెన్కో కుటుంబం ఆత్మహత్య
సాక్షి, నాగార్జునసాగర్(నల్లగొండ): అనారోగ్య సమస్యలు, మానసిక సంఘర్షణతోనే జెన్కో ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగి రామయ్య తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇటీవల కుమారుడు, భార్యతో కలిసి జెన్కో ఉద్యోగి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రామయ్యతో పాటు, భార్య నాగమణి, కుమారుడు సాత్విక్ను స్వగ్రామం చింతలపాలెంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు. రామయ్యకు కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల మిర్యాలగూడలో పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ ఉన్నదని, అదే విధంగా కరోనా కూడా సోకినట్లు తేలడంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రామయ్య కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని ఉంటాడ ని అనుమానిస్తున్నారు. తొలుత కుమారుడు సాత్వి క్ను బ్రిడ్జి పైనుంచి కృష్ణానదిలోకి తోసేసి అనంతరం దంపతులు చేతులు పట్టుకుని దూకినట్లు తెలుస్తోంది. మొదట సాత్విక్ మృతదేహం, అనంతరం చేతులు పట్టుకుని ఉన్న రామయ్య దంపతుల మృతదేహాలు తేలినట్లు జాలర్లు చెబుతున్నారు. తనకున్నజబ్బులు బయటకు తెలిస్తే సమాజం చిన్నచూపు చూస్తుందని ప్రతికూల భావనతో కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. -
రైతు కుటుంబం ఆత్మహత్య
సాక్షి బళ్లారి: కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోరం జరిగింది. శహపుర తాలూకా ధోరణహళ్లిలో దంపతులు, నలుగురు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకొన్నారు. గ్రామానికి చెందిన భీమరాయ సురపుర (45), భార్య శాంతమ్మ (36), కుమార్తెలు సుమిత్ర (12), శ్రీదేవి (10), లక్ష్మి (8), శివరాజ్ (6) అనే ఆరుగురు సోమవారం తమ పొలంలోని ఫారం పాండ్లో దూకి తనువు చాలించారు. భీమరాయ మూడెకరాల పొలం కొనుగోలు చేసి, మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు. మిరప, పత్తి తదితరాల సాగుకు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.20 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా కరువు, అతివృష్టితో పంటలు పండక తీవ్ర నష్టాల పాలయ్యాడు. అప్పుల భారం పెరిగి కుటుంబ పోషణ కూడా కష్టమైంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భీమరాయ సొంత పొలానికి భార్య బిడ్డలను తీసుకెళ్లి మొదట పిల్లలను ఫారంపాండ్లోకి తోసేసి, తరువాత దంపతులు దూకినట్లు పోలీసులు తెలిపారు. -
విషాదం: ‘మాఫ్ కర్దేనా గోపి భాయ్’ అంటూ చివరి సందేశం
సాక్షి, చార్మినార్/దూద్బౌలి: ఆర్థిక ఇబ్బందులు ఒక కుటుంబాన్ని బలిగొన్నాయి. ఒక కుటుంబంలో అన్నదమ్ములతోపాటు సోదరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్లోని హుస్సేనీఆలం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్ నరేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పురానాపూల్లోని పార్ధివాడ ప్రాంతానికి చెందిన ఎల్ఐసీ ఉద్యోగి మధుసూదన్ (42), సోదరి ప్రేమలత (39), సోదరుడు సందీప్ (35) ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. వీరిలో ఎవరికీ వివాహం కాలేదు. భరించలేని అప్పుల బాధతో ఈ ముగ్గురు ఒకేసారి సొంతింట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి తల్లిదండ్రులు 15–20 ఏళ్ల క్రితమే మృతి చెందారు. ఒకే మాటపై నిలబడే ఈ ముగ్గురు లక్షల రూపాయల అప్పు చేసి పార్ధివాడలో జీ ప్లస్–1 ఇల్లు నిర్మించుకున్నారు. అప్పులిచ్చిన వారు వెంటపడుతుండటంతో నెల రోజులుగా ఇంటిని వదిలి కనిపించకుండా తిరుగుతున్నారు. ఈక్రమంలో గురువారం రాత్రి పార్ధివాడకు చేరుకున్న వీరు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని జుమ్మెరాత్ బజార్లో ఉంటున్న తన స్నేహితుడు గోపిసింగ్కు మధుసూదన్ వాట్సాప్ సందేశం పంపించాడు. ‘మాఫ్ కర్దేనా గోపి భాయ్’అనే సందేశాన్ని శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు పంపాడు. అనంతరం ముగ్గురు కలిసి ఒకే గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధుసూదన్ మెసేజ్ చూసిన గోపిసింగ్ తిరిగి ఫోన్ చేస్తుండగా... మధుసూదన్ లిఫ్ట్ చేయకపోవడంతో పార్ధివాడకు చేరుకున్నాడు. వెంటనే అక్కడే ఉన్న బస్తీ నివాసి శశికిరణ్కు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్కింటి గోడపైకి ఎక్కి లోపలికి వెళ్లి చూడగా ముగ్గురు విగతజీవులై కనిపించారు. -
అమ్మా ఎంతపనిచేశావమ్మా..?
చిన్నపాటి మనస్పర్థలకే కుంగిపోయావు.. మా నాన్నను వదిలి ఒంటరిగా జీవించాలనుకున్నావు.. అది సాధ్యం కాదని తెలిసి నీ తల్లిదండ్రుల చెంతకు చేరావు.. వారితోనూ సఖ్యతగా ఉండలేక విసిగిపోయావు .. గొడవలకు దిగి మరింత మానసిక వేదనకు లోనయ్యావు.. కడుపుచించుకు పుట్టిన బిడ్డల్ని పోషించలేనని భావించావు.. ఒంటరిగా సమాజంలో బతకడం కష్టమని కుమిలిపోయావు.. ఇక చావే శరణ్యమని వ్యవసాయబావిని ఎంచుకున్నావు.. ఆ బావిలోనే మమ్మల్ని ముంచేసి.. నువ్వూ కడతేరిపోయావు.. అమ్మా ఎంతపనిచేశావమ్మా..? అన్నట్టు అభంశుభం తెలియని పసిపిల్లలు నీటిలో తేలియాడుతూ కనిపించడం చూపరులను కలచివేసింది. చిత్తూరులో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన తల్లీబిడ్డలు శుక్రవారం వ్యవసాయ బావిలో శవాలుగా తేలడం స్థానికంగా విషాదం అలముకుంది. చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఓబనపల్లెకు చెందిన మునిరత్నం, పట్టమ్మ కుమార్తె ధనలక్ష్మి (28)కి పదేళ్ల క్రితం తమిళనాడులోని వేలూరుకు చెందిన ముత్తుతో వివాహమైంది. వీళ్లకు ఝాన్సి (8), ఉదయ్ పిల్లలు ఉన్నారు. ముత్తు తాపీమేస్త్రీగా, ధనలక్ష్మి హైరోడ్డులోని ఓ హోటల్లో కూలీగా పనిచేసేవారు. కొంతకాలం వీళ్ల కాపురం సజావుగా సాగింది. తర్వాత చిన్నపాటి గొడవలు రావడంతో రెండేళ్ల క్రితం దంపతులు విడిపోయారు. ముత్తు తన సొంతూరికి వెళ్లిపోగా, ధనలక్ష్మి ఓబనపల్లెలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి, కుమారుడిని ఒకటో తరగతి చదివిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నెలలుగా ధనలక్ష్మి ఒంటరితనాన్ని భరించలే పోయింది. తల్లిదండ్రులతో సైతం పలుమార్లు మనస్పర్థలు రావడంతో మరింత కుంగిపోయింది. చదవండి: (విషాదం: గుండెపోటుతో జగదీష్.. మనోవేదనతో శిరీష..) ఈనెల 4వ తేదీ సాయంత్రం పిల్లలతో సహా ధనలక్ష్మి కనిపించకుండాపోయింది. భర్త వద్దకు వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. ఆపై రెండు రోజుల పాటు అన్నిచోట్లా విచారించారు. కానీ ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 6వ తేదీన టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ కెమెరాలు, తెలిసిన వాళ్ల చిరునామాల్లో వెతకడం ప్రారంభించారు. ధనలక్ష్మి తన సెల్ఫోన్ కూడా ఇంట్లోనే వదలివెళ్లిపోవడంతో కేసు కొలిక్కిరాలేదు. శుక్రవారం ఉదయం ఓబనపల్లె వద్ద ఉన్న వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లల మృతదేహాలు తేలాయి. గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందజేశారు. బాధితుల్ని ఓదారుస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టూటౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ మల్లికార్జునతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ధనలక్ష్మి పిల్లలుగా గుర్తించారు. కొంతసేపటి వరకు ధనలక్ష్మి కోసం బావిలో వెతికినా ఆచూకీ లభించలేదు. అగ్నిమాపక సిబ్బంది గాలింపు తీవ్రం చేయడంతో ఆమె మృతదేహం కూడా లభ్యమైంది. పిల్లల్ని ముందుగా బావిలో తోసి, ఆపై తనూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. -
స్టాక్ మార్కెట్ నష్టాలు.. కుటుంబం ఆత్మహత్య
సాక్షి, బళ్లారి రూరల్: అతనో చిరుద్యోగి. స్టాక్ మార్కెట్లో షేర్లు కొనే అమ్మే అలవాటు వ్యసనంగా మారింది. నష్టాల పాలవుతున్నా ఏదో ఒకనాటికి లాభాలు రాకపోతాయా అనే ఆశతో ట్రేడింగ్ సుడిగుండంలో మునిగి నష్టాల్లో కూరుకుపోయాడు. ఫలితంగా ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు పసికందుల్ని చంపి, భార్యతో కలిసి ఉరివేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన బళ్లారి జిల్లా గాదిగనూరలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గాదిగనూరుకు చెందిన నంజుండేశ్వర (32) జిందాల్లో పనిచేస్తుండేవాడు. ఇతడు షేర్లు కొనడం, అమ్మడం చేస్తుండేవాడు. అయితే కరోనా వైరస్ వల్ల షేర్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురికావడంతో నంజుండేశ్వర పెద్దమొత్తంలో నష్టపోయాడు. సొంత డబ్బు పోగొట్టుకోవడంతో పాటు రూ.15 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ సమయంలో బంధువులు కొంత సాయం చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున నంజుండేశ్వర పిల్లలు గౌతమి (3), స్వరూప్ (2)లకు పురుగుల మందు తాగించడంతో వారు మృత్యువాత పడ్డారు. తర్వాత భార్య పార్వతి(27), తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. డెత్నోట్ స్వాధీనం ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసునమోదు చేసుకొని మృతదేహాలను విమ్స్కు తరలించారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని రాసిపెట్టిన డెత్నోట్ పక్కన ఉంది. కాగా మృతుని సోదరుడు గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ షేర్మార్కెట్లో నష్టాలే ఘోరానికి కారణమని తెలిపాడు. -
విల్లుపురంలో విషాదం.. ఒకే ఇంట్లో ఐదుగురు మృతి
సాక్షి, చెన్నై: అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వలవనూరుకు చెందిన మోహన్ (32) వృత్తిరీత్యా చెన్నైలో టైలర్. భార్య విమలేశ్వరి (28), కుమార్తెలు విజయశ్రీ (8), రాజశ్రీ (7), కుమారుడు శివబాలన్ (5) ఉన్నారు. టైలరింగ్తో వచ్చే ఆదాయం చాలకపోవడంతో అప్పు చేసి సొంతూరులో వడ్రంగి మిల్లును ప్రారంభించాడు. సొంతిల్లు కూడా నిర్మించుకున్నాడు. కరోనా కారణంగా మిల్లు మూతపడడంతో వడ్డీలు పెరిగిపోయాయి. ఆదాయం కోసం ఆన్లైన్ జూదం ఆడి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో మానసిక ఒత్తికి గురయ్యాడు. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి గదిలో పడుకుని ఉన్న ముగ్గురు పిల్లలను తాడుతో ఉరివేసి హతమార్చాడు. ఆ తర్వాత భార్యభర్తలిద్దరూ ప్రాణాలు తీసుకున్నారు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబం ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..) -
కన్నా..నీ వెంటే మేమంతా..!
సాక్షి, చెన్నై: క్యాన్సర్తో పెద్దకుమారుడు మరణించడం ఓ కుటుంబాన్ని కలిచి వేసింది. నీ వెంటే మేమూ అంటూ ఆ కుటుంబంలోని నలుగురు సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు.. సేలం జిల్లా అమ్మాపేట సమీపంలోని వలకాడుకు చెందిన మురుగన్, కోకిల దంపతులకు కుమారులు మదన్ కుమార్ (14), వసంతకుమార్(12), కార్తీక్(9) ఉన్నారు. సమీప గ్రామంలోని ఓ సెలూన్లో మురుగన్ పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం ఆ ఇంటి తలుపులు ఎంతకు తెరచుకోలేదు. దీంతో పక్కింట్లో ఉన్న వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో మురుగన్, కోకిల, వసంతకుమార్, కార్తీక్లు విగతజీవులుగా పడివున్నారు. మృతదేహాలను పరిశీలించగా అందరూ విషం సేవించినట్టు తేలింది. చదవండి: (హుస్నాబాద్లో విషాదఛాయలు) విచారణలో బయటపడిన నిజాలు సేలం అమ్మాపేట పోలీసులు కేసు నమోదు చేసిన మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. విచారణలో 8 నెలల క్రితం పెద్దకుమారుడైన మదన్ కుమార్ క్యాన్సర్తో మరణించినట్టు తెలిసింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగింది. స్థానికులతోసరిగ్గా మాట్లాడకుండా పెద్దకుమారుడిని తలచుకుంటూ అతడి ఫొటో వద్దే మురుగన్, కోకిల్ కూర్చుని ఉండేవారు. మురుగన్ పనికి వెళ్లడం మానేశాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఇద్దరు కుమారులకు విషమిచ్చి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
హుస్నాబాద్లో విషాదఛాయలు
సాక్షి, కరీంనగర్క్రైం: ఐదేళ్ల క్రితం జీవనోపాధి కోసం కరీంనగర్ పట్టణానికి వెళ్లిన కుటుంబ సభ్యులు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో హుస్నాబాద్లో విషాదఛాయలు అలుముకున్నాయి. హుస్నాబాద్ పట్టణానికి చెందిన అందె సమ్మయ్య కృష్ణవేణి దంపతులు ఐదేళ్ల నుంచి జీవనోపాధి కోసం కరీంనగర్ వెళ్లారు. అప్పుల బాధతో ఆదివారం రాత్రి ఇంట్లో దంపతులతోపాటు కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ పట్టణానికి చెందిన అందె సమ్మయ్య(38)కు కూచనపెల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి(35)తో పన్నెండేళ్ల కిందట వివాహం జరిగింది. కొద్దిరోజులు హుస్నాబాద్లో జీవనం సాగించిన వీరు జీవనోపాధి కోసం ఐదేళ్ల క్రితం కరీంనగర్కు వలస వెళ్లారు. అక్కడ అద్దె గదిలో ఉంటూ సమ్మయ్య మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చేసిన అప్పులు రూ.14లక్షలను తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ రాసి దంపతులిద్దరు పురుగుల మందును ఆహారంలో తీసుకొని, కుమారుడు లక్కీ(10)కి కూడా ఇచ్చారు. చదవండి: (ఫీజు చెల్లించలేక తనువు చాలించింది) ఆహారం తీసుకొని నిద్రపోయిన దంపతులు ఇద్దరు సోమవారం తెల్లవారుజామున చావుబతుకుల మధ్యన కొట్టుకుండటం చూసిన కుమారుడు డయల్ 100కు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సమ్మయ్య, కృష్ణవేణి దంపతులు ఇద్దరు మృతి చెందగా, కుమారుడు లక్కీ ప్రమాదం నుంచి బయటపడ్డట్లు తెలిపారు. ఈ సంఘటన కరీంనగర్లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనతో కృష్ణవేణి తల్లిగారు ఊరు అయిన కూచనపెల్లిలో, సమ్మయ్య సొంత ఇల్లు ఉండే హుస్నాబాద్ గాంధీ చౌరస్తాలో విషాదం నెలకొంది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొని బాలుడికి భవిష్యత్ చూపించాలని రెండు గ్రామాల గ్రామస్తులు కోరుతున్నారు. -
నాన్నా... నీ వద్దకే వస్తున్నాం!
సాక్షి, చెన్నై: ఇంటి పెద్ద మరణం ఓ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనలోకి నెట్టింది. నీ వెంటనే మేమూ అంటూ ఆ కుటుంబంలోని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన మదురైలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు..తిరుచ్చి సత్యమూర్తినగర్కు చెందిన అరుణ్పాండియన్(44) కాంట్రాక్టర్. ఆయనకు భార్య వలర్మతి(38), కుమార్తెలు అఖిల(19), ప్రీతి(17) ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో అరుణ్పాండియన్ అనారోగ్యానికి గురయ్యారు. మదురైలో చికిత్స తీసుకోవాల్సి రావడంతో మలై స్వామిపురంలోని వలర్మతి సోదరి సరస్వతి ఇంటికి పైఅంతస్తులో కొద్ది నెలలుగా ఉంటున్నారు. జూలైలో అరుణ్ పాండియన్ మరణించాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం తీవ్ర మనోవేదనతో ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముగ్గురు ఒకేగదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాము పెంచుకుంటున్న శునకాన్ని సైతం గొంతు నులిమి హతమార్చారు. ఉదయం ఎంత సేపైనా వలర్మతి, పిల్లలు బయటకు రాకపోవడంతో సరస్వతి భర్త గణేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు బద్దలు కొట్టి చూడగా తల్లి, కుమార్తెలు ఉరికి వేలాడుతూ కనిపించారు. (కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!) ఫ్యామిలీ ఫొటో వద్ద ఓ లేఖను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలను అందులో వివరించారు. తమ ఆస్తులను తన తల్లి లక్ష్మికి అప్పగించాలని వలర్మతి అందులో పేర్కొంది. తమ అంత్యక్రియులను తల్లి లక్ష్మి చేతుల మీదుగా చేయించాలని..తమతో పాటుగా శునకాన్ని ఖననం చేయాలని కోరారు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి లేకపోవడం కష్టతరంగా ఉందని, అందుకే నాన్న వద్దకే వెళుతున్నామని ఇద్దరు కుమార్తెలు లేఖలో పేర్కొనడం అందరి హృదయాలను బరువెక్కించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదురై జీహెచ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నంద్యాల సీఐ, కానిస్టేబుల్ల బెయిల్ రద్దు
సాక్షి, కర్నూలు జిల్లా: అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్ల బెయిల్ను నంద్యాల కోర్టు రద్దు చేసింది. అబ్దుల్ సలాం కేసులో ప్రభుత్వం తరపున ఏపీ హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విన్న నంద్యాల కోర్టు.. ఆయన మాటలకు ఏకీభవించింది. దాని ప్రకారం సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ల బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీసీ సెక్షన్ 306ను అమలు పరుస్తూ బెయిల్ రద్దు చేసినట్లు కోర్టు వెల్లడించింది. డిసెంబర్ 2 వ తేదీ లోగా నంద్యాల జిల్లా కోర్టులో హాజరు కావాలని సీఐ సోమశేఖర్ రెడ్డిని, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లని నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి మొక సువర్ణ రాజు ఆదేశించారు. ( సెల్ఫీ వీడియో: అందుకే చనిపోతున్నాం.. ) అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వ తేదీన గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సలాం, అతని భార్య నూర్జహాన్ తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా.. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్టౌన్ సీఐ సోమశేఖర్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసందే. ఈ కేసులో కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను అరెస్ట్ చేశారు. -
సలాం కుటుంబం ఆత్మహత్యపై రాజకీయాలొద్దు
సాక్షి, హైదరాబాద్: నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై రాజకీయాలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ఉల్మా కౌన్సిల్ అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్ ఫారూక్ హెచ్చరించారు. నిందితులకు బెయిల్ ఇప్పించిన టీడీపీ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని విమర్శించారు. టీడీపీ కార్యదర్శిగా ఉన్న న్యాయవాది నిందితులకు బెయిల్ ఇప్పించారని గుర్తు చేశారు. ముస్లిం సంఘాల పేరుతో టీడీపీ, కొన్ని రాజకీయ పక్షాలు నంద్యాలకు బస్సు యాత్ర చేపట్టటాన్ని ఖండించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఘటనపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడాన్ని స్వాగతించారు. అధికారంలో ఉండగా ముస్లింల సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని ముఫ్తీ ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో రాజమండ్రిలో ఒక మసీదు మౌజమ్ హత్యకు గురైతే ఆ కుటుంబానికి కనీసం న్యాయం చేయలేక పోయారని మండిపడ్డారు. ముస్లిం యువతపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయటాన్ని మరవబోమన్నారు. -
విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు..
సాక్షి, కొమురం భీమ్ : ఆసీఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బూరపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్య భర్తల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా నక్క రాజు అనే వ్యక్తి భార్య తన కూతురిని వెంట తీసుకొని మహారాష్ట్ర లోని వారి పుట్టింటికి వెళ్తున్న అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం కూతురితో కలిసి తల్లి ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త నక్క రాజు తన ఇంటి దగ్గర ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారని సమాచారం. చదవండి: సైబర్ టవర్ సిగ్నల్ వద్ద రోడ్డు ప్రమాదం చదవండి: జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య -
సలామ్ అత్తకు రూ. 25 లక్షల పరిహారం అందజేత
-
సలామ్ అత్తకు రూ. 25 లక్షల పరిహారం అందజేత
సాక్షి, కర్నూలు : నంద్యాలలో ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియాను బాధిత కుటుంబానికి అందజేశారు. గురువారం సలామ్ అత్తగారిని కలిసిన ఎంపీ బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ కలెక్టర్ వీరపాండ్యన్, తహశీల్దార్ రవికూమార్ ఎక్స్గ్రేషియాను బాధిత కుటుంబానికి అందజేశారు. కాగా నంద్యాల మూలసాగరం ప్రాంతానికి చెందిన అబ్దుల్సలామ్ (45) తన భార్య నూర్జహాన్ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలంధర్ (10)తో కలిసి ఈ నెల 3న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రూ.70 వేలు పోగొట్టుకున్న కేసులో విచారణ నిమిత్తం పోలీసులు అబ్దుల్ సలామ్ను స్టేషన్కు పిలిచి విచారణ జరిపారు. ఈ పరిస్థితుల్లో తాను బతకడం అనవసరం అనుకున్న సలామ్.. కుటుంబంతో కలిసి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం ఆత్మహత్య చేసుకునే ముందు సలామ్, అతని భార్య నూర్జహాన్ సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆ సెల్ఫోన్ను ఇంట్లో పెట్టారు. కుటుంబ సభ్యులు ఆ ఫోన్ను పరిశీలిస్తున్న క్రమంలో సెల్ఫీ వీడియో బయటపడింది. ‘నేనేం తప్పు చేయలేదు సార్. ఆటోలో జరిగిన దొంగతనానికి, నాకు సంబంధం లేదు. అంగట్లో జరిగిన దొంగతనంతో కూడా సంబంధం లేదు. పోలీసుల టార్చర్ భరించలేకున్నా సార్. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మా చావుతోనైనా మనశ్శాంతి కలుగుతుందని భావిస్తున్నా’మంటూ సలాం, నూర్జహాన్ కన్నీటి పర్యంతమవుతూ తమ పరిస్థితిని అందులో వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విచారణకు ఆదేశించారు. నంద్యాల వన్టౌన్ సీఐ సోమశేఖర్ను సస్పెండ్ చేశారు. అదే విధంగా పోలీసులు విధుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి.. పౌరులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని హోం మంత్రి సుచరిత హెచ్చరించారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ -
సలామ్ అత్తకు రూ.25 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి/నంద్యాల: నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యతో ఆసరా కోల్పోయిన అతని అత్త మాబున్నీసాను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.25 లక్షల పరిహారం ప్రకటించారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో డీజీపీ గౌతమ్సవాంగ్తో కలిసి సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సలామ్ కుటుంబం ఆత్మహత్య తమను తీవ్రంగా కలచివేసిందని, దీనికి పోలీసుల వేధింపులే కారణమంటూ సలామ్ సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన వెంటనే సీఎం జగన్ తనతోను, డీజీపీ సవాంగ్తోను మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని మంత్రి చెప్పారు. తప్పు చేస్తే పోలీసులనూ ఉపేక్షించేది లేదన్నారు. తమది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, అణగారిన వర్గాలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎక్కడైనా పోలీసులు వేధింపులకు పాల్పడితే బాధితులెవరూ ప్రాణాలు తీసుకోవద్దని, తక్షణం ఏపీ పోలీస్ సేవా యాప్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురైతే బాధితులు నేరుగా ఫిర్యాదు చేసేలా త్వరలో టోల్ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ముస్లింలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు చంద్రబాబు యత్నం హత్య కేసులో నిందితుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను, ఈఎస్ఐ స్కామ్లో నిందితుడైన అచ్చెన్నాయుడిను అరెస్ట్ చేస్తే బీసీలపై కక్ష సాధింపు అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ముస్లిం, మైనార్టీలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. టీడీపీ నేతల అవకాశవాద విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. డీజీపీ గౌతమ్సవాంగ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే పోలీసులనూ ఉపేక్షించవద్దని సీఎం వైఎస్ జగన్ తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సలాం కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్బాషా, ఎమ్మెల్యేలు శిల్పా రవి, హఫీజ్ఖాన్ బాధ్యులందరిపైనా చర్యలు అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అందరిపైనా ప్రభుత్వం చట్టపరమైన చర్యలను తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా అన్నారు. సోమవారం ఆయన నంద్యాలలోని అబ్దుల్సలామ్ ఇంటికి వెళ్లి అతని అత్త, బంధువులను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, హఫీజ్ఖాన్తో కలిసి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. నంద్యాల సీఐ, హెడ్ కానిస్టేబుల్కు బెయిల్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన నంద్యాల సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లకు నంద్యాల ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ప్రసన్నలత బెయిల్ మంజూరు చేశారు. వారిద్దరిపైనా పోలీసులు ఐపీసీ 323, 324, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, న్యాయమూర్తి దీనిని సెక్షన్ 506 (మాటలతో వేధించడం) పరిధిలోకి తీసుకుని వారికి బెయిల్ మంజూరు చేశారు. నిందితుల తరఫున కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది వి.రామచంద్రరావు వాదనలు వినిపించారు. న్యాయం జరుగుతుందనుకోలేదు నా అల్లుడు, కుమార్తె, వారి పిల్లల ఆత్మహత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తారని అనుకోలేదు. ఈ కేసులో విచారణ కమిటీ ఏర్పాటు చేసి.. సీఐ, హెడ్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేయడం సంతోషంగా ఉంది. నా కుటుంబానికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. నా వాళ్ల చావుకు కారణమైన ఎవరినీ వదిలిపెట్ట వద్దని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా. – మాబున్నిసా, అబ్దుల్ సలామ్ అత్త సీఎం స్పందించిన తీరు మనోధైర్యం నింపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరు ముస్లింలలో మనోధైర్యాన్ని ఇచ్చింది. ప్రభుత్వం విచారణ కమిటీ వేయడమే కాకుండా ఆత్మహత్యకు కారణమైన సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ గంగాధర్లను సస్పెండ్ చేయడం, వారిని అరెస్ట్ చేయడం అభినందించదగ్గ విషయం. – అబ్దుల్ఖాదిర్, మతపెద్ద, నంద్యాల -
కఠిన చర్యలు తీసుకుంటాం: అంజాద్ బాషా
-
నంద్యాల: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం
సాక్షి, కర్నూలు: నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులను సోమవారం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం అంజాద్బాషా హామీ ఇచ్చారు. అన్యాయంగా, అక్రమంగా ప్రజలపై ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించిన చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. (సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్) అబ్దుల్ సలామ్ ఘటనపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రత్యేక అధికారుల ద్వారా సమగ్ర దర్యాప్తు చేపడుతుంది. వీరిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలకుండా దర్యాప్తు జరుగుతంది అని డిప్యూటీ సీఎం అంజాద్బాషా వెల్లడించారు. కాగా గతంలోనే సామూహిక ఆత్మహత్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలున్న సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ గంగాధర్లను ఇప్పటికే సస్పెండ్ చేస్తూ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (బిడ్డలతో కలిసి దంపతుల ఆత్మహత్య) -
24 గంటల్లోనే ఇద్దరూ అరెస్టు
సాక్షి, అమరావతి, నంద్యాల/బొమ్మలసత్రం: కర్నూలు జిల్లాలో ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం అంతే వేగంగా స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బాధితుడు తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 24 గంటలలోపే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల వన్టౌన్ సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లను సస్పెండ్ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఘటనపై విచారణకు ప్రభుత్వం నియమించిన పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం ఉదయమే నంద్యాల చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమన్న ప్రభుత్వ వైఖరి దీని ద్వారా మరోసారి స్పష్టమైంది. ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరును మైనార్టీ వర్గాలు స్వాగతిస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలామ్ (45), భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వతేదీన పాణ్యం వద్ద గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. తక్షణమే చర్యలకు సీఎం ఆదేశం.. నంద్యాలలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తన దృష్టికి రాగానే ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించారు. క్షుణ్నంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న సీఎం జగన్ స్వయంగా డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. ఘటనపై హోంమంత్రి, డీజీపీలను నివేదిక కోరారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీ శంకబ్రతబాగ్చీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ సవాంగ్ ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులు నంద్యాల చేరుకుని విచారణ చేపట్టారు. ఏ సెక్షన్లు అంటే.. సస్పెండైన సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లపై పలు ఐపీసీ సెక్షన్లు కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా వేధించడం, బాధించడం), 324 (మారణాయుధాలు చూపించడం, బెదిరించడం), 306 (ఆత్మహత్యకు పురిగొల్పడం) తదితర సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. సలామ్ సెల్ఫోన్ సీజ్... వారిని 24 గంటల్లో కోర్టులో హాజరు పరుస్తామని ఏఎస్పీ గౌతమిసాలి, డీఎస్పీ పోతురాజు ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. విచారణ పేరుతో భయపెట్టడం, బెదిరింపులకు పాల్పడటం, ఆడవారి పట్ల అమర్యాదగా మాట్లాడటం, ఆత్మహత్యకు ప్రేరేపించడం లాంటివి ఎవరు చేసినా తప్పేనన్నారు. అబ్దుల్ సలాం సెల్ఫోన్ను సీజ్ చేశామని, ఆధారాలను కోర్టులో అందజేస్తామని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం బంధువులను ఏఎస్పీ గౌతమిసాలి నంద్యాల వన్టౌన్ పోలీస్టేషన్లో విచారించారు. నూర్జహాన్ తల్లి మాబున్నీసా నుంచి వివరాలు సేకరించారు. మరో 10 మంది పోలీసు సిబ్బందిని కూడా విచారించామని, ఈనెల 2వతేదీన సలాం ఆటోలో నగదు పోగొట్టుకున్న భాస్కర్రెడ్డిని కూడా ప్రశ్నించినట్లు డీఐజీ వెంకటరామిరెడ్డి తెలిపారు. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్వాగతించిన ముస్లిం మైనార్టీలు.. ఘటనపై ముఖ్యమంత్రి వేగంగా స్పందించి దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించడం, పోలీసు శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ మైనారిటీ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యను మైనార్టీలు స్వాగతించారు. దర్యాప్తు కొనసాగుతోంది: డీజీపీ సవాంగ్ ముఖ్యమంత్రి ఆదేశాలతో విచారణ చేపట్టిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం చర్యలు తీసుకున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. తప్పుచేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తిలేదని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్
సాక్షి, విజయవాడ : నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తును పోలీస్ అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే సీఐ సోమశేఖర్రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా తప్పు చేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్లే ప్రసక్తే లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. మరోవైపు ఐజీ శంకబ్రతబాగ్జి, ఐపీఎస్ అధికారి అరిఫ్ అఫీజ్ కేసు విచారణను ప్రారంభించారు. (బిడ్డలతో కలిసి దంపతుల ఆత్మహత్య) కాగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వ తేదీన గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సలాం, అతని భార్య నూర్జహాన్ తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా.. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్టౌన్ సీఐ సోమశేఖర్ను సస్పెండ్ చేశారు. (కుటుంబం ఆత్మహత్యపై విచారణకు సీఎం ఆదేశం) 24 గంటల్లోనే చర్యలు షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏయే సెక్షన్లు భారత శిక్ష్మాస్మృతి (ఐపీసీ) సెక్షన్–34లోని సెక్షన్–323, సెక్షన్–324, సెక్షన్–306 కింద సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లపై కేసులు నమోదు చేశారు. (వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే..?!) మైనారిటీల హర్షం షేక్ అబ్దుల్ సలామ్ సెల్ఫీ బయటకు వచ్చిన వెంటనే శరవేగంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించడం, ముగ్గురు ఐపీఎస్ అధికారులను సమగ్ర దర్యాప్తు కోసం నియమించడం, ఆ తర్వాత కేవలం 24 గంటల్లోనే ఘటనకు బాధ్యులను గర్తించి సీఐ, హెడ్ కానిస్టేబుల్ని అరెస్టు చేయడంపై పలు ముస్లిం మైనారిటీ సంఘాలు హర్షం వక్తం చేశాయి. ప్రభుత్వ చర్యలను మైనారిటీలు స్వాగతించారు. -
నంద్యాల ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు
సాక్షి, కర్నూలు: నంద్యాలలో సామూహిత ఆత్మహత్యలపై ప్రత్యేక విచారణకు కమిటీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ కేసు విచారణకు అధికారులను నియమించారు. సమగ్ర విచారణ చేపట్టేందుకు డీఐజీ వెంకటరామిరెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక అధికారుల బృందం ఆదివారం నంద్యాలకు చేరుకుంది. అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను, వన్టౌన్ పోలీసులను ప్రత్యేక అధికారుల బృందం విచారించనుంది. విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని డీఐజీ వెంకటరామిరెడ్డి తెలిపారు. కాగా, నంద్యాలకు చెందిన అబ్దుల్సలాం, అతని భార్య నూర్జహాన్, కుమారుడు దాదాఖలందర్, కుమార్తె సల్మా ఈ నెల 3వ తేదీన పాణ్యం మండలం కౌలూరు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.పోలీసుల వేధింపుల వల్ల తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అబ్దుల్సలాం కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్ను సీఎం జగన్ ఆదేశించారు. నంద్యాల వన్టౌన్ సీఐ సోమశేఖర్ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. -
సెల్ఫీ వీడియో: అందుకే చనిపోతున్నాం..
నంద్యాల/బొమ్మలసత్రం(కర్నూలు జిల్లా): పోలీసుల వేధింపుల వల్ల తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అబ్దుల్సలాం కుటుంబ సభ్యులు తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది. అబ్దుల్సలాం, అతని భార్య నూర్జహాన్, కుమారుడు దాదాఖలందర్, కుమార్తె సల్మా ఈ నెల 3వ తేదీన పాణ్యం మండలం కౌలూరు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం అప్పట్లో తెలియలేదు. అయితే... తాజాగా వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియోలో అబ్దుల్సలాం, నూర్జహాన్ కన్నీటి పర్యంతమవుతూ పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని వాపోయారు. వెంటాడిన కష్టాలు.. నంద్యాలలోని రోజాకుంటకు చెందిన అబ్దుల్గఫార్, రసూల్బీ దంపతులకు నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు. చిన్నవాడైన అబ్దుల్సలాం పాఠశాలకు వెళ్లేటప్పుడే ఖాళీ సమయంలో పక్కనే ఉన్న బంగారు దుకాణంలో పని చేసేవాడు. తల్లిదండ్రుల మృతి తర్వాత చదువు మానేసి గాందీచౌక్లోని వెంకన్న వర్మకు చెందిన బంగారు దుకాణంలో గుమాస్తాగా చేరాడు. 2004లో మూలసాగరానికి చెందిన నూర్జహాన్ను వివాహం చేసుకున్నాడు. వీరికి సల్మా, దాదాఖలందర్ సంతానం. గుమాస్తా పని చేసుకుంటూనే తనకు తెలిసిన వారితో అగ్రిగోల్డ్ డిపాజిట్లు కట్టించాడు. కంపెనీ బోర్డు తిప్పేయడంతో తన ఇంటిని రూ.10 లక్షలకు విక్రయించి డిపాజిట్దారులకు నగదు చెల్లించాడు. కాగా.. గత ఏడాది నవంబర్ 7న అర్ధరాత్రి అబ్దుల్సలాం పని చేస్తున్న దుకాణంలో దొంగలు చొరబడి కేజీన్నర బంగారాన్ని అపహరించారు. ఈ కేసులో పోలీసులు అబ్దుల్సలాంను నిందితుడిగా చేర్చారు. విచారణ నేపథ్యంలో కర్నూలు సీసీఎస్లో చిత్రహింసలు పెట్టి కేసులు ఒప్పుకొనేలా చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం సలాంను రిమాండ్కు తరలించారు. ఇంట్లో ఉన్న బంధువుల బంగారు ఆభరణాలు దాదాపు 50 తులాలను రికవరీ కింద పోలీసులు తీసుకెళ్లారు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన సలాం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. నూర్జహాన్ పిల్లలు చదువుకునే పాఠశాలలోనే టీచర్గా వెళుతూ భర్తకు చేదోడుగా ఉండేది. కష్టాల నుంచి గట్టెక్కుతున్నామని సంతోషించేలోగానే పోలీసులు మరో చోరీ కేసును తెరపైకి తెచ్చారు. ఈ నెల 2వ తేదీన గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన భాస్కరరెడ్డి.. సలాం ఆటోలో ప్రయాణిస్తుండగా రూ.70 వేల నగదు మిస్సయ్యింది. ఈ విషయంపై పోలీసులు విచారణకు పిలిచారు. సలాంతో పాటు భార్య నూర్జహాన్, అత్త మాబున్నీసా స్టేషన్కు వెళ్లారు. అక్కడ సలాంను, భార్యను పోలీసులు దూషించడమే కాకుండా..మరుసటి రోజు మళ్లీ స్టేషన్కు రావాలని ఆదేశించారు. దీంతో భయపడిపోయిన సలాం ఈ నెల 3న భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు సీసీఎస్ పోలీసుల వేధింపులే కారణమని అబ్దుల్సలాం అత్త మాబున్నీసా అంటున్నారు. -
కుటుంబం ఆత్మహత్యపై విచారణకు సీఎం ఆదేశం
కర్నూలు/నంద్యాల/బొమ్మలసత్రం: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ విచారణకు ఆదేశించారు. అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వ తేదీన కర్నూలు జిల్లా కౌలూరు వద్ద గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన విషయం విదితమే. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సలాం, అతని భార్య నూర్జహాన్ తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా.. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్టౌన్ సీఐ సోమశేఖర్ను సస్పెండ్ చేశారు. పోలీసుల వేధింపులు భరించలేకే.. ఆత్మహత్య చేసుకునే ముందు సలామ్, అతని భార్య నూర్జహాన్ సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆ సెల్ఫోన్ను ఇంట్లో పెట్టారు. కుటుంబ సభ్యులు ఆ ఫోన్ను పరిశీలిస్తున్న క్రమంలో సెల్ఫీ వీడియో శనివారం బయటపడింది. ‘నేనేం తప్పు చేయలేదు సార్. ఆటోలో జరిగిన దొంగతనానికి, నాకు సంబంధం లేదు. అంగట్లో జరిగిన దొంగతనంతో కూడా సంబంధం లేదు. పోలీసుల టార్చర్ భరించలేకున్నా సార్. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మా చావుతోనైనా మనశ్శాంతి కలుగుతుందని భావిస్తున్నా’మంటూ సలాం, నూర్జహాన్ కన్నీటి పర్యంతమవుతూ తమ పరిస్థితిని అందులో వివరించారు. దంపతులిద్దరూ సెల్ఫీ వీడియో తీస్తుండగా.. అభం శుభం తెలియని చిన్నారులు సెల్ఫోన్ వైపు అమాయకంగా చూస్తూ కన్పించడం కంటతడి పెట్టిస్తోంది. తన కుమార్తె, అల్లుడు, మనుమళ్ల ఆత్మహత్యలకు సీసీఎస్ పోలీసులే కారణమని సలాం అత్త మాబున్నీసా అంటున్నారు. తమ అల్లుణ్ణి 8 రోజుల పాటు చితక బాదారని ఆమె ఆరోపించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తే సహించం: హోం మంత్రి సుచరిత గుంటూరు రూరల్: పోలీసులు విధుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి.. పౌరులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని హోం మంత్రి సుచరిత హెచ్చరించారు. శనివారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని హెచ్చరించారు. -
చలి కుంపటే కారణం..!
భువనేశ్వర్/రాజ్గంగపూర్: సుందర్గడ్ జిల్లాలోని రాజ్గంగపూర్ ప్రాంతంలో ఇంటిల్లపాది ఒక్కసారిగా మృతి చెందిన సంఘటన కారణాలు అనుమానస్పదంగా కనిపిస్తున్నాయి. సుందర్గడ్ జిల్లాలోని రాజగంగపూర్ ఐటీ కాలనీ బి/7 నంబరు ఇంటిలో అద్దెకు ఉంటున్న భర్త రంజిత్ ప్రసాద్ (28), భార్య కల్పన ప్రసాద్, ఇద్దరు పిల్లలు కొద్దిరోజుల క్రితం ఇంటిలోనే చనిపోగా ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక జారీకావడంతో సందిగ్ధతకు తెర క్రమంగా తొలగుతోంది. మొదట సంఘటన స్థల పరిసరాల దృష్ట్యా వారిది ఆత్మహత్యగా అంతా భావించారు. కుటుంబీకులంతా విషం తాగి సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వచ్చిన పోస్టుమార్టం నివేదిక ప్రకారం అది విష ప్రయోగం కాదని తేలింది. ఊపిరాడకపోవడంతో వారంతా మరణించినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి గదిలో ఓ చలి కుంపటి ఉన్నట్లు గుర్తించారు. చలి నుంచి ఉపశమనం పొందడం కోసం వారు చలికుంపటి పెట్టుకోగా నిద్రపోయే సమయంలో ఆ కుంపటి సెగకు వారంతా మరణించి ఉంటారని తేలింది. ఇదిలా ఉండగా కిటికీలతో సహా తలుపులు కూడా మూసేయడంతోనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు తదుపరి ఉన్నత పరీక్షలకు సిఫారసు చేయగా ఆ పరీక్షల నివేదిక అందితే కానీ కుటుంబం మరణం వెనక కారణాలు స్పష్టం కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒడిశా -
వీడియో కాల్లో శవాలను చూపించి..
ఘజియాబాద్: ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని కష్టాల సుడిలోకి నెట్టాయి. కన్నతండ్రి తన పిల్లలను చంపేందుకు కారణమయ్యాయి. ఘజియాబాద్లోని ఇందిరాపురంలో కలకలం సృష్టించిన కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు తేల్చారు. ఐదేళ్లుగా నష్టాలే.. గుల్షన్ వాసుదేవ ఉత్తర ఢిల్లీలోని గాంధీనగర్లో గార్మెంట్ బిజినెస్ నడిపిస్తున్నాడు. గత ఐదేళ్లుగా వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నాడు. దీంతో అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబ పోషణ కూడా భారం కాసాగింది. ఈ క్రమంలో గుల్షన్ తన కారుకు ఈఎమ్ఐ కూడా కట్టలేని నిస్సహాయస్థితికి చేరుకున్నాడు. పరిస్థితి ఇలానే కొనసాగితే కుటుంబం అంతా కలిసి చనిపోవడం తప్ప మరోదారి లేదంటూ చిన్ననాటి స్నేహితుడైన అరోరాతో తన గోడు వెల్లబోసుకునేవాడు. తెల్లవారుజామున స్నేహితుడికి మెసేజ్.. గుల్షర్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మిత్రుడు అరోరాకు టెక్స్ట్ మెసేజ్ చేశాడు. అనంతరం కాసేపటికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. శాశ్వతంగా నిద్రపుచ్చిన తన పిల్లలను, గోడపై రాసిన సూసైడ్ నోట్ను చూపించాడు. అందులో వారి చావుకు రాకేశ్ వర్మ కారణమంటూ గోడపై రాతలు కనిపించాయి. అతను ఇచ్చిన బౌన్స్ అయిన చెక్కులు కూడా అక్కడ ఉన్నాయి. కాగా గుల్షన్ అతని బంధువు రాకేశ్ వర్మకు రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చాడు. కానీ అతను ఇచ్చిన చెక్లు బౌన్స్ అయ్యాయి. ఆ తర్వాత అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేయలేకపోయాడు. దీంతో 2015లో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదు చేశారు. కుటుంబం ఆత్మహత్య ఏదారి కనిపించక మరణమే శరణ్యమని భావించిన గుల్షన్ పిల్లలను చంపేసి, భార్యతో కలిసి ఎనిమిదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్లతో పాటు అతని ఆఫీసు ఉద్యోగి సంజన కూడా ఆత్మహత్యకు యత్నించటం విచారకరం. ఆత్మహత్యకు యత్నించి తీవ్రగాయాలపాలై చికిత్స తీసుకుంటున్న సంజనను ముందుగా గుల్షన్ రెండో భార్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, విచారణలో ఆమెను ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగిగా తేల్చారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఘజియాబాద్లో కుటుంబం ఆత్మహత్య) -
కుటుంబం ఆత్మహత్య.. ఆస్పత్రిలో రెండో భార్య!
లక్నో: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటు చేసుకుంది. నిద్రపోతున్న పిల్లలను శాశ్వతంగా నిద్రపుచ్చి అనంతరం తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్లోని ఇందిరాపురమ్లో నివాసముంటున్న ఓ జంట ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం వేకువజామున పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారిని హత్య చేశారు. అనంతరం ఆ జంటతో పాటు మరో మహిళ వారు నివసిస్తున్న అపార్ట్మెంట్లో ఎనిమిదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు సంఘటనా స్థలంలోనే మరణించగా మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయపడిన మహిళను మరణించిన వ్యక్తి రెండో భార్యగా భావిస్తున్నారు. అయితే రెండో భార్య ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందనేది తెలియాల్సి ఉంది. మృతుల ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
శ్రీనవ్య జ్ఞాపకాలు మరువలేక...
చిన్ననాటి నుంచి కష్టాలే జీవితంగా గడిపిన ఆ అభాగ్యునికి భార్య రాక కొత్త జీవితం వచ్చినట్లైంది. భర్తకు ఆమె చేదోడువాదోడుగా ఉంటూ వ్యాపారాభివృద్ధికి తోడ్పాటును అందించింది. వారి అన్యోన్య దాంపత్యంలో చిన్నారి శ్రీయోషితకు జన్మనిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు తీరి సాఫిగా సాగిపోతున్న వారి జీవితాన్ని విధి ఒక్కసారిగా వంచించింది. డెంగీ లక్షణాలతో భార్య మృతి చెందగా అప్పటి నుంచి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తను మరో పెళ్లి చేసుకున్నా తన చిన్నారికి తల్లి ప్రేమ దక్కదని, తాను పడ్డ కష్టాలు తన కుమార్తె పడకూదని భావించాడు. తన భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక, ఆమె జ్ఞాపకాల నుంచి బయటపడలేక, భార్య ముందు వెళ్లిపోయింది తర్వాత మేమిద్దరమంటూ తమ మూడేళ్ల చిన్నారిని కడతేర్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండపేటలో గురువారం సంచలనం కలిగించిన ఈ ఘోరం అందరినీ కలచివేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తను లేని దగ్గర నుంచి నాకు ప్రతి క్షణం నరకంలాగే ఉంది. మా పెళ్లయిన దగ్గర నుంచి తల్లిలా, స్నేహితురాలిలా, భార్యలా అన్ని విషయాల్లో సహకరించేది. ఇప్పుడు ఒకేసారి ఆ ముగ్గురు (తల్లి, స్నేహితుడు, భార్య) దూరం కావడంతో నాకు బతుకు ఎందుకు అనిపిస్తుంది. నాతో ఉన్నది నాలుగేళ్లు కానీ తను రాకముందు నా జీవితంలో ఏం జరిగిందో మర్చిపోయేలా చేసింది. ఇప్పుడు తనతో ఉన్న క్షణాల్లో తప్ప మరేమీ గుర్తుకు రావడం లేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే ఇంకో భార్య వస్తే ఇవన్నీ మర్చిపోయి ఉండవచ్చు అంటారు. కానీ నాకు భార్య వస్తే నా కూతురుకి తల్లి రాదు. నాకు పిల్లలు పుడితే నా కూతురు మరో నవ్యలా తయారవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఈ కఠిన నిర్ణయం. తను ముందు వెళ్లిపోయింది తర్వాత మేమిద్దరం. ఎన్నో చెప్పాలని ఉంది, ఎన్నో పంచుకోవాలని ఉంది. కాని నా ప్రాణానికి ప్రాణం నాతో లేకపోయేసరికి ఏమీ తెలీట్లేదు. ఏమీ అర్ధం కావడం లేదు. నా కోసం కష్టపడిన నా స్నేహితులు అందరికీ నా క్షమాపణలు. అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. – చందు మండపేటలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటనలో కూతురిని కడతేర్చి ఆత్మహత్యకు పాల్పడిన చందు తన సూసైడ్ నోట్లో రాసిన వేదన. సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన బాదం చందనకుమార్ (చందు) తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకోగా పదేళ్ల వయస్సులోనే తన చెల్లెలు పుష్పలతను తీసుకుని చందు మండపేటలోని దగ్గర బంధువుల ఇంటికి వచ్చేశాడు. బంధువుల సహకారంతో చదువు ప్రారంభించారు. కొంతకాలానికి దగ్గరి బంధువు మృతి చెందగా ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ చెల్లెలకి అన్నీ తానయ్యాడు. పెంచి పెద్దిచేసి కోరుకొండ మండలానికి చెందిన యువకునితో వివాహం జరిపించాడు. తాను స్థానిక నాళం వారి వీధిలో ఫ్లెక్సీ ఫ్రింటింగ్ ప్రారంభించి వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు. 2015లో జిల్లాలోని రావులపాలెం శివారు కొమరాజులంకకు చెందిన కంచర్ల శ్రీనవ్యతో వివాహమైంది. పేద కుటుంబానికి చెందిన శ్రీనవ్య తండ్రి చిన్నతనంలో మృతిచెందగా ఆమె దాతల సహకారంతో ఎంటెక్ చదువుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన చందు, పక్కనే చిన్నారి మృతదేహం వ్యాపార నిర్వహణలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపారాభివృద్ధికి తోడ్పాటును అందించేది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా మూడేళ్ల కుమార్తె శ్రీయోషిత ఉంది. చిన్ననాటి నుంచి పడ్డ కష్టాలు మరిచి పోయి ఆనందంగా సాగిపోతోంది. కుటుంబంతో కలిసి పట్టణంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న చందు మండపేట రూరల్లో ఇటీవల సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు స్థలం కొనుగోలు చేసుకున్నాడు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాన్ని డెంగీ జ్వరం అతలాకుతలం చేసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రీనవ్య కన్నుమూసింది. ఆమె ఆశయం మేరకు చందు ఆమె కళ్లను దానం చేశాడు. నాటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న చందు భార్య లేని జీవితం ఊహించుకోలేకపోయాడు. మరో వివాహం చేసుకున్నా తన కుమార్తెకు తల్లి ప్రేమ దక్కదని, చిన్నతనంలో తాము పడ్డ ఇబ్బందులు తన కుమార్తె పడాల్సి వస్తుందని భావించి ఈ ఘెరానికి పాల్పడ్డాడు. నా భార్య వద్దకే మేమిద్దరం వెళ్లిపోతున్నామంటూ లేఖ రాసి తన కుమార్తెను కడతేర్చి, తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో భార్య చీరను ముఖానికి కట్టుకుని మెడకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కోరుకొండలో నివాసముంటున్న సోదరి పుష్పలత ఉదయం నుంచి పలుమార్లు ఫోన్ చేసినా చందు ఫోన్ ఎత్తకపోవడంతో పక్క వ్యాపారికి చెప్పగా అతను ఇంటికి వచ్చి చూసే సరికి ఈ ఘోరం వెలుగుచూసింది. చందు ఉరివేసుకుని ఉండటం, పక్కనే అభంశుభం తెలీని చిన్నారి శ్రీయోíÙత విగతజీవిగా పడి ఉండటం చూపరుల హృదయాలను కలచివేసింది. తమ అన్యోన్య దాంపత్య, తాను పడుతున్న ఆవేదన, తనకు సంబంధించిన స్థలం, వ్యాపారంలోని సామగ్రి, ఎల్ఐసీ ఇన్సూరెన్స్ సొమ్ములు తన తండ్రి, సోదరి, తన భార్య తల్లికి చెందాలనే విషయాలను వివరిస్తూ చందు రాసిన ఆరు పేజీల సూసైడ్ నోట్ను సంఘటన స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందు రాసిన సూసైడ్ నోట్ భార్యకు మాట ఇచ్చినట్టుగానే... నేను ముందు పోతే ఏం చేస్తావు అని తన భార్య అన్నప్పుడు... నీ వెంటే నేను వచ్చేస్తానని చెబితే అలా కాదు కనీసం నా దినం కూడా చేయవా అని అడిగేది. చేశాక రా అనేది. అది సరదాకో నిజంగానో తెలీదు కానీ ఇప్పుడు తనే ముందు వెళ్లిపోయింది. అందుకే తన కోరిక ప్రకారం నా శక్తి మేర ఆమె కార్యక్రమాన్ని పూర్తి చేసి అప్పగించాల్సిన వన్ని అప్పగించేసి నేను తన వద్దకి వెళ్లిపోతున్నానంటూ చందు లేఖలో పేర్కొనడం అందరినీ కలచివేస్తోంది. సచివాలయ ఉద్యోగినిగా... ఇటీవల మృతి చెందిన శ్రీనవ్య సెప్టెంబరులో జరిగిన సచివాలయ ఉద్యోగుల పరీక్షకు హాజరైంది. సెకెండ్ లిస్ట్లో తన భార్య పేరు వచ్చినట్టు బుధవారం చందు చెప్పాడని స్థానికులు అంటున్నారు. తన భార్య జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నానని, మండపేటలో వ్యాపారం మానేసి కుమార్తెను తీసుకుని కోరుకొండలోని తన సోదరి ఇంటికి వెళ్లిపోయి ఏదో పనిచేసుకుంటానని సన్నిహితుల వద్ద చెప్పేవాడని అంటున్నారు. కాగా ఇంతలోనే ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఊహించలేదని స్థానికులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. మండపేట సీఐ నాగ మురళీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: నా భార్య వద్దకే వెళ్లిపోతున్నాం.. -
రైస్ 'కిల్లింగ్'!
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: బియ్యాన్ని ఆకర్షించే మహిమ కలిగిన అద్భుత యంత్రం ఇంట్లో ఉంటే మహర్దశ పడుతుందనే మూఢ నమ్మకం నిండు కుటుంబాలను బలి తీసుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్ పెన్మెత్స రామకృష్ణంరాజు కుటుంబ ఆత్మహత్యకు రైస్ పుల్లర్ మోసమే కారణమని పోలీసులు నిర్ధారించారు. రైస్ పుల్లర్ పేరుతో రూ.5 కోట్లు కాజేసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన వరికూటి వెంకట వేణుధరప్రసాద్ను అరెస్టు చేసినట్లు అమలాపురం పోలీసులు మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్లో ఉంటున్న ప్రసాద్ మరో ముగ్గురితో కలసి ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు రామకృష్ణంరాజు నుంచి రూ.5 కోట్లకుపైగా వసూలు చేశాడు. అప్పుల పాలైన రామకృష్ణంరాజు (55), భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు డాక్టర్ కృష్ణసందీప్ (25) నాలుగు రోజుల క్రితం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడటం తెలిసిందే. అతీత శక్తుల పేరుతో మోసాలు.. బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహాన్ని రైస్ పుల్లర్గా పరిగణిస్తారు. అత్యంత అరుదైన, ఖరీదైన ఇరీడియం లోహాన్ని కలిగి వుండే వీటిని చూపించి మోసగిస్తున్నారు. అతీత శక్తుల పేరుతో వీటిని విక్రయించడం భారతీయ శిక్షాస్మృతి 415, 420 ప్రకారం నేరం. తేలికగా డబ్బులు సంపాదించేందుకు కొందరు ముఠాలుగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో రేడియేషన్ ఆర్టికల్ అమ్మకాలతో మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి దివ్య శక్తులు ఉంటాయని, ఇది ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని నమ్మించి మోసగిస్తున్నారు. రాగి లోహంతో చేసిన గ్లాసులు, గిన్నెలు, బిందెలు, మూతలు, విగ్రహాలు, నగలు, పాతకాలం నాణేలు లాంటివి రైస్ పుల్లర్ పరికరాలుగా చలామణి అవుతున్నాయి. నల్ల పసుపు, ఎర్ర ఉల్లిపాయ, ఎర్ర కలబంద లాంటి మొక్కల్లో కూడా రైస్ పుల్లర్ లక్షణాలున్నాయని నమ్మబలుకుతున్న ముఠాలు కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్న ఏడుగురితో కూడిన ముఠాను ఈ ఏడాది జూలైలో మచిలీపట్నం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసగిస్తున్న ముఠాను ఇటీవల తిరువనంతపురంలో అరెస్టు చేశారు. రైస్ పుల్లింగ్ అంటే...? రైస్ అంటే బియ్యం... పుల్లింగ్ అంటే లాక్కోవడం. సాధారణంగా ఓ వస్తువుకు కొద్ది గంటలపాటు అయస్కాంతాన్ని రాపిడి చేస్తే కొద్దిసేపు ఆకర్షణ గుణాన్ని పొందుతుంది. రైస్ పుల్లింగ్లో దీన్ని అద్భుత శక్తిగా నమ్మిస్తారు. పురాతన లోహ విగ్రహాలు, పాత్రలు, నాణేలను రైస్ పుల్లింగ్ ముఠా తమ మోసాలకు ముడి సరుకుగా వాడుతుంది. వీటికి అయస్కాంతాన్ని రుద్దడం ద్వారా బియ్యపు గింజలను ఆకర్షించి ప్రజలను మోసగిస్తున్నారు. పురాతన వస్తువుల పేరుతో రూ.కోట్లు కాజేస్తున్నారు. -
డాక్టర్ కుటుంబం ఆత్మహత్యకు ఈ ముఠానే కారణం!
సాక్షి, అమలాపురం(తూర్పు గోదావరి) : అమలాపురంలో డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్యహత్య చేసుకున్న ఘటనలో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చేస్తున్న దర్యాప్తులో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా నలుగురు వ్యక్తులతో కూడిన ఈ ముఠా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని ఈ రైసు పుల్లింగ్ ఊబిలోకి లాగి రూ.కోట్లు కాజేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలో సభ్యుడైన కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన వరికూటి వెంకటవేణుధర ప్రసాద్ను అమలాపురం పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజే అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా ఆదేశాలతో నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ముఠా సభ్యుడైన వేణుధర ప్రసాద్ను అమలాపురం బస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టణ సీఐ బి.సురేష్బాబు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ ముఠా సూత్ర, పాత్రధారి అయిన హైదరాబాద్కు చెందిన షావలిన్, ముఠాలోని మిగిలిన సభ్యులు అనంతరామ్, శ్రీనివాసరావులను అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ బాషా తెలిపారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్రంలో తమ పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని చెప్పారు. మన రాష్ట్రంలోనూ వీరి కోసం పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. డాక్టర్ కుటుంబం నుంచి రూ.ఐదు కోట్లు గుంజుకున్న ముఠా ముఠా సభ్యుడైన వెంకట వేణుధర ప్రసాద్ను అరెస్ట్ అనంతరం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ బాషా మంగళవారం ఉదయం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అమలాపురం పట్టణ, రూరల్, ముమ్మిడివరం సీఐలు బి.సురేష్బాబు, ఆర్.భీమరాజు, రాజశేఖర్లతో కలిసి ముఠా వివరాలను వెల్లడించారు. ఏడాది నుంచి డాక్టర్ రామకృష్ణంరాజు ఈ ముఠా మాయమాటల్లో పడినట్టు చెప్పారు. తొలుత వేణుధరప్రసాద్ డాక్టర్కు పరిచయమై రైస్ పుల్లింగ్ ఆశ పుట్టించాడు. తర్వాత డాక్టర్ను హైదరాబాద్లోని ప్రధాన నిందితుడు షావలిన్కు పరిచయం చేశాడు. దైవాంశ సంభూతమైన పురాతన విగ్రహాలు, నాణేలు, పాత్రల గురించి డాక్టర్కు వివరించి వాటి వల్ల రుణ విముక్తి కావడమే కాకుండా అష్టైశ్వర్యాలు ఎలా ప్రాప్తిస్తాయో తన ముఠాలోని సభ్యులతో ఆయనకు చెప్పించి నమ్మించాడు. రైస్పుల్లింగ్లో ఇవ్వబోయే పురాతన వస్తువు విలువ రూ.కోట్లలో ఉంటుందని మానసికంగా సిద్ధం చేశారు. మీ కోసం రైస్ పుల్లింగ్ వస్తువు తయారవుతోందని డాక్టర్ కుటుంబం నుంచి ముఠా దఫదఫాలుగా నగదు రూపంలో, బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంది. ఇందు కోసం డాక్టర్ అధిక మొత్తాలను అధిక వడ్డీలకు అప్పు చేసి రూ.ఐదు కోట్లు ముఠాకు అతికష్టంగా సరిపెట్టారు. చివరకు ఈ ముఠా చేసిన మోసాలకు బలి అయ్యానని డాక్టర్ కుటుంబం గ్రహించి ఇటీవల హైదరాబాద్ వెళ్లి రెండు వారాలు ఉండి పొగొట్టుకున్న రూ.ఐదు కోట్లను ఏలాగైనా రాబట్టుకోవాలని విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఇంతటి ఘోరమైన మోసానికి గురైన డాక్టర్ కుటుంబం చివరకు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు ఒడిగట్టిందని డీఎస్పీ బాషా తెలిపారు. డాక్టర్ పెద్ద కుమారుడు, మృతుడు డాక్టర్ కృష్ణ సందీప్ సూసైడ్ నోట్, డాక్టర్ చిన్న కుమారుడు కృష్ణ వంశీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ ఆదేశాల మేరకు రైస్ పుల్లింగ్ మోసాలు, ముఠాపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు. -
డాక్టర్ ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్
-
ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో...!
సాక్షి, సింహాచలం/పెందుర్తి: తొలి సంతానం ఆడబిడ్డ.. లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిందని సంబరపడింది ఆ తల్లి.. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ ముద్దులొలికే మాటల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది.. ఆ చిన్నారికి మరెన్నో కబుర్లు చెబుతూ గోరుముద్దలు తినిపిద్దామని ఆశపడింది.. కానీ విధి మరోలా తలచింది.. ఆ బిడ్డకు మాట రాలేదు.. మాటలు వినపడలేదు.. ఆడబిడ్డ జన్మించిన మూడేళ్లకు మగబిడ్డ రూపంలో మరో సంతానం.. ఈ సారీ అదే ఆశ.. అంతకు మించిన ఆత్రుత.. చిట్టచివరకు అదే వేదన.. ఇద్దరి బిడ్డల పండంటి భవిష్యత్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లి పూజ చేయని అమ్మవారు లేదు.. మొక్కని దేవత లేదు.. కానీ ఏ ‘తల్లీ’ కరుణించలేదు.. బలీయమైన విధి చేతిలో ఈ ‘అమ్మ’ ఓడిపోయింది. పిల్లల భవిష్యత్పై పూర్తిగా ఆశలు వదులుకున్న ఆ మాతృమూర్తి వారి గొంతులో గరళం పోసింది.. తానూ ఆ కాలకూటాన్ని మింగేసి తనువు చాలించింది.. సింహాచలం సమీపంలోని గొల్లనారాయణపురంలో పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. విగతజీవులుగా పడి ఉన్న తల్లీ బిడ్డలు బురకాయల అరుణ(30), రమ్యశ్రీ(9), మహేష్(6)ను చూసి కంటతడి పెట్టనివారు లేరు. ఓ వైపు పిల్లల వైకల్యం.. మరోవైపు ఆర్థిక భారం ఈ పెను విషాదానికి కారణమయ్యాయి. ఉన్నంతలో జీవనం సాగిస్తున్న సమయంలో భార్య పిల్లలు శాశ్వతంగా దూరం కావడంతో అరుణ భర్త సత్యనారాయణ తల్లడిల్లిపోతున్నాడు. అమ్మ సన్నిధిలోనే అనంతలోకాలకు ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం సమీపంలో ఉన్న గొల్లనారాయణపురంలో చోటుచేసుకుంది. పెందుర్తి సీఐ వెంకునాయుడు, స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామానికి చెందిన బురకాయల సత్యనారాయణ, అరుణ (30) దంపతులు గత ఆరేళ్లుగా గొల్లనారాయణపురంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సత్యనారాయణ శ్రీకాకుళంలోని అరబిందో ఫార్మసీలో పనిచేస్తూ వారానికి ఒకటి రెండుసార్లు గొల్లనారాయణపురంలోని ఇంటికి వస్తుంటాడు. వీరికి రమ్యశ్రీ (9), మహేష్ (6) అనే పిల్లలున్నారు. పిల్లలు ఇద్దరికీ పుట్టుక నుంచే మూగ, చెవుడు కావడంతో తల్లి నిత్యం మదనపడేది. రోజూ చుట్టుపక్కల వారితో పిల్లల పరిస్థితిని చెప్పుకుని బాధపడేది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో మెరుగైన వైద్యం చేసే పరిస్థితి లేకపోవడంతో కుమిలిపోయేది. ఉన్నంతలో అప్పుడప్పుడు వైద్యులకు చూపించినా ఫలితం ఉండేది కాదు. కాస్త దైవభక్తి ఎక్కువ ఉన్న అరుణ తన పిల్లలు బాగుపడాలని నిత్యం దేవతలను పూజిస్తుండేది. స్థానికంగా ఉన్న నూకాంబిక ఆలయంలో అమ్మవారికి సేవలు చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ దగ్గరైంది. భర్త సత్యనారాయణని విచారిస్తున్న పెందుర్తి సీఐ వెంకునాయుడు ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భర్త సత్యనారాయణ ఫోన్ చేసి ఉదయం ఇంటికి వస్తున్నట్టు అరుణకి చెప్పాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో శ్రీకాకుళం నుంచి సత్యనారాయణ ఇంటికి రాగా అరుణ, పిల్లలు ఇంట్లో కనిపించలేదు. ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో చుట్టుపక్కల ఇళ్ల వద్ద వెతికాడు. ఆలయానికి వెళ్లిందేమోనని పలువురు చెప్పగా సత్యనారాయణ ఆలయం వద్దకు వెళ్లాడు. ఆలయం వెనుక ప్రాంగణంలో నిర్జీవ స్థితిలో పడి ఉన్న భార్య, పిల్లలను చూసి షాకయ్యాడు. అప్పటికే అరుణ పిల్లలకి విషం ఇచ్చి తానూ తాగి మృతి చెందింది. దీంతో సత్యనారాయణ స్థానికులకు, పెందుర్తి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి సీఐ వెంకునాయుడు సత్యనారాయణ, స్థానికులను విచారించారు. పిల్లలిద్దరూ మూగ, చెవుడు కావడంతో అరుణ మానసికంగా బాధపడుతుండేదని, ఆర్థిక పరిస్థితులు కూడా కారణం కావచ్చని స్థానికులు చెప్పినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. అరుణ పిల్లలతో సహా మృతి చెందిందని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు తరలివచ్చారు. ఎప్పుడూ పిల్లల గురించే మాట్లాడేదని, పిల్లలకు చెవుడు, మూగ కావడంతో ఎప్పటికైనా అమ్మవారు కరుణిస్తుందని చెప్పేదని పలువురు మహిళలు కంటతడి పెట్టారు. భార్య సహా పిల్లలు కూడా ఒకేసారి మృత్యుఒడికి చేరుకోవడంతో సత్యనారాయణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
కాటేసిన అప్పులు
-
మూకుమ్మడిగా విషం తాగిన కుటుంబం
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు వారిని సొంతూరి నుంచి గరివిడికి తరిమాయి. అక్కడి నుంచి సింహాచలానికి తరిమికొట్టి ఉసురు తీసుకునేలా చేశాయి. విజయనగరం జిల్లా బాడంగి మండలానికి చెందిన సింహాద్రి ఈశ్వరరావు, తన భార్యాకుమార్తెలతో కలిసి రెండున్నరేళ్ల క్రితం బతుకు తెరువు కోసం గరివిడి మండలం కొండపాలెం వచ్చాడు. అక్కడా పూట గడవని స్థితిలో సింహాచలం వచ్చి శనివారం రాత్రి కుటుంబమంతా విషం తాగి బలవన్మరణానికి ఒడిగట్టారు. వీరిలో తండ్రి, కూతురు మరణించగా.. తల్లి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడి కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. సాక్షి, ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : ఓ చిన్ని కుటుంబాన్ని అప్పులు కాటేశాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ ఇంటి పెద్దతోపాటు భార్య, కుమార్తె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో తండ్రీ కుమార్తె చనిపోయారు. తల్లి ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. హృదయవిదారకరమైన ఈ ఘటన సింహాచలం ఆర్టీసీ బస్టాండ్లో చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా, గరివిడి మండలం, కొండపాలెం గ్రామం అటుకా కాలనీకి చెందిన దంపతులు సింహాద్రి ఈశ్వరరావు(46), చంద్రకళ(39), తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె చాందిని (13) శనివారం సింహగిరిపై వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు దిగారు. కొంత సమయం గడిచిన తరువాత సాయంత్రం కూల్డ్రింక్లో తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు కలుపుకుని తాగారు. అయితే తండ్రీ, కుమార్తె పూర్తిగా తాగేయగా చంద్రకళ దుర్వాసన భరించలేక విడిచిపెట్టేసింది. కొద్దిసేపటికి స్పృహతప్పి పడి ఉన్న వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపట్నం సీఐ రమణయ్య వెంటనే ఆ కుటుంబ సభ్యులను 108లో కేజీహెచ్కు తరలించారు. మార్గమధ్యలో ఈశ్వరరావు, చాందిని మరణించారు. వారి మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. చంద్రకళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె షాక్లో ఉందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అప్పల బాధలు తాళలేక పురుగుల మందు తాగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఉపాధి కోసం వలస బాట గరివిడి(చీపురుపల్లి): బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన ఈశ్వరరావు నాలుగేళ్ల కిందట ఉపాధి కోసం గరివిడి మండలం తాటిగూడ గ్రామానికి వలసవచ్చాడు. అనంతరం రెండేళ్ల తర్వాత కొండపాలెం పంచాయితీ హడ్కోకాలనీకి వలస వచ్చేశాడు. అతనికి భార్య చంద్రకళ, కుమారుడు సాయికృష్ణ(20), కుమార్తె చాందిని ఉన్నారు. గతంలో తాటిగూడ గ్రామంలో రంగు రాళ్ల ఉంగరాలు తయారు చేసేవాడు. ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంవతో కొండపాలెం పంచాయతీ హడ్కోకాలనీకి నివాసం మార్చుకున్నారు. బంగారం, వెండి వస్తువులు తయారు చేస్తూ కొండపాలెంలోని సూర్యసధనమ్ కోవెలలో పనిచేసేవాడు. కుమార్తె చాందిని స్థానిక హైస్కూల్లో 9వ తరగతి, కుమారుడు సాయికృష్ణ విజయనగరంలోని ఎంఆర్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కుమార్తె, భార్యను తీసుకుని సింహాచలం వెళ్లిన ఈశ్వరరావు అక్కడ ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకునేంతగా అప్పులు ఏమున్నాయో తమకు తెలియని స్థానికులు చెబుతున్నారు. -
ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు
కర్ణాటక, బనశంకరి : చిన్నపాటి కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హెబ్బాల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... మనోరాయనపాళ్యకు చెందిన పుష్పవతి (30)తో ఎంబెసీ గ్రూప్ కంపెనీలో కారుడ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న నాగరాజ్ను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. అనంతరం దంపతులు ఇక్కడి మనోరాయనపాళ్యలో అద్దె ఇంటిలో ఉంటున్నారు. వీరికి ఎనిమిదేళ్లు వయసు గల జీవన్, ఐదునెలల ఆడపిల్ల సంతానం. కుటుంబ విషయంలో దంపతులిద్దరూ అప్పుడప్పుడు గొడవపడేవారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో భర్త విధులకు వెళ్లిన సమయంలో మూడవ తరగతి చదువుతున్న జీవన్, ఐదునెలల పసికందుకు విషం కలిపిన భోజనం తినిపించి హత్య చేసింది. అనంతరం పుష్పవతి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు జీవితంపై విరక్తితో పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డానని తన చావు కు నేనే కారణమని అని లేఖ రాసింది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని మంగళవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్న నాగరాజ్ ఇంటి తలుపు పలుమార్లు తట్టిన స్పందన రాకపోవడంతో భయపడి తలుపులు బద్దలు కొట్టిచూడగా ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను విక్టోరియా ఆస్పత్రికి తరించారు. -
ఇద్దరు పిల్లలు సహా దంపతులు ఆత్మహత్య
-
భార్య, కుమార్తె సహా వ్యక్తి ఆత్మహత్య
అన్నానగర్: తిరుచ్చి సెందన్నీర్పురంలో బుధవారం భార్య, కుమార్తె సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతను రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి సెందన్నీర్పురం పారి వీధిలో ఓ ఇంటి మొదటి అంతస్థులో అద్దెకున్న బాల సహాయరాజ్ (43) ఆటో డ్రైవర్. ఇతని భార్య యువరాణి(40), కుమార్తె ముత్తులక్ష్మి (25). ముత్తులక్ష్మి నర్సింగ్ చదువుతోంది. వీరి ఇల్లు రెండు రోజులుగా మూసివేసి ఉంది. ఈ స్థితిలో ఆ ఇంటి యజమాని విజయలక్ష్మి అద్దె నిమిత్తం బాల సహాయరాజ్ ఫోన్కి కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానంతో విజయలక్ష్మి బుధవారం రాత్రి 7 గంటల సమయంలో నేరుగా మొదటి అంతస్థుకు వెళ్లింది. అక్కడ దుర్వాసన రావడంతో కిటికీలో లోపలికి చూడగా బాల సహాయరాజ్ ఒంటరిగా, యువరాణి, ముత్తులక్ష్మి ఒకే చీరకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దిగ్భ్రాంతి చెందిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పొన్మలై సహాయ పోలీసు కమిషనర్ బాలమురుగన్, సీఐ కావేరి అక్కడికి వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. కుళ్లిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఇంట్లో తనిఖీ చేయగా బాలసహాయరాజ్ రాసిన ఓ లేఖ లభించింది. అందులో ‘మా చావుకు ఎవరూ కారణం కాదని, యువరాణి అక్క సుశీల వద్ద తీసుకున్న రూ.50 వేల నగదు కోసం నా ఆటోని అమ్మి అప్పు తీర్చండి’ అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పొన్మలై పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
కుటుంబం సహా ఉపాధ్యాయుడు ఆత్మహత్య
చెన్నై ,టీ.నగర్: కోయంబత్తూరులో నలుగురు కుటుంబ సభ్యులతో పాటూ ఉపాధ్యాయుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి సూసైడ్నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. కోయంబత్తూరు కరుమత్తంబట్టి అమలినగర్కు చెందిన అంతోని ఆరోగ్యదాస్ (37) ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. అతనికి భార్య శోభన (30), కుమారుడు రితిక్ మైకేల్ (7), కుమార్తె రియా ఏంజలిన్ (1), తల్లి భువనేశ్వరి(65)తో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శనివారం చాలా సేపయినప్పటికీ ఇతని ఇంటి తలుపులు తెరుచుకోనందున ఇంటి యజమాని సాయంత్రం తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. పడక గదిలో అంతోని ఆరోగ్యదాస్ ఉరేసుకుని మృతిచెంది కనిపించాడు. పక్కన భార్య, తల్లి, పిల్లలు విషం సేవించిన స్థితిలో మృతదేహాలుగా పడిఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసు ఎస్పీ పాండ్యరాజన్, డీఎస్పీ భాస్కరన్ పోలీసులతో అక్కడికి చేరుకుని ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. సూసైడ్నోట్ లభ్యం ఆరోగ్యదాస్ ఇంట్లో తనిఖీ చేయగా సూసైడ్నోట్ లభించింది. అందులో.. తమ మృతికి ఎవరూ కారణం కాదని, తాను 12 ఏళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నానని, ఎన్ని మందులు వాడినా నయం కాలేదని తెలిపాడు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయానని, రుణాలు ఇచ్చినవారు తమను క్షమించాలని వేడుకున్నాడు. తనకు గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. అలాగే, అత్తమామలకు వేరొక లేఖ రాశాడు. అందులో తాను, కుటుంబాన్ని విడిచి వెళ్లలేకున్నానని, అందుకే భార్య పిల్లలను వెంట తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా ఐదుగురి మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
పాపం ఏ కష్టం వచ్చిందో.. కుటుంబం మొత్తం
బెంగళూరు : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయిన సంఘటన కర్ణాటకలోని కొప్పాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. భర్త, భార్య, వారి నలుగురు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. మరణించిన వారిని శేఖరయ్య బీద్నల్(42), అతడి భార్య జయమ్మ(39), కుమార్తెలు.. బసమ్మ(23), గౌరమ్మ(20), సావిత్రి (18), పార్వతి (16)లుగా గుర్తించారు. మొదటి ఇద్దరు కుమార్తెలకు వివాహాలైనట్లు సమాచారం. శేఖరయ్య ముందుగా తన భార్య, నలుగురు కుమార్తెలకు విషం ఇచ్చి తర్వాత అతడు ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని మరణించినట్లు భావిస్తున్నారు. పంటలు పండకపోవడం వల్ల బ్యాంకు రుణాలతో కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడలో విషాదం.. మూకుమ్మడి ఆత్మహత్యలు
-
విజయవాడలో విషాదం.. మూకుమ్మడి ఆత్మహత్యలు
సాక్షి, విజయవాడ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవటంతో కలకలం రేగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయవేలూరుకి చెందిన క్యాబ్ డ్రైవర్ ధనశేఖర్ భార్య జయంతి(29), కుమార్తె శ్రీలక్ష్మీ(3), పెదనాన్న గోపాల కృష్ణన్(65)లు గురువారం విజయవాడలో రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. గత నెల 27న తన ఇద్దరు కుమార్తెలతో పాటు తాతయ్య వరుసైన గోపాల కృష్ణన్తో జయంతి వేలాంగని మాత గుడికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. జయంతి పెద్ద కూతురు మహాలక్ష్మి(6) వేలాంగని మాత ఆలయంలోని అతిధి గృహంలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కాగా జయంతి భర్త, ఇతర కుటుంబసభ్యులు గోపాలకృష్టన్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
తల్లిపై నిందలకు మనస్తాపం.. కుటుంబం ఆత్మహత్య
అనంతపురం, బత్తలపల్లి : ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కుమారుడి బలవన్మరణంతో మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు కూతురుతో కలిసి పురుగుమందు తాగి అర్ధంతరంగా తనువుచాలించాలనుకున్నారు. వీరిలో తండ్రీ కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బత్తలపల్లి మండలం జలాలపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, శిరీష దంపతులు. వీరికి కుమారుడు ఉమేష్చంద్ర (11), కూతురు కీర్తన ఉన్నారు. శ్రీనివాసులు వెలుగులో పని చేస్తూ శిక్షణ ఇచ్చేందు కోసం ఇతర రాష్ట్రాలలో పర్యటిస్తుంటాడు. శిరీష ఆశా వర్కర్. కుమారుడు బత్తలపల్లిలోని ప్రయివేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కుమార్తె కీర్తన తనకల్లు రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. తల్లిపై నిందలకు మనస్తాపం.. ఆశావర్కర్ విధుల్లో భాగంగా శిరీష ఇంటింటికీ తిరుగుతుండటం వల్ల స్థానికులు మాట్లాడే మాటలకు కుమారుడు ఉమేష్చంద్ర మనస్తాపం చెందాడు. సోమవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉమేష్చంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న శ్రీనివాసులు వెంటనే మధ్యప్రదేశ్ నుంచి స్వగ్రామానికి చేరుకుని కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేశాడు. కుమారుడి లేని జీవితం వద్దని.. గురువారం రాత్రి ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో శ్రీనివాసులు, శిరీష దంపతులతో పాటు కుమార్తె కీర్తన పురుగుమందు తాగారు. అంతకు ముందే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని శ్రీనివాసులు వెలుగు కార్యాలయం అధికారికి వాట్సప్ ద్వారా మెసేజ్ పంపాడు. వెంటనే ఆయన బత్తలపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఎస్ఐ గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని ముగ్గురినీ ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శిరీషను అనంతపురం ఆస్పత్రికి పంపారు. శ్రీనివాసులు, కీర్తనల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ లేఖ ఏమైంది..? ఆత్మహత్యాయత్నానికి కారుకైలన వారి పేర్లను సూచిస్తూ శ్రీనివాసులు లేఖ రాసినట్లు బంధువులు తెలిపారు. అయితే ఆ లేఖ ఎవరి వద్ద ఉందనేది తెలియడం లేదు. పోలీసులు కూడా ఇంతవరకూ ఆ లేఖను స్వాధీనం చేసుకోలేదు. ఆ లేఖ దొరికితే ఎవరెవరి పేర్లు ఉన్నాయి.. ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనేది తెలిసే అవకాశం ఉంది. -
ఒక మరణం.. రెండు ఆత్మహత్యలు
యశవంతపుర: ఒక మరణం.. రెండు ఆత్మహత్యల్ని ప్రేరేపించింది. అనారోగ్యంతో భర్త మృతిని తట్టుకోలేక భార్య, తల్లీ ఆత్యహత్య చేసుకున్న ఘటన బెంగళూరులోని యశవంతపుర పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముత్యాలనగరలో శేషశయన అలియాస్ శేషపాణి (44) అనే టైలర్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆయనతో పాటు భార్య ఉషానందిని (42), శేషపాణి తల్లి సుధా అలియాస్ లక్ష్మీదేవి (65)లు ఉంటున్నారు. వీరు చాలా ఏళ్ల కిందటే ఏపీ నుంచి వచ్చి స్థిరపడ్డారు. కుటుంబానికి ఆయనే ఆధారం. టైలరింగ్ ద్వారా వచ్చే డబ్బుతో కుటుంబం గడిచేది. అయితే తీవ్ర ఆనార్యోగంతో బాధపడుతున్న శేషపాణి అనేక ఆస్పత్రులలో చికిత్సలు పొందుతూ నాలుగు రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిసింది. ఆయన మృతిని భార్య, తల్లి బంధువులకు ఎవరికీ చెప్పకుండా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఉన్న ఆధారం పోయాడు, తమ జీవితమెలా అనే బాధను తట్టుకోలేక భార్య, తల్లి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. దుర్వాసనతో స్థానికుల ఫిర్యాదుల శనివారం రాత్రి ఇంట్లో నుండి దుర్వాసన రావటంతో చుట్టుపక్కలవారు యశవంతపుర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తాళం బద్ధలుకొట్టి చూడగా కుళ్లిన స్థితిలో ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. శేషపాణి ఆనారోగ్యంతో మరణించడంతో విరక్తి కలిగి భార్య, తల్లీ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వీరి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. కుళ్లిన మృతదేహలను బయటకు తీయటానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. పోస్టుమార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. యశవంతపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కడలి తీరంలో కన్నీటి ఉప్పెన
మూడేళ్ల దాంపత్యంలో ఆప్యాయతల నవ్వులేగానీ.. ఏ రోజూఅపార్థపు అరుపులు వినబడలేదు. అనురాగపు మాటలేగానీ.. అప్పుల కుంపట్లు రగల్లేదు. ముద్దులొలికే బాబు రాకతో మురిపెం రెట్టింపయ్యిందేగానీ.. వివాదాల ముసురు కమ్ముకోలేదు. ఇలాంటి అన్యోన్య కుటుంబంపై విధి విషం చిమ్మింది. మృత్యువు ముంచుకొచ్చిందో, క్షణికావేశమే కాలనాగై కాటు వేసిందో తెలీదుగానీ కొడుకుసహా దంపతులిద్దరినీ బలి తీసుకుంది. మూల స్తంభమైన భర్త ఆయువు ఉరికొయ్యకు వేలాడింది. ఇంటి దీపమైన జ్యోతి జీవితం మృత్యు చీకట్లలో కలిసిపోయింది. ధ్రువతారగా ప్రకాశిస్తాడనుకున్న బిడ్డ నూరేళ్ల జీవితం ఏడాదిన్నరకే ముగిసిపోయింది. మచిలీపట్నం కడలి తీరాన మంగళవారం జరిగిన ఈ విషాద ఘటన ప్రతి హృదయంలో కన్నీటి ఉప్పెనై ద్రవించింది. కృష్ణా జిల్లా, కోనేరు సెంటర్ (మచిలీపట్నం): ఓ ధాన్యం వ్యాపారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మంగళవారం చోటు చేసుకుంది. బందర్ డీఎస్పీ మహబూబ్బాషా కథనం ప్రకారం.. మచిలీపట్నం రాజుపేటకు చెందిన పద్మనాభుని సుధీర్ (30) స్థానికంగా తన తండ్రి నాగేశ్వరరావుతో కలిసి ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. అతనికి మూడేళ్ల క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన జ్యోతితో వివాహమైంది. ఈ దంపతులకు ఏడాదిన్నర కుమారుడు ధృవ ఉన్నాడు. తల్లిదండ్రులు కింది పోర్షన్లో ఉంటుండగా సుధీర్ రెండో అంతస్తులో నివసిస్తున్నాడు. మంగళవారం సుధీర్ ఎంతకీ కనిపించకపోవడంతో తండ్రి నాగేశ్వరరావు పై అంతస్తులోకి వెళ్లి తలుపుతట్టినా స్పందన రాలేదు. దీంతో అనుమానమొచ్చిన ఆయన కిటికీ అద్దాలు పగులగొట్టి లోనికి చూడగా సుధీర్ ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. నాగేశ్వరరావు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా పక్క గదిలో సుధీర్ భార్య జ్యోతి, కుమారుడు ధృవ నిర్జీవంగా కనిపించారు. దీంతో నాగేశ్వరరావు తన మిగిలిన ముగ్గురు కుమారులతోపాటు బంధువులకు విషయం చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బందర్ డీఎస్పీ మహబూబ్బాషా, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆకుల రఘు, ఇనగుదురుపేట సీఐ ఎస్కే నబీ, ఎస్ఐ కుమార్, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఇంట్లో వేలిముద్రలు సేకరించారు. జ్యోతి తండ్రి తంగిశెట్టి సుబ్బారావు ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బందర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎస్పీ మహబూబ్బాషా మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. -
ఆ వార్తను పదే పదే చూసి...
న్యూస్ ఛానెళ్లలో ప్రసారం అవుతున్న ఒకే వార్తను పదే పదే చూసిన ఓ వ్యక్తి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే డిప్రెషన్లోకి వెళ్లిపోగా.. ఆ కథనాలు అతనిపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఆ పెద్దాయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్య ఘటనల ఉదంతం కేసులో దర్యాప్తు కొనసాగుతున్న విషయం విదితమే. ఇదిలా ఉంటే గోరెగావ్కు చెందిన 63 ఏళ్ల కృష్ణశెట్టి అనే వ్యక్తి మూడేళ్ల క్రితం వ్యాపారంలో భారీగా నష్టాలు రావటంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఇంటికే పరిమితమైన ఆయన.. బురారీ ఫ్యామిలీ సూసైడ్ కథనాలను టీవీలో రెప్పవేయకుండా చూస్తూ వస్తున్నాడు. వద్దని భార్య, కూతురు ఎంత వారించినా కృష్ణ పట్టించుకోలేదు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనై శుక్రవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ఆ కుటుంబం(భాటియా ఫ్యామిలీ) చేసింది నిజంగానే సాహసం. చావటానికి చాలా ధైర్యం కావాలి’ అని తరచూ తమతో చెప్పేవాడని కృష్ణ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన శుభంగి పారేకర్ అనే మానసిక వైద్యుడు ఇలాంటి కథనాల విషయంలో సున్నితత్వం పాటించాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సంచలన కేసులో కీలక మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సంచలనం రేపిన కుటుంబం ఆత్మహత్యల కేసు కీలక మలుపు తిరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. తాంత్రిక పూజల వెనుక ఆ మహిళ హస్తం ఉందన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. తండ్రి తమను కాపాడతాడని భాటియా కుటుంబం నమ్మేది. ఓ కప్పులో నీళ్లు ఉంచితే.. అది రంగు మారగానే నాన్న వచ్చి కాపాడతాడని బురారీ ఏరియాకి చెందిన లలిత్ భాటియా(45) తన కుటుంబాన్ని నమ్మించాడు. ఈ క్రమంలో తాంత్రిక పూజలు చేసిన అనంతరం కుటుంబం మొత్తం గత ఆదివారం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయితే ‘గీతా మా’ అనే మహిళ వీళ్లను తాంత్రిక పూజల దిశగా నడిపించినట్లు అనుమానాలున్నాయి. మరోవైపు కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రధాన ద్వారం తెరిచి ఉండటంతో పూజలు చేసిన వ్యక్తి ఆ మార్గం గుండానే వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి 12వ వ్యక్తి మిస్టరీ చేధించే క్రమంలో గీతా మాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించి ఓ డైరీని సేకరించిన పోలీసులు, దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరీ గీతా మా...? లలిత్ భాటియా కుటుంబానికి, పోలీసులు అదుపులోకి తీసుకున్న గీతా మాకు సంబంధం ఉంది. భాటియా కుటుంబం ఉంటున్న ఇంటిని ఓ కాంట్రాక్టర్ నిర్మించారు. ఆ కాంట్రాక్టర్ కూతురే గీతా మా కావడం గమనార్హం. ఆమెకు లలిత్ భాటియాకు సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. ఏదైన కారణంతో భాటియా కుటుంబం తమకు తామే బలవన్మరణానికి పాల్పడేలా చేసి ఉండొచ్చునేమోనని గీతా మాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత కథనాలు 11 మంది మరణం: అతడే సూత్రధారి బురారీ కేసులో 12వ వ్యక్తి?? తండ్రి కాపాడుతాడని... -
బురారీ కేసు: ఇంటిని ఆలయంగా మార్చండి!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల కేసు విషయంలో స్థానికులు ఓ కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. గత ఆదివారం 11 మంది మూకమ్మడిగా బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికులు భయంతో చచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆ చుట్టుపక్కల్లో నివసించే చాలా మంది ఇతర ప్రదేశాలకు తరలి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. మరి దర్యాప్తు తర్వాత ఆ ఇంటిని ఎవరికి అప్పగిస్తారు అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఆ ఇంటిని తీసుకోడానికి బంధువులు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని ఏం చేయాలనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనతో ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని, ఆ ఇంటిని దేవాలయంగా మార్చడమే ఉత్తమమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దీనిపై మృతుల బంధువు కేతన్ నాగ్పాల్ స్పందిస్తూ.. ఇంటి గురించి ఇంకా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంపై బంధువులతో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని, పోలీసులు ఆధీనంలో ఉన్న ఇంటిని ఎప్పుడు అప్పజెప్పుతారనే విషయం తెలియదన్నారు. మృతురాలు నారాయణ్ దేవి మరో కుమార్తె, కుమారుడు పానిపట్, ఛిత్తోర్గఢ్లో స్థిరపడ్డారు. దీంతో వారు ఈ ఇంటిని తీసుకోడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. నవీన్ బాత్రా అనే స్థానికుడు మాట్లాడుతూ.. తన 21 ఏళ్ల కూతురు ఈ ఘటన అనంతరం భయంతో వణికిపోతుందని, లైట్ లేనిది ఇంట్లో ఉండలేక పోతుందని, చివరకు వాష్ రూం డోర్ పెట్టుకోడానికి కూడా భయపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ ఇంటికి పోలీసులు వస్తుండటం, టీవీ చానెళ్లో పదే పదే రావడం కూడా స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. చిన్నారులను బలవంతంగా చంపారు! ఇక ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలో చిన్నారులను ఆత్మహత్య చేసుకునేలే వారిపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల ధృవ్, శివమ్లిద్దరికి బలవంతంగా ఊరితాడు బిగించారని దీంతోనే వారి శరీరాలపై గాయాలైనట్లు పోలీసులు వాపోతున్నారు. ఈ ఫుటేజీలో ఆ 11 మంది స్టూల్స్, వైర్ల పట్టుకెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
బురారీ కేసులో 12వ వ్యక్తి??
సామూహిక మరణాల కేసు(బురారీ కేసు) దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త అనుమానాలు వ్యక్తం కావటంతో బురారీ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లలిత్ భాటియా మభ్యపెట్టడంతోనే కుటుంబ సభ్యులంతా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న కోణం ఒకటి కాగా, ఈ వ్యవహారంలో మరో వ్యక్తి ప్రమేయం ఉండి ఉంటుందన్నది రెండో కోణం. అందుకు కారణం ఆత్మహత్యకు ముందు ఇంట్లో పూజలు నిర్వహించినట్లు ఉండటం. (...విచిత్రంగా ప్రవర్తించేవాళ్లు) సాక్షి, న్యూఢిల్లీ: భాటియా కుటుంబం ఆత్మహత్యకు ముందు ఇంట్లో ‘వటవృక్ష’ పూజ నిర్వహించారు. సాధారణంగా పూజారుల సమక్షంలోనే దీనిని నిర్వహిస్తుంటారు. దీంతో బయటి నుంచి వచ్చిన వ్యక్తే ఈ పూజను నిర్వహించి ఉంటాడని భావిస్తున్నారు. మోక్షం కోసం భగవంతుడ్ని చేరేందుకు దగ్గరి దారి ఇదేనని ప్రలోభానికి గురి చేసి ఉంటారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ద్వారం తెరిచి ఉండటంతో సదరు వ్యక్తి పూజ ముగిశాక ఆ మార్గం గుండానే వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాటియా కుటుంబం తరచూ ఇటువంటి పూజలు నిర్వహించేదని, కొందరు స్వామీజలు వారి ఇంటికి వచ్చే వారని గతంలో ఇంట్లో పని చేసిన వాళ్లు చెబుతున్నారు. దీంతో 12వ వ్యక్తి మిస్టరీ చేధించే పనిలో పడ్డారు. మానసిక రుగ్మతే!... 2007లో నారాయణ్ దేవి(77) భర్త మృతి చెందారు. ఆయన మరణాన్ని కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా లలిత్ భాటియా మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. తండ్రి ఫొటోతో మాట్లాడడం, ఆయన ఆదేశాలు ఇచ్చాడంటూ వాటిని ఓ పుస్తకంలో రాయడం చేస్తుండేవాడు. ‘తండ్రి తన కలలో కనిపించాడని, మాట్లాడాడని, ఆయన ఆత్మ ఆవహించిందని చెబుతూ కుటుంబ సభ్యులను కూడా అదే దారిలో నడిపించాడు. క్రమంగా తన రుగ్మతను కుటుంబ సభ్యులకూ అంటించాడు. ‘అంతిమ సమయంలో మన కోర్కెలు నెరవేరేటప్పుడు ఆకాశం బద్దలవుతుంది.భూమి కంపిస్తుంది. అయినా ఎవరూ భయపడొద్దు. నేనొచ్చి రక్షిస్తా’ పుస్తకాల్లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఈ రెండు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు.. వీలైనంత త్వరలో కేసులో చిక్కుముడి విప్పుతామని డీసీపీ వెల్లడించారు. మరోవైపు భాటియా ఇంట్లో దొరికిన నోట్ బుక్లను విశ్లేషించిన మానసిక నిపుణులు.. వాటిని అధ్యయనం చేసే పనిలో ఉన్నారు. సీసీటీవీలో షాకింగ్ విజువల్స్... ఆ పైపుల సంగతేంటి? -
తండ్రి కాపాడుతాడని...
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయిన కేసు మరో మలుపు తిరిగింది. ఆత్మహత్య సందర్భంగా చనిపోయిన తండ్రి తమను కాపాడతాడని భాటియా కుటుంబం నమ్మేదని ఇంట్లో పోలీసులకు లభ్యమైన డైరీల్లో ఉంది. ఈ క్రతువులో భాగంగా ‘ఓ కప్పులో నీళ్లు ఉంచండి. అది రంగు మారగానే నేను వచ్చి మిమ్మల్ని కాపాడతాను’ అని లలిత్ భాటియా(45)తో ఆయన తండ్రి అన్నట్లు వీటిలో ఉంది. జూన్ 30న(శనివారం) చివరిసారిగా రాసిన డైరీలో ఈ క్రతువుల్ని ‘దేవుడి దగ్గరకు దారి’గా లలిత్ అభివర్ణించాడు. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తండ్రి తనకు కన్పిస్తున్నారనీ, ఆయన సూచనలతో మోక్షం కోసం ఈ క్రతువును పాటించినట్లు లలిత్ రాసుకున్నాడు. మరోవైపు భాటియా కుటుంబం ఆత్మహత్యకు చేసుకుంటున్న ఏర్పాట్లు ఎదురింటివారు అమర్చిన సీసీటీవీలో నమోదయ్యాయి. దీన్ని ఓ జాతీయ మీడియా సంస్థ బుధవారం ప్రసారం చేసింది. తాంత్రిక క్రతువులో భాగంగా భాటియా కుటుంబం పెద్ద కొడలు సవిత, ఆమె కుమార్తె నీతూలు శనివారం రాత్రి 10 గంటలకు ఐదు కుర్చీలను ఇంట్లోకి తీసుకెళ్లినట్లు వీడియోలో ఉంది. మరో 15 నిమిషాలకు ఉరి వేసుకునేందుకు కావాల్సిన వైర్లను శివమ్(15), ధ్రువ్(12)లు తీసుకొచ్చారు. కాగా, ఈ దారుణం జరిగిన రోజున బయటివారెవరూ భాటియా ఇంట్లోకి వెళ్లలేదని పోలీసులు స్పష్టం చేశారు. బురారీ ఘటనలో చనిపోయిన శివమ్(15), ధ్రువ్(15) చదువులో ఎప్పుడూ చురుగ్గానే ఉండేవారని ఢిల్లీకి చెందిన వీరేంద్ర పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయుడు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సంఘటన జరిగిన తీరుతెన్ను ఇదే.. శనివారం రాత్రి 10 గంటలు: పెద్ద కోడలు సవిత, ఆమె కుమార్తె నీతూ ఆత్మహత్య కోసం కుర్చీలు తెచ్చారు. ► 10:15గంటలు–ధ్రువ్, శివమ్లు ఉరి కోసం వైర్లను తీసుకొచ్చారు. ► 10:39– ఆర్డర్ చేసిన 20 రొట్టెల్ని ఓ వ్యక్తి డెలివరీ చేశాడు ► 10:57– పెద్ద కుమారుడు భవనీశ్ ఇంట్లోని కుక్కను షికారుకు తీసుకెళ్లాడు. ► 11:04– కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం ► 5.56 గంటలు– పాలవాడు క్యాన్లను ఇంటిదగ్గర పెట్టివెళ్లాడు. ► 7.14– పొరుగునే ఉన్న ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. -
చచ్చిపోయే ముందు చపాతీల కోసం...
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని సామూహిక మరణాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. క్షుద్ర పూజల ప్రభావానికి లోనై మోక్షం కోసమే వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రచారం జరగగా.. అది అంతా తప్పని వారిని ఎవరో చంపారని మృతురాలు నారయణ దేవి కూతురు సుజాత ఆరోపించారు. అయితే వారివి ఆత్మహత్యలేనని ఢిల్లీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల్లో ఒకరైన లలిత్ భాటియానే మిగతా కుటుంబ సభ్యులను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే నారాయణ దేవి కుటుంబ సభ్యులను వారి ఇంట్లో చివరిసారిగా చూసిన డెలివరీ బాయ్ రిషి చెప్పిన విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ‘మంగళవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు 20 చపాతీల కోసం వారు ఆర్డర్ చేశారు. 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలో చపాతీలు ఇచ్చేందుకు వారి ఇంటికి వెళ్లాను. వాళ్లలో ఒక మహిళ తన తండ్రిని నాకు డబ్బులు ఇవ్వాల్సిందిగా చెప్పింది. నేను వెళ్లిన సమయంలో ఇళ్లంతా సందడిగా ఉంది. వారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అసలు ఎవరూ ఊహించనే లేరంటూ’ రిషి వాపోయాడు. మరికొన్ని గంటల్లో చనిపోతామని తెలిసి కూడా వారంతా అలా ఉండటం తనను విస్తుగొలిపిందని అతడు తెలిపాడు. కాగా నారాయణ దేవి ఇంట్లోని రెండు రిజిస్టర్లలో లభ్యమైన కాగితాల్లో మోక్షం పొందాలంటే చనిపోయే రోజు ఇంట్లో భోజనం వండకూడదని వారు పెట్టుకున్న నియమం ప్రకారమే చపాతీలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. -
ఏ కష్టమొచ్చిందో..
కొవ్వూరు రూరల్/కొవ్వూరు : ఏ కష్టమొచ్చిందో.. ఆరోగ్య సమస్యలా.. ఆర్థిక ఇబ్బందుల కారణమా.. ఏదైనా కాని ఓ కుటుంబం మూడు జిల్లాలు దాటి వచ్చి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని కొవ్వూరు వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం కలిగించింది. శనివారం కొవ్వూరు లాంచీల రేవు శ్రీ కృష్ణ చైతన్య స్నానఘట్టంలో గోదావరిలో తేలి యాడుతున్న మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, సీఐ సుభాకర్, ఎస్సైలు ఎస్ఎస్ఎస్ పవన్కుమార్, పి.రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. సంఘటనా స్థలంలో దొరికిన బ్యాగ్లో లభించిన ఆధార్కార్డులు, రేషన్కార్డు ఆధారంగా మృతులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన పొందూరు రవికుమార్ (27), అతని భార్య పావని (24), కుమార్తె పూజిత (3)గా గుర్తించారు. ఈ మేరకు మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. అనంతరం సీఐ సుభాకర్ మాట్లాడుతూ సంఘటనా స్థలంలో లభించిన బ్యాగ్లో ఆధార్కార్డులతో పాటు రవికుమార్ ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ ఫైల్ ఉందన్నారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నామని చెప్పారు. బ్యాగ్లో మృతుడి తల్లి రమణమ్మ, మరో కుమార్తె హారిక (2) ఆధార్కార్డులు కూడా లభించాయన్నారు. వీరంతా శుక్రవా రం స్థానిక ఆంజనేయస్వామి స్నానఘట్టం వద్ద సంచరించారనే సమాచారం ఉందని, ఆ ప్రాంతంలోనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామన్నారు. అయితే మరో కుమార్తె హా రిక ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. మృతదేహా లను కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశామని సీఐ సుభాకర్ చెప్పారు. ఇదిలా ఉండగా శుక్రవారం గోదావరిలో తేలియాడిన మరో పురుషుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కడతేరిన ప్రేమబంధం రవికుమార్, పావని ఐదేళ్ల క్రితం కులాంతర వివాహాం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. రవికుమార్ కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. వీటికి ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో బలవర్మణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రవికుమార్ తల్లి రమణమ్మ కూడా ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరిలో దిగి భయంతో వెనక్కి వ చ్చినట్టు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు. అప్పటికే రవికుమార్ దంపతులు, ఇద్దరు కుమార్తెలు నదిలో మునిగిపోవడంతో రమణమ్మ కేకలు వేసినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి కావడంతో ఆ సమయంలో ఎవరూ స్పందించలేదు. రవికుమార్ బీ టెక్ పూర్తి చేయగా పావని డిగ్రీ చదివింది. వీరు నరసన్నపేటలో నివాసముంటున్నారు. రవికుమా ర్ది గొర్రెలబంద గ్రామం కాగా, పావనిది కురుడు గ్రామం. చినవెంకన్నను దర్శించి.. నరసన్నపేట: తీర్థ యాత్రల పేరుతో బుధవారం నరసన్నపేట నుంచి బయలుదేరి గురువారం ఉద యం ద్వారకాతిరుమల వెళ్లామని రవికుమార్ త ల్లి రమణమ్మ నరసన్నపేటలో ‘సాక్షి’కి తెలిపారు. చినవెంకన్నకు పూజలు చేసి ఉన్న డబ్బు, బం గారు ఆభరణాలు హూండీలో వేసి సాయంత్రం నదికి వద్దకు వెళ్లి్లనట్టు చెప్పారు. అందరమూ ఒక రి చేతులు ఒకరు పట్టుకొని నదిలోని దిగామని ఇంతలో నీటి ఉద్ధృతికి తన చేతులు విడిపోయాయని.. వెంటనే తాను ఒడ్డుకు కొట్టుకు వచ్చానని, అక్కడి నుంచి నరసన్నపేట చేరుకున్నానని చెప్పింది. -
కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో 50పేర్లు
సాక్షి, ముంబై : ఓవైపు అప్పుల బాధ, మరోవైపు కూతురి మరణం వెరసి ఓ కుటుంబం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ముంబైలోని కఫే పరేడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కఫే పరేడ్కు చెందిన ప్రవీణ్ పటేల్, భార్య వీణా పటేల్, కొడుకు ప్రభు పటేల్తో కలిసి మత్స్యకారుల కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ప్రవీణ్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తుండేవాడు. కొన్ని నెలల క్రితం అతని కూతురు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందింది. కూతురి మరణంతో పాటు అప్పుల బాధ తాళలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. ముందుగా కొడుకును ఉరివేసి, ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ప్రవీణ్ ఇంటి నుంచి దుర్వాసన రావటం గుర్తించిన పొరుగింటి వారు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరచిచూడగా ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సంఘటనా స్థలంలో లభించిన ఓ సూసైడ్ నోట్లో మృతులు దాదాపు 50 మంది పేర్లను ప్రస్తావించటం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఇంటి సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేదా... ఆత్మహత్య చేసుకునేలా ఎవరన్నా ప్రేరేపించారా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. -
డబ్బులిస్తేనే మృతదేహాన్నిస్తామన్న తల్లిదండ్రులు
సిద్దిపేటటౌన్: కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస విడిచిన సావిలి మీనా మృతదేహాన్ని ఎవరూ తీసుకువెళ్లాలనే విషయంలో ఆస్పత్రి వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను గొంతు నులిమిన ఘటనలో గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శుక్రవారం ఉదయం మీనా మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన తర్వాత ఇరు కుటుంబాల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని తాము తీసుకువెళ్తామంటే తాము తీసుకువెళ్తామంటూ వాదనకు దిగారు. వీరిని సముదాయించేందుకు బంధువులు చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. మీనా తల్లిదండ్రులు హన్మంతరావుతో పెళ్లి అయిన నాటి నుంచి ఏ అవసరం ఉన్నా తామే చూసుకున్నామని, మధ్యలో డబ్బు కావాలంటే కూడా ఇచ్చామని, ఆ డబ్బు తిరిగి ఇస్తేనే మృతదేహాన్ని అత్తింటికి తీసుకువెళ్లనిస్తామని తేల్చిచెప్పారు. అయితే మధ్యవర్తులు నచ్చజెప్పడంతో హన్మంతరావు తరపువాళ్లు కొంత వెనక్కి తగ్గి కార్యక్రమాలు అయిన తర్వాత ఇరు వర్గాల వాళ్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పడంతో వివాదం కొంత సద్దుమణిగింది. ఆ తర్వాత మరి కొంత సేపటికి తమ బిడ్డను చంపిన వారి ఇంటికి తీసుకువెళ్లనివ్వమని, తమ బిడ్డ చివరి కార్యక్రమాన్ని తామే నిర్వహిస్తామని చెప్పి మృతదేహాన్ని తల్లి గారి ఊరు అయిన గాడిచర్లపల్లికి తీసుకువెళ్లారు. మార్చురీలో నుంచి మీనా మృతదేహాన్ని తీసుకువస్తున్న క్రమంలో తల్లిదండ్రులు బోరున విలపించారు. దీంతో అక్కడి వాతావరణం శోకసంద్రంలో మునిగిపోయింది. -
సిద్దిపేటలో జర్నలిస్ట్ కుటుంబం ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో జిల్లాలో గురువారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాకేంద్రంలోని భారత నగర్లో ఓ కుటుంబం పురుగల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా నివాసముంటున్న హనుమంతరావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు హాస్పిటల్కు తరలించేలోపే హనుమంతరావుతో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. హనుమంతరావు భార్య చికిత్స పొందుతుండగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హనుమంతరావు ఓ వార్త పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణాలుగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. -
నెహ్రూనగర్లో విషాదఛాయలు
గుంటూరు ఈస్ట్: ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్లో సోమవారం రాత్రి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న బుంగా వెంకయ్య (47), భార్య రజిని (40), కుమార్తె సాయికృష్ణవేణి (22) మృతదేహాలను నెహ్రూనగర్కు మంగళవారం తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుకుమున్నాయి. అనంతరం కన్నీటి వీడ్కోలుతో అంత్యక్రియలు నిర్వహించారు. వెంకయ్య కుమారుడు సాయిగోపీనాథ్ తల్లిదండ్రులు, సోదరి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. అతనిని ఓదార్చడం ఎవరికి అలివికాలేదు. వెంకయ్య, భార్య రజిని అందరితో స్నేహంగా మెలిగేవారని, అటువంటివారు ఈవిధంగా చేసుకుని ఉండకూడదంటూ అక్కడికి వచ్చిన వారంతా కంటతడి పెట్టారు. లేళ్ల అప్పిరెడ్డి, రోశయ్యల పరామర్శ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి నెహ్రూనగర్లోని వెంకయ్య గృహం వద్దకు వెళ్లి భౌతికకాయాలను సందర్శించారు. సాయిగోపీనాథ్ను పరామర్శించి ఓదార్చారు. సాయిగోపినాథ్కు తాను అండగా ఉంటానని అప్పిరెడ్డి ధైర్యం చెప్పారు. విషయం తెలియగానే లేళ్ల అప్పిరెడ్డి మధిర వెళ్లి అక్కడ మృతదేహాలను తరలించేందుకు అవసరమైన చర్యలు దగ్గరుండి చూశారు. పోస్టుమార్టం అనంతరం గుంటూరు తరలించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. -
విషాదాంతం
బుక్కపట్నం: తల్లీకుమారుల అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. అనుమానించినట్లుగానే తల్లీకుమారులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరోజు తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. బుక్కపట్నంలోని ఎస్సీ కాలనీకి చెందిన రమాదేవి (28), పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన కృష్ణ దంపతులు. వీరికి బబ్లూ (6), జోసియో (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ కుటుంబం బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవించేది. ఇటీవల రమాదేవి పిల్లలిద్దరినీ తీసుకుని పుట్టింటికి వచ్చింది. సోమవారం ఉదయం ఏడు గంటలకు బెంగళూరుకు వెళ్లేందుకని ఇంటి నుంచి లగేజీ సర్దుకుని పిల్లలతో కలిసి బయల్దేరింది. ఇంతలో బుక్కపట్నం చెరువు వద్ద వీరి లగేజీ బ్యాగు, పిల్లల దుస్తులు కనిపించడం, తల్లీకుమారులు అదృశ్యమవడం కలకలం రేపింది. ఎస్ఐ రాజేష్, సిబ్బంది చెరువు వద్దకెళ్లి వస్తువులను పరిశీలించి, ఆరా తీశారు. వారి కోసం గాలింపు చేపట్టారు. ఆత్మహత్య చేసుకుని ఉందేమోనన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేశారు. మంగళవారం చెరువులో తల్లీ కుమారుల మృతదేహాలను గుర్తించారు. ఊరికని బయల్దేరిన కూతురు, మనవళ్లు మృత్యువాత పడ్డారని తెలుసుకున్న రమాదేవి తల్లి గంగమ్మ బోరున విలపించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
బుక్కపట్నంలో కలకలం
బెంగళూరుకు వెళ్లేందుకు ఇంటినుంచి బయల్దేరిన తల్లీ కూతుళ్లు కనిపించడం లేదు. బ్యాగు, పిల్లల దుస్తులు చెరువు వద్ద పడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తల్లీపిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా.. లేక ఇంకేమైనా జరిగిందా.. అనేది తెలియడం లేదు. వారి జాడ కోసం గాలిస్తున్నారు. బుక్కపట్నం: మండల కేంద్రం బుక్కపట్నంలో బైపాస్ సమీపాన ఎస్సీ కాలనీకి చెందిన గంగమ్మ కుమార్తె రమాదేవి (28)కి పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన కృష్ణతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. పొట్టకూటి కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి బబ్లూ (6), జోసియో (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల రమాదేవి పిల్లలతో కలిసి పుట్టినిల్లు అయిన బుక్కపట్నం వచ్చింది. సోమవారం ఉదయం ఏడు గంటలకు బెంగళూరు వెళ్లేందుకుని ఇంటి నుంచి బయల్దేరారు. చెరువు వద్ద కలకలం బుక్కపట్నం చెరువు తూము వద్ద ఒక బ్యాగ్, సెల్ ఫోన్, ఇద్దరు చిన్నారుల దుస్తులను అటువైపు వచ్చిన వారు గమనించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే కొత్తచెరువు ఎస్ఐ రాజేష్, సిబ్బంది చెరువు వద్దకు చేరుకుని దుస్తులు, బ్యాగ్ ఎవరివని ఆరా తీయగా గంగమ్మ తన కుమార్తె రమాదేవి, మనవళ్లవని తెలిపింది. -
అనుమానం.. పెనుభూతం
నెల్లూరు(క్రైమ్): దంపతుల నడుమ అనుమానం పెనుభూతంగా మారింది. ఆరు నిండుప్రాణాలను బలితీసుకొంది. ముద్దుముద్దు మాటలతో ఆడుతూ పాడుతూ గడపాల్సిన చిన్నారులను సైతం విగతజీవులుగా మార్చేసింది. ప్రకాశం జిల్లా ఉలవపాడులో ఆదివారం రాత్రి ఆ కుటుంబం రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్ప డింది. వారి మృతదేహాలను ప్రత్యేక వాహనంలో బాధిత కటుంబసభ్యులు, బంధువులు సోమవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని బోడిగాడితోటకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. నెల్లూరు సంతపేట మహాలక్ష్మమ్మగుడి ప్రాంతానికి చెందిన నారాయణ, ఉమ దంపతుల కుమారుడు పి.సునిల్(25)కు కందుకూరుకు చెందిన రమాదేవి/రమ(23)తో 2012లో వివాహమైంది. అల్యూమినియం వంటసామగ్రి విక్రయించుకుంటూ వారు జీవనం సాగించేవారు. వ్యాపార నిమిత్తం కొంతకాలం క్రితం సునిల్ కాపురాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్కు మార్చాడు. వారికి ఉష(5), కవలలు కల్యాణ్(3), కల్యాణి(3), ఎనిమిది నెలల బాబు ఉన్నారు. సజావుగా సాగాల్సిన వీరి కాపురంలో అనుమానం పెనుభూతంలా దాపురించింది. భార్య ప్రవర్తనపై సునిల్ అనుమానం పెంచుకొన్నాడు. ఆమె సెల్ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతుందో వారి సంభాషణలన్నీ రికార్డ్ చేయసాగాడు. అలా ఆమె తప్పులను ప్రస్తావిసూ తరచూ నిలదీసేవాడు. దీంతో దంపతుల నడుమ విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రమ వారం రోజుల క్రితం కందుకూరులోని తన పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఉదయం సునిల్ తన తల్లిదండ్రులను, బంధువులను తీసుకొని కందుకూరు వచ్చాడు. ఇరువర్గాల íపెద్దలు వారికి సర్దిచెప్పారు. కాపురాన్ని చక్కగా చేసుకోవాలని సూచించారు. దీంతో భార్య, పిల్లలను తమ వెంట తీసుకొని ఉలవపాడు రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తిరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ సునిల్, రమ తమ పిల్లలతో కలిసి ఉలవపాడు రైల్వేస్టేషన్లో సంఘమిత్ర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. రైల్వే పోలీసులు మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించి సునిల్ కుటుంబసభ్యులకు సోమవారం అప్పగించారు. సోమవారం సాయంత్రం బాధిత కుటుంబసభ్యులు మృతదేహాలను అంబులెన్స్లో నెల్లూరు బోడిగాడితోటకు తరలించారు. మిన్నంటిన రోదనలు సునిల్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన బంధువులకు, స్నేహితులకు తెలియడంతో వారు సోమవారం సాయంత్రం పెద్ద ఎత్తున బోడిగాడితోటలోని శ్మశానవాటికకు చేరుకున్నారు. మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశానవాటికకు తరలించారు. మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. ముద్దుముద్దు మాటలతో అందరినీ అలరించా ల్సిన చిన్నారులు విగతజీవులుగా మారి చాపల్లో చుట్టి ఉండటాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అశ్రనయనాల నడుమ సునిల్, రమలతోపాటు వారి పిల్లల అంత్యక్రియలు జరిగాయి. మృతదేహాలను నెల్లూరుకు తీసుకొస్తున్నారన్న సమాచారంతో మృతుడి తల్లిదండ్రులు ఇంటి వద్దకు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గంటల తరబడి మృతదేహాలను కడసారి చూసేందుకు వేచిచూశారు. అయితే బాధిత కుటుంబసభ్యులు నేరుగా మృతదేహాలను బోడిగాడితోటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారన్న విషయం తెలుసుకుని బాధపడ్డారు. ఆరు మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి ఒంగోలు క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే కుటుంబంలో ఆరుగురి ఆత్మహత్యకు సంబంధించి మృతదేహాలకు ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో సోమవారం పోస్ట్మార్టం నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా ఉలవపాడు రైల్వేస్టేషన్ సమీపంలో సంఘమిత్ర ఎక్స్ప్రెస్కు ఎదురుగా వెళ్లడంతో నెల్లూరుకు చెందిన పాశం సునిల్(28), రమ(24) దంపతులతోపాటు వారి పిల్లలు ఉష(5), కవలలు కల్యాణ్, కల్యాణి(3), ఎనిమిది నెలల పసికందు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాలను రిమ్స్కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల సమక్షంలో పూర్తి వివరాలతో కూడిన పంచనామాను రిమ్స్లో ఉలవపాడు తహసీల్దార్ పద్మావతి సమక్షంలో ఒంగోలు రైల్వే జీఆర్పీ సీఐ పి.శ్రీనివాసరావు, చీరాల ఎస్సై రామిరెడ్డి, హెడ్కానిస్టేబుల్ ఎం.జె.కిషోర్బాబు నిర్వహించారు. రిమ్స్ వైద్యులు రాజ్కుమార్ ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుని బంధువు పాశం కొండయ్య, అన్నయ్య పాశం అని ల్ ఆరు మృతదేహాలను రిమ్స్ నుంచి నెల్లూరు పట్టణానికి తీసుకెళ్లారు. జీఆర్పీ సీఐ పి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాంసపు ముద్దలు.. రక్తపు మరకలు ఉలవపాడు: ఉలవపాడు రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి రైలు కింద పడి ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు సోమవారం తెల్లవారుజామునే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాల మధ్యలో మాంసపు ముద్దలు, రక్తపు మరకలు చూసి చలించిపోయారు. హృదయ విదారకరమైన ఘటనను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్పర్థలు వచ్చి ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసి కష్టాలు ఎదుర్కొని సంసారం చేయాలి కానీ ఇలా ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని చర్చించుకోవడం కనిపించింది. ఐదేళ్లలోపు పిల్లలు నలుగురు మృతి చెందారని తెలుసుకున్న మహిళలు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాలపై మాంసపు ముద్దలను చూసి కంటతడి పెట్టారు. -
క్షణికావేశంలో రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య
-
సురేష్ ఆచూకీ లభ్యం
సూర్యాపేట క్రైం : రూ.కోట్లల్లో అప్పులు చేసి ఉడాయించిన సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కస్తూరి సురేష్ ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు కనిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రకాశ్జాదవ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. పదేళ్లుగా ‘ఆన్లైన్’ వ్యాపారం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి కస్తూరి జనార్దన్ కుమారుడు సురేష్ పదేళ్ల నుంచి ఆన్లైన్ (ఫారెక్స్) వ్యాపారం చేస్తున్నాడని ఎస్పీ తెలిపారు. 2009 నుంచి ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న సురేష్ రూ.10 వేల నుంచి రూ.లక్షలు అప్పులు చేసి రూ.5 నుంచి రూ.7ల వరకు వడ్డీలు చెల్లిస్తూ వస్తున్నాడు. ఆన్లైన్ వ్యాపారంలో పెద్ద ఎత్తున నగదు పెట్టేందుకు సూర్యాపేటకు చెందిన 47 మంది నుంచి రూ.6 కోట్ల వరకు అప్పులు చేశాడు. ప్రతి నెలా అసలు ఉంచి.. వడ్డీ ఇస్తూ సురేష్ వ్యాపారం సాగిస్తు వస్తున్నాడన్నారు. ఎవరి దగ్గరైనా వడ్డీకి తీసుకున్న డబ్బులకు ప్రతినెలా 10వ తేదీన వడ్డీ చెల్లించేవాడన్నారు. అదే మాదిరిగా గత ఏడాది.. ఆగస్టు, సెప్టెంబర్ నెల 10వ తేదీన తీసుకున్న నగదుకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో.. డబ్బులు ఇచ్చిన వారు వడ్డీ .. లేదా అసలైనా ఇవ్వాలని ఒత్తిడి పెంచడంతో చేసేదేమి లేక.. సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం సురేష్ తన భార్య ప్రభాతకు పూణె వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. పదో తేదీ రాత్రి ఇంటికి రాకుండా తిరిగి 11వ తేదీన పూణెలో డబ్బుల కోసం వెళ్తున్నానని మరోమారు భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. డబ్బుల కోసం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో తిరిగి భార్యకు 12వ తేదీన సాయంత్రం ఫోన్ చేసి చెప్పి డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నానని.. నా కోసం.. ఇంటి వద్దకు అప్పులవారు వస్తారు.. అమ్మనాన్న దగ్గరి నుంచి వెళ్లిపోండని చెప్పాడు. దీంతో చేసేదేమి లేక భార్య ప్రభాత అత్తమామలకు చెప్పి 13వ తేదీన వారి ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి అత్తమాతలు జనార్దన్, చంద్రకళలు ఫోన్ చేయడంతో ప్రభాత 16వ తేదీన సాయంత్రం సూర్యాపేటలోని వారి నివాసానికి చేరుకుంది. 16వ తేదీన సురేష్ కన్పించకుండా పోయారంటూ పట్టణ పోలీస్స్టేషన్లో భార్య ప్రభాత ఫిర్యాదు కూడా చేసింది. 11 వ తేదీ రాత్రి నుంచి సురేష్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో చేసేదేమి లేక.. 17వ తేదీన అర్ధరాత్రి కూడా సురేష్కు పదే పదే ఫోన్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో కుటుంబ యజమాని అయిన జనార్దన్తో పాటు భార్య చంద్రకళ, చిన్న కుమారుడు అశోక్, సురేష్ భార్య ప్రభాత, కుమార్తెలు సాన్విక, రుత్వికలు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. సెప్టెంబర్ 25న యూట్యూబ్లో చూసి.. అరువు ఇచ్చిన వారి నుంచి వేధింపులు తాళలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సురేష్కు తన తల్లిదండ్రులు, తమ్ముడు, భార్య, కుమార్తెలు మృతిచెందిన విషయం సెప్టెంబర్ 25వ తేదీన యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాడు. అప్పుడు సురేష్ వారణాసిలో ఉన్న సురేష్ భయంతో ఇక్కడికి రాలేకపోయాడు. వారణాసి నుంచి వయా, కోల్కత్తా, వరంగల్, వైజాగ్, విజయవాడలో తిరిగాడు. అందరి అప్పులు తీర్చేస్తా.. ఎవరి వద్ద నుంచి అప్పు తీసుకున్నానో.. వారందరికీ చెల్లించేందుకు గాను తనకు రెండుమూడేళ్ల సమయం ఇస్తే తీరుస్తానని సురేష్ మీడియా ఎదుట చెప్పాడు. ఆన్లైన్ మార్కెటింగ్లో షేర్లు పెట్టేందుకే రూ.6 కోట్లు తీసుకున్నట్లు తెలిపాడు. వ్యాపారంలో నష్టం రావడంతోనే ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయనన్నారు. ఈలోపు మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్లు వారం రోజులకే తెలిసిందన్నారు. భయంతోనే ఇక్కడికి రాలేకపోయనని తెలిపాడు.– కస్తూరి సురేష్ బ్యాంకు ఖాతాపై నిఘాపెట్టి.. అయితే సురేష్ మిస్సింగ్ కేసు నమోదునైప్పటి నుంచి సూర్యాపేట డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అప్పటి నుంచి సురేష్ బ్యాంకు ఖాతాలపై నిఘాపెట్టి నగదు లావాదేవీలపై దృష్టి సారించారు. ఇటీవల విశాఖపట్నంలో అతడి ఖాతానుంచి లావాదేవీలు జరగడంతో ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గొర్ల కృష్ణ, గోదేషి కరుణాకర్లు వైజాగ్ వెళ్లి సురేష్ను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ వివరించారు. అయితే ఇప్పటి వరకు సురేష్పై అప్పులిచ్చిన వారు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. సురేష్పై మిస్సింగ్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ శ్రీనివాస్, ఐడీపార్టీ బృందాన్ని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు ఉన్నారు. అరువే..అంతం చేసింది.. సురేష్ జల్సాలకు అలవాటు పడి అనతికాలంలో కోట్లల్లోకి ఎదగాలన్న ఆశ కుటుంబాన్ని అంతం చేసేలా చేసింది. అయిన వాళ్ల నుంచే కాకుండా.. స్నేహితులు, సమీప బంధువుల నుంచి రూ. కోట్లల్లో అరువు తీసుకున్నాడు. ఆన్లైన్ వ్యాపారంలో బాగా కలిసివస్తుందని ఆశపడ్డాడు. బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కత్తాలతో పాటు గోవా లాంటి ప్రాంతాల్లో ఆన్లైన్ వ్యాపారంలో జోరుగా పాలుపంచుకున్నట్లు తెలిసింది. ఈ వ్యాపారం కొన్ని రోజుల పాటు బాగానే సాగినప్పటికీ అరువు తెచ్చిన వాళ్లకు లక్ష రూపాయలకు నెలకు రూ.10 వేల వడ్డీ కూడా ఇచ్చి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా ఆశపడ్డ వారు పెద్ద మొత్తంలో సురేష్కు ఎక్కువ నగదును ముట్టజెప్పారు. తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఉడాయించాడు. తీరా అప్పులిచ్చిన వారు ఇంటిమీద పడడంతో కుటుంబ పెద్దతో సహా మరో ఐదుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
పారిపోయి పరువు పోగొట్టుకోలేక...
సూరత్ : పీకల లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఓ వ్యాపారవేత్త... ఆ బాధ నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలు తీసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తన భార్య, నాలుగేళ్ల కుమారుడితో కలిసి తాముంటున్న అపార్ట్మెంట్ 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మీడియాలో యువ వ్యాపారవేత్త ఆత్మహత్యా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సర్థనా ప్రాంతానికి చెందిన వస్త్ర వ్యాపారవేత్త విజయ్ వాఘాసియా(35).. భార్య రేఖ(30), కొడుకు వీర్(4)లతో యోగి చౌక్లోని మేజిస్టిక్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్నారు. గత కొంత కాలంగా ఆయన వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన అప్పులు చేశారు. అయినప్పటికీ కోలుకోకపోవటంతో వాటిని తీర్చే దారి తెలీక దారుణానికి తెగబడ్డారు. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన విజయ్ అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న గౌరవ్ అనే స్నేహితుడితో కాసేపు మాట్లాడారు. ఆపై మంచి నీళ్లు మరిచిపోయానంటూ మళ్లీ పైకి వెళ్లిన కాసేపటికే భార్య, పిల్లలతో దూకినట్లు తెలుస్తోంది. గౌరవ్ అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయ్ జేబులో ఓ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘మా కుటుంబ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. అప్పులు తీర్చేందుకు నా ముందు దారులు లేవు. ఆర్థిక సమస్యలతోనే ఇలా చేస్తున్నాం. నా తదనంతరం వ్యాపార బాధ్యతలు నా సోదరుడివే’ అని విజయ్ ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. పారిపోలేక.. పరువు పోగొట్టుకోలేక... ప్రాణాలే విడిచారంటూ స్థానిక మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. -
సొంత అన్న కుమార్తెనే కిడ్నాప్
కనిగిరి: రాజేష్ చెడు వ్యవసానాలే అ కుటుంబంలో చావు బజా మోగించాయి. జల్సాలకు అలవాటుపడిన రాజేష్ తప్పటడుగు వేయడం..జైలు పాలవ్వడం.. తల్లిదండ్రుల ఆదరణ కరువవ్వడం..ఆర్థికంగా ఆదరించే వారు లేక పోవడం.. వెరసీ తీవ్ర మానసిక క్షోభకు గురై భార్య పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందా.. అన్న అనుమానాలు ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతున్నాయి. కనిగిరికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు హనుమంతారెడ్డి, మహాలక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు రాజేష్ (37) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వైజాగ్లో గురువారం ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. వీరి స్వగ్రామం హెచ్ఎంపాడు మండలం పెదగోగులపల్లి. తండ్రి హనుమంతారెడ్డి చాలకాలం దోడ్డిచింతలలో టీచర్గా పనిచేశారు. అనంతరం సుమారు 22 ఏళ్ల క్రితం కనిగిరి పట్టణంలోని కొత్తపేట పెద కరణం బజార్లో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నారు. సొంత అన్న కుమార్తెనే కిడ్నాప్ రాజేష్ ఉరఫ్ దేవిరెడ్డి రాజేశ్వరరెడ్డి 2016 మార్చి 31న అన్న దేవిరెడ్డి శ్రీను (టీచర్) రెండో కుమార్తె సహస్రను కనిగిరిలో పట్టపగలు కిడ్నాప్ చేశాడు. నిందితుడు రాజేష్ను పోలీసులు విజయవాడలో అరెస్టు చేశారు. రాజేష్ చెర నుంచి పాపను క్షేమంగా కాపాడారు. ఈమేరకు అతడిపై కనిగిరి పోలీస్స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదై ఉంది. ఐటీఐ చదివిన రాజేష్ జల్సాలకు అలవాటు పడ్డాడు. కనిగిరిలో రెండు మూడు వ్యాపారాలు చేసినా కలిసి రాలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటూ ఓ టెలికాం సంస్థలో నెల్లూరులో కొన్ని రోజులు సూపర్వైజర్గా పనిచేశాడు. ఆ తర్వాత సంసారాన్ని విజయవాడకు మార్చాడు. రెండేళ్లు అక్కడే ఉన్నాడు. మళ్లీ అక్కడ ఉద్యోగం వదిలి ఖాళీగా తిరుగుతూ విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. దానికి తోడు కుటుంబ సభ్యుల ఆదరణ లేదు. తల్లిదండ్రులు అన్న కుటుంబంతోనే సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో అన్న శ్రీను కుంటుంబంపై ద్వేషం పెంచుకున్నాడు. నగదు కోసం అన్న కూతురు సహస్రను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పట్లో కేవలం ఆర్థిక సమస్యల కారణంగా, ఆస్తి పంపకాలు చేయడం లేదనే తాను పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు రాజేష్ వెల్లడించాడు. అప్పట్లో పెద్ద మనుషుల సమక్షంలో రాజేష్కు తల్లిదండ్రులు కొంతమేర ఆర్థిక సర్దుబాటు చేసినట్లు తెలిసింది. కొంత కాలంగా వైజాగ్లో ఉంటున్న రాజేష్ ఇటీవల తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్లినట్లు సమాచారం. తండ్రితో మాట్లాడని రాజేష్ తల్లితోనే ఎక్కువగా మాట్లేవాడని తెలిసింది. పాపం చిన్నారులు రాజేష్ తప్పులు చేసినా అభం శుభం తెలియని చిన్నారులు విష్ణు, జాహ్నవిలను విషమిచ్చి చంపడంపై కనిగిరి వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు వారేం చేశారంటూ బంధువులు కలత చెందారు. ఆస్తి పంపకాలు చేసి ఉంటే ఇంత అఘాయిత్యం జరిగి ఉండేది కాదమోనని చర్చించుకుంటున్నారు. రాజేష్ ఆత్మహత్యకు పాల్పడే ముందు చివరి క్షణంలో రాసిన సూసైడ్ నోట్లో ఏముందనే దానిపై పట్టణంలో తీవ్ర చర్చ జరుగుతోంది. వైజాగ్ వెళ్లని తల్లిదండ్రులు తల్లిదండ్రులు హనుమంతారెడ్డి, ఆదిలక్ష్మమ్మలు కుమారుడు, కోడలు, మనవళ్ల శవ పంచనామాకు వైజాగ్ వెళ్లలేదు. రాజేష్ అన్న శ్రీనివాసులురెడ్డి మాత్రమే వెళ్లాడు. తాము పూర్తి అనారోగ్యంగా ఉన్నామని, కాళ్లూ చేతులు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నందున శవపంచనామాకు వెళ్లలేక పోతున్నట్లు కనిగిరి పోలీసులకు వారు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. నలుగురి మృతదేహాలను శనివారం కనిగిరి తీసుకు రానున్నట్లు మృతుడి తండ్రి హనుమంతారెడ్డి తెలిపారు. మనుమరాలి కిడ్నాప్ ఘటన జరిగినప్పటి నుంచి రెండో కొడుకు రాజేష్ తనతో ఎప్పుడూ మాట్లాడలేదని.. అప్పుడప్పుడూ వచ్చి తల్లితో మాత్రమే మాట్లాడేవాడని చెప్పారు. వేదన తీరనిది.. విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలో ఆరిలోవలో గురువారం జరిగిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యల వెనుక కుటుంబ గొడవలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల సమాచారంతో శుక్రవారం చెన్నై నుంచి సౌమ్య తల్లిదండ్రులు గురుస్వామి, భాగ్యలక్ష్మి, బంధువులు విశాఖ చేరుకున్నారు. ముందుగా ఆరిలోవ పోలీసులను కలిసి జరిగిన విషయం తెలుసుకున్నారు. అక్కడి నుంచి వారు కేజీహెచ్ మార్చురీకి చేరుకున్నారు. మార్చురీలో మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రాజేష్ మృతి చెందినట్లు ఆరిలోవ పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చినా శుక్రవారం రాత్రి వరకూ ఎవరూ రాలేదు. రాజేష్ మృతదేహానికి సంబంధించి పోస్టుమార్టం చేసేందుకు శవ పంచనామా జరగలేదు. శుక్రవారం, శనివారం రాజేష్ బంధువులు వస్తేనేగానీ ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరగదు. దంపతుల మధ్య తగాదాలు లేవు సౌమ్య, రాజేష్ మధ్య ఎటువంటి తగదాలు లేవు. 2010లో వివాహమైంది. రాజేష్ అప్పట్లో సిగ్నల్ టవర్స్లో పనిచేసేవాడు. అల్లుడు మంచోడు. అల్లుడు తల్లిదండ్రులు, అల్లుడు అన్నయ్య మధ్య కొంతకాలంగా వైరం నడుస్తోంది. బుధవారం రాత్రి సౌమ్య ఫోన్ చేసి అమ్మా అన్నం తిన్నావా.. అని అడిగింది. అప్పుడు కూడా నాతో ఏమీ చెప్పలేదు. బాగానే మాట్లాడింది. – భాగ్యలక్ష్మి, సౌమ్య తలి ఎప్పుడూ అలా మాట్లాడలేదు కుమార్తె గురుబాల (సౌమ్య) చాలా మంచిది. నాన్న నీవు మమ్మల్ని చాలా ఆదుకున్నావు. నిన్ను ఇక బాధపెట్టలేనని రెండు రోజుల కిందట ఫోన్లో చెప్పింది. అమ్మాయి నాతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడేది కాదు. అలాంటిది ఇలా చెప్పడంతో కొంత ఉద్వేగానికి గురయ్యా. కుటుంబమంతా ఇలా చనిపోవడానికి కారణమేంటో తెలియడం లేదు. కుమార్తె రాసిన సూసైడ్ నోట్ ప్రకారం విచారణ చేపట్టాలి. – గురుస్వామి, సౌమ్య తండ్రి -
కుటుంబం ఆత్మహత్య
ఆరిలోవ(విశాఖపట్నం తూర్పు): ఎంతో అన్యోన్యంగా ఉంటున్న దంపతులకు ఏ కష్టమొచ్చిందో తెలియదు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలతో సహా హఠాత్తుగా తనువు చాలించారు. ముందుగా పిల్లలిద్దరికీ విషమిచ్చి.. ఆ తర్వాత తాము కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గురువారం విశాఖలో జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దేవిరెడ్డి రాజేశ్రెడ్డి(35), భార్య సౌమ్య(30), పిల్లలు విష్ణు(7), జాహ్నవి(5)తో కలసి విశాఖ శివారులోని ఆరిలోవ ముస్తఫా కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న రాజేశ్ గురువారం ఉదయం పనికి వెళ్లి.. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చాడు. ఏమైందో ఏమో గానీ ఆత్మహత్య చేసుకోబోతున్నామంటూ రాత్రి 7 గంటల సమయంలో చెన్నైలో ఉంటున్న బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆందోళన చెందిన వారు.. వెంటనే విశాఖ ఆరిలోవ పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన ముస్తఫా కాలనీకి చేరుకుని రాజేశ్ నివాసముంటున్న ఇంటి ఆచూకీ కోసం గాలించారు. కొంతసేపటికి రాజేశ్ ఉంటున్న ఇంటిని గుర్తించిన పోలీసులు.. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే రాజేశ్, సౌమ్య ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. పిల్లలు విష్ణు, జాహ్నవి మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఘటనాస్థలిలో దొరికిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ మరణానికి కుటుంబ తగాదాలే కారణమని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. పిల్లలకు ముందు విషమిచ్చి ఆ తర్వాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఆరు నెలల నుంచి వారు ఇక్కడ ఉంటున్నారని, దంపతులిద్దరూ సఖ్యతగానే ఉండేవారని స్థానికులు తెలిపారు. ఇరుగుపొరుగు వారితో కూడా ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. కేసును ద్వారకా ఏసీపీ రామచంద్రరావు నేతృత్వంలో ఆరిలోవ ఇన్చార్జి సీఐ షణ్ముఖరావు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజేశ్రెడ్డి ఓ హత్య కేసులో నిందితుడనే ప్రచారం జరుగుతోంది. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ రామచంద్రరావు చెప్పారు. -
మరణ మృదంగం
తినే ఆహారంలో విష పదార్థాలు కలిశాయా..? క్రిమిసంహారక మందు కలుపుకుని మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడ్డారా..? ఎవరైన హత్య చేశారా..? ఇలా అంతుచిక్కని ప్రశ్నలెన్నో.. మరెన్నో సందేహాలు. కారణాలు ఏమైతేనేం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో శుక్రవారం తెల్లవారుజామున మరణమృదంగం ప్రతిధ్వనించింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పదంగా విగత జీవులవడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర కలకలంరేపింది. నల్లగొండ జిల్లా, రాజాపేట (ఆలేరు) : సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడపకు చెందిన దుబ్బాసి బాలరాజు(44), భార్య నిర్మల(40) దంపతులు. వీరికి కుమార్తె శ్రావణి (15), కుమారులు చింటు (12, బన్నీ (8) ఉన్నారు. బాలరాజు సికింద్రాబాద్ కూషాయిగూడ, జమ్మికుంటకు వెళ్లి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా బాలరాజుకు అప్పుడ్పుడు ఫిట్స్ రావడం, వచ్చే కూలి డబ్బులు సరిపోక కుటుంబ పోషణ భారంగా మారింది. చేసిన అప్పులకు తన తోబుట్టువులు అండగా నిలిచినా సరిపోలేదు. దీంతో బాలరాజు నెల రోజుల క్రితం రాజాపేట మండల కేంద్రానికి చెందిన బెజుగం నాగభూషణం పౌల్ట్రీఫాంలో పనిచేసేందుకు మాట్లాడుకున్నాడు. బాలరాజు ఏడాది క్రితం రాజాపేటలోని ఓ పౌల్ట్రీ ఫాంలో పనిచేసిన అనుభవం ఉండటంతో నాగభూషణం నెలకు రూ. 8వేలు ఇచ్చేందుకు అగీకరించాడు. అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బుతో కడుపునొప్పితో బాధపడుతున్న కుమార్తెకు ఆపరేషన్ చేయించాడు. బాలరాజు మామ జనగాం జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన బాలనర్సయ్య(68) వారం రోజుల క్రితం పాముకుంట శివారులోని ఓ దాబాలో పనిచేస్తూ జీవిస్తున్నాడు. కాగా ఇటీవల బాలరాజుకు ఫిట్స్ ఎక్కువగా రావడంతో ఆస్పత్రిలో చేర్పించేందుకు భార్య నిర్మల తన తల్లిదండ్రులు భారతమ్మ(60), బాలనర్సయ్యలను మూడు రోజుల క్రితం ఇంటికి పిలిపించుకుంది. నిర్మల గురువారం రాత్రి చికెన్ తీసుకొచ్చి వంట చేసింది. రాత్రి పౌల్ట్రీ పనులు ముగించుకుని కుటుంబ సభ్యులంతా కలిసి భోజనాలు చేసి నిద్రించారు. పలుమార్లు ఫోన్చేసినా.. పౌల్ట్రీ యజమాని నాగభూషణం రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చేసరికి బాలరాజు కుటుంబ సభ్యులు నిదురించి ఉండటాన్ని గమనించి తిరిగి వెళ్లాపోయాడు. రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని, సమీపంలోని వ్యవసాయ బావివద్ద ఉన్న ఓ రైతును పంపించినా వారు లేవలేదని పౌల్ట్రీ యజమాని తెలిపాడు. ఉదయం 4గంటల సమయంలో వచ్చి చూసేసరికి కుటుంబ సభ్యులతంతా విగతజీవులై పడిఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశాడు. నష్టపరిహారం చెల్లించాలని బంధువుల డిమాండ్ తమ కుటుంబ సభ్యులను చంపేశారంటూ బాలరాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు నష్టపరిహారం అందించాలని పౌల్ట్రీ యజమానిని డిమాండ్ చేశారు. నష్టపరిహారంగా రూ.70లక్షలు ఇవ్వాలంటూ కోరారు. ఇందుకు పౌల్ట్రీ యజమాని అంగీకరించకపోవడంతో ఇరువర్గాల పెద్దలు చర్చలు జరిపారు. మృతుల కుంటుంబాలకు ఆర్థికసాయంగా రూ.4 లక్షలు అందజేసేందుకు అంగీకరించారు. రాజాపేటలో విషాదం రాజాపేట శివారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన మండలమే కాకుండా ఇతర జిల్లాలకు పాకడంతో, బంధువులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తాం : కలెక్టర్ అనితారామచంద్రన్ భువనగిరిఅర్బన్ : మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకవచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలో ఉన్న మృతదేహాలను సందర్శించారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. పోలీస్ విచారణ కొనసాగుతుందని, త్వరతిగతిన విచారణ చేసి కారణం ఏమిటో తెలుసుకుంటామన్నారు. అనంతరం మృతుల కుటుంబాలను పరమర్శించారు. మృతదేహాల తరలింపు విషయం తెలుసుకున్న బంధువులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి సొంత గ్రామమైన సిద్దిపే ట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామానికి తరలించారు. వృద్ధ దంపతుల మృతదేహాలను జనగాం జిల్లా లింగాల గ్రామానికి తీసుకెళ్లారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం రాజాపేట శివారులోని పౌల్ట్రీఫాంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్లూజ్టీమ్స్, డాగ్స్కాడ్స్ను రప్పించాం. సంఘటన స్థలంలో పురుగులమందు, కొన్ని ఆధారాలు దొరికాయి, పరీక్షల నిమిత్తం పంపించాం. బాలరాజు అన్న రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నాం. పోస్టుమార్టం చేసిన తర్వాతనే పూర్తి వివరాలు తెలుస్తాయి. – డీసీపీ రామచంద్రారెడ్డి -
కూతురు పెళ్లి చేసే ఆర్థిక స్థోమత లేక..
సంగారెడ్డి ,అక్కన్నపేట(హుస్నాబాద్): అయ్యో భగవంతుడా..! అన్నెపున్నెం ఎరుగని రైతును తీసుకుపోతివా అని పల్లెవాసులు కన్నీరు పెట్టారు. తర్కవానికుంటలో మంగళవారం రైతు కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. రైతు భగవాన్రెడ్డి, కొడుకు ప్రేమ్చందర్రెడ్డి, కూతురు రోజాల అంత్యక్రియలకు హాజరైన ప్రజలు ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరయ్యారు. భగవాన్రెడ్డి ఎవరికీ హాని తలపెట్టకుండా గ్రామస్తులతో కలిసిమెలిసి ఉండేవాడు. దీంతో జనం వారి అంత్యక్రియలకు తరలివచ్చారు. ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం తుర్కవానికుంటలో ఇదే మొదటిసారి కావడంతో ఆ విషాదం నుంచి పల్లె ఇంకా తేరుకోలేదు. చుట్టుముట్టిన సమస్యలను పరిష్కరించుకునే మార్గం లేక, ఎవరి సహాయం అందకపోవడం ఆ రైతును నిత్యం వేధించాయి. సమస్యల సుడిలో కూరుకుపోయిన రైతు లోకం విడిచి వెళ్లాలని నిర్ణయించకున్నాడు. వెంటాడిన నిరుద్యోగ సమస్య భగవాన్ రెడ్డి తన పిల్లలకు ఉన్నత చదువులు చదివించాడు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాడు. కానీ పిల్లులు నిరుద్యోగులుగా రెండేళ్ల నుంచి ఇంట్లోనే ఉంటున్న తీరును కలచివేసింది. ఉద్యోగాలు రావేమోననే బెంగ అతడిని కుంగదీసింది. కూతురు పెళ్లీడుకొచ్చింది. కానీ పెళ్లి చేసేంత ఆర్థిక స్థోమత లేదు. పిల్లల నిరుద్యోగ సమస్య, కూతురు పెళ్లి సమస్యలు రైతుకు జీవితం మీద విరక్తిని కలిగించాయి. పెద్ద చదువులు చదివిన పిల్లలు తనలాగే వ్యవసాయ పనులు చేయాల్సి వస్తోందని కలత చెందిన రైతు కుటుంబ సభ్యులందరూ కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. పిల్లలకు ఆహారంలో విషం ఇచ్చి తర్వాత దంపతులు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన ఊపిరితో భార్య కొట్టుమిట్టాడుతుండగా భగవాన్ రెడ్డి, అతడి పిల్లలు ఇద్దరు మరణించారు. అందరితో కలివిడిగా ప్రేమ్చందర్రెడ్డి.. ప్రేమ్చందర్రెడ్డి గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవాడు. నిత్యం ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉండేవాడు. ఎంబీఏ పూర్తి చేసిన ప్రేమ్చందర్రెడ్డి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. గతంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరీక్ష రాయగా 6 మార్కుల తేడాతో ఉద్యోగం చేజారింది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగ అన్వేషణలోనే ఉన్నాడు. వారం క్రితమే స్వగ్రామానికి వచ్చి తండ్రికి సహాయంగా వ్యవసాయ పనులు చేసేవాడు. ఏ రోజుకైనా ఉద్యోగం సంపాదిస్తాడు అని భావించే క్రమంలో ప్రేమ్చందర్రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం స్నేహితులను, గ్రామస్తులను కలిచి వేసింది. వేధించిన భూ సమస్య.. అక్కన్నపేట మండలంలో రెండు నెలల కింద ధర్మారంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరిగింది. దీనికి భగవాన్రెడ్డి హాజరయ్యారు. అతడు ఇతరుల నుంచి కొనుగోలు చేసిన (సర్వే నంబర్ 123(2)లో) 1.20 గుంటల భూమికి సంబంధించిన పట్టా ఉంది. దీంతోపాటు మరో రైతు దగ్గర 1.20 ఎకరాల భూమి సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి కబ్జాలో ఉంటూ సాగు చేస్తున్నాడు. సర్వే నంబర్ 123(2)లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతులకు సీలింగ్ పట్టాలు ఇచ్చారు. రైతు పేరున ఉన్న 1.20 ఎకరాలతోపాటు తాను మరో రైతు వద్ద కొనుగోలు చేసిన 1.20 ఎకరాల భూమిని పట్టా చేసుకోవడానికి అధికారుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకపోయింది. ఇది లావుణి పట్టా.. దీన్ని మరో రైతు పేరు మీదకు మార్చడం వీలు కాదని కొందరు చెప్పారు. దీంతో రైతు పట్టా చేసుకోవడం కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. తుర్కవానికుంటలో ప్రస్తుతం ఎకరా భూమికి రూ. 6లక్షలు ధర పలుకుతుండడంతో 1.20 ఎకరాలకు 9లక్షల భూమి తనకు దక్కకుండా పోతుందేమోనని రైతు ఆందోళన చెందాడు. కుటుంబ సమస్యలు, పిల్లల నిరుద్యోగం, బతుకు నిచ్చే భూమి పట్టా సమస్యలు రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించాయి. వివరాలు ఆరా తీసిన ఎమ్మెల్యే సతీష్కుమార్ అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని తర్కువానికుంటలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఇంటిని బుధవారం ఎమ్మెల్యే సతీష్కుమార్ సందర్శించారు. ముగ్గురి మృతికి ఆయన సంతాపం తెలియజేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అతడి బంధువులను అడిగి తెలుసుకున్నారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ భూక్య మంగ, నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మార్కెట్ చైర్మన్ లింగాల సాయన్న, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మ్యాక నారాయణ, తదితరులు ఉన్నారు. మృతుడి కుటుంబానికి జగ్గారెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయం అక్కన్నపేట(హుస్నాబాద్): పోతారం(జే) పంచాయతీ పరి« దిలోని తుర్కవానికుంట గ్రా మానికి చెందిన రైతు గుండా భగవాన్రెడ్డి కుటుంబం మంగళవారం ఆత్మహత్యకు యత్నించగా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భగవాన్రెడ్డి భార్య రాజవ్వ కరీంనగర్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతోంది. రాజవ్వను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించి కుటుంబానికి రూ. లక్ష నగదును అందించారు. ఆయనతోపాటు ఎల్లారెడ్డి, తదితరులు ఉన్నారు. -
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
-
రైతు కుటుంబం బలవన్మరణం
సాక్షి, సిద్దిపేట: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లలతో సహ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లాలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. అక్కన్నపేట మండలం తురకవానికుంట గ్రామానికి చెందిన రైతు గుండా భగవాన్రెడ్డి(50), భార్య రాజవ్వ, కొడుకు ప్రేమ్ చందర్ రెడ్డి, కూతురు రోజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే... వీరిలో భగవాన్రెడ్డి, ప్రేమ్ చందర్ రెడ్డి, రోజా మృతి చెందగా ప్రాణాపాయస్థితిలో ఉన్న రాజవ్వను హుస్నాబాద్ ఆస్పత్రిలో చేర్చారు. రాజవ్వ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. భార్య ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భగవాన్ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. కొడుకు కూతురు ఇద్దరూ ఎంబీఏ పూర్తి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
రామకూరు.. కన్నీరు మున్నీరు
జె.పంగులూరు/నరసరావుపేట టౌన్: ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలంలోని రామకురుకు చెందిన పెనుబోతు సోమశేఖర్, విజయలక్ష్మి దంపతులతోపాటు వారి ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట ఏరియా వైద్యశాలలో శవ పంచనామా నిర్వహించిన అనంతరం తల్లీబిడ్డల మృతదేహాలను మంగళవారం రామకూరుకు తీసుకొచ్చారు. తండ్రితోపాటు ఈ ముగ్గురి మృతదేహాలకు సాయంత్రం పోలీసుల పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగానే బంగారు నగలు పుట్టింటికి.. విజయలక్ష్మి రైలు కింద పడి మరణించాలని నిర్ణయించుకున్న విజయలక్ష్మి ఆ తరువాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. తన బిడ్డలతో ఫొటో తీయించుకోవడంతోపాటు, తన ఒంటిపై ఉన్న బంగారు నగలను, తీసి మూటగట్టి తెలిసిన వారితో పుట్టింటికి పంపింది. విజయలక్ష్మి ఇలా ఎందుకు చేసిందో ఆరా తీసి, బంధువులు అక్కడికి చేరకునే సరికే అనంత లోకాలకు పయమై పోయారు. తన ఇద్దరు పిల్లలను చీరతో కదలకుండా కట్టేసి నరసరావుపేటలో రైల్వే ట్రాక్పై పడేసింది. వారిపై రైలు ఎక్కిన తర్వాత తానూ అదే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిందని ఘటనాస్థలానికి సమీపంలో ఉన్నవారు తెలిపారు. ట్రాకు పక్కనే ఉన్న కొందరు పిల్లల కేకలు విని అక్కడికొచ్చేలోపే, దారుణం జరిగిపోయింది. తల్లి, ఇద్దరు పిల్లలు రైల్వే ట్రాకుపై రక్తపు మడుగులో నెత్తుటి ముద్దలుగా మారారు. సాయిగణేశ్ తల ఆనవాళ్లు మినహా విజయలక్ష్మి, దిగ్విజయ మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారాయి. ఆకారాలే లేవు. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్తున్నారా..? నీకేం కష్టం వచ్చిందమ్మా... చూస్తూ చూస్తూనే ఎంత పని చేశావే తల్లీ.. అంటూ విజయలక్ష్మి మృతదేహం వద్ద ఆమె తల్లి అన్నపూర్ణమ్మ రోదన.. గణేశా.. షేక్ హ్యాండ్ ఇవ్వరా.. అంటూ మనవల మృతదేహాల వద్ద తాత పేరయ్య విలపించిన తీరు చూపరుల హృదయాన్ని కలిచివేసింది. రోజూ బడికి వెళ్లే సమయంలో నాకు షేక్ హ్యాండ్ ఇచ్చే వాళ్లు కదా. ఈ రోజు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్తున్నారే.. ఇక నాకు ఎవరు షేక్ హ్యాండ్ ఇస్తారంటూ పేరయ్య మృతదేహాలపై పడి విలపించాడు. ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ రామకూరు వెళ్లి మృతదేహలకు నివాళులు అర్పించారు. బరువెక్కిన హృదయాలతో తుది వీడ్కోలు.. భర్త సోమశేఖర్ మృతదేహంతో సహా నలుగురికి ఒకే సారి బంధువులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో గ్రామంలోని పిల్లా పెద్దలతో సహా అందరూ పాల్గొన్నారు. గ్రామస్తులంతా మంగళవారం ఆ కుటుంబానికి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. చీరాల డీఎస్పీ ప్రేమ్కాజల్, సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ నాగరాజు తమ సిబందితో గ్రామంలో అవాంచనీయ సంఘటనలు ఎదురు కాకుండా పర్యవేక్షించారు. కుటుంబసభ్యుల ఆత్మహత్యలపై కేసు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఘటన వెనుక ఎన్నో ప్రశ్నలు.. ముక్కు పచ్చలారని పిల్లలను వదలకుండా వారితో సహా రైలు కింద పడి మృతిచెందిన తల్లి విజయలక్ష్మి, ఎందుకంత కర్కశ నిర్ణయం తీసుకుంది? చిన్న కారణానికే పంతం పట్టి మరణించాలని నిర్ణయించుకుందా? వారిపై ఎంత ప్రేమ లేకపోతే వారి మరణ వార్త విన్న వెంటనే భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాడు? ఇవన్నీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నలుగా మిగిలాయి. తన భర్త ఆయన తండ్రి, సోదరుడితో కలిసి వ్యవసాయం చేయడం, ప్రతి అవసరానికి డబ్బులు వారిని అడుగుతుండటంపై తరచూ సోమశేఖర్, విజయలక్ష్మి దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవని బంధువలు ద్వారా తెలిసింది. సోమవారం కుమార్తె పుట్టిన రోజు సందర్బంగా కొత్త బట్టలు తెచ్చే విషయంలో గొడవ జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనకు ఇదే కారణం అయివుండవచ్చిన కొందరు భావిస్తున్నారు. -
ఒకే కుటుంబంలో 8మంది ఆత్మహత్యాయత్నం..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై యోగప్పనగర్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ఐదుగురు మృతిచెందగా, ముగ్గురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వీరిని పక్కింటి వాళ్లు గుర్తించి, మధురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురికి చికిత్స చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, వ్యాపారంలో నష్టాల వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
కబళించిన పేదరికం
ఆర్థిక సమస్యలతో తనువు చాలించిన కుటుంబం ♦ ఇంట్లో వస్తువులు అమ్మి..ఆలుబిడ్డలను పొషిస్తూ... ♦ సతులకు అనారోగ్యం.. నిత్యం జీవన్మరణం ♦ దేవుడి వద్దకంటూ కానరాని లోకానికి ♦ ఒకేసారి అందరూకలిసి ఆత్మహత్య ♦ మైలవరం రిజర్వాయర్ చరిత్రలో పెద్ద దుర్ఘటన ఎప్పుడు ఏ ఆపద వచ్చి చుట్టుముడుతుందో ఎవరికీ తెలియదు. పేదరికానికి తోడు..అనారోగ్య సమస్యలు కుటుంబాన్ని వేధించాయి. మరోవైపు పెళ్లీడుకు వచ్చిన పిల్లలను కళ్లెదుటే చూస్తున్నా అంతో ఇంతో వెనకేసుకోలేకపోయామన్న మనోవేదన కుటుంబాన్ని కుంగదీసింది. ఇంటిలో జరగుబాటులేక..ఒకప్పుడు కొనుక్కున్న వస్తువులను సైతం అమ్ముకుని జీవనాన్ని సాగించారని తెలిస్తేనే మనస్సు తల్లడిల్లిపోతుంది. ఏమి చేయలేక..ఎలా బతకాలో తెలియక కొన్ని రోజులుగా కుటుంబం అనునిత్యం నరకయాతన అనుభవిస్తూ వచ్చింది. సమాజంలో అందరితో సమానంగా జీవించాలన్నా..అనుకున్నన్ని ఆర్థిక పరిస్థితులు లేక తప్పని పరిస్థితుల్లో వారి మరణ శాసనాన్ని వారే రాసుకున్నారు. అందరూ ఒకేసారి కలిసికట్టుగా చివరిసారిగా మెటికల్లో కూర్చొని మాట్లాడుకున్న అనంతరం జలాల్లోకి దూకి తనువు చాలించారు. పేదరికం వలలో చిక్కి ఐదుగురు చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది. సాక్షి, కడప/జమ్మలమడుగు రూరల్/మైలవరం : జమ్మలమడుగు మండలం గూడెం చెరువు వద్దనున్నరాజీవ్ నగర్ కాలనీకి చెందిన వాహిద్ (45), భార్యలు షమీమ్బేగం, ఆషాబేగం, కుమార్తెలు షబాన, మహబూబ్బీ శుక్రవారం మైలవరం రిజర్వాయర్లో శవాలుగా కనిపించారు. అయితే ముందురోజు రాత్రే ప్రాజెక్టు వద్దకు చేరుకుని దూకారా? లేక శుక్రవారం తెల్లవారుజామున తనువు చాలించారా?అన్నది తెలియరాలేదు. అయితే వాహిద్ చేసుకున్న ఇద్దరు భార్యల్లో షమీమ్కు అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతూనే వస్తోంది. మరోవైపు ఆషాబేగం గుండెజబ్బు నేపథ్యంలో మందులు వాడుతూ వస్తున్నారు. వారి మందుల ఖర్చులకుపెద్ద ఎత్తున వెచ్చించాల్సి వస్తోంది. ముందే సంపాదన అంతంత మాత్రం...అనారోగ్యానికి ఖర్చులు పెరిగిపోతుండడం కూడా వారికి సమస్యగా మారింది. సమస్యలతో సతమతం గూడెంచెరువు రాజీవ్నగర్ కాలనీకి చెందిన వాహిద్ ఏడాది కిందటి వరకు ఆయిల్ ట్యాంకర్కు డ్రైవర్గా వెళుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కాలనీలో ప్రభుత్వ పక్కాగృహంలో నివాసం ఉండేవారు. ఎప్పుడైతే ట్యాంకర్ డ్రైవర్ నుంచి తప్పుకున్నాడో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. భార్యల అభ్యర్థన మేరకు డ్రైవర్ వృత్తి మానుకుని ఇతర పనులు చేసుకునేందుకు సిద్ధమైనా పరిస్థితులు అనుకూలించక నరకయాతన అనుభవిస్తూ వచ్చాడు. వాహిద్తోపాటు ఇద్దరు భార్యలు ఏదో ఒక పనికి వెళుతున్నా కుటుంబం ఆర్థిక కోరల్లో ఇరుక్కుని బయటపడలేకపోయింది. దీంతో జీవితం వారికి రానురాను నరకప్రాయంగానే మారి చివరకు తనువు చాలించేలా చేసింది. పెళ్లీడుకు వచ్చిన పిల్లలు వాహిద్కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె షబానా, చిన్న కూతురు మహబూబ్బీ కూడా పెళ్లీడుకొచ్చారు. అంతో ఇంతో వెనుకోవాల్సిన సమయంలో కూడా డబ్బులు మిగులుబాటు లేకపోవడం వేదనకు గురి చేస్తూ వచ్చింది. ఏం చేయాలో అర్థంగాని పరిస్థితుల్లో వారందరూ ఒకేసారి కలిసికట్టుగా మరణ శాసనాన్ని రాసుకున్నారు. పదిమందికి తమ పరిస్థితి తెలియకుండానే కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చినప్పటికీ...గత్యంతరం లేని పరిస్థితుల్లోనే చనిపోవాలనే నిర్ణయానికి వచ్చి రిజర్వాయర్లో దూకి ఆత్మహత్యకు పూనుకున్నారు. మైలవరం డ్యాంలో అతి పెద్ద ఘటన ఆర్థిక కోరల్లో చిక్కి బయటికి రాలేక కుటుంబం ఆత్మహత్యకు పూనుకున్న ఘటన జిల్లాలో సంచలనం రేపింది. మైలవరం ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఘటన చోటుచేసుకోలేదు. గతంలో పదేళ్ల కిందట వినాయక నిమజ్జనం సందర్బంగా ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడి ముగ్గురు మృతి చెందారు. అదేపెద్ద ఘటనగా ఇప్పటి వరకు ఉండేది. ప్రస్తుతం వాహిద్ కుటుంబం మొత్తం రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రిజర్వాయర్ చరిత్రలో పెద్ద ఘటనగా మిగిలిపోయింది. దర్గాకని చెప్పి.. కానరాని లోకానికి కర్నూలుజిల్లాలో ఉన్న ఎల్లార్తి దర్గా గురువుల వద్దకు వెళుతున్నామని బయలుదేరిన వాహిద్ కుటుంబం నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దర్గాకు వెళుతున్నామని చెప్పి కానరాకుండా వెళ్లారా అంటూ వాహిద్ బంధువులు మృతదేహాలపై పడి రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. అంతేకాకుండా రెండేళ్లలోపే వాహిద్ అన్నదమ్ముల్లో ఇద్దరు ప్రమాదాల్లో మృతి చెందిన నేపథ్యంలో వారు తేరుకోలేకపోతున్నారు. అందులోనూ మైలవరం రిజర్వాయర్ వద్ద నీటిలోకి దిగేందుకు ఉన్న మెట్ల వద్ద ఐదుగురు చివరిక్షణాల్లో కూర్చొని మాట్లాడుకున్న అనంతరం వారు ఒకేమాటపై నీటిలోకి దూకినట్లు తెలిసింది. అసలు ఘటన తలుచుకుంటేనే అందరినీ కుదిపేస్తోంది. -
పోషణ భారమై కుటుంబం ఆత్మహత్య
- మైలవరం జలాశయంలో దూకి బలవన్మరణం - వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఘటన మైలవరం: కుటుంబ యజమాని అరకొర సంపాదనతో ఇల్లు గడవక, పోషణ భారమై జీవితం మీద విరక్తి చెందిన ఓ కుటుంబం జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హృదయ విదారకమైన ఈ ఘటన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని గూడెం చెరువులో శుక్రవారం చోటుచేసుకుంది. షేక్ వాహిద్ (45) తన ఇద్దరు భార్యలు షమీమ్ బేగం (41), ఆశా బేగం (39), కుమార్తెలు మహబూబ్ బీ (19), షబాన (17)లతో కలిసి స్థానిక రాజీవ్ నగర్ కాలనీలో నివసిస్తున్నాడు. వాహిద్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. వ్యక్తిగత భద్రత రీత్యా ఆ వృత్తిని మానేసిన వాహిద్ చిన్నాచితక పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదాయం తగ్గి ఖర్చులు పెరగడంతో అతనిలో ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఇద్దరు భార్యలు అనారోగ్యం బారిన పడటంతో వారికి వైద్యానికి ఖర్చయ్యేది. ఈ పరిణామాలతో జీవితంమీద విరక్తి చెందిన ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం ఉదయం ఎల్లార్తిదర్గాకు వెళ్తున్నామని చుట్టుపక్కల వారికి చెప్పిన వాహిద్ కుటుంబ సభ్యులు మైలవరం చేరుకున్నారు. అక్కడే ఉన్న అతిథిగృహం ఆవరణ సమీపంలో గట్టుపై చెప్పులు, ఆధార్కార్డులు వదిలేసి మూకుమ్మడిగా జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యాహ్నం మూడు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి∙గజ ఈతగాళ్ల సాయంతో మిగతా రెండు మృతదేహాలను వెలికి తీయించారు. వాటిని పోస్ట్మార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు , కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుటుంబం ఆత్మహత్యపై మంత్రి దిగ్ర్భాంతి
కరీంనగర్: మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి కారుకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. -
కరీంనగర్ జిల్లాలో విషాదం
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని హుజూరాబాద్ మండలం కందుగులలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామంలోని గంగిరెడ్డి కాలనీకి చెందిన గంట కొమరయ్య(36), కొమరమ్మ(34) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అత్తారింటికి వెళ్లిన సందర్భంలో మంత్రాలు చేస్తున్నారని నింద వేయడంతో మనస్తాపానికి గురై ఇంటికి తిరిగొచ్చి తన ముగ్గురు పిల్లలు ఎల్లమ్మ(10), కొమరవ్వ(8), అంజమ్మ(6)లకు ఉరి వేసి అనంతరం దంపతులు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య
శామీర్పేట్: మేడ్చల్ జిల్లా శామీర్పేట్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఓ కుమార్తె పూజిత మృతదేహం లభ్యం కాగా, తండ్రి అర్జున్, కొడుకు ధనుష్ మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారు నగరంలోని సికింద్రాబాద్ రసూల్పూర్ వాసులుగా అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లాడ్జిలో కటుంబం ఆత్మహత్యాయత్నం
ఇద్దరు చిన్నారులు మృతి పరారీలో తల్లిదండ్రులు సామర్లకోట లాడ్జిలో ఘటన దంపతులపై 302 కేసు నమోదు సామర్లకోట : పట్టణంలోని లాడ్జిలో ఓ కుటుంబం ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘనటలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వారి తల్లిదండ్రులు పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా పార్వతీపురానికి (బెలగామ్) చెందిన కోడూరి సత్యనారాయణ, గౌరమ్మ దంపతులతో పాటు వారి పిల్లలు శిరీష(9), అనూష (7) గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రైల్వేస్టేషన్ సెంటర్లో ఉన్న ఎన్ఆర్సీ లాడ్జి, రూమ్ నంబర్ 106లో దిగారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో భార్యభర్తలు ఇద్దరు బయటకు వెళ్తున్నట్టు చెప్పి శుక్రవారం మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తన తోడల్లుడు కొప్పంగి సతీష్కు ఫోన్ చేసి, తాము ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేయగా పిల్లలు చనిపోయారని, తాము కూడా బయటకు వెళ్లి చనిపోతున్నామని చెప్పినట్టు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. సతీష్ సమాచారం మేరకు పోలీసులు లాడ్జి వద్దకు వచ్చి విచారణ ప్రారంభించారు. «కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి నలుగురు తాగగా... చిన్నారులు కావడంతో వారు పిల్లలు చనిపోయారని, ఈ విషయాన్ని గమనించిన సత్యనారాయణ, గౌరమ్మ పరారయ్యారని సీఐ చెప్పారు. వీరిపై 302 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారి నుంచి వచ్చిన సెల్ఫోన్ టవర్ ఆధారంగా వారిని గుర్తిస్తామని చెప్పారు. సత్యనారాయణ తోడళ్లుడు సతీష్ విశాఖపట్నం నుంచి శుక్రవారం సామర్లకోట చేరుకున్నారు. 12 రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళుతున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వారి నుంచి ఎటువంటి ఫోన్ లేదని సతీష్ విలేకరులకు చెప్పారు. శుక్రవారం ఉదయం ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం తెలిపి, ఇక్కడికి వచ్చానన్నారు. తన తోడళ్లుడు పెద్దవాల్తేరులో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఇటీవలే రూ.లక్షతో మరమ్మతులు చేయించాడని, నెలకు రూ.2,500 అద్దె కూడా సక్రమంగా చెల్లిస్తున్నాడని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని సతీష్ తెలిపారు. విషయం తెలుసుకుని వచ్చిన పిల్లల తాత కొత్త సన్యాసిరావు (గౌరమ్మ తండ్రి) మనవరాళ్ల మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఎంతో చలాకీగా ఉండే పిల్లలను పుణ్యక్షేత్రాలకు తీసుకువెళుతున్నానని చెప్పి తన అల్లుడే చంపేశాడని రోదించారు. లాడ్జి గుమస్తా నక్కా భాస్కరరావు మాట్లాడుతూ సత్యనారాయణ ఒక రోజుకు అడ్వాన్సుగా రూ.500 చెల్లించారని, రూమ్ అద్దె రూ.350 పోగా మిగిలిన సొమ్ము 24 గంటలు దాటినా ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం రూమ్ను పరిశీలించామన్నారు. రూము తలుపు తెరువక పోవడంతో ఏమి జరిగి ఉంటుందోనని వెనుక కిటికీ నుంచి చూడగా ఇద్దరు పిల్లలు మంచంపై ఉన్నారని, దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేసేలోపే పోలీసులు లాడ్జి వచ్చారని విలేకర్లకు చెప్పారు. మృతుల చిన్నాన్న సతీష్ ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ వెంట ఎస్సై ఎల్.శ్రీనివాసు, ఏఎస్సై జీవీవీ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు. ఫోన్ ఆధారంగా సత్యనారాయణ దంపతులు సికింద్రాబాద్లో ఉన్నట్టు పోలీసులు శుక్రవారం రాత్రి గుర్తించారు. -
ఫాదర్స్డే రోజున తండ్రి ఓ ఘాతుకం
► భార్యా, ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య ► ముగ్గురి మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం విజయవాడ: నాన్న అంటే అండ, ఏకష్టమొచ్చినా నేనున్నానంటూ మన వెన్నుతట్టి మనల్ని ముందుకు నడిపిస్తాడు. మన కోసం తను కష్టపడుతూ మనకు సంతోషాన్ని అందించడానికి నిరంతరం పరితపిస్తాడు. అలాంటిది ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న బిడ్డలను విషమిచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ నగరంలో ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యతో పాటు ముగ్గురు పిల్లలకు విషమిచ్చి అనంతరం తాను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని కృష్ణలంకలోని రణదివే నగర్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సురేష్(30), యశోద(28) దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి కుమారుడు అమీర్ పుట్టినరోజు వేడుకలు జరిపిన అనంతరం సురేష్ తన భార్యా ముగ్గురు పిల్లలకు విషం కలిపిన ఆహరం ఇచ్చి తర్వాత తాను కూడా ఆ ఆహారం తీసుకున్నాడు. అయితే వీరిలో సురేష్, యశోదతో పాటు కుమారుడు అమీర్(10) మృతిచెందగా.. ఇద్దరు కుమార్తెల పరిస్థితి విషమంగా మారింది. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్య
-
ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్య
నవాబ్పేట: మహబూబ్నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నవాబ్పేట మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మీనారాయణ(50), అలివేలు(45) దంపతులు కూతురు సుప్రజ(21) ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం రాత్రి బుధ్ద పూర్ణిమ సందర్భంగా రామేశ్వరంలోని శివాలయంలో నిద్రచేసి తిరిగి వస్తున్న ముగ్గురు గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. లక్ష్మీనారాయణ, అలివేలు అప్పటికే మృతిచెందారు. కొన ఊపిరితో ఉన్న సుప్రజను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: కుటుంబమంతా ఆత్మహత్య
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చిన ఒక కుటుంబంలోని ముగ్గురు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక విజయేంద్ర వసతి భవనంలో పుదుచ్చేరికి చెందిన దంపతులు తమ పదేళ్ల కూతురికి విషం ఇచ్చి అనంతరం ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య
-
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య
పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ యజమాని జట్టి సురేష్(30) అనే వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య సరిత(26), ఇద్దరు పిల్లలు నరేందర్(8), నాగచైతన్య(6) మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కోడలి వేధింపులతో.. కుటుంబం ఆత్మహత్య
కోడలు పెట్టిన వేధింపులు, ఆమె బెదిరింపులు తట్టుకోలేక నోయిడాకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రాంచీలోని ఒక ఫ్లాట్లో ఈనెల 9వ తేదీన ఐదుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయి. వాళ్లంతా పెద్ద మొత్తంలో మత్తుమందు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారితో పాటు నోయిడాకు చెందిన డాక్టర్ సుకాంత సర్కార్ ఒంటిమీద తీవ్రమైన గాయాలతో కనిపించారని పోలీసులు చెప్పారు. కుటుంబం మొత్తం తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతోందని, వాళ్లు తొలుత నోయిడాలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, తర్వాత రాంచీ వరకు వచ్చి ఇక్కడ చనిపోయారని తెలిపారు. వాళ్లతో పాటు ఆ ఇంటి కోడలు మాత్రం రాలేదు. ఆత్మహత్య వద్దని తమవాళ్లకు చెప్పేందుకు తాను ఎంతగానో ప్రయత్నించినట్లు డాక్టర్ సర్కార్ చెప్పారు. కుటుంబంలో 63 ఏళ్ల సర్కార్, ఆయన భార్య అంజన (60), కుమారుడు సమీర్ (35), మనవరాలు సమీత (7), సమీర్ మరదలు మౌమిత (35), ఆమె కూతురు సుమిత (5) ఉన్నారు. వీళ్లలో మౌమిత.. సర్కార్ కోడలికి సొంత చెల్లెలు. ఈనెల 8వతేదీ రాత్రి 10-11 గంటల మధ్య సమయంలో అంజన, సమీర్, మౌమిత భారీమొత్తంలో మత్తుమందు ఇంజెక్షన్ తీసుకున్నారు. తర్వాత అంజన, మౌమిత కలిసి పిల్లలిద్దరికీ కూడా అవే ఇంజెక్షన్లు ఇచ్చారు. కాసేపటి తర్వాత అందరూ స్పృహతప్పి పడిపోయారు. డాక్టర్ సర్కార్ ఒక కత్తి తీసుకుని తనను తాను తీవ్రంగా పొడచుకుని గాయపర్చుకున్నారు గానీ.. 'దురదృష్టవశాత్తు' తన ప్రాణాలు పోలేదని ఆయన అన్నారు. తన కోడలు తామందరి మీద వరకట్న వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించేదని, తన సోదరి మౌమితతో సమీర్, తాను కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటూ ఆరోపించేదని ఆయన వాపోయారు. ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఆమెకు జత కలిసింది. భోపాల్లో ఉండే మౌమిత భర్త కూడా ఈ దుర్ఘటన జరిగినరోజు రాత్రి రాంచీ వచ్చినా.. అతడు వేరే బంధువుల ఇంటికి వెళ్లాడు. డాక్టర్ సర్కార్ ప్రాణాలకు ముప్పు పలేదని, రెండు మూడు రోజుల్లో ఆయనను ఈ కేసు విషయంలో ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పారు. -
కుమార్తె, కుమారుడికి విషమిచ్చి..
ప్రొద్దుటూరు: అతనికి ఏం కష్టం వచ్చిందో ఏమో తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆపై అతను కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం సాయంత్రం సంబటూరులో చోటు చేసుకుంది. కమలాపురం మండలం సంబటూరు గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రొద్దుటూరుకు చెందిన జంపాల చంద్రశేఖర్రెడ్డి శీతల పానీయంలో విషం కలిపి కుమారుడు మంజునాథరెడ్డి, కుమార్తె హన్సికలకు తాగించి, తాను కూడా తాగాడు. వారిని పొలాల్లో పనిచేస్తున్న స్థానికులు గమనించి వెంటనే 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని నాగేంద్ర నగర్కు చెందిన చంద్రశేఖర్రెడ్డి శెనగలు, వరి ధాన్యం కమీషన్ వ్యాపారం చేస్తున్నాడు. అతను మేనత్త కూతురు రమాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇంటర్ చదువుతున్న మంజునాథరెడ్డి, 3వ తరగతి చదువుతున్న హన్సికలు ఉన్నారు. వీరిది మేనరికం వివాహం కావడంతో పిల్లల ఆరోగ్యం సరిగా లేదు. ఈక్రమంలో ఐదేళ్ల క్రితం వీరికి ఆనారోగ్యం చేయడంతో హైదరాబాద్లోని ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు పిల్లలిద్దరికి 20 ఏళ్లు వచ్చిన తర్వాత మంచాన పడతారని, నడవలేరని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర కలత చెందారు. అప్పట్లోనే ఇంటికి వచ్చిన నెల రోజుల తర్వాత రమాదేవి శీతల పానీయంలో శెనగ గుళికలు కలిపి పిల్లలకు తాగించింది. ముందుగా రమాదేవి తాగి మంజూనాథరెడ్డికి తాగిస్తుండగా కొద్దిగా నోట్లో పెట్టుకున్న అతను గ్లాసును విసిరిగొట్టాడు. కుమార్తెకు కూడా తాగిస్తుండగా మంజునాథరెడ్డి గ్లాసును చేత్తో విసిరివేశాడు. అయితే రమాదేవి ఎక్కువగా తాగడంతో మృతి చెందింది. కొద్దిగా సేవించిన మంజునాథరెడ్డిని ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఏడాది తర్వాత చంద్రశేఖర్రెడ్డి ముద్దనూరుకు చెందిన కవితను పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిన్నర తర్వాత విఘ్నేశ్వరుడు అనే కుమారుడు జన్మించాడు. శీతల పానీయంలో విషం కలిపి గత కొన్నినెలల నుంచి చంద్రశేఖర్రెడ్డి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు సన్నిహితులు, బంధువులు చెబుతున్నారు. అంతేగాక పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా అతను గుర్తుకు తెచ్చుకుని రోదించేవాడన్నారు. ఈ క్రమంలో గురువారం కాలేజిలో ఉన్న కుమారుడు మంజునాథరెడ్డిని, పాఠశాలలో ఉన్న హన్సికలను మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి తీసుకొచ్చాడు. వారిని మోటార్ బైక్లో కూర్చోబెట్టుకుని సంబటూరు సమీపంలోని ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్లాడు. అక్కడ ముందే విషం కలిపిన మాజాను పిల్లలకు తాగిపించి తాను కూడా తాగాడు. వీరు ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు 108కు సమాచారం అందించారు. ప్రస్తుతం ముగ్గురు ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
కుమార్తె, కుమారుడికి విషమిచ్చి..
-
కుమార్తె, కుమారుడికి విషమిచ్చి..
ప్రొద్దుటూరు క్రైం: అతనికి ఏం కష్టం వచ్చిందో ఏమో తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆపై అతను కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం సాయంత్రం సంబటూరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కమలాపురం మండలం సంబటూరు గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రొద్దుటూరుకు చెందిన జంపాల చంద్రశేఖర్రెడ్డి శీతల పానీయంలో విషం కలిపి కుమారుడు మంజునాథరెడ్డి, కుమార్తె హన్సికలకు తాపి, తాను కూడా తాగాడు. వారిని పొలాల్లో పనిచేస్తున్న స్థానికులు గమనించి వెంటనే 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు ప్రొద్దుటూరులోని నాగేంద్ర నగర్కు చెందిన చంద్రశేఖర్రెడ్డి శనగలు, వరి ధాన్యం కమీషన్ వ్యాపారం చేస్తున్నాడు. అతను మేనత్త కూతురు రమాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇంటర్ చదువుతున్న మంజునాథరెడ్డి, 3వ తరగతి చదువుతున్న హన్సికలు ఉన్నారు. వీరిది మేనరికం వివాహం కావడంతో పిల్లల ఆరోగ్యం సరిగా లేదు. ఈక్రమంలో ఐదేళ్ల క్రితం వీరికి ఆనారోగ్యం చేయడంతో హైదరాబాద్లోని ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు పిల్లలిద్దరికి 20 ఏళ్లు వచ్చిన తర్వాత మంచాన పడతారని, నడవలేరని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర కలత చెందారు. అప్పట్లోనే ఇంటికి వచ్చిన నెల రోజుల తర్వాత రమాదేవి శీతల పానీయంలో శనగ గుళికలు కలిపి పిల్లలకు తాపించింది. ముందుగా రమాదేవి తాగి మంజూనాథరెడ్డికి తాపిస్తుండగా కొద్దిగా నోట్లో పెట్టుకున్న అతను గ్లాసును విసిరిగొట్టాడు. కుమార్తెకు కూడా తాపిస్తుండగా మంజునాథరెడ్డి గ్లాసును చేత్తో విసిరివేశాడు. అయితే రమాదేవి ఎక్కువగా తాగడంతో మృతి చెందింది. కొద్దిగా సేవించిన మంజునాథరెడ్డిని ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఏడాది తర్వాత చంద్రశేఖర్రెడ్డి ముద్దనూరుకు చెందిన కవితను పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిన్నర తర్వాత విఘ్నేశ్వరుడు అనే కుమారుడు జన్మించాడు. శీతల పానీయంలో విషం కలిపి గత కొన్నినెలల నుంచి చంద్రశేఖర్రెడ్డి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు సన్నిహితులు, బంధువులు చెబుతున్నారు. అంతేగాక పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా అతను గుర్తుకు తెచ్చుకుని రోదించేవాడన్నారు. ఈ క్రమంలో గురువారం కాలేజిలో ఉన్న కుమారుడు మంజునాథరెడ్డిని, పాఠశాలలో ఉన్న హన్సికలను మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి తీసుకొచ్చాడు. వారిని మోటార్ బైక్లో కూర్చోబెట్టుకుని సంబటూరు సమీపంలోని ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్లాడు. అక్కడ ముందే విషం కలిపిన మాజాను పిల్లలకు తాపించి తాను కూడా తాగాడు. వీరు ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు 108కు సమాచారం అందించారు. ప్రస్తుతం ముగ్గురు ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
కన్నతల్లికి, పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య
నల్గొండ : పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరిలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. తన కన్న తల్లితో పాటు ముగ్గురు చిన్నారులకు పురుగుల మందు తాగించిన రమేష్... అనంతరం అతడు అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన స్థానికులు శనివారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు బాలికలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్యలకు కారణం ఆర్థిక ఇబ్బందులే అని బంధువులు చెబుతున్నారు. మృతులను పద్మ (62), రమేష్ (42), సర్వూప (8), కావేరి (4), నందిని (2)గా గుర్తించారు. -
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
* భార్యాపిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న బాలరాజ్ * హైదరాబాద్ సీతారాంబాగ్లో విషాదం హైదరాబాద్: అప్పుల బాధకు ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కవల పిల్లలు మృతిచెందారు. హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్లో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి... సీతారాంబాగ్ అఫ్జల్సాగర్ పాలమూరు బస్తీ వాసి, పాత సామాన్ల వ్యాపారస్తుడైన బాలరాజ్(30), సురేఖ(24) భార్యాభర్తలు. వీరికి 13 నెలల కవలలు మేథ, మేఘన. బాలరాజ్ తల్లి మణెమ్మ, సోదరుడు ప్రేమ్తో కలసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. బాలరాజ్ వ్యాపారం దివాలా తీయడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకొస్తున్నాడు. రెండు నెలలుగా ఖాళీగా ఉండటంతో అప్పులు అధికమై, వడ్డీలు పేరుకుపోయాయి. బాకీల కోసం అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగింది. వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురైన బాలరాజ్ ఆదివారం రాత్రి భోజనం చేసిన తరువాత తన కుటుంబంతో ఓ గదిలోకి వెళ్లారు. తొలుత భార్యకు కూల్డ్రింక్లో, పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి... అనంతరం అతను ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం 9 గంటలైనా గదిలో నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు.. తలుపులు పగులగొట్టాడు. పరుపు మీద సురేఖ, పిల్లలు.. ఫ్యాన్కు వేలాడుతూ బాలరాజ్ కనిపించారు. వారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఆర్థిక కారణాలే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గోషామహాల్ ఏసీపీ రాంభూపాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హృదయ విదారక దృశ్యం చూసి బస్తీవాసులు కన్నీటి పర్యంతమయ్యారు. -
కోరిక తీర్చాలంటూ ఆటోడ్రైవర్ వేధింపులు
-
కుటుంబం ఆత్మహత్యాయత్నం
-
బిడ్డను బతికించలేక.. విషమిచ్చారు!
-
బిడ్డను బతికించలేక.. విషమిచ్చారు!
పురుగులమందు తాగి తామూ ఆత్మహత్య చిత్తూరులో కుటుంబం విషాదం సాక్షి, చిత్తూరు: పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేక తల్లిదండ్రులు పాలలో విషం కలిపి ఆ బిడ్డ ప్రాణం తీశారు. కడుపు కోత భరించలేక తామూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయ విదారక సంఘటన సోమవారం చిత్తూరులో చోటుచేసుకుంది. పట్టణంలోని గిరింపేట గాంధీనగర్కు చెందిన ఈశ్వరరావు (31) రవాణా శాఖలో హోం గార్డు. అతని భార్య రజని (24). వీరికి ఐదు నెలలక్రితం కొడుకు రిత్విక్ జన్మించాడు. పుట్టినప్పటి నుంచి ఈ చిన్నారి నిమోనియాతో బాధపడుతున్నాడు. చిత్తూరు, వేలూరు, తిరుపతిలోని ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం కనిపించలేదు. మెరుగైన చికిత్స చేయించే స్థోమతలేదు. దీంతో మనో ధైర్యాన్ని కోల్పోయిన దంపతులు బిడ్డను బతికించుకోలేమని నిర్ధారణకు వచ్చారు. సోమవారం ఉదయం ఇంట్లోనే పాలలో విషం కలిపి బిడ్డకు తాగించారు. అనంతరం బిడ్డలేని బతుకు మాకెందుకని వారు కూడా పురుగుల మందు తాగారు. రిత్విక్ ఇంట్లోనే చనిపోగా, రజని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఈశ్వరరావు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. కాగా సోమవారం రాత్రి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈశ్వరరావు భార్య రజని ప్రస్తుతం 3 నెలల గర్భవతి అనీ, ఆమె గర్భంలో మగ బిడ్డ ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం వారికి ముందే తెలిసి ఉంటే ఇలా బలవన్మరణానికి పాల్పడి ఉండేవారు కాదేమోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిజామాబాద్జిల్లా బోధన్లో విషాదం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్లో ఓ కుటుంబంలో విషాదం నెలకుంది. కుంటుంబ కలహాలతో తండ్రి, కూతురు, ఆత్యహత్యకు పాల్పడారు. 10 రోజుల క్రితమే తండ్రి దుబాయ్ నుంచి వచ్చాడు. -
వీటీపీఎస్ కెనాల్లో ముగ్గురు గల్లంతు
విజయవాడ: ఇక్కడి ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో గురువారం తండ్రి, ఇద్దరు కొడుకులు దూకి గల్లంతయ్యారు. వారి బంధువైన ఓ వృద్ధురాలు కూడా దూకగా, స్థానికులు కాపాడారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన మహేశ్వర హనుమాన్ ప్రసాద్ (35) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య శ్రీలక్ష్మితో అతడికి మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ప్రసాద్ తన కుమారులు శివభార్గవ్(9), గోపీచంద్(7)తో కలిసి అమ్మమ్మ వరుసైన పులిపాటి పుష్పావతి(70) ఇంటికి చేరాడు. ఆమెతో కలిసి గురువారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం వచ్చాడు. తామందరం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్యకు ఫోన్చేసి చెప్పాడు. అనంతరం అంతా కలసి స్థానిక ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్ వంతెనపై నుంచి కాలువలో దూకారు. స్థానికులు పుష్పావతిని కాపాడారు. హనుమాన్ప్రసాద్, ఇద్దరు కుమారుల ఆచూకీ దొరకలేదు. వీరి ఆత్మహత్యాయత్నానికి కారణం తెలియలేదు. -
భార్యాబిడ్డలను చంపి సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!
హైదరాబాద్ : హైదరాబాద్ మాదాపూర్లోని మైహోం అపార్ట్మెంట్లో విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొడుకుతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ మనీష్ సాహు, అతని భార్య శ్వేతాసాహు, మూడేళ్ల కుమారుడు యాష్ సాహులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మనీష్ సాహు గత నాలుగు రోజుల నుంచి విధులకు హాజరు కాకపోవటంతో తోటి ఉద్యోగులు అతని నివాసానికి వచ్చారు. వారు నివాసం ఉంటున్న 108 ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు ఎంతకి తెరవకపోవడంతో పగులకొట్టి చూడగా సాహు కుటుంబీకులు విఘత జీవులుగా కనిపించారు. మృతదేహాలు ఉన్న పరిస్థితిని బట్టి ఆత్మహత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనా. వారంతంలో సాహు దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. తల్లీకొడుకులు రక్తపు మడుగులో ఉండగా, సాహు అదే గదిలో కిటికీకి ఉరేసుకుని ఉన్నాడు. సాహు ముందుగా భార్యాబిడ్డలను హతమార్చి అనంతరం తాను ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. -
చెప్పుతో కొట్టారన్న మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య
దంపతులు సహా ఇద్దరు పిల్లల బలవన్మరణం ఆర్థిక ఇబ్బందులు కూడా మరో కారణం అంటున్న స్థానికులు ఆత్మహత్యకు కారకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు లాలాపేట, న్యూస్లైన్ : ఓ వ్యక్తి చెప్పుతో కొట్టిందని మనస్తాపానికి గురైన ఓ నిండు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం లాలాగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిన్నారుల మృతదేహాలను చూసి స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్లో పేర్కొన్న విషయాలు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. తార్నాక డివిజన్ శాంతినగర్, ఆర్యానగర్కు చెందిన ప్రవీణ్కుమార్(33) భార్య స్వాతి(29) ఇద్దరు కుమార్తెలు వర్షిత(05) అక్షయ కృప(03)లతో అద్దె ఇంట్లో మూడవ అంతస్తులో ఉంటున్నారు. ప్రవీణ్కుమార్ కొంత కాలం ఓ ఎలక్ట్రానిక్ చానల్లో ప్రోగ్రాం ప్రొడ్యూసర్గా పనిచేసి మానేశాడు. ప్రస్తుతం ఓ యాడ్ ఎజెన్సీలో కన్స్ల్టెంట్గా ఉన్నాడు. స్వాతి ఇంట్లో టైలర్ పని చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. మృతుడికి వరుసకు పెద్దమ్మ (అనసూయ), అక్క (నాగలత) ఇదే భవనం కింది అంతస్తులో ఉంటున్నారు. వీరికి, స్వాతికి మధ్య మూడు రోజుల కిందట ఘర్షణ జరిగింది. పిల్లల మధ్య జరిగిన తగాదా విషయమై వీరు గొడవపడ్డారు. దీనిపై మంగళవారం సమావేశం ఏర్పాటుచేసిన ఆర్యనగర్ పంచ్కమిటీ సభ్యులు పెద్దమనుషులుగా ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తుండగా.. వారి ముందే అనసూయ, స్వాతిని చెప్పుతో కొట్టారు. ఈ ఘటనతో ప్రవీణ్కుమార్, స్వాతి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయమై మరోసారి ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తన ఇద్దరు కూతుళ్లను తాడుతో గొంతు బిగించి చంపి బెడ్రూంలో బెడ్పై పడుకోబెట్టి, పక్క గదిలో భార్యాభర్తలు స్లాబ్కు ఉన్న ఇనుప కోక్కాలకు చెరొకవైపు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రవీణ్కుమార్ కూతురు వర్షిత, సోదరుడి కూతురు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. ప్రతిరోజు ఉదయం వారు కలిసే స్కూల్కు వెళ్తారు. గురువారం ఉదయం పాఠశాల సమయం మించిపోతున్నప్పటికి వర్షిత పాఠశాలకు రాకపోవడంతో సోదరుడు సుజీత్కుమార్ భవనం మూడవ అంతస్తులో ఉంటున్న ప్రవీణ్కుమార్ ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో అనుమానం వచ్చిన సుజీత్కుమార్ కిటికిలోంచి చూడగా అన్నా, వదిన వేలాడుతూ కన్పించారు. దీంతో బోరున విలపిస్తూ 100కి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు లాలాగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా బెడ్పై, భార్యభర్తలు ఉరికి వేలాడుతూ కనిపించారు. అక్కడే ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లాలాగూడ సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. స్వాతితో ఘర్షణ పడ్డ అనసూయ, నాగలతలను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చే శామన్నారు. కాగా గత కొంతకాలంగా ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురవుతోందని.. ఆత్మహత్యకు అదీ ఒక కారణం కావచ్చని స్థానికులు చెబుతున్నారు. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
విజయవాడ: నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసున్నారు. గులాబీ తోట భాను నగర్లో ఈ దుర్ఘటన జరిగింది. దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. వారిని పాన్ బ్రోకర్ శ్రీరామ్, అతని భార్య భాగ్యలక్ష్మి పిల్లలు నిహార్, రోహిణిగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను తెలుసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. -
సత్తెనపల్లిలో ఐదుగురు ఆత్మహత్య
-
సత్తెనపల్లిలో అయిదుగురు ఆత్మహత్య
గుంటూరు: సత్తెనపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. బాదం ప్రసాద్ అనే వ్యక్తి కుటుంబం మొత్తం ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ కుటుంబానికి చెందిన అయిదుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వారు ఆత్మహత్యచేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పులబాధ తాళలేకే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం ప్రసాద్ పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చినవారు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. 50 వేల రూపాయలు ఇచ్చిన ఒక వ్యక్తి నిన్న ఇంటి వద్దకు వచ్చి నానా గొడవ చేసి వెళ్లాడు. తన బాకీ తీర్చమని ఒత్తిడి చేశాడు. ప్రసాద్కు అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దాంతో తొలుత తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి హత్య చేశాడు. ఆ తరువాత తన తల్లికి, భార్యకు పురుగుల మందు ఇచ్చి, తనూ తాగాడు. మొత్తం అయిదుగురు మృతి చెందారు. -
అప్పులబాధతో కుటుంబం ఆత్మహత్య
తిరువళ్లూరు, న్యూస్లైన్: అప్పులు, రుణదాతల ఒత్తిళ్లు నలుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలూ అనంతలోకాలకు వెళ్లిపోవడం స్థానికంగా కలచి వేసింది. ఈ విషాద సంఘటన తిరువళ్లూరు సమీపంలోని వేపంబట్టు వద్ద చోటు చేసుకుంది. చెన్నై సమీపంలోని పెరంబూరు ప్రాం తానికి చెందిన సుకుమారన్ (45) పెరంబూరులోని రైల్వే గ్యారేజీ వ ర్క్స్లో కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య జయంతి (40). కుమార్తె ఆశా(19), కుమారుడు హరీష్ అలియాస్ జగదీష్(15)తో కలిసి వేపంబట్టులో నివాసం ఉంటున్నాడు. భార్య జయంతి గృహిణికాగా, కుమార్తె ఆశా చెన్నైలోని ప్రైవేటు కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం, కుమారుడు జగదీష్ సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో సుకుమారన్ ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం రుణదాతలు కొందరు వచ్చి అప్పు చెల్లించాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు వాగ్వాదానికి దిగారు. దీంతో సుకుమారన్ మనస్తాపం చెంది నట్టు బంధువులు చెబుతున్నారు. అప్పులు, గొడవలను పెరంబూరులో ఉన్న బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆదివారం జరిగిన గొడవలపై ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జయంతి తమకు అప్పుల భారం ఎక్కువగా ఉందని, తమకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని బంధువుల వద్ద రోదించినట్టు తెలుస్తోంది. అప్పులపై కలత చెందవద్దని వారించిన బంధువులు, సోమవారం మాట్లాడుకుందామని నచ్చచెప్పినట్టు తెలుస్తుంది. సోమవారం మధ్యాహ్నం జయంతి అన్న కొడుకు సతీష్ ఫోన్ చేశాడు. అయితే ఫోన్ తీయలేదు. అనుమానం కలిగిన సతీష్ ఇంటి వద్దకు వచ్చి చూడగా తలుపులకు లోపల గడియ పెట్టి ఉండడం చూశాడు. కిటికీ తెరిచి చూడగా సుకుమార్, జయంతి, ఆశా, జగదీష్లు ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించాడు. సెవ్వాపేట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తాళాలను గడ్డపారతో పగులగొట్టి మృత దేహాలను వెలికితీసి తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. కారణం ఇదేనా! పెరంబూరుకు చెందిన సుకుమారన్ వేపంబట్టులో ఇంటి నిర్మాణం, స్థలం కొనుగోలుకు అప్పలు చేసినట్టు తెలుస్తుంది. అప్పలు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం ఆత్మహత్యకు గల ప్రధాన కారణంగా పోలీసులు వివరించారు. దీంతో పాటు రైల్వే ఉద్యోగి అయిన సుకుమారన్, అదే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 2లక్షల నుంచి 4 లక్షల వరకు వ సూలు చేసినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. నగదు ఇచ్చిన వారు కొందరు ఆదివారం ఇంటి వద్ద గొడవ చేశారు. దీంతో మనస్తాపం చెందిన కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు నిర్ధారించారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. -
ఇద్దరు కూతుళ్ల సహా తల్లి ఆత్మహత్యాయత్నం
కరీంనగర్: కుటుంబంలోని సమస్యలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. గత కొంతకాలంగా కుటుంబంలో చోటు చేసుకున్న చిన్నపాటి తగాదాలు కాస్తా తీవ్రరూపం దాల్చడంతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలోని జమ్మికుంటలో శుక్రవారం చోటు చేసుకుంది. జీవితం మీద విరక్తి చెందిన ఓ తల్లి తన పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. తాను లేని జీవితంలో పిల్లలు ఉండకూదదని భావించిన ఆ కన్నతల్లి ముందుగా తన ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి వారిని ఆత్మహత్యకు పురిగొల్పింది. అనంతరం ఆమె కూడా విషం తాగా ఆత్మహత్యయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య
రాజమండ్రి: రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులతోపాటు వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నాను. కోనసీమలోని అంబాజీపేటకు చెందిన వీరు నగరంలోని హోటల్ ఆనంద్ రీజెన్సీలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.