సాక్షి, విజయవాడ: ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆయనకు నివాళుతులు అర్పించారు. తన ‘ఎక్స్’ ట్వీట్లో ‘పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలబడి, వారి అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా గారు. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజల గుండెల్లో నిలిచిన రంగా గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’అని పేర్కొన్నారు.
పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలబడి, వారి అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా గారు. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజల గుండెల్లో నిలిచిన రంగా గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/ol1Ye6cSCX
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2026


