ఆగస్ట్‌లో హైదరాబాద్‌ మారథాన్‌, టైటిల్‌ స్పాన్సర్‌గా ఎన్‌ఎండీసీ!

Nmdc Will Be Held 11th Edition Of The Hyderabad Marathon In Hyderabad\ - Sakshi

తెలంగాణ ప్రభుత్వం, ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌ రన్నర్స్‌ సొసైటీలు సంయుక్తంగా 11వ ఎడిషన్‌ ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌ మారథాన్‌ - 2022 ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్‌ 27న 5కె ఫన్ రన్, ఆగస్టు 28న 10 కె, హాఫ్ మారథాన్  21.095కె , ఫుల్ మారథాన్ 42.195కెలు జరగనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. ఇందుకోసం 15వేల  మందికి పైగా రన్నర్లు, 3500 మందికి పైగా వాలంటీర్లు, 250 మంది వైద్య సిబ్బంది పాల్గొననున్నారు. 

ఇక ఈ హైదరాబాద్‌ మారథాన్‌ టైటిల్‌ స్పాన్సర్‌ షిప్‌ను ఎన్‌ఎండీసీ అందిస్తున్నట్లు ఆ సంస్థ రేస్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ మోర్పారియా తెలిపారు. హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేవారికి ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. 

మారథాన్‌ ఈవెంట్‌కు ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ఫేస్‌ ఆఫ్‌ ది ఈవెంట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నిఖత్‌ జరీన్‌ మాట్లాడుతూ.. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2022 ఎడిషన్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. నగరంలో జరిగే అతిపెద్ద కమ్యూనిటీ ఫిట్నెస్ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిఖత్‌ జరీన్‌ పిలుపునిచ్చారు.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top