నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసున్నారు.
విజయవాడ: నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసున్నారు. గులాబీ తోట భాను నగర్లో ఈ దుర్ఘటన జరిగింది. దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. వారిని పాన్ బ్రోకర్ శ్రీరామ్, అతని భార్య భాగ్యలక్ష్మి పిల్లలు నిహార్, రోహిణిగా గుర్తించారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను తెలుసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.