-
తిరుపతి @894
సహజంగా ప్రముఖులు, రాజకీయ, వ్యాపార, సెలబ్రెటీలతో పాటు ఎక్కువ మంది పుట్టినరోజును వేడుకగా జరుపుకోవడం చూస్తుంటాం. కానీ భారతదేశంలో ఏనగరానికీ లేని పుట్టిన రోజు ఒక్క తిరుపతి నగరానికి మాత్రమే ఉండడం విశేషం. సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు తన స్వహస్తాలతో 1130 ఫిబ్రవరి 24వ తేదీన గ్రామ ఈశాన్యంలో (నాలుగుకాళ్ల మండపం) వద్ద పునాది వేసినట్లు చరిత్రలో నిరూపితమైంది. అద్వైత పురుషుడైన సమతామూర్తి పుణ్యఫలమే తిరుపతి నగరమైంది. ఈ మేరకు శనివారం 894వ పుట్టిన రోజు వేడుకలకు తిరుపతి నగరం అత్యంత సుందరంగా ముస్తాబైంది. తిరుపతి తుడా: ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి పుట్టినరోజు ఉందన్న విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేధావులు, పండితులతో కలసి 2022లో ప్రకటించారు. చరిత్ర, పురాణ, ఇతిహాసాల ఆధారంగా అద్వైత పురుషుడైన రామానుజాచార్యులు చేతుల మీదుగా తిరుపతి నగరం పురుడు పోసుకుందని సామాజానికి చాటిచెప్పారు. ఈ క్రమంలో శనివారం తిరుపతి నగర 894వ పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 1130వ ఏటే పునాది శ్రీరామానుజాచార్యులు కంచి నుంచి తిరుమలకు వచ్చే క్రమంలో తన 112వ ఏట నిర్మానుష్యంగా ఉన్న పార్థసారథిస్వామి ఆలయం (నేటి గోవిందరాజస్వామి ఆలయం) ప్రాంతాన్ని ఓ గ్రామంగా నిర్ణయిస్తూ పునాది వేశారు. 1130 ఫిబ్రవరి 24వ తేదీన గ్రామానికి పునాది వేశారని స్పష్టమవుతోంది. కపిలతీర్థం సమీపంలో కొత్తూరు గ్రామం ఉండేది. వివిధ వ్యాధులతో ఆ గ్రామ వాసులు వరుసగా మృత్యువాత పడుతుండడాన్ని శ్రీరామానుజాచార్యులు గుర్తించారు. గోవిందరాజస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భంలోనే కొత్తూరు గ్రామ ప్రజలను సంరక్షించడం, నిర్మానుష్య ప్రాంతంగా ఉన్న ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు గరుడ ఆకారంలో కొత్తగా నిర్మిస్తున్న గ్రామానికి హద్దులు పెట్టించి పునాది వేయించారు. ఆగమశాస్త్రోక్తంగా నాడు వేసిన పునాదే నేడు ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆ క్రమంలోనే ఆ గ్రామానికి గోవిందరాజపట్నంగా నామకరణం చేశారు. ఆ తరువాత గోవిందరాజపట్నానికి రామానుజపురంగా స్థానికులు పేరును మార్పుచేశారు. కాలక్రమేణా 13వ శతాబ్దంలో తిరుపతిగా ప్రసిద్ధికెక్కింది. హద్దులు ఇవే నాటి గోవిందరాజపట్నానికి కృష్ణాపురం ఠానా, నాలుగుకాళ్ల మండపం, రైల్వేస్టేషన్కు తూర్పు ప్రాంతం, బేరివీధి నాలుగు ప్రాంతాల్లో మండపాలను నిర్మించారు. ఆ తరువాత ఆయా ప్రాంతాల్లో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నాలుగుకాళ్లమండపం మాత్రమే చరిత్రకు సాక్షిగా మిగిలింది. తొలివీధి అదే నాడు తిల్లా గోవిందరాజస్వామిని ప్రతిష్టించే లఘ్నం ఖరారు కావడంతో యుద్ధప్రాతిపాదికన సున్నపు ముద్దలతో గోవిందరాజస్వామి విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఆ విగ్రహంలో స్వామి వారి పొట్టలో దేవదాసి తిల్లా వద్ద ఉన్న లోహవిగ్రహాన్ని ప్రతిష్టించి తయారు చేశారని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. గోవిందరాజపట్నం గ్రామం ఏర్పడ్డాక రామానుజ తిరువీధి (గోవిందరాజస్వామి తూర్పుమాడావీధి) ఏర్పడింది. ఇలా తొలివీధి రామానుజ తిరువీధిగా చరిత్రలో నిలిచింది. కై కాల రెడ్లదే తొలిదర్శనం గోవిందరాజస్వామిని తొలినాళ్లలో దేవదాసి అయిన తిల్లా పూజిస్తూ స్వామివారి బాగోగులు చూసుకునేవారు. ఈ క్రమంలో దేవదాసి అయిన మహిళ పూజలు చేయడం ఏంటని ప్రశ్నించి అవమానించేవారు. ఈ క్రమంలోనే ఆమె కై కాల చెంగారెడ్డి అనే చిన్నారిని దత్తత తీసుకుంది. కై కాల చెంగారెడ్డి ద్వారా ఆలయంలో ఉత్సవాలు, సేవలను నిర్వహించేవారు. ఇందులో భాగంగానే నేటికీ కైకాల కులస్థులకు గోవిందరాజస్వామి ఆలయంలో తొలిదర్శనం కల్పిస్తున్నారు. శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఉత్సవాల్లోనూ ఈ వర్గానిదే ఆధిపత్యం. నాటి రాజావీధే నేటి గాంధీరోడ్డు గోవిందరాజపట్నం ఏర్పడ్డాక గ్రామానికి తొలివీధిగా రామానుజ తిరువీధితో పాటు పడమర, తూర్పు, దక్షిణ మాడావీధులు శ్రీవారి అర్చకులు, వారి బంధుమిత్రులకు ఆవాసాలుగా అభివృద్ధి చెందాయి. ఆ తరువాత ఆ వీధికి బజారువీధిగా ఆపై మహాత్మాగాంధీ ఈ రోడ్డులో నడయాడంతో గాంధీరోడ్డుగా మార్పుచెందింది. సున్నం తయారు చేస్తున్న ప్రాంతం సున్నపువీధిగా, ఇసుక నిల్వ ఉంచిన ప్రాంతాన్ని ఇసుక వీధిగా నామకరణం చేశారు. బండ్లు నిలిపే ప్రాంతమే నేటి బండ్ల వీధిగా మారినట్టు తెలుస్తోంది. తొలి భక్తుడు ఆయనే శ్రీమన్నారాయనుడు శ్రీవేంకటేశ్వరుడిగా సప్తగిరులపై కొలువుదీరారు. శ్రీరామానుజాచార్యుల మేనమామ అయిన శ్రీవారి పరమ భక్తుడు తిరుమల నంబి తొలిభక్తుడుగా కీర్తిగడించారు. ఆయన అనుగ్రహంతోనే అడపురి(అలిపిరి) ఓ మహావృక్షం కింద శ్రీరామానుజాచార్యులు వారు ఆధ్వైత పురుషుడుగా, వైఖానస పండితులుగా ప్రసిద్ధి గడించారు. 904 ఏళ్ల క్రితం తిరుమల ఆలయ పరిరక్షణ కోసం జీయంగార్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇదో చారిత్రక ఘట్టం ఏ నగరానికీ లేని పుట్టిన రోజు తిరుపతి నగరానికి మాత్రమే ఉంది. ఇది నగర ప్రజలకు దక్కిన గౌవరం. పుణ్య పురుషుడైన శ్రీ రామానుజాచార్యుల వారి చేత ఆ శ్రీమన్నారాయణుడే తిరుపతి పుణ్యక్షేత్రానికి పుణాది వేయించారు. ఈ చరిత్ర తెలియడం చారిత్రక ఘట్టమే. అందుకే తిరుపతి పుట్టిన రోజు వేడుకలను ప్రతి ఏటా జరుపుకోవడం మనందరి బాధ్యత. – భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ చైర్మన్. ఇప్పటికీ గోవిందరాజపట్నంగానే.. తమిళులు ఇప్పటికీ తిరుపతిని గోవిందరాజపట్నంగానే పిలుస్తుంటారు. కపిలతీర్థం సమీపంలోని కొత్తూరు గ్రామ ప్రజలను రక్షించడం, గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మించడం, ఈ ప్రాంతం దేదీప్యమానంగా విరాజిల్లాలన్న సంకల్పంతో గరుడ ఆకారంలో గోవిందరాజ పట్ననికి హద్దులు నిర్ణయించారు. – ఆచార్య పేట శ్రీనివాసులరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ -
Vijay Sethupathi Unseen Photos: విజయ్ సేతుపతి చిన్ననాటి ఫోటోలు చూశారా..?
-
మెగా హీరో బర్త్డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!
గతేడాది ఆదికేశవ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 24న విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. కాగా.. ఉప్పెన చిత్రంతో సూపర్హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన కొండపొలం ,రంగరంగ వైభవంగా చిత్రాల్లో నటించారు. (ఇది చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా!) తాజాగా మెగా హీరో 29వసంతంలోకి అడుగుపెట్టారు. జవనరి 13న వైష్ణవ్ తేజ్ బర్త్ డేను మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు పాల్గొన్ని సందడి చేశారు. వైష్ణవ్ తేజ్తో సరదాగా ఫోటోలు దిగుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు సైతం మెగా హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. A heart-warming glimpse of lovely couple Mega Power star @AlwaysRamCharan & @upasanakonidela with #VaisshnavTej from his birthday celebrations 😍#RamCharan #GameChanger #TeluguFilmNagar pic.twitter.com/yyjBwe52JS — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 -
దుబాయ్లో సీఎం జగన్ పుట్టినరోజు సంబరాలు
దుబాయిలో వందలాది జగనన్న అభిమానుల నడుమ అత్యంత వైభవంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అడ్వైజర్ ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్సీపీ యువ నాయకులు సింహాద్రిపురం మహమ్మద్ జిలాన్ భాష, తరపట్ల మోహన్, రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, సయ్యద్ నాసర్, చిల్లే తాతాజీ, పాస్టర్ యోహన తదితరుల ఆధ్వర్యంలో దుబాయ్లో సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో నిర్వహించారు. ఈ వేడుకుల్లో భారీగా అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 600 మంది జగనన్న అభిమానులు, కార్యకర్తలు పాల్గొని సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగనన్న జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసిన అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన 400 మహిళలకు చీరల పంపిణీతో పాటు సింహాద్రిపురం మహమ్మద్ జిలాన్ భాష, పవన్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది ప్రవాసఆంధ్రులకు APNRTS బీమా పథకంకు ఆర్థిక సహాయం చేశారు.దాదాపు 100 మంది కొత్తవారిని వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రసన్న సోమిరెడ్డి, మహమ్మద్ జిలాన్ భాష, మోహన్ తరపట్ల ప్రసంగిస్తూ సీఎం జగన్ పాలనలో ఏపీలో జరిగిన అభివృద్ధిని,సంక్షేమ కార్యక్రామాలని వివరిస్తూ మళ్లీ వచ్చే 2024 ఎలక్షన్లలో పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎటువంటి విభేదాలు లేకుండా, ఒకరినొకరు కలుపుకొని, ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తీ వంచన లేకుండా కృషి చేసి మళ్లీ వైఎస్సార్సీపీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. తిరిగి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చివరగా కార్యక్రమానికి విచ్చేసి, విజయవంతం కావడానికి కృషి చేసిన కార్యకర్తలు, అభిమానులకు, అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, ఓగూరి శ్రీనివాస్, పాస్టర్ అనిల్, కొల్లే రవికుమార్, కటికితల ప్రకాశ్, పాలపర్తి నీలిమ, గోసంగి లక్ష్మి, విజయ, మేడిది శ్యామ్, కళ్యాణ్, శ్యామ్ సురేంద్రరెడ్డి, వెంకటరమణారెడ్డి, సయ్యద్ సలీమ్, షేక్ షోయబ్, వెంకటప్పరెడ్డి, ఆర్టీఏ జహీర్, గూడూరు విజయ్రెడ్డి, మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లండన్లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు!
లండన్లోని వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యూకే నలుమూలల నుంచి వచ్చిన జగన్గారి అభిమానులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా పలువురు వక్తలు ప్రసంగించారు. ప్రతీపేదవాడి కోసం జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కమిటీ సభ్యులు ఓబుల్రెడ్డి పాతకోట , అనంత్రాజు పరదేశి, మలిరెడ్డి కిషోర్ రెడ్డి, మన్మోహన్ యామసాని, జనార్ధన్ చింతపంటి, జయంతి, ప్రతాప్ భీమిరెడ్డి, సురేందర్రెడ్డి అలవల, శ్రీనివాసరెడ్డి దొంతిబోయిన, గాంధీ రెడ్డి పోలి, భాస్కర్రెడ్డి మాలపాటి, బీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా ప్రసంగిస్తూ.. రానున్న మూడు నెలల్లో ప్రతిఒక్కరు ఒక సైనికుడిలా పనిచేసి జగన్గారి గెలుపుకు కృషిచేయాలన్నారు. డాక్టర్ ప్రదీప్ చింతా, వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ "ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు హర్ధిక జన్మదిన శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది లండన్కు వచ్చారు. ఇక్కడ మరింత మందికి సాయం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎంతో మందికి సీఎం జగన్ సపోర్ట్ చేస్తున్నారు. అండగా నిలుస్తున్నారు. మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి మనవంతుగా ఎంతో కొంత సహకరిద్దాం. సోషల్మీడియాలో వచ్చే మూడు నెలల పాటు విధిగా సీఎం జగన్ కోసం పోరాడుదాం. జై జగన్.. హ్యాపీ బర్త్డే జగన్. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవాలి, ప్రజలకు అండగా ఉండాలి." (చదవండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement