
దిగ్గజ గాయని పి.సుశీల పుట్టినరోజు నేడు (నవంబర్ 13). ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో 1935లో పుట్టి పెరిగింది పులపాక సుశీల

1950లో రేడియోలో నిర్వహించిన పోటీలో పాల్గొని సంగీత ప్రస్థానం మొదలుపెట్టింది

AM రాజాతో 'కన్నతల్లి' అనే తెలుగు సినిమాలో పాట పాడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది

ఇప్పటివరకు ఈమె దాదాపు 50 వేల పైచిలుకు పాటలు పాడటం విశేషం

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ భాషల్లో ఈమె పాడింది

పెళ్ళి చేసి చూడు, పిచ్చి పుల్లయ్య, మిస్సమ్మ, బాలనాగమ్మ, మాయా బజార్.. ఇలా చెప్పుకుంటూ పోతే పాటల లిస్ట్ చాలా పెద్దదే

ప్రాంతీయ అవార్డులు, జాతీయ అవార్డులని సైతం ఈమె తన పాటలతో సొంతం చేసుకున్నారు

ఇలా ఇప్పటికీ తన పాటలతో అలరిస్తున్న పి.సుశీల.. ఒక్క పాట విషయంలో తెగ బాధపడుతుంటారు

ఎన్టీఆర్ 'డ్రైవర్ రాముడు' మూవీలో "గ్గుగ్గుగ్గగుడెసుందీ మ్మమ్మమ మంచముందీ'' అనే పాట ఉంది

ఈ సాంగ్ పాడిన తర్వాత ఎందుకు పాడానా అని చాన్నాళ్ల పాటు సుశీల చాలా బాధపడ్డారట

ఈ ఏడాది ఆగస్టులో సుశీల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. అభిమానులు భయపడ్డారు కానీ కోలుకుని తిరిగి మామూలు మనిషైపోయారు

88 ఏళ్లు పూర్తి చేసుకున్న సుశీలమ్మ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్
