విజయవాడలో ఉద్రిక్తత.. బోండా ఉమా దౌర్జన్యం | Action Against TDP MLA Bonda Uma Supporters Creates Political Heat In Vijayawada, Watch News Video For More Details | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఉద్రిక్తత.. బోండా ఉమా దౌర్జన్యం

Aug 6 2026 11:33 AM | Updated on Aug 6 2026 12:18 PM

TDP MLA Bonda Uma Supporters Over Action At Vijayawada

సాక్షి, విజయవాడ: విజయవాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెగా డీఎస్సీ పరీక్షలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ ముత్యాలపాడు వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దౌర్జన్యానికి దిగారు. ఉమా అనుచరులు అత్యంత నీచంగా వ్యవహరించారు. దీక్షా శిబిరంపైకి ఎక్కి.. టీడీపీ కార్యకర్త ఒకరు టాయిలెట్‌ చేశారు. 

వైఎస్సార్‌సీపీ నేతల దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు గుడ్లు విసిరారు. దీంతో, టీడీపీ కార్యకర్తులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడ ఉన్న సమయంలోనే ఇదంగా జరగడం గమనార్హం. టీడీపీ నేతల దాడి కారణంగా ఓ మహిళా వైఎస్సార్‌సీపీ కార్యకర్త స్పృహ తప్పిపోయి కిందపడిపోయినట్టు సమాచారం. ఉమా అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఉమా అనుచరులు అత్యంత నీచంగా వ్యవహరించారు. దీక్షా శిబిరంపైకి ఎక్కి.. టీడీపీ కార్యకర్త ఒకరు టాయిలెట్‌ చేశారు. మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాలతోనే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు జరిగాయని పార్టీ నేతలు ఆరోపించారు. 

అనంతరం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే గూండాయింజ చేశారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం మన దురదృష్టం. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. పోలీసుల సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దౌర్జన్యం చేశారు అని అన్నారు. దీక్షా శిబిరంలో ఉ‍న్న మహిళలపై కూడా దాడులు చేయడం గమనార్హం. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement