-
మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం
'బిగ్బాస్ 7' షో అయిపోయి చాలారోజులైపోయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్తో షోలో అడుగుపెట్టి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. రూ.35 లక్షల ప్రైజ్మనీతో రైతులకు సాయం చేస్తానన్నాడు. మూడు నెలల కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసేలేదని తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోడిని తెగ ట్రోల్ చేశాడు. ఫైనల్గా ఇన్నాళ్లకు మాట నిలబెట్టుకున్నాడు. తొలి సాయం చేశాడు. (ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్) గతంలో జరిగిన ఆరు సీజన్ల కంటే ఈసారి బిగ్బాస్.. ఊహించిన దానికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ అనే ట్యాగ్తో వచ్చి షోలో సింపతీ కొట్టేశాడు. జనాలు కూడా ఇతడిని చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడకుండా నమ్మేశారు. ఓట్లు వేశారు. ఇక షోలో విజేతగా నిలిచిన తర్వాత అదే రోజు రాత్రి.. హైదరాబాద్లో ఇతడి ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్లు, బస్సుల అద్దాల పగలగొట్టి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ని కొన్నిరోజలు జైల్లో పెట్టడం, బెయిల్పై బయటకు రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. అయితే షోలో పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు పేద రైతులకు సాయం చేస్తానని మాట మాత్రం మరిచిపోయాడా అని సందేహం వచ్చింది. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. గజ్వేల్లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి ఏకంగా రూ.లక్ష సాయమందించాడు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు. ఇతడికి తోడుగా సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం చేయడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్-ప్రశాంత్ పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
రాజకీయాల్లోకి రైతుబిడ్డ? అందుకే అలా..
రైతుబిడ్డ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదంటున్నాడు పల్లవి ప్రశాంత్.. ఒక్క ఛాన్స్ అంటూ బిగ్బాస్ స్టూడియో ముందు పడిగాపులు కాసిన ప్రశాంత్ ఏడో సీజన్లో పాల్గొనడమే కాకుండా ఆ సీజన్కు విన్నర్గా నిలిచిన విషయం తెలిసిందే! అయితే షో అయిపోయిన తర్వాత చేసిన హంగామా వల్ల జైలుకు కూడా వెళ్లివచ్చాడు. తాజాగా ఇతడు బిగ్బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్కు హాజరయ్యాడు. దేవుడే దిక్కు ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. 'మనల్ని మనం నమ్ముకోవాలి. అలాగే దేవుడిని నమ్మినవాళ్లు ఎప్పుడూ చెడిపోరు. ఆ భగవంతుడే కాపాడతాడు. ఏ కష్టంలో ఉన్నా దేవుడే దిక్కనుకుంటే ఆయనే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడతాడు. మన వెన్నంటే ఉంటాడు. మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సరే గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను.. అందుకే మీముందు ఇలా నిలబడ్డాను. మీ ఆశీస్సులు ఉంటే.. ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా సరే అస్సలు భయపడను, వెనక్కు వెళ్లను.. ఇలాగే నిలబడతాను. రైతుబిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు' అని చెప్పాడు. ఇంతలో శివాజీ పార్లమెంటుకు కూడా వెళ్తాడు అనగా.. 'మీ అందరి ఆశీస్సులు ఉంటే అది కూడా జరుగుతుంది. యువత మేలుకోవాలి, యువత ముందడుగు వేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది' అని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ మాటల్ని బట్టి చూస్తే జనాలు సపోర్ట్ చేస్తే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్బాస్ విన్నర్ ఓవరాక్షన్.. యూట్యూబర్ను కాలితో తన్నుతూ, కొడుతూ.. -
బిగ్బాస్ విన్నర్ రైతుబిడ్డకు ఊరట.. ఇకపై..
గెలుపోటములు సహజమే.. కష్టసుఖాలూ కామనే.. కానీ రెండూ ఒకేసారి వస్తే తట్టుకోవడం, తట్టుకుని నిలబడటం చాలా కష్టం. పల్లవి ప్రశాంత్కు ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. తనను తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్ విజేతగా ప్రకటించడంతో ఫుల్ ఖుషీ అయ్యాడు ప్రశాంత్. కానీ ఫినాలే ఎపిసోడ్ జరిగిన కొద్ది క్షణాలకే గందరగోళం సృష్టించాడు. స్టూడియో బయట పరిస్థితి బాలేదు, వెనకనుంచి వెళ్లిపో అని పోలీసులు చెప్తున్నా పట్టించుకోకుండా లెక్క చేయలేదు. ప్రశాంత్ రాకతో వీరంగం అప్పటికే అభిమానులు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు, బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తూ నానా వీరంగం సృష్టిస్తుండగా ప్రశాంత్ అక్కడికి చేరుకోవడంతో అక్కడి జనాలు మరింత రెచ్చిపోయారు. ఈ వ్యవహారంలో ప్రశాంత్, అతడి సోదరుడితో పాటు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాలుగు రోజులపాటు జైల్లో ఉన్న ప్రశాంత్ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. రెండు నెలలుగా పోలీసుల ఎదుట హాజరు బెయిల్లోని కండీషన్ ప్రకారం రెండు నెలలుగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పోలీసుల ఎదుట హాజరు నుంచి రిలీఫ్ ఇవ్వాలని ప్రశాంత్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై బుధవారం నాడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. ప్రశాంత్, ఆయన సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. చదవండి: అనసూయ గ్లామర్ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి.. -
ప్రశాంత్కు ఇబ్బందిగా మారిన 'బిగ్బాస్' ప్రైజ్ మనీ.. వాళ్లను మోసం చేశాడా?
బిగ్బాస్ 7 ముగిసిపోయి ఇప్పటికి రెండు నెలలు దాటింది. ఈ సీజన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. రైతుబిడ్డ ట్యాగ్లైన్తో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ప్రత్యర్థులను ఎదుర్కుంటూ ఒక్కోమెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకున్నాడు. విజేతగా నిలుస్తే వచ్చే ప్రైజ్ మనీని పేద రైతులకు ఉపయోగిస్తానని పలుమార్లు చెప్పాడు. ఇప్పుడా విషయంపై సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ప్రశాంత్ కూడా రియాక్ట్ అయ్యాడు. రైతుల పేరుతో గెలిచి.. అమ్మాయిలతో ఎంజాయ్ అందరూ అనుకున్నట్లే ప్రశాంత్ విజేతగా నిలిచాడు.. రోజులు గడుస్తున్నా అతను ముందుగా చెప్పినట్లు ప్రైజ్ మనీ నుంచి రైతులకు సాయం చేసినట్లు కనిపించలేదు. అంతేకాకుండా పలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. బిగ్బాస్ స్నేహితులతో పార్టీలలో కనిపిస్తున్నాడు. పలు షాప్స్ ఓపెనింగ్స్కు అతిథిగా వెళ్తున్నాడు... ఇలా నిత్యం బిజీగా మారిపోయిన పల్లవి ప్రశాంత్.. రైతులకు తన ప్రైజ్ మనీ ఇస్తానని ఇచ్చిన మాట మరిచిపోయాడంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. కొందరైతే ఏకంగా రైతుల పేరుతో గెలిచి వారికి ఇచ్చిన మాటను తప్పడమే కాకుండా అమ్మాయిలతో బుల్లితెరపై బాగానే ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సాయం చేసే ఆలోచన ఉంటే ఎప్పుడో చేసేవాడు.. ఆ డబ్బు కూడా అతనికి చేరడమే కాకుండా ఖర్చు కూడా అయిపోయి ఉంటుంది. ఆ డబ్బు గురించి ఇక అందరూ మరిచిపోండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. అతను కూడా పేదరికంతో ఉన్నాడని అతని భవిష్యత్ కోసం ఆ డబ్బు ఉపయోగించుకోవాలని తెలుపుతున్నారు. వాస్తవంగా అమర్దీప్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రశాంత్కు రైతుబిడ్డ అనే సింపతీ ఎక్కువగా ఉపయోగపడటంతో విజేతగా నిలిచాడు. ఇప్పుడు అదే ట్యాగ్లైన్ ప్రశాంత్కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ రియాక్షన్ తాజాగా ఈ విషయంపై ప్రశాంత్ ఇలా రియాక్ట్ అయ్యాడు. 'ప్రాణం పోయిన ఇచ్చిన మాట మరువను. నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నిరూపేద రైతు కుటుంబాల కోసం ఇచ్చిన మాట ప్రకారం బిగ్బాస్ ప్రైజ్ మనీతో త్వరలో మీ ముందుకు వస్తాను.' అని ప్రశాంత్ చెప్పాడు. ప్రశాంత్కు వచ్చేది ఎంత బిగ్బాస్ విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట. బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు. ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్ మనీ పంచితే.. ఆయనకు అదనంగా వచ్చిన మారుతి బ్రెజా కారు, రూ. 15 లక్షల విలువ చేసే వజ్రాభరణం మిగిలినట్లు అవుతుంది. ప్రశాంత్కు బిగ్బాస్ నుంచి ఒక వారానికి రూ. లక్ష రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అంటే 15 వారాలకు సుమారుగా రూ.15 లక్షలు ఈ రూపంలో దక్కినట్లు అని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
పల్లవి ప్రశాంత్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క!
పల్లవి ప్రశాంత్, బర్రెలక్క (శిరీష).. ఇటీవలి కాలంలో వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి. ఒకరేమో బిగ్బాస్ హౌస్లోకి రైతుబిడ్డగా అడుగుపెట్టి సెలబ్రిటీలను వెనక్కు నెట్టి షో విజేతగా నిలిచాడు. కానీ బయటకు వచ్చాక తెలిసీతెలియక చేసిన హంగామాతో జైలుపాలై అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. మరొకరేమో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగి గళాన్ని గట్టిగా వినిపిస్తూ పోటీ చేసింది. అయితే జనాల్లో తిరగడానికంటే కూడా సోషల్ మీడియా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతిచ్చి ఓటమి చవి చూసింది. అప్పుడు ప్రశాంత్కు సపోర్ట్ ప్రశాంత్.. బర్రెలక్క చుట్టాలేం కాదు. కానీ బిగ్బాస్ 7లో ఒక సామాన్యుడు అడుగుపెట్టాడని తెలిసి సపోర్ట్ చేసింది. ఇంకేముంది పలకరిస్తే చాలు తప్పుడు వరుసలు అంటగట్టేసే సమాజం వీరిద్దరికీ ఏదో ఉందని ముడిపెట్టింది. ప్రశాంత్, శిరీష పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి వీరి పెళ్లయిపోయినట్లు మార్ఫింగ్ ఫోటోలు కూడా వదిలారు. యూట్యూబ్లో పెళ్లి చేశారు తాజాగా ఈ వ్యవహారంపై స్పందించింది బర్రెలక్క. ఆమె మాట్లాడుతూ.. 'నేను బిగ్బాస్ షో అసలు చూడను. అయితే ఏడో సీజన్లో ఒక రైతుబిడ్డ వెళ్లాడని తెలిసి రెండు, మూడు ఎపిసోడ్లు చూశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావుడిలో పడి దాన్ని పక్కనపెట్టేశాను. మళ్లీ గ్రాండ్ ఫినాలే రోజు చూశాను. ఎప్పుడూ అతడికి ఫోన్ చేయలేదు. అలాంటిది.. నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్ అన్నతో యూట్యూబ్లో నా పెళ్లి చేసేశారు. నా పెళ్లికి పెద్ద పెద్ద అతిథులు కూడా వచ్చారట. ఆ సంగతే నాకు తెలీదు. ఎవరి ఇజ్జత్ పోతే ఏంటి? వ్యూస్ కోసం ఇంతలా బరితెగిస్తారా? ఎవరు మట్టిలో కలిస్తే ఏంటి? ఎవరి ఇజ్జత్ పోతే ఏంటి? ఎవరి జీవితం నాశనమైతే ఏంటి? మాకు వ్యూస్ కావాలంతే అన్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చాలా వీడియోలలో నేను పల్లవి ప్రశాంత్ను అన్న అని పిలిచాను. ఎవరైనా అన్నను పెళ్లి చేసుకుంటారా? అతడితో వివాహం జరిగినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది శిరీష. చదవండి: హీరోయిన్-డైరెక్టర్ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది? విజయకాంత్ కోసం ఆ పని చేస్తానని వాగ్ధానం.. అది గుర్తుపెట్టుకుని..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement