కన్నతల్లికి, పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కన్నతల్లికి, పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య

Published Sat, Mar 26 2016 8:22 AM

Family suicide in bhuvanagiri

నల్గొండ : పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరిలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. తన కన్న తల్లితో పాటు ముగ్గురు చిన్నారులకు పురుగుల మందు తాగించిన రమేష్... అనంతరం అతడు అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయాన్ని గమనించిన స్థానికులు శనివారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు బాలికలు ఉన్నారని పోలీసులు తెలిపారు.  ఈ ఆత్మహత్యలకు కారణం ఆర్థిక ఇబ్బందులే అని బంధువులు చెబుతున్నారు. మృతులను పద్మ (62), రమేష్ (42), సర్వూప (8), కావేరి (4), నందిని (2)గా గుర్తించారు.

 

Advertisement
Advertisement