-
నిఖత్ విదేశీ శిక్షణకు క్రీడా శాఖ ఆమోదం
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్తోపాటు ప్రీతి, పర్వీన్, లవ్లీనా విదేశీ గడ్డపై శిక్షణ తీసుకోనున్నారు. ఒలింపిక్స్ సన్నాహాల కోసం ఈ నలుగురు బాక్సర్లు టర్కీ వెళ్లనున్నారు. ఈ నలుగురు బాక్సర్ల శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. క్రొయేషి యా, చెక్ రిపబ్లిక్లో జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రాకు అయ్యే ఖర్చులు భరిస్తామని క్రీడా శాఖ తెలిపింది. -
Strandja Memorial Boxing: నిఖత్కు రజతం
సోఫియా- Amit Panghal and Sachin win Gold: బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్కు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు లభించాయి. మహిళల 50 కేజీల ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 2–3తో సబీనా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, 66 కేజీల ఫైనల్లో అరుంధతి 1–4తో లి యంగ్ (చైనా) చేతిలో ఓడి రజత పతకాలను దక్కించుకున్నారు. పురుషుల 51 కేజీల ఫైనల్లో అమిత్ 5–0తో తష్కెంబే (కజకిస్తాన్)పై, 57 కేజీల ఫైనల్లో సచిన్ 5–0తో షఖ్జోద్ (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గి స్వర్ణాలు సాధించారు. ఫైనల్స్లో బరున్ సింగ్ (48 కేజీలు), రజత్ (67 కేజీలు) ఓడి రజత పతకాలు గెలిచారు. Take a look at 🇮🇳's #Silver🥈& #Bronze🥉medalists of the 7⃣5⃣th Strandja Cup, 🇧🇬 *Nikhat: 🥈in 51kg weight category * Arundhati:🥈in 66kg weight category * Barun:🥈in 48kg weight category * Rajat: 🥈in 67kg weight category * Akash:🥉in 67kg weight category * Naveen:🥉in… pic.twitter.com/K0LqKHM8FT — SAI Media (@Media_SAI) February 11, 2024 -
ఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా: భారత టాప్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో తన జోరు కొనసాగిస్తూ తుది పోరుకు అర్హత సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ ఏకపక్ష సమరంలో గెలిచి ఈ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన సెమీస్లో నిఖత్ 5–0 స్కోరుతో స్థానిక బాక్సర్ జ్లాటిస్లోవ్ చుకనోవాపై విజయం సాధించింది. తొలి రౌండ్లో నిఖత్ జాగ్రత్తగా ఆడగా బల్గేరియా బాక్సర్ కూడా పోటీనిచ్చింది. దాంతో స్కోరు 3–2తో ముగిసింది. అయితే తర్వాతి రెండు రౌండ్లలో ఆమెకు ఎదురు లేకుండా పోవడంతో 5–0, 5–0తో రౌండ్లు సొంతమయ్యా యి. ఓవరాల్ స్కోరింగ్తో చివరకు 5–0తో నిఖత్దే పైచేయి అయింది. నేడు జరిగే ఫైనల్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన సబీనా బొ»ొకులోవాతో నిఖత్ తలపడుతుంది. 66 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ అరుంధరి చౌదరి కూడా ఫైనల్కు చేరగా...పురుషుల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంఘాల్ కూడా ఫైనల్లోకి అడుగుపెట్టాడు. -
సెమీఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో ఆమె 5–0తో ఖదిరి వాసిల (ఫ్రాన్స్)పై గెలిచి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 66 కేజీల క్వార్టర్స్లో అరుంధతి 5–0తో సెర్బియాకు చెందిన మిలెనాపై గెలుపొందింది. 57 కేజీల క్వార్టర్స్లో సాక్షి 2–3 తో మమజొనొవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల కేటగిరీలో దీపక్ (75 కేజీలు), నవీన్ (92 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. దీపక్ 5–0తో సుల్తాన్ (కిర్గిజిస్తాన్)పై, నవీన్ 5–0తో వొయిస్నరొవిక్ (లిథువేనియా)పై గెలుపొందారు. చదవండి: ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? -
నిఖత్ జరీన్కు చుక్కెదురు
కచ్చితంగా స్వర్ణ పతకంతో తిరిగి వస్తుందనుకున్న భారత స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్కు ఆసియా క్రీడల్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో నిఖత్ 2–3తో రక్సత్ చుథామట్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ తెలంగాణ బాక్సర్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో రక్సత్ను అలవోకగా ఓడించిన నిఖత్కు ఈసారి గట్టిపోటీ ఎదురైంది. పక్కా ప్రణాళికతో ఈ బౌట్లో దిగిన రక్సత్ భారత బాక్సర్ను నిలువరించింది. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్షిప్లో రెండుసార్లు స్వర్ణాలు నెగ్గిన నిఖత్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. మరోవైపు భారత్కే చెందిన పర్వీన్ హుడా (63 కేజీలు) సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకోవడంతోపాటు పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో పర్విన్ హుడా 5–0తో తుర్దిబెకోవా సితోరా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచింది. అయితే జాస్మిన్ (60 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఉంగ్యోంగ్ వన్ (ఉత్తర కొరియా) సంధించిన పంచ్లకు జాస్మిన్ తట్టుకోలేకపోయింది. దాంతో రిఫరీ రెండో రౌండ్లో బౌట్ను ముగించి ఉంగ్యోంగ్ను విజేతగా ప్రకటించారు. -
Nikhat Zareen: సాహస యాత్రలకు సిద్ధం: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్
భారత స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్కు మహీంద్రా కంపెనీ స్పోర్ట్ యుటిలిటి వెహికిల్ను బహూకరించింది. తమ కంపెనీకి చెందిన ప్రఖ్యాత ఎస్యూవీ ‘థార్’ను బహుమతిగా అందించింది. మహీంద్ర ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ విజేతగా నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్కు థార్ను ప్రదానం చేసింది. మహీంద్రా కంపెనీ సౌత్ జోనల్ హెడ్ రాయ్, రీజినల్ సేల్స్ హెడ్ అభిషేక్, కొత్తగూడ మహీంద్రా వీవీసీ షోరూం ఎండీ వీవీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నిఖత్కు ఎస్యూవీని అందజేశారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్-2023లో విజేతగా నిలిచిన నిఖత్కు థార్ను గిఫ్ట్గా అందిస్తామని ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన మహీంద్రా కంపెనీ.. తాజాగా ఆమెకు ఎస్యూవీ తాళాలను అందజేసింది. ఈ ఈవెంట్లో కంపెనీ ఉద్యోగులతో పాటు కస్టమర్లు కూడా పాల్గొన్నారు. నిఖత్ జరీన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తనకు ప్రతిష్టాత్మక మహీంద్ర ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ అవార్డు రావడం పట్ల నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనకైతే డ్రైవింగ్ రాదని.. త్వరలోనే ‘థార్’తో తన ప్రయాణం మొదలుకానుందని పేర్కొంది. తన ప్యాషన్కు అనుగుణంగా ఈ ఎస్యూవీతో సాహసయాత్రలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్ (50 కేజీలు) ఈ ఏడాది మరోసారి చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. వరుసగా రెండో ఏడాది పసిడి సాధించి సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో ఎన్గుయెన్ థిటామ్ను ఓడించి విజేతగా అవతరించి.. ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో రెండు స్వర్ణాలు గెలిచిన రెండో భారత బాక్సర్గా నిలిచింది. -
Mahindra Thar Gifted To Nikhat Zareen: వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్కు మహీంద్రా ‘థార్’ గిఫ్టు (ఫొటోలు)
-
నిఖత్ జరీన్కు రూ.2 కోట్లు.. ‘ఒలింపిక్స్’ శిక్షణ కోసం సీఎం కేసీఆర్ సాయం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణపతకాన్ని సాధించి తెలంగాణతోపాటు భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. నిఖత్ జరీన్కు రాబోయే ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రూ.2 కోట్లను ప్రకటించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిఖత్ జరీన్ను సందీప్ కుమార్ సుల్తానియా సచివాలయంలోని తన చాంబర్లో నిఖత్కు శాలువా కప్పి సత్కరించారు. చదవండి: లకారం ట్యాంక్బండ్పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు! -
ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ ‘ఇఫ్తార్ విందు’.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
బాక్సింగ్కి హైదరాబాద్లో సౌకర్యాలు లేవని అన్నారు
-
నిఖత్ జరీన్కు ఘనస్వాగతం
శంషాబాద్: ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ గెలుచుకున్న నిఖత్ జరీన్కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న నిఖత్కు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చాంపియన్న్షిప్ సాధించిన నిఖత్ యువతకు ఆదర్శమని ప్రశంసించారు. అనంతరం ఓపెన్టాప్ జీప్లో ఆమెతో పాటు ప్రయాణించారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. నిఖత్కు స్వాగతం పలికిన వారిలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఆంజనేయగౌడ్, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు ఉన్నారు. -
Nikhat Zareen Photos: బాక్సర్ నిఖత్ జరీన్కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
Nikhat Zareen: ఇండియన్ గోల్డెన్ గర్ల్కి మరో అరుదైన గిఫ్ట్!
ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన 'నిఖత్ జరీన్' (Nikhat Zareen)పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్ ఎన్గెయెన్ థి టామ్పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిష్ చరిత్రలో నిఖత్ జరీన్కు ఇది రెండో స్వర్ణ పతకం విశేషం. ఇప్పటికే ఈమె 2022లో 52కేజీల విభాగంలో మొదటిసారి వరల్డ్ చాంపియన్గా మారింది. అయితే ఇప్పుడు పొందిన విజయంతో ఈమె ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డును కూడా గెలుచుకుంది. భారత క్రీడా చరిత్రలో ఎదురులేకుండా నిలిచి కొత్త అధ్యాయానికి నాంది పలికిన నిఖత్ జరీన్ను ప్రశంసిస్తూ కంపెనీ థార్ SUV గిఫ్ట్గా ఇచ్చింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మహీంద్రా ఆటోమోటివ్ ట్వీట్ చేసింది. (ఇదీ చదవండి: ఎమ్ఆర్పి ధరల్లో జరిగే మోసాలకు ఇలా చెక్ పెట్టండి) మహీంద్రా థార్ విషయానికి వస్తే, భారతీయ మార్కెట్లో ప్రజాదరణ పొందిన ఆఫ్-రోడ్ కార్లలో ఇది ఒకటి. ఇది అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి పర్ఫామెన్స్ విషయంలో కూడా మంచి పనితీరుని అందిస్తుంది. ఇందులో రెండు డీజిల్ ఇంజిన్స్, ఒక పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. -
Womens World Boxing Championships 2023: ప్రపంచాన్ని గెలిచిన మన బంగారాలు
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) న్యూదిల్లీలో (మార్చి15–మార్చి26) నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్ (50 కేజీల విభాగం), స్వీటీ బూరా (81 కేజీల విభాగం), లవ్లీనా (75 కేజీల విభాగం), నీతూ గంగాస్ (48 కేజీల విభాగం) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నిఖత్ నుంచి నీతూ వరకు ఎవరిదీ నల్లేరు మీద నడక కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వాటికి దీటుగా పంచ్లు ఇచ్చి తమను తాము నిరూపించుకున్న ఈ స్వర్ణవిజేతలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు... నిఖత్ జరీన్: పదమూడేళ్ల వయసులోనే బాక్సింగ్ బరిలోకి దిగింది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్. నిఖత్లోని ప్రతిభ సంగతి పక్కనపెట్టి ‘మగరాయుడిలా ఈ ఆటలు ఏమిటి’ అన్న వాళ్లే ఎక్కువ. ‘ఎందుకొచ్చిన తలనొప్పి’ అని ఆమె తండ్రి నిఖత్ను ఆట మానిపించి ఉంటే విశ్వ విజేతగా నిఖత్ను చూసేవాళ్లం కాదు. రింగ్లో ఒత్తిడి ఎదురైతే బిత్తరపోయే రకం కాదు నిఖత్. ఆ ఒత్తిడినే బలంగా చేసుకునే నైజం ఆమెది. ఆటకు సంబంధించిన వ్యూహాల పైనే కాదు ఆహార నియమాల విషయంలోనూ దృష్టి సారించే నిఖత్ ప్రతికూల వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఆటలో వ్యూహ ప్రతివ్యూహాలపైనే తన ఆసక్తి. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచి తన ప్రత్యేకత చాటుకుంది నిఖత్. మేరీ కోమ్ తరువాత ఒకటి కంటె ఎక్కువ స్వర్ణాలు గెలిచిన బాక్సర్గా నిలిచింది. పోరాటమే తన మార్గం. బలం. స్వీటీ బురా: హరియాణాలోని హిసార గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వీటీ బురా తండ్రి మహేంద్రసింగ్ ఒకప్పటి బాస్కెట్బాల్ ప్లేయర్. తండ్రి ప్రభావంతో ఆటలపై స్వీటిలో ఆసక్తి మొదలైంది. బాక్సింగ్లో ఓనమాలు నేర్చుకోవడానికి ముందు స్వీటీ రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్. కబడ్డీలో స్వీటీ దూకుడు చూసి తండ్రితో సహా చాలామంది ‘ఈ అమ్మాయికి బాక్సింగ్ అయితే కరెక్ట్’ అనుకున్నారు. తండ్రి సూచనతో బాక్సింగ్ వైపు వచ్చింది స్వీటీ. ఒక ఆటలో ‘సూపర్’ అనిపించుకున్నవారికి కొత్తగా వేరే ఆటలోకి వెళ్లి నిరూపించుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. స్వీటీ బడ్డింగ్ బాక్సర్గా ఉన్నప్పుడు తనకు పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు. ఎక్కడైనా ఖాళీ స్థానం కనిపిస్తే కోచ్ అక్కడ శిక్షణ ఇచ్చేవాడు. పొలం భూముల్లో నేర్చుకున్నామా, పట్టణంలోని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నామా అనేదాన్ని స్వీటీ ఎప్పుడూ మనసు మీదికి తీసుకోలేదు. గురువు చెప్పినదానికి తనదైన వ్యూహాన్ని జోడించి ఆటలో రాణించేది. ఒకసారి బాక్సింగ్ రింగ్లో ఉన్నప్పుడు స్వీటీకి ప్రత్యర్థి గట్టి పంచ్ ఇచ్చింది. ‘చుక్కలు కనిపించి ఉంటాయి నీకు’ అని తమ్ముడు అరిచాడు. అతను ఎగతాళిగా అన్నాడా, వ్యూహాత్మకంగా అన్నాడా అనేది వేరే విషయంగానీ తమ్ముడు చేసిన కామెంట్తో స్వీటీకి బాగా కోపం వచ్చింది. ఆ కోపం బలంగా మారి ప్రత్యర్థికి చుక్కలు చూపించింది! స్వీటీ పంచింగ్ గ్రామర్ను చూసి ప్రేక్షకులు వేనోళ్ల పొగిడారు. ఆ విజయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్లో స్వీటీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ‘ఆట అనేది నా రక్తంలోనే ఉంది’ అని సగర్వంగా చెప్పే స్వీటీ బురాకు రాబోయే ఒలింపిక్స్ అనేది లక్ష్యం. నీతూ గంగాస్: హరియాణా రాష్ట్రంలోని బివానీ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టింది నీతూ గంగాస్. తల్లి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పుడు నీతూ చిలిపి అమ్మాయి. స్కూల్లో తగాదాలు, ఫైట్లు! బాక్సింగ్లో ఓనమాలు తెలియకపోయినా ప్రత్యర్థులకు బాక్సర్లా పంచ్లు ఇచ్చేది. ఇది చూసిన తండ్రి జై భగవాన్ కుమార్తెకు బాక్సింగ్లో శిక్షణ ఇప్పించడం ప్రారంభించాడు. అప్పుడు నీతూ వయసు 12 సంవత్సరాలు. శిక్షణ తీసుకుంటోందన్న మాటేగానీ బాక్సింగ్లో ఎలాంటి ప్రతిభా చూపేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చేతిలో ఓడిపోతూనే ఉండేది. ఒకరోజు ‘ఇక నా వల్ల కాదు నాన్నా. నాకు బాక్సింగ్ వద్దు’ అని ధైర్యంగా తండ్రితో చెప్పింది. ‘అలాగే తల్లీ’ అని ఆయన అని ఉంటే కొత్త చరిత్ర ఆవిష్కరణ అయ్యేది కాదు. కుమార్తెను బాక్సర్గా తీర్చిదిద్దడం కోసం చేస్తున్న ఉద్యోగానికి సెలవు(నాన్–పెయిడ్ లివ్) పెట్టి మరీ కుమార్తె ట్రైనింగ్ నుంచి డైట్ వరకు దగ్గరుండి పర్యవేక్షించాడు. కొంతకాలం తరువాత ప్రసిద్ధ బాక్సింగ్ కోచ్, బివానీ బాక్సింగ్ క్లబ్ (బీబీసి) వ్యవస్థాపకుడు జగ్దీష్ సింగ్ దృష్టిలో పడింది నీతూ. ‘బీబీసి’లో చేరడం నీతూకు టర్నింగ్ పాయింట్గా మారింది. నిజంగా చెప్పాలంటే అసలు సిసలు శిక్షణ అప్పుడే మొదలైంది. బాక్సింగ్లోని మెలకువలను ఔపోసన పట్టి రింగ్లో ప్రత్యర్థులను మట్టి కరిపించడం ప్రారంభించింది. గత సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది నీతూ. లవ్లీనా బోర్గో హెయిన్: అస్సాంలోని గోలగాట్ జిల్లాకు చెందిన టికెన్ బోర్గోహెయిన్ చిన్న వ్యాపారి. ‘పాపం ఈయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని ఎప్పుడూ ఎవరో ఒకరు అకారణ సానుభూతి చూపుతుండేవారు. ముగ్గురు కుమార్తెలలో చిన్న అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్ అక్కలను స్ఫూర్తిగా తీసుకొని బాక్సింగ్ నేర్చుకుంది. ‘మనకెందుకు బాక్సింగ్’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చిన్న కుమార్తెను బాక్సింగ్ ఛాంపియన్గా చూడాలని కలులు కనేవాడు తండ్రి. 2018, 2019 ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాలు గెలుచుకొని తల్లిదండ్రుల కళ్లలో వెలుగులు నింపింది లవ్లీనా. గత సంవత్సరం ఏషియన్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో బాక్సర్గా పేరు తెచ్చుకున్నా తన మూలాలు మరిచిపోలేదు లవ్లీనా. ఇప్పటికీ తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంటుంది. పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలనేది తన సిద్ధాంతం. 2020 ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకుంది లవ్లీనా. ఒలింపిక్స్లో బంగారు పతకం గెలుచుకోవాలనేది తన కల. -
తెలంగాణకు నిఖత్ గర్వకారణం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ ఫైనల్లో 50 కిలోల విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని కొనియాడారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతర్జాతీయస్థాయి ఖ్యాతిగడించే ప్రదర్శన చేస్తున్న బాక్సర్ నిఖత్ జరీన్ స్వశక్తికి నిదర్శనమని రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జరీన్ను ఢిల్లీలో మంత్రి అభినందించారు. -
ఇదే కఠినమైన బౌట్.. నా దేశం కోసం ఈ పతకం: నిఖత్ జరీన్ ఉద్వేగం
Nikhat Zareen- World Boxing Championship: ‘‘రెండోసారి ప్రపంచ చాంపియన్గా నిలవడం చాలా సంతోషంగాఉంది. అందులోనూ ఒలింపిక్ కేటగిరీలో స్వర్ణం గెలవడం ఇంకా సంతృప్తినిచ్చింది. టోర్నీలో సహజంగానే నా దృష్టిలో ఇదే కఠినమైన బౌట్. ఆమె ఆసియా చాంపియన్. హోరాహోరీగా తలపడ్డాం. కామన్వెల్త్ క్రీడల్లో నేను పెద్దగా పోటీని ఎదుర్కోలేదు. ఈ తర్వాత ఇక్కడే మళ్లీ బరిలోకి దిగాను. కానీ ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రత్యర్థులతో వరుస బౌట్లలో తలపడాల్సి వచ్చింది. అందుకే కొన్నిసార్లు నేను వేగంగా కదల్లేకపోయాను. ఫైనల్లో మాత్రం చివరి బౌట్ కాబట్టి పూర్తి శక్తిసామర్థ్యాలు వాడాలని నిశ్చయించుకున్నా. వంద శాతంకంటే ఎక్కువ ప్రయత్నించా. గత ఏడాది పతకంతో పోలిస్తే ఇది ఎక్కువ శ్రమతో వచ్చింది. దీని కోసం బరువు తగ్గించుకొని ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సన్నాహానికి సమయం తక్కువగా ఉన్నా పూర్తి ఏకాగ్రతతో సాధన చేశా. ఉత్తమ బాక్సర్గా మహీంద్రా థార్ వాహనం బహుమతిగా వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి నాకు వచ్చిన ప్రైజ్మనీతో అమ్మా, నాన్నను హజ్ యాత్రకు పంపిస్తా’’ అని భారత బాక్సర్ నిఖత్ జరీన్ తెలిపింది. బెస్ట్ బాక్సర్గా ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్ (50 కేజీలు) మరోసారి చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో వియత్నాం బాక్సర్ థి టామ్ను ఓడించి విజేతగా నిలిచింది. అంతేకాకుండా టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించి బెస్ట్ బాక్సర్గా నిలిచింది. ఈ క్రమంలో వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ విజయం అనంతరం ఈ మేరకు స్పందించింది. ఎన్నో అడ్డంకులు ఎదురైనా తాను ఇక్కడిదాకా చేరుకోవడంలో తన తల్లిదండ్రుల పాత్రను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నిఖత్.. ఈ పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు పేర్కొంది. చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్కు షాక్.. భరత్కు చోటు SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. 2️⃣x World Champion 🇮🇳 @nikhat_zareen ’s reaction right after scripting history 🥳🔥@AjaySingh_SG l @debojo_m#itshertime #WorldChampionships #WWCHDelhi @Media_SAI @anandmahindra @IBA_Boxing @Mahindra_Auto @MahindraRise @NehaAnandBrahma https://t.co/29Wd7lBDfx pic.twitter.com/kLcmJzLdcw — Boxing Federation (@BFI_official) March 26, 2023 -
అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు..
మే 19, 2022... నిఖత్ జరీన్ తొలిసారి ప్రపంచ చాంపియన్గా నిలిచింది. అప్పటి వరకు ఆమెకు ఉన్న గుర్తింపు వేరు. ఒకసారి యూత్ వరల్డ్ చాంపియన్గా, మరోసారి రన్నరప్గా నిలిచినా సరే, సీనియర్ స్థాయికి వచ్చేసరికి కనుమరుగైన వారి జాబితాలో ఆమె కూడా చేరుతుందని చాలా మంది అనుకున్నారు. ఆసియా చాంపియన్షిప్లో కాంస్యంతో పాటు మరో ఆరు అంతర్జాతీయ పతకాలు సాధించినా నిఖత్పై ఎక్కువగా అంచనాలు లేవు. ఆమె ప్రదర్శనపై కూడా ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అని, మున్ముందు గొప్ప విజయాలు సాధించగలదని ఎవరూ ఊహించలేదు. అందుకు కారణం అప్పటికే ఉత్తరాది, ముఖ్యంగా హరియాణా బాక్సర్లతోనే భారత బృందం నిండి ఉంది. ఆటా వారిదే, ఫలితాలు వారి నుంచే అన్నట్లుగా పరిస్థితి ఉంది. పైగా మేరీకోమ్తో పోటీ పడేందుకు సిద్ధపడి అదేదో తప్పు చేసినట్లుగా తన ప్రమేయం లేకుండానే చాలా మంది దృష్టిలో నిఖత్ జరీన్ విలన్గా మారిపోయింది. కానీ... కానీ... ఒక్క అద్భుత ప్రదర్శన అంతా మార్చేసింది... వరల్డ్ చాంపియన్షిప్లో విజేతగా నిలవడంతో నిఖత్ సత్తా అందరికీ అర్థమైంది. నిఖత్ ప్రతిభను ప్రపంచం గుర్తించింది. భారత్ నుంచి విశ్వ వేదికపై నిలబడగల అథ్లెట్ల జాబితాలో ఆమె కూడా చేరింది. అసలు కర్తవ్యంపైనే దృష్టి... గత వరల్డ్ చాంపియన్షిప్ స్వర్ణం నుంచి నిఖత్ ప్రయాణం కొత్తగా మొదలైంది. ఎందుకంటే అగ్రశ్రేణి ఆటగాళ్లు విజయాలు సాధించడం మాత్రమే కాదు, వాటిని కొనసాగించడం, నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. గొప్ప ఘనతల తర్వాత వచ్చే కీర్తి కనకాదులు, ప్రచారాలు ప్లేయర్లను ఒక్కసారిగా ఆటకు దూరం చేసిన ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. సరిగ్గా ఈ విషయంలోనే నిఖత్ తడబడలేదు. వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత ఎన్నో ప్రచార, బ్రాండింగ్ కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలకు ఆహ్వానాలు, ప్రారంభోత్సవాలు, ఆపై టీవీ, సినిమా షోలు, అవార్డుల స్వీకరణ... ఇలా ఒక్కసారిగా నిఖత్ బిజీగా మారిపోయింది. అయితే ఈ సమయంలోనూ ఆమె తన అసలు కర్తవ్యాన్ని మరచిపోలేదు. వెయిట్ కేటగిరీ మారినా... గత విజయం తర్వాత నిఖత్ ముందు నిలిచిన పెద్ద సవాల్ వెయిట్ కేటగిరీ! 2022 వరల్డ్ చాంపియన్షిప్లో ఆమె 52 కేజీల విభాగంలో టైటిల్ సాధించింది. దాంతో పారిస్ ఒలింపిక్స్–2024 అనేది అసలు లక్ష్యంగా మారింది. అయితే వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లో 52 కేజీల విభాగం లేకపోవడంతో తప్పనిసరిగా దానిని మార్చుకోవాల్సి వచ్చింది. ముందుకెళితే 54 కేజీల్లో అప్పటికే అక్కడ సత్తా చాటుతున్న అంతర్జాతీయ స్టార్ బాక్సర్లు, అనుభవజ్ఞులు ఉంటారు. దాంతో తన పంచ్ పవర్ పదును పని చేసేందుకు వెయిట్ తగ్గడమే సరైందని భావించి 50 కేజీలకు మారింది. దానికి అనుగుణంగా తన బరువును మార్చుకొని తీవ్రంగా సాధన చేసింది. భారత కోచ్ జాన్ వార్బర్టన్ సాధన విషయంలో నిఖత్కు అన్ని రకాలుగా సరైన దిశానిర్దేశం చేశారు. ఆమె శ్రమ ఫలితం బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో కనిపించింది. వరల్డ్ చాంపియన్గా తన స్థాయిని ప్రదర్శిస్తూ అక్కడ సునాయాసంగా స్వర్ణం గెలుచుకుంది. అదీ తాను కొత్తగా మొదలుపెట్టిన 50 కేజీల కేటగిరీలో కావడంతో తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఆపై మరో ఐదు నెలలకు వచ్చిన జాతీయ చాంపియన్షిప్లో నిఖత్కు మొదటి స్థానం లాంఛనమే అయింది. ఈ ఏడాది వ్యవధిలో ఆమె ఈ రెండు ఈవెంట్లు మినహా మరే టోర్నీలోనూ పాల్గొనలేదు. విదేశాల్లో కొన్ని టోర్నమెంట్లకు ఆహ్వానాలు అందినా... తన ఆట మెరుగవ్వాలంటే అలాంటి టోర్నీలలో ఆడి ‘విజేత’ అనిపించుకోవడంకంటే ప్రాక్టీస్ చేయడమే సరైందని జరీన్ భావించింది. చివరకు దాంతో ఫలితాన్ని అందుకుంది. ఆద్యంతం ఆధిపత్యం... సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో ఆద్యంతం నిఖత్ ఆధిపత్యం కనిపించింది. సెమీస్ మినహా మిగిలిన బౌట్లలో ఎక్కడా తడబాటు లేకుండా ఆమె అలవోక విజయాలు అందుకుంది. ఒక బౌట్లో ఆర్ఎస్సీ (రిఫరీ స్టాప్స్ ద కంటెస్ట్), 4 బౌట్లలో 5–0తో నెగ్గిన ఆమె ఒక్క సెమీస్లో 5–2తో ప్రత్యర్థికి కాస్త అవకాశం ఇచ్చింది. తాజా విజయంతో ఈ కేటగిరీలో నిఖత్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. ఇకపై పారిస్ ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగాల్సి ఉంది. ఇదే తరహా ఆటను కొనసాగిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ, మెగా ఈవెంట్లో కూడా పతకం అందుకోవడం అసాధ్యం కాబోదు! -సాక్షి క్రీడా విభాగం చదవండి: WPL 2023 Winner: విజేత ముంబై ఇండియన్స్.. Congratulations to @nikhat_zareen for her spectacular victory at the World Boxing Championships and winning a Gold. She is an outstanding champion whose success has made India proud on many occasions. pic.twitter.com/PS8Sn6HbOD — Narendra Modi (@narendramodi) March 26, 2023 -
Nikhat Zareen: నిఖత్ తడాఖా
సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు పసిడి పంచ్లతో అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తమ అత్యుత్తమ ‘స్వర్ణ’ ప్రదర్శనను సమం చేశారు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ నాలుగు బంగారు పతకాలతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం నీతూ (48 కేజీలు),స్వీటీ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... ఆదివారం నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) ‘గోల్డెన్’ ఫినిషింగ్ ఇచ్చారు. న్యూఢిల్లీ: గత ఏడాది తాను సాధించిన ప్రపంచ చాంపియన్షిప్ పసిడి పతకం గాలివాటమేమీ కాదని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ నిరూపించింది. ఈ తెలంగాణ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 26 ఏళ్ల నిఖత్ 50 కేజీల విభాగంలో విజేతగా అవతరించింది. ఫైనల్లో నిఖత్ 5–0తో రెండుసార్లు ఆసియా చాంపియన్గా నిలిచిన ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)పై గెలుపొందింది. గత ఏడాది తుర్కియేలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో నిఖత్ 52 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచింది. తాజా ప్రదర్శనతో నిఖత్ ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్గా గుర్తింపు పొందింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రపంచ చాంపియన్షిప్లో ఆరు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఏడు పతకాలు సాధించింది. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఐదు పతకాలు గెలిచింది. దూకుడుగా... థి టామ్తో జరిగిన ఫైనల్లో నిఖత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది. ఒకవైపు అవకాశం దొరికినపుడల్లా ప్రత్యరి్థపై పంచ్ల వర్షం కురిపించింది. మరోవైపు ప్రత్యర్థి విసిరిన పంచ్లను కాచుకుంది. తొలి రౌండ్లో నిఖత్ను ఒడిసిపట్టుకొని కింద పడేసినందుకు వియత్నాం బాక్సర్కు రిఫరీ పెనాల్టీ పాయింట్ విధించారు. ఆ తర్వాత నిఖత్ ఎదురుదాడికి దిగి రెండు రైట్ హుక్ పంచ్లతో, ఆ తర్వాత స్ట్రెయిట్ పంచ్లతో విరుచుకుపడింది. ఫలితం తొలి రౌండ్లో నిఖత్దే పైచేయిగా నిలిచింది. రెండో రౌండ్లో థి టామ్ పుంజుకుంది. నిర్ణాయక మూడో రౌండ్లో నిఖత్ మళ్లీ జోరు పెంచింది. నిఖత్ సంధించిన పంచ్కు వియత్నాం బాక్సర్కు దిమ్మదిరిగిపోయేలా చేసింది. చివరకు నిఖత్ అదే జోరు కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన నిఖత్కు ‘బెస్ట్ బాక్సర్’ అవార్డు కూడా లభించింది. విజేతగా నిలిచిన నిఖత్కు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్మనీతోపాటు ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారం కింద ‘మహీంద్రా థార్’ వాహనం లభించింది. ఓవరాల్ చాంపియన్ భారత్ ఆతిథ్య భారత్ నాలుగు స్వర్ణ పతకాలతో ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. చైనా మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో ఏడు పతకాలతో రన్నరప్గా నిలిచింది. ర్యాంక్ వర్గీకరణలో నెగ్గిన స్వర్ణ పతకాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. రష్యా ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడు పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 12 వెయిట్ కేటగిరీలలో 48 పతకాల కోసం బౌట్లు జరగ్గా... 20 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. రష్యా బాక్సర్లను అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఐబీఏ నిర్ణయాన్ని నిరసిస్తూ 17 దేశాలు ఈ పోటీలకు దూరంగా ఉన్నాయి. లవ్లీనా తొలిసారి... అస్సాం బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్గా అవతరించింది. 2018, 2019 ప్రపంచ చాంపియన్షిప్లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్న లవ్లీనా ఈసారి మాత్రం విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో లవ్లీనా 5–2తో కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. చాంపియన్గా నిలిచిన లవ్లీనాకు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
చరిత్ర సృష్టించిన నిఖిత్ జరీన్.. భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ 2023లో భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం చేరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత బాక్సర్ నిఖిత్ జరీన్ వియత్నాంకు చెందిన థామ్ గుయేన్ను 5-0 తేడాతో చిత్తు చేసి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో నిఖిత్ ఈ ఘనత సాధించింది. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్ధిపై పూర్తి అధిపత్యం చెలాయించిన నిఖిత్ రెండో సారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ఇక రెండువ సారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన నిఖిత్ జరీన్ అరుదైన రికార్డు సాధించింది. ఒకటి కంటే ఎక్కవ ప్రపంచ ఛాంపియన్ షిప్స్ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్గా నిఖిత్ జరీన్ నిలిచింది. ఈ ఘనత సాధించిన జాబితాలో భారత బాక్సర్ మేరీకోమ్ తొలి స్థానంలో ఉంది. -
నిఖత్ పంచ్ అదిరె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు తమ పంచ్ పవర్ను ప్రదర్శించారు. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షి ప్లో ఏకంగా నలుగురు భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు), నీతూ (48 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) తుది పోరుకు అర్హత సాధించి స్వర్ణ పతకాలకు విజయం దూరంలో నిలిచారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్లో నిఖత్ జరీన్ 5–0తో 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇన్గ్రిత్ వలెన్సియా (కొలంబియా)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–2తో ఆసియా చాంపియన్ అలువా బల్కిబెకోవా (కజకిస్తాన్)పై, లవ్లీనా 4–1తో లీ కియాన్ (చైనా)పై, స్వీటీ 4–3తో స్యు ఎమ్మా గ్రీన్ట్రీ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు. గత ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో 52 కేజీల విభాగంలో పోటీపడి స్వర్ణం సాధించిన నిఖత్ ఈసారి 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. టోక్యో ఒలింపిక్స్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ను ఓడించిన వలెన్సియాను నిఖత్ తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ఆడింది. రింగ్లో వేగంగా కదులుతూనే అవకాశం దొరికినపుడల్లా వలెన్సియాపై పంచ్లు విసిరింది. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయించకుండా కూడా నిఖత్ జాగ్రత్త పడింది. ముందుగా తొలి రెండు రౌండ్లలో ఎదురుదాడి చేసి స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన నిఖత్ మూడో రౌండ్లో మాత్రం ప్రత్యర్థి కి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా రక్షణాత్మకంగా ఆడి కట్టడి చేసింది. 2 ఒకే ప్రపంచ చాంపియన్షి ప్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది భారత బాక్సర్లు ఫైనల్ చేరడం ఇది రెండోసారి. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచి్చన ప్రపంచ చాంపియన్షిప్లో ఐదుగురు భారత బాక్సర్లు (మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ, లేఖ, నగిశెట్టి ఉష) ఫైనల్ చేరారు. ఉష రజతం నెగ్గగా, మేరీకోమ్, సరిత, జెన్నీ, లేఖ స్వర్ణ పతకాలు గెలిచారు. 3 మేరీకోమ్ తర్వాత ప్రపంచ చాంపియన్షి ప్లో కనీసం రెండుసార్లు ఫైనల్కు చేరిన భారత బాక్సర్లుగా నిఖత్ జరీన్, స్వీటీ గుర్తింపు పొందారు. మేరీకోమ్ ఏకంగా ఏడుసార్లు ఫైనల్కు చేరి ఆరుసార్లు స్వర్ణం, ఒకసారి రజతం సాధించింది. నిఖత్ గత ఏడాది, స్వీటీ 2014లో ఫైనల్కు చేరారు. నేడు విశ్రాంతి దినం. శనివారం, ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్లో లుత్సయిఖాన్ అల్టాంట్సెట్సెగ్ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్ (చైనా)తో స్వీటీ తలపడతారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్లో ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)తో నిఖత్ జరీన్... కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)తో లవ్లీనా పోటీపడతారు. -
ఫైనల్లో నీతూ, నిఖత్.. భారత్కు కనీసం 2 సిల్వర్ మెడల్స్ ఖాయం
మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్-2023లో భారత్కు కనీసం రెండు రజత పతకాలు ఖాయమయ్యాయి. ఇవాళ (మార్చి 23) జరిగిన సెమీ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీలు), ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు) ప్రత్యర్ధులపై విజయాలు సాధించి ఫైనల్కు చేరారు. నీతూ.. కజకిస్తాన్కు చెందిన అలువా బాల్కిబెకోవాపై విజయం సాధించగా, తెలంగాణ అమ్మాయి నిఖత్.. కొలంబియా బాక్సర్ ఇంగ్రిడ్ వెలెన్సియాను మట్టికరిపించింది. ఈ పోటీల్లో భారత్కు మరో 2 పతకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న జరిగిన క్వార్టర్స్లో లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) విజయాలు సాధించి కనీసం కాంస్యం పతాకన్ని ఖరారు చేశారు. ఇవాళ రాత్రి 8:15 గంటలకు జరిగే సెమీఫైనల్లో లవ్లీనా.. లీ కియాన్ (చైనా)ను, రాత్రి 8: 30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సావీటీ.. సూ ఎమ్మా గ్రీన్ట్రీ (ఆస్ట్రేలియా)తో తలపడనున్నారు. ఈ బౌట్లలో వీరిరువురు విజయాలు సాధిస్తే, భారత్కు మరో 2 రజత పతకాలు ఖాయమవుతాయి. -
భారత్కు తొలి పతకం ఖాయం చేసిన నీతూ ఘంగాస్
మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో భారత్కు తొలి పతకం ఖాయమైంది. కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీలు) భారత్కు పతకం ఖరారు చేసింది. ఇవాళ (మార్చి 22) జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో జపాన్కు చెందిన మడోకా వాడాకు మట్టికరిపించిన నీతూ.. సెమీఫైనల్కు అర్హత సాధించి భారత్కు కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది. తొలి రౌండ్ నుంచే దూకుడుగా ఆడి ప్రత్యర్ధిపై పంచ్ల వర్షం కురిపించడంతో రెండవ రౌండ్లో రిఫరీ బౌట్ను నిలిపివేసి RSC (రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్) ద్వారా నీతూను విజేతగా ప్రకటించాడు. ఈ పోటీల్లో నీతూ RSC ద్వారానే మూడు బౌట్లలో విజయం సాధించడం విశేషం. మరోవైపు, ఇవాళ జరుగబోయే బౌట్లలో మరో ఏడుగురు భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు), సాక్షి చౌదరి (52 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), జైస్మిన్ లంబోరియా (60 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) (+81 కేజీలు) (+81 కేజీలు) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఆడనున్నారు. -
అమ్మాయిల పంచ్ అదిరింది.. క్వార్టర్ ఫైనల్లో నిఖత్, నీతూలతో పాటు..
World Boxing Championship 2023- న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో మంగళవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న డిఫెండింగ్ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీఫైనల్ చేరితే ఈ నలుగురికీ కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మరోవైపు శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయా రు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో నిఖత్ 5–0తో పాట్రిసియా అల్వారెజ్ (మెక్సికో)పై, సుమయా కొసిమోవా (తజికిస్తాన్)పై నీతూ, నూర్ ఎలిఫ్ తుర్హాన్ (తుర్కియే)పై మనీషా, సమదోవా (తజికిస్తాన్)పై జాస్మిన్ గెలుపొందారు. శశి చోప్రా 0–4తో మాయ్ కిటో (జపాన్) చేతిలో, నవ్బఖోర్ ఖమిదోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో మంజు ఓడిపోయారు. చదవండి: WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా.. పాపం ముంబై! SA Vs WI: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్ను ఊదేశారు Quarterfinals Ready 🔥💥 🇮🇳 champs acing it at the #WWCHDelhi Tomorrow ⏳ Book your tickets now to not miss the action 🔗:https://t.co/k8OoHXoAr8@AjaySingh_SG l @debojo_m#itshertime #WWCHDelhi #WorldChampionships @IBA_Boxing @Media_SAI @paytminsider pic.twitter.com/KeXDKSuC90 — Boxing Federation (@BFI_official) March 21, 2023 -
Nikhat Zareen: ప్రిక్వార్టర్ ఫైనల్లో నిఖత్
Women's World Boxing Championship- న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఆదివారం బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు) తమ ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలు నమోదు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ రెండో రౌండ్ బౌట్లో 5–0తో ఆఫ్రికా చాంపియన్ బూఆలమ్ రుమేసా (అల్జీరియా)ను ఓడించగా... మనీషా 5–0తో రహీమి టీనా (ఆస్ట్రేలియా)పై గెలిచింది. చదవండి: IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం -
నిఖత్ జరీన్ తొలి 'పంచ్' అదిరింది..
తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో శుభారంభం చేసింది. 50 కేజీల విభాగంలో అజర్బైజాన్కు చెందని ఇస్మయిలోవా అనఖానిమ్ను చిత్తు చేసి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. మ్యాచ్ మొదలవగానే తన పంచుల వర్షం కురిపించిన నిఖత్ ఎక్కడా ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వలేదు. తొలి బౌట్లోనే ఆధిపత్యం చూపించిన నిఖత్ ఇస్మయిలోవా మొహంపై పంచ్లతో అటాక్ చేసింది. అయితే రిఫరీ అడ్డుకొని ఆర్ఎస్సీ(Referee Stops Contest) కింద నిఖత్ గెలిచినట్లు ప్రకటించాడు. ఇక నిఖత్ జరీన్ రౌండ్ ఆఫ్ 32లో ఆఫ్రికాకు చెందిన రౌమైసా బౌలమ్ను ఎదుర్కోనుంది. మరోవైపు సాక్షికూడా కొలంబియాకు చెందిన జోస్ మారియాను 5-0తో చిత్తు చేసింది. #IND's🇮🇳 @nikhat_zareen starts off her campaign in style at IBA Women's World Boxing Championships 2023 🥊#WorldChampionships #Boxing pic.twitter.com/srfduaVL88 — Doordarshan Sports (@ddsportschannel) March 16, 2023
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement