Elderly man
-
వృద్ధ దంపతుల దారుణ హత్య
అల్వాల్(హైదరాబాద్): వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు, ఇంట్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లిన సంఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూర్యనగర్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, మాణిక్యారం గ్రామానికి చెందిన కనకయ్య (70), రాజమ్మ (65) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావడంతో బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఊరిలో వ్యవసాయం చేసుకునే కనకయ్య, రాజమ్మ వయసు మీద పడడంతో పిల్లల వద్ద ఉందామనే ఆలోచనతో మూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. కనకయ్య అల్వాల్, సూర్యనగర్లో వాచ్మెన్గా పనిచేసేవాడు. కొన్నాళ్ల క్రితం అతను అనారోగ్యానికి గురి కావడంతో ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమీపంలో ఉంటున్న కూతురు లత ఇంటికి వెళ్లి సామన్లు సర్దుకునేందుకు అవసరమైన సంచులు కూడా తెచ్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వారి కుమార్తె లత ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో మంచంపై విగతజీవులై పడి ఉన్నారు. ఇద్దరి తలలపై గాయాలు ఉన్నాయి. సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లత కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాగిలాలను రప్పించి పరిసరాల్లో తనిఖీలు చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంట్లో చొరబడి దొంగతనాలు పాల్పడి ఉంటారని, ఈ క్రమంలోనే వారిపై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, వెండి పట్టీలు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కనకయ్య తమ వద్ద ఉన్న నగదు అవసరమైన వారికి వడ్డీకి ఇచ్చే వాడని తాను ఊరికి వెళ్లి రూ. లక్ష తీసుకువచ్చానని, అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తానని చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ డీసీపీ సుధీర్ కుమార్, ఏసీపీ రాములు, సీఐ రాహుల్దేవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
యోయో హనీ సింగ్ కచేరీలో అనుకోని అతిథి స్టెప్పులు, వీడియో వైరల్
రాపర్ , గాయకుడు యో యో హనీ సింగ్ సంగీతాభిమానులకు పరిచయం అవసరంలేదు.అంతర్జాతీయంగా గత పదిహేనేళ్లుగా పాప్ సంగీతాన్ని ఏలుతున్న ఘనత అతగాడి సొంతం. ఇటీవల హనీ సింగ్ భారత పర్యటన సందర్భంగా ఒక విశేషం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.హనీ సింగ్ భారత పర్యటనలో భాగంగా కోల్కతాలొ (ఏప్రిల్ 4) మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటైంది. అతని సంగీత ఝరిలో ప్రేక్షకులంతా ఓలలాడుతున్నారు. ఈ కచేరీ సందర్భంగా వేదికపై ఉన్న యో యో హనీ సింగ్ను కలవడానికి ఒక వృద్ధుడు దూసుకొచ్చాడు. భారీగా గుమిగూడిన జనాల మధ్యనుంచి ,బారికేడ్ను దూకి మరీ వృద్ధుడి ముందుకొచ్చాడు. నెత్తిన తలపాకాగాతో ఆ పెద్దాయన (సింగ్) రావడాన్ని చూసి హనీ సింగ్ ఆయను వేదికమీదకు ఆహ్వనించాడు. అంతే.. వేదికమీదకు రాగానే సూపర్గా స్టెప్పులేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హనీసింగ్ హిట్ ట్రాక్ డోప్ షోప్కు హుషారుగా నృత్యం చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఉత్సాహంతో ఊగిపోయారు. హనీ సింగ్ స్వయంగా ఈ చిన్న క్లిప్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. " మై ఫరెవర్ యంగ్ ఫ్యాన్స్" అంటూ పోస్ట్ చేయడం హైలైట్ అయింది. View this post on Instagram A post shared by Yo Yo Honey Singh (@yoyohoneysingh) జస్ప్రీత్ పనేసర్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్లో మొత్తం వీడియోను షేర్ చేయడంతో బారికేడ్ను దాటి సింగ్ను కంటెంట్ సృష్టికర్త జస్ప్రీత్ తండ్రి అని తేలింది. "కోల్కతాలో హనీ సింగ్ కచేరీలో నాన్నకు ఒక అద్భుతమైన క్షణం" అంటూ ఈ జస్ప్రీత్ వీడియోలో చెప్పారు. "నాకు హనీ సింగ్ అంటే చాలా ఇష్టం. పదేళ్ల వయస్సు నుండి అతని పాటలు వింటున్నాను. నా తండ్రి ఈ రోజు అతనితో వేదికపై డ్యాన్స్ చేశాడు. చెప్పలేనంత ఆనందంగా ఉంది" అంటూ పేర్కొన్నాడు. -
వెల్లువలా ఫిర్యాదులు
సాక్షి నెట్వర్క్:⇒ పింఛన్ ఇప్పించాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వేడుకోలు..!⇒ తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కాళ్లరిగేలా తిరుగుతున్న గిరిజనులు..!⇒ రేషన్ కార్డులు, ఇళ్ల కోసం నెలల తరబడి ఆరాటంతో ఎదురు చూస్తున్న పేదలు..! ⇒ అడుగు ముందుకు పడని భూముల మ్యుటేషన్లు.. పాస్బుక్లు అందక రైతన్నల గగ్గోలు..! ⇒ స్థలాలు ఆక్రమణలకు గురై తీవ్ర ఆందోళనలో సామాన్యులు..! ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువులు మధ్యలో ఆగిపోయిన పిల్లలు..!ఇంతమంది ఇన్ని సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నా పరిష్కారం లభిస్తుందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా.. సమస్యల నిలయంగా మారింది! కలెక్టర్ నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక ప్రజలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్కు తరలి వస్తున్న వారితోపాటు కార్యాలయాలను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమవుతూ నెలల తరబడి తిరుగుతున్నవారే కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిష్కార వేదికల వద్దకు వచ్చిన వారిని ‘సాక్షి’ ప్రతినిధుల బృందం పలుకరించగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కల్పిస్తూ అడుగులు ముందుకు వేసిందని, గ్రామ స్థాయిలో ఇంటి వద్దకే పౌర సేవలను అందచేసిందని గుర్తు చేసుకున్నారు. ఏ కారణం చేతనైనా సరే.. అర్హుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా లబ్ధి చేకూరేలా ఏటా రెండుసార్లు జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో పారదర్శకంగా ప్రదర్శించి వలంటీర్ల ద్వారా ఇంటికే పథకాలను చేరవేసిందని చర్చించుకోవడం కనిపించింది.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురానికి చెందిన ఆయన కుమారుడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32లో 89 సెంట్లను రామచంద్రుడు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఇందులో 44 సెంట్ల భూమిని ఈశ్వరయ్య అనే వ్యక్తికి విక్రయించాడు. మిగిలిన 45 సెంట్ల భూమికి పాస్బుక్ కోసం వెళితే మూడు సార్లు సర్వే కోసం చలానా కట్టించుకున్నారు. సర్వేయర్ ఒక్కసారి కూడా వచ్చి సర్వే చేయలేదు. కోర్టు పరిధిలో భూమి ఉందంటూ దాట వేస్తున్నారు. దీంతో బాధితుడు నాలుగైదుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నమ్మలు తన కుమారుడిని పాలిటెక్నిక్ చదివిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ నుంచి దివ్యాంగుడైన తండ్రి సాయంతో కలెక్టరేట్కు వచ్చింది. కాలేజీకి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించింది. నిరుపేదనైన తాను ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులతోనే కుమారుడిని చదివిస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని చిన్నమ్మలు వాపోయింది.⇒ చిత్రంలో కనిపిస్తున్న గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణదతీలేసు పంచాయతీ పరిధిలోని లాబేసు గ్రామం వాసులు. వీరంతా నిరుపేదలు. గ్రామానికి చెందిన18 మంది గిరిజన రైతులు సర్వే నంబర్ 16, 11లోని కొంత ప్రభుత్వ భూమిలో తుప్పలు తొలగించి 1995 నుంచి పంటలు పండిస్తున్నారు. సాగు హక్కు పట్టాలు మంజూరు చేయాలంటూ తొమ్మిది నెలలుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.నేను చచ్చిన తరువాత పింఛన్ ఇస్తారా? పెన్షన్ కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్కు వస్తే సచివాలయానికి వెళ్లమంటారు. అక్కడికి వెళితే మళ్లీ ఇక్కడికే పొమ్మంటారు. అసలు పెన్షన్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వబోమంటే మా పని ఏదో చేసుకొని బతుకుతాం. పేదలను ఇలా తిప్పుకోవడం మంచిది కాదు. నేను చచ్చిన తరువాత పెన్షన్ ఇస్తామంటే ఏం లాభం? గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మంజూరు చాలా చక్కగా ఉండేది. – మద్దయ్య, బి.తాండ్రపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లాఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు బండిపై బాదంపాలు విక్రయిస్తూ జీవిస్తున్నా. ఒంటరి మహిళను. ఈ ఏడాది జనవరి 22వ తేదీన చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి విరిగాయి. ఆపరేషన్కు రూ.లక్ష ఖర్చు అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నా. నిందితుడిని గుర్తించి, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ప్రమాదానికి కారకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. –షేక్ సైదాబీ, కావూరు లింగంగుంట్ల, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాముళ్ల పొదల్లో మృతదేహాలను మోసుకుంటూ..మా గ్రామం నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మాంటిస్సోరి స్కూల్ వెనుక భాగంలో 70 సెంట్ల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడకు వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్లపై, ముళ్ల పొదల్లో భయంభయంగా మృతదేహాలను మోసుకుంటూ తీసుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేరు. – చాపిరేవుల గ్రామస్తులు, నంద్యాల జిల్లా -
పెద్దలకు ఇద్దాం! ఇమ్యూనిటీకాలు
మామూలుగా వ్యాక్సిన్లు అంటే పిల్లలకే అని చాలామంది అనుకుంటుంటారు. అవి పెద్దవాళ్లకూ అవసరమవుతాయి. కోవిడ్ టైమ్లో వ్యాక్సిన్కు విశేషప్రాచుర్యం వచ్చింది. పెద్దవాళ్లకు ఇచ్చే వ్యాక్సిన్ అంటే అది కోవిడ్ కోసమే కాదు... ఇంకా చాలా రకాల వ్యాధులను నివారించగలిగే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పెద్దవాళ్లకు ఇవ్వాల్సిన కారణం ఏమిటంటే... వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి నిరోధక వ్యవస్థ మునపటి అంత బలంగా ఉండకపోవచ్చు. దాంతో ఇమ్యూనిటీకి బలం పెంచడం కోసం ఇలా తీసుకోవచ్చు. అలాగే చిన్నప్పుడు తీసుకున్న వ్యాక్సిన్లు క్రమంగా ప్రభావం కోల్పోతూ ఉండవచ్చు. అందుకే వాటిని మరింత బలోపేతం చేసేందుకు 50 ఏళ్ల వయసు దాటిన దగ్గర్నుంచి కొన్ని వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి వివరాలివి...సాధారణంగా 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసులో కొన్ని రకాల జబ్బులు ఉండి, వాళ్లలో వ్యాధి నిరోధక వ్యవస్థ కాస్త బలహీనంగా (ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్) ఉన్నప్పుడు 65 ఏళ్ల వయసు తర్వాత కొన్ని జబ్బులు వచ్చే ముప్పు ఉంది. పెద్దవాళ్లకు ఇవ్వాల్సిన టీకాలు ఇవ్వడం ద్వారా ఆ ముప్పును దాదాపుగా నివారించవచ్చు. అందుకే ఈ వ్యాక్సిన్లు.పెద్ద వయసు వారు తీసుకోవాల్సిన రకరకాల వ్యాక్సిన్లుడిఫ్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సిన్ : ప్రతి చిన్నారికీ తమ చిన్నతనంలో డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారు. కానీ 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి వాళ్లలో ఆ టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్ను 60 దాటిన వారికి మరోసారి ఇవ్వాలి. అది బూస్టర్ డోస్లా పనిచేసి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నిజానికి ‘టీ–డ్యాప్’ అనే వ్యాక్సిన్ ప్రతి పదేళ్లకు ఒకసారి తీసుకోవడం మంచిది.హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కాలేయాన్ని ప్రభావితం చేసేదే ఈ హెపటైటిస్–ఏ వైరస్. కలుషితాహారం, కలుషితమైన నీటి ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. దీని నివారణకు ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, ఆర్నెల్లకు మరో విడత కూడా తీసుకోవాలి.హెర్పిస్ జోస్టర్ వ్యాధిహెర్పిస్ జోస్టర్ అనే వైరస్తో మొదట చికెన్పాక్స్ వచ్చి, అటు పిమ్మట అది హెర్పిస్ జోస్టర్ వ్యాధికి దారితీస్తుంది. దాన్నే షింగిల్స్ అంటారు. జోస్టర్ వైరస్ సోకిన వారిలో పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే నరాలకు సంబంధించిన కాంప్లికేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. హెర్పిస్ జోస్టర్ వైరస్ సోకిన వాళ్లలో 60 ఏళ్లు దాటాక ఈ పోస్ట్ హెర్పిటిక్ న్యూరాల్జియా వచ్చే అవకాశాలు ఎక్కువ. జోస్టర్ వ్యాక్సిన్ అన్నది ఈ హెర్పిస్ జోస్టర్ వ్యాధి నుంచి నివారణ ఇస్తుంది. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల 100 శాతం వ్యాధి రాకుండా ఉంటుందనే గ్యారంటీ లేదు గానీ... వ్యాక్సిన్తో బాధితుల జీవన ప్రమాణం మెరుగవుతుందని చెప్పవచ్చు.వ్యారిసెల్లా వ్యాక్సిన్ వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ (వీజడ్వీ) అనే ఈ వైరస్ ‘చికెన్పాక్స్’ను కలిగిస్తుంది. వ్యారెసెల్లా వ్యాక్సిన్ వృద్ధుల్లో ఈ చికెన్ పాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. అప్పటికే ఏవైనా వ్యాధులతో బాధపడుతున్నవాళ్లకూ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వాళ్లకూ, హెచ్ఐవీ వ్యాధి ఉండి, సీడీ4 సెల్స్ కౌంట్స్ 200 లోపు ఉన్నవారికీ, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేటస్లో ఉన్నవారికి, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి డాక్టర్లు ఈ వ్యాక్సిన్ను సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని తీసుకున్నవారు కూడా ఈ వ్యాక్సిన్ను తీసుకోకూడదు. గర్భవతులకూ దీన్ని ఇవ్వకూడదు.హెపటైటిస్–బి వ్యాక్సిన్హెపటైటిస్–బి వైరస్ కూడా కాలేయాన్నే ప్రభావితం చేసే మరింత ప్రమాదకరమైన వ్యాధి. హెచ్ఐవీ వ్యాప్తి చెందే మార్గాల్లోనే దీని వ్యాప్తీ జరుగుతుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసిప్రాణాంతకంగా మార్చే ముప్పు ఉంటుంది. ఇంత ప్రమాదకరమైన వైరస్కు అదృష్టవశాత్తూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీన్ని మూడు డోసుల్లో ఇవ్వాలి. మొదటిది ఇచ్చిన నెల తర్వాత రెండో డోసూ, అలాగే మొదటిది ఇచ్చిన ఆర్నెల్లకి మూడో డోసు ఇవ్వాలి. యుక్తవయస్కులూ దీన్ని తీసుకోవడం మేలు.ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధికి నివారణగా ఇచ్చే వ్యాక్సిన్. జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే రెండో దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి తీవ్రంగా బాధిస్తాయి. పైగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటుంది. అందుకే జలుబు వైరస్కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవై ఐదేళ్లు పైబడిన వారు, ఇమ్యూనోకాంప్రమైజ్ స్టేటస్లో ఉన్నవాళ్లు (వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు) ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. దీన్ని ప్రతి ఏడాదీ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తీసుకోవడం మంచిది.సూచన : గుడ్డుతో అలర్జీ ఉన్నవారు దీని బదులు రీకాంబినెంట్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి.టైఫాయిడ్ వ్యాక్సిన్ : అందరూ తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన వ్యాక్సిన్ ఇది. మరీ ముఖ్యంగా ఆహార పరిశ్రమలో పనిచేసేవారూ, వంటలు చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్. ఆహార తయారీ రంగంలో ఉండేవారికి టైఫాయిడ్ ఉంటే... ఓ క్యారియర్గా వారు అనేక మందికి ఈ వ్యాధిని సంక్రమింపజేసే అవకాశం ఉన్నందున వాళ్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నది డాక్టర్ల సిఫార్సు.హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ (హెచ్పీవీ వ్యాక్సిన్) ఇది మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్నుంచి నివారణ కల్పిస్తుంది. మహిళలకు 26 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. 15 ఏళ్లు పైబడ్డ అమ్మాయిలు మొదలుకొని మూడు విడతలుగా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి డోసు ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆర్నెల్ల తర్వాత మూడో డోసు ఇస్తారు. ఇందులో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు రకాల స్ట్రెయిన్స్ నుంచి, మరొకటి నాలుగు రకాల స్ట్రెయిన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. డాక్టర్ సలహా మేరకే అవసరమైన వాటిని వాడాల్సి ఉంటుంది.మరికొన్ని వ్యాక్సిన్లు ఇప్పుడు డెంగ్యూ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందిగానీ దాన్ని కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఇస్తారు. ఇవేగాక జపనీస్ ఎన్కెఫలైటిస్, రేబీస్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి ఎల్లో ఫీవర్ వ్యాధి మన దేశంలో లేదు కాబట్టి అది ఉన్నచోటికి వెళ్లే ప్రయాణికులు అక్కడికి వెళ్లే 15 రోజుల ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే పశ్చిమాసియా దేశాలకు వెళ్లేవాళ్లు మెనింగోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.నిమోకోకల్ వ్యాక్సిన్: వయసు పైబడిన వారిలో స్ట్రె΄్టోకాకల్ నిమోనియా అనే బ్యాక్టీరియాతో నిమోనియా, మెనింజైటిస్, బ్యాక్టీరిమియా అనే సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.నిమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ 13) : 65 ఏళ్ల వయసు పైబడిన ప్రతివారూ ఈ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవాలి. ఇది తీసుకున్న ఏడాది తర్వాత నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) తీసుకోవాలి. నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23): ప్రస్తుతం వేర్వేరు నిమోకాకల్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ కారణంగా వచ్చే అనేక రకాల వ్యాధులకు ‘నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్’ తో ప్రయోజనం చేకూరుతుంది. ఇది కేవలం ఒక్క నిమోనియాకు మాత్రమే కాకుండా మెనింజైటిస్, బ్యాక్టీ రిమియా (బ్లడ్ ఇన్ఫెక్షన్) లకు నివారణ ఔషధంగా కూడా పనిచేస్తుంది.అయితే దీనివల్ల నూరు శాతం నివారణ జరగకపోవచ్చు. కాకపోతే చాలా వరకు రక్షణ లభించడంతో పాటు ఒకవేళ టీకా తీసుకుని ఉంటే పైన పేర్కొన్న వ్యాధులు చాలావరకు తగ్గి, కాంప్లికేషన్లు కూడా చాలా వరకు నివారితమవుతాయి. అయితే నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ మరో డోస్ తీసుకోవాలి. అలా ప్రతి ఐదేళ్లకోమారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి. -
పండుటాకుల గోడు విని..
రాష్ట్రంలోనే తొలిసారిగా..రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నల్లగొండ జిల్లాలో వృద్ధులు, దివ్యాంగుల కోసం కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక గ్రీవెన్స్ను గురువారం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పలువురు వృద్ధులు, వికలాంగులు కలెక్టరేట్కు తరలివచ్చి కలెక్టర్కు తమ బాధలను వివరించి ఆదుకోవాలని వేడుకున్నారు. వారందరికీ కలెక్టర్ భరోసా ఇచ్చారు.ప్రత్యేక గ్రీవెన్స్కు వచ్చే వారి సమస్యలు ఎట్టిపరిస్థితుల్లో పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ‘ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 80 ఏళ్లు దాటిన వృద్ధులు, నడవలేని స్థితిలో ఉండే దివ్యాంగులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. వారు అలా గంటల తరబడి వేచిఉండటం బాధగా అనిపించింది. అందుకే వారి సమస్యలపై ప్రత్యేకంగా ప్రతి గురువారం గ్రీవెన్స్ నిర్వహించాలని నిర్ణయించాను’ అని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండఈయన పేరు దేవరకొండ అంజయ్య, చిట్యాల మండలం ఏపూర్ గ్రామం. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఒక్కో బిడ్డకు ఒక ఎకరం చొప్పున రాసిచ్చారు. తన జీవనం కోసం ఒక ఎకరం తన పేరునే ఉంచుకున్నారు. అయితే ఒక మనవడు మభ్యపెట్టి అంజయ్య పేరున ఉన్న ఎకరం భూమిని కూడా రాయించుకున్నాడు. దీంతో ఆయనకు ఆధారం లేకుండా పోయింది. అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో ప్రత్యేక గ్రీవెన్స్లో కలెక్టర్కు తన గోడు చెప్పుకున్నారు. దీంతో మనవడు చేయించుకున్న భూమి పట్టాను రద్దుచేసి, తిరిగి అంజయ్య పేరున పట్టా జారీచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
MahaKumbh Mela 2025 - కలియుగ శ్రవణ్ కుమరుడు ఇతడు...
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025 ) అనేక విశేషాలతో చర్చల్లో నిలుస్తోంది. రికార్డు స్థాయిలో మహా కుంభమేళాకు భక్తులు హాజరవుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నివేదిక ప్రకారం, బుధవారం ఉదయం 6 గంటల వరకు 1.75 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వేదికగా హృదయాలను కదిలించే వీడియోలు అనేకం నెట్టింట విశేషంగా నిలుస్తున్నాయి. అటు భక్తులను, ఇటు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నాయి.తాజాగా 65 ఏళ్ల వృద్ధుడు తన 92 ఏళ్ల తల్లిని ప్రతిరోజూ 50 కిలోమీటర్లు నడిచి ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కలియుగ్ శ్రవణ్ కుమార్’ అంటూ ఈ వీడియో సంచలనంగా మారింది. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.పురాణ గాథలోలని శ్రవణ కుమారుడి (జన్మనిచ్చిన, అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి తన మరణం వరకు కూడా కంటికి రెప్పలా చూసుకున్న పురాణ పురుషుడు శ్రవణ కుమారుడు) నుంచి ప్రేరణ పొందాడో ఏమో గానీ, తన తల్లిని బండిమీద కూర్చోబెట్టి, స్వయంతా తాను లాగుతూ పవిత్ర మహాకుంభ మేళాకు తీసుకొని వచ్చాడు. యూపీలోని ముజఫర్ నగర్కు చెందినమాలిక్ (Malik) వయసు 65 ఏళ్లు కావడం విశేషం. ఆయన జబ్బీర్ దేవి వయసు 92 ఏళ్లు. తల్లి కోరిక నెరవేర్చాలన్న ధృఢ సంకల్పంతో బండిపై కూర్చోబెట్టి లాగుతూ కుంభమేళాకు తరలివచ్చాడు. ఇలా 13 రోజులు పాటు తల్లిని తీసుకెళ్లాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు. ముజఫర్ నగర్ నుంచి ప్రయాగరాజ్కు 780 కిలోమీటర్లు. త్రివేణి సంగమంలో కుంభ్ స్నానం చేయాలని తన తల్లి కోరిక తీర్చడం తన బాధ్యత అని చెప్పాడు. అతని సంకల్పం, సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తల్లి పట్ల అతనికున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘‘కలియుగ్ కా శ్రవణ్ కుమార్' అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ యుగానికి గొప్పోడు అని కొందరు. "ప్రతీ తల్లి ఇలాంటి కొడుకును పొందాలని కోరుకుంటుంది"అని మరొకరు వ్యాఖ్యానించారు. ముసలి వయసులో తల్లిదండ్రుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న వారికి ఈయన కథ ఆదర్శనీయం, ఆచరణీయం అంటున్నారు.Watch: In Bulandshahr, Uttar Pradesh, A man is walking with a cart, taking his 92-year-old mother to the Maha Kumbh in Prayagraj. They started their journey from Muzaffarnagar, fulfilling her wish to bathe at the Kumbh pic.twitter.com/2IstKkqMXY— IANS (@ians_india) January 28, 2025 -
రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు
మనిషికి వృద్ధాప్యం అనేది గడ్డుకాలమని చాలామంది అంటుంటారు. అలాంటి కాలం త్వరలో రానుంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి. రానున్న 25 ఏళ్లలో దేశంలో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సవాల్ విసురుతున్న వృద్ధాప్య జనాభాప్రస్తుతం భారతదేశంలో వృద్ధుల సంఖ్య దాదాపు 10.40 కోట్లు (104 మిలియన్లు), ఇది 2050 నాటికి 31.90 కోట్లకు (319 మిలియన్లు) చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. వృద్ధాప్య దశలో శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా వృద్ధులు దీర్ఘకాలం జీవించగలుగుతారు. అయితే ఇదే సమయంలో వృద్ధుల ఆరోగ్య సంబంధిత సవాళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.రెండున్నర దశాబ్దాల్లో వృద్ధుల సంఖ్య మూడు రెట్లుఅసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోఛామ్) నేషనల్ కౌన్సిల్ ఆన్ సీఎస్ఆర్, చైర్మన్ అనిల్ రాజ్పుత్ ఇటీవల ఒక సదస్సులో మాట్లాడుతూ వృద్ధులకు వారి స్వతంత్రతను కాపాడుకునేందుకు, చురుకుగా ఉండటానికి అనువైన విధానాలను అనుసరించడం అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్యం అనేది 21వ శతాబ్దపు అతిపెద్ద సామాజిక సవాళ్లలో ఒకటిగా మారింది. వచ్చే రెండున్నర దశాబ్దాల్లో భారతదేశంలో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందనే అంచనాలున్నాయి. వృద్ధాప్య సంరక్షణపై కార్పొరేట్ రంగం, సమాజం, ప్రభుత్వాలు క్రియాశీల సహకారం అందించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.వృద్ధాప్య సమస్యలను నియంత్రించే యోగాన్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సుభాష్ మంచాంద ఇదే అంశంపై మాట్లాడుతూ వృద్ధులకు వచ్చే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల సమస్యలను నియంత్రించడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. యోగాభ్యాసం వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదింపజేస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. వృద్ధులు క్రమం తప్పకుండా యోగా చేయాలని, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సుభాష్ మంచాంద పేర్కొన్నారు.సమతుల ఆహారంతో ఆరోగ్యంఢిల్లీలోని ఎయిమ్స్లో గల వృద్ధాప్య క్లినిక్ మాజీ సీనియర్ సలహాదారు ప్రొఫెసర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వృద్ధాప్యం కోసం, ప్రజలు సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరమని అన్నారు. అనారోగ్యకరమైన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామం రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని, వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాల పాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలని, తగినంతసేపు నిద్రించాలని సలహా ఇచ్చారు. ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
12 ఏళ్లయినా వీడని ఆశ.. నవరాత్రుల్లో కొడుకు దొరుకుతాడని..
వారణాసి: ఆశ అనేని మనిషిని ముందుకు నడిపిస్తుందని అంటారు. మహారాష్ట్రకు చెందిన ఒక జంట 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని కోసం ఏళ్ల తరబడి ఆశగా అన్నిచోట్లా వెదుకుతోంది.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన విక్రమ్ మేఘ్వానీ 12 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ విక్రమ్ తల్లిదండ్రులు నాడు తప్పిపోయిన కొడుకు కోసం కాశీలోని దేవాలయాలలో వెదుకులాట సాగిస్తున్నారు. నవరాత్రులలో అమ్మవారు తప్పకుండా తమ వినతి వింటుందని, అందుకే కాశీలోని అమ్మవారి ఆలయాలలో తిరుగున్నామని వారు చెబుతున్నారు.తప్పిపోయిన కొడుకు ఫోటోను పట్టుకుని తిరుగుతున్న రణోమల్ సమనోమల్ మేఘ్వానీ, ఆయన భార్య లక్ష్మీబాయి రణోమల్ మేఘ్వానీలను చూసిన వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు కాశీలోని వివిధ ఆలయాల వెలుపల తమ కుమారుని ఫొటోను, వివరాలతో కూడిన పోస్టర్ను అతికిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని ఆచూకీ లభిస్తుందని విక్రమ్ తల్లి లక్ష్మీబాయి ఆశాభావం వ్యక్తం చేశారు.2012, ఆగస్టు 29న తన కుమారుడు దుకాణం నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమయ్యాడని లక్ష్మీబాయి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఇప్పటి వరకు తమ కుమారుని ఆచూకీ లభించలేదన్నారు. ఈ వృద్ధ దంపతులు నవరాత్రులలో కాశీలో ఉంటూ, తప్పిపోయిన తమ కుమారుని కోసం వెదుకుతున్నారు.ఇది కూడా చదవండి: 16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్ -
పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులెందుకు?
శాయంపేట: ఆస్తులు సంపాదించి ముగ్గురు కుమారులకు ఇచ్చాం. ఇళ్లు కట్టి ఇచ్చాం. వృద్ధాప్యంలో పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులు ఎందుకు? మా ఆస్తులు మాకు ఇప్పించండి.. అంటూ ఓ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. అనంతరం శాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో విలేకర్ల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన చెక్క చంద్రయ్య సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చంద్రయ్య హమాలీ పనిచేసి గ్రామంలో 10 ఎకరాల భూమి, పరకాల పట్టణంలో మూడు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ముగ్గురు కుమారులకు 2002లో మూడు ఎకరాల చొప్పున భూమిని పంచి ఇచ్చాడు. పరకాలలో మూడు గుంటల్లో కట్టిన ఇంటిని 2012లో సమానంగా పంచాడు. వృద్ధ దంపతులిద్దరు గ్రామంలో ఓ షెడ్డు వేసుకొని అందులో ఉంటున్నారు. వృద్ధాప్యం మీద పడడంతో తమ ఆరోగ్యాలు సరిగ్గా లేవని, ఏ కుమారుడు కూడా పట్టించుకోవడం లేదని చెక్క చంద్రయ్య, సారమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారులు పట్టించుకోకపోవడంతో జూలై 7న పోలీస్స్టేషన్లో, 8న పరకాల ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చంద్రయ్య తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
సాధకులు... గురువులు
గురు అన్న మాటని అతి సామాన్యంగా వాడేస్తూ ఉంటాం. దారిలో కనపడిన ముక్కు మొహం తెలియని మనిషిని పలకరించటానికి, ఎలా సంబోధించాలో తెలియని సందర్భంలోనూ, స్నేహితులు ఒకరినొకరు పలకరించుకోటానికి, చివరికి బస్ కండక్టర్నీ, డ్రైవర్నీ, ఇంకా ఎవరిని పడితే వారిని గురూ అని సంబోధించటం చూస్తాం. కాస్త పెద్దవారైతే గురువుగారూ అంటారు. గురువు అంటే పెద్ద వాడు అన్న అర్థంలో వాడితే సరే! గురు అన్నది అర్థం మాట అటు ఉంచి, పదమే సరి కాదు. గురువు అన్నది సాధు పదం.అసందర్భంగా ఉపయోగించటమే కాదు కొంత మంది ఆ విధంగా పిలిపించుకోవాలి అని చాలా తాపత్రయ పడుతూ ఉంటారు. నిజానికి ఆ విధంగా పిలిపించుకోవటం చాలా పెద్ద బరువు. బాధ్యత అవుతుంది. నాలుగు లలిత గీతాలు నేర్పి, పది పద్యాలో, శ్లోకాలో నేర్పి, రెండు మూడు యోగాసనాలు నేర్పించి, నాలుగు ప్రవచనాలు చెప్పి ‘గురు’ అనే బిరుదాన్ని తమకు తామే తగిలించుకోవటం చూస్తాం. వారి వద్ద నేర్చుకుంటున్న వారు గురువుగారు అనటం సహజం. తప్పనిసరి. అందరూ అట్లాగే అనాలి అనుకోవటం వల్ల సమస్య. అందరూ ఎందుకు అంటారు? అందుకని తామే తమ పేరులో భాగంగా పెట్టుకుంటున్నారు. అయితే ఏమిటిట?గురువు అంటే అజ్ఞాన మనే చీకట్లని తొలగించి, జ్ఞానమనే వెలుగుని ప్రసాదించే వాడు అని కదా అర్థం. గురుత్వాన్ని అంగీకరిస్తే శిష్యుల పూర్తి బాధ్యత నెత్తి కెత్తుకోవలసి ఉంటుంది. వారి తప్పులకి బాధ్యత తనదే అవుతుంది. బోధకుడుగా ఒక విషయంలో బాధ్యత వహించ వచ్చు. కానీ, గురువు అంటే మొత్తం అన్ని విషయాలలోనూ బాధ్యత ఉంటుంది. ఈ బరువు మోస్తూ ఉంటే తన సాధన సంగతి ఏమిటి? తన జీవన విధానం ఆదర్శ్ర΄ాయంగా ఉన్నదా? ఒక్కసారి గురుస్థానం ఆక్రమిస్తే తరచుగా జరిగేది గర్వం పెరగటం. తాను ఒక స్థాయికి రావటం జరిగింది కనుక ఇక పై తెలుసుకోవలసినది, సాధన చేయవలసినది లేదు అనే అభి్ర΄ాయం కలుగుతుంది. దానితో ఎదుగుదల ఆగి΄ోతుంది. గిడసబారి, వామన వృక్షాలు అవుతారు. బోధిసత్వుడు తనను ‘తథాగతుడు’ అనే చెప్పుకున్నాడు కానీ గురువుని అని చెప్పుకోలేదు. శ్రీ రామ చంద్రుడికి అరణ్యవాసంలో మార్గనిర్దేశనం చేసిన ఋషులు కూడా ‘ఇది ఋషులు నడచిన దారి’ అనే చె΄్పారు. మా దారి అని చెప్పలేదు. ఎందుకంటే, వారు అప్పుడు ఉన్న స్థితి కన్నా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళటం అనే ఆదర్శం ఉన్న వారు. ఒక్క సారి తనని గురువు అనిప్రకటించుకున్నాక ముందుకి సాగటం ఉండదు. ఈ జన్మకి ఇంతే! సాధకులు అనే స్థితి లేక ΄ోతే, సాధన ఎక్కడ? సిద్ధి ఎక్కడ? అటువంటి వారిని ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. ఏదో చిన్న సిద్ధి రాగానే దానిని ప్రకటించుకుంటూ ఆగి ΄ోతారు. పతనం కూడా అవుతారు. మరొక గొప్ప బాధకరమైన ఉదాహరణ. చిన్నపిల్లలలో ప్రతిభ ఉండచ్చు. దాన్ని ్ర΄ోత్సహించాలి కూడా. కానీ, వాళ్ళకి బిరుదాలు మొదలైనవి ఇచ్చిన తరువాత మరొక్క అడుగు ముందుకి వేయక ΄ోవటం అనుభవమేగా! ఒక రంగంలో అత్యున్నత స్థానాన్ని ΄÷ందిన వారు ఎవరు కూడా తాము గురువులము అని చెప్పుకోవటం చూడం. ఇంకా సాధన చేస్తున్నాము, జ్ఞానం అనంతం మాకు ఈ మాత్రం అందినందుకు ధన్యులం అంటారు. పైగా ప్రతిరోజు మరింతగా సాధన చేస్తూ ఉంటారు. సంగీత విద్వాంసులయినా, వేద పండితులైనా, క్రికెట్ ఆటగాళ్లయినా అభ్యాసం ఆపరు. తాను చెప్పినది విని తనని నలుగురు అనుసరిస్తున్నారు అంటే ఎంత జాగ్రత్తగా మసలుకోవాలి? – డా. ఎన్. అనంత లక్ష్మి -
పిల్లలకు బహుమతిగా ఇచ్చినా తిరిగి తీసుకోవచ్చు...
పిల్లలు ఎదిగేంతవరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వాళ్లు జీవితాల్లో స్థిరపడ్డాక ఇంకా ఈ బరువు బాధ్యతలు ఎందుకు... ప్రశాంతంగా వారి వద్ద గడిపేద్దాంలే అని ఉన్న ఆస్తులను వారికే పంచేస్తారు.కానీ, ఆస్తులను పంచుకున్న పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. ఆస్తులను తీసుకొని, ఇంటినుంచి గెంటేస్తే.. ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో తరచూ వృద్ధులకు సంబంధించి వచ్చిన వార్తల్లో ఇది ప్రధాన అంశంగా ఉంటోంది. వృద్ధుల ఆస్తులకు సంబంధించి రక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయో... తెలుసుకుందాం.మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామంలోని జెండా బజారుకు చెందిన వృద్ధురాలు నర్సమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. వీరికి ముగ్గురు కుమారులు. ఉన్న మూడెకరాల భూమిని కొడుకులు పంచుకున్నారు. ఆ తర్వాత ఇంటిని కూలగొట్టి తల్లికి గూడు లేకుండా చేశారు. ఆస్తి పంచుకునే ముందు కొడుకులు నెలకు ఒకరి చొప్పున అమ్మను సాకుతామని ఒప్పందం చేసుకున్నారు. తీరా ఆస్తి పంచిన తర్వాత అసలు అమ్మ విషయాన్నే గాలికి వదిలేశారు. దాంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ వారిలో దయగల తల్లి ఎవరైనా ఇంత ముద్ద పెడితే తిని, ఎవరో ఒకళ్ల ఇంటి అరుగులపై తలదాచుకోవలసి వస్తోందా వృద్ధురాలు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్, ఆస్తిని తీసుకుని తల్లిని వదిలేసిన కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిని ΄ోషించాలని, లేదంటే ఆమె పంచి ఇచ్చిన యావదాస్తిని తిరిగి తల్లికి చెందేటట్లుగా చేస్తామని వారిని హెచ్చరించారు. సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007లోని (సీనియర్ సిటిజన్స్ యాక్ట్) సెక్షన్ 23(1) తల్లిదండ్రుల ఆస్తిని రక్షిస్తుంది. మోసాన్ని నిరోధించి, ్రపాథమిక సౌకర్యాలను కోల్పోకుండా పరి రక్షిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చి 15 సంవత్సరాలు గడిచినా ఈ హక్కులపై సీనియర్ సిటిజన్స్కు అవగాహన అంతంత మాత్రమే. సీనియర్లు తమ ఆస్తిని పంచి ఇచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తే ట్రిబ్యునల్ ద్వారా ఆస్తి బదిలీని రద్దు చేసుకునే ఆవకాశంఉంది. ఆస్తిని తిరిగి ΄పోందవచ్చు... తమ పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వాలని ఆలోచించే వయోవృద్ధులైన తల్లిదండ్రులు ట్రాన్స్ఫర్ డీడ్లో ఒక ఎక్స్ప్రెస్ షరతును చేర్చవచ్చు. ఆస్తిని బహుమతిగా తీసుకున్న పిల్లలు ఈ షరతును ఉల్లంఘిస్తే, ఆ బహుమతి చెల్లుబాటు కానిదిగా ప్రకటించి, తల్లిదండ్రులు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. తల్లిదండ్రులు ప్రేమ, ఆ΄్యాయతతో లేదా సేవలకు బదులుగా పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు దానిని సూచించవచ్చు. అయితే, అస్పష్టతకు తావు లేకుండా ఎక్స్ప్రెస్ షరతును చేర్చడం ఉత్తమం అని పేర్కొన్నాయి. ఇంటినుంచి తరిమివేయవచ్చుసీనియర్ సిటిజన్ల ఆస్తుల నుంచి పిల్లలు లేదా ఆస్తి తీసుకున్న బంధువులను తొలగించడానికి సుప్రీం కోర్టుతో సహా కోర్టులు అనుమతించాయి. చట్టబద్ధమైన వారసులమనే కారణంతో తల్లిదండ్రులను వేధిస్తే ఇంటినుంచి బయటకు పంపివేయవచ్చని కూడా ఆదేశించింది. ముఖ్యమైన గమనికలు⇒ ఆస్తిలో ఆర్థిక పెట్టుబడులు, కాపీరైట్లు, పేటెంట్లు, ఆభరణాలు, కళాఖండాలు మొదలైనవి ఉండచ్చు. ∙ఆస్తుల వివరాలతో΄ాటు బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలు, ఎమ్ఎఫ్లు, షేర్లు, ఎఫ్డీలు, బీమా పాలసీలు, లోన్లు.. మొదలైన వాటి జాబితా కోసం న్యాయవాది, ఆర్థిక సలహాదారుని సంప్రదింపు అవసరం. అందుకని వారి వివరాలను తీసుకోండి. వారసత్వం, ఆస్తుల ప్రణాళికలో కీలకమైన భాగం వీలునామాను రూపోందించడం. దాని చెల్లుబాటును నిర్ధారించడానికి కొన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి... ఆస్తులకు సంబంధించిన వివరాలు, కంపైల్ చేయాల్సిన సమాచారంలో ఇద్దరు సాక్షులను, ఒక ఎగ్జిక్యూటార్ని నియమించుకోవాలి. ⇒వీలునామాలో మీ తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో వారి పేర్లను విధిగా నమోదు చేయాలి. లేకుంటే తర్వాత వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. అవగాహన అవసరంవృద్ధుల రక్షణ చట్టం గురించి అవగాహన మన దేశంలో చాలా మందికి లేదు. అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వృద్ధులు కూడా తమ సమస్యను చట్టం దృష్టికి తేవాలి. ఆస్తులు లేక΄ోయినా వృద్ధ తల్లిదండ్రులు మెయింటనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.– ఎ.పి.సురేష్, సీనియర్ అడ్వకేట్, హైకోర్ట్ -
Video: మెట్రోలో సీటు ఇవ్వలేదని.. యువతిపై వృద్దుడి దౌర్జన్యం
చైనాలో ఓ మెట్రోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తనకు కూర్చోవడానికి సీటు ఇవ్వలేదన్న కోపంలో 50 ఏళ్ల వృద్దుడు ఆమెపై కర్రతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బీజింగ్ సబ్వేలైన్ 10లో ఈ ఘటన వెలుగుచూసింది. మెట్రోలో ఒక వృద్ధుడు తన కోసం సీటు ఇవ్వాల్సిందిగా యువతిని అడిగాడు. అయితే తన సీటును వెరొకరికి ఇస్తాను కానీ.. అతనికి మాత్రం ఇవ్వనని చెప్పింది. దీంతో ఆగ్రహించిన వృద్ధుడు ఆమెపై అరవడం ప్రారంభించాడు. అంతేగాక ఆమె మీద మీదకు వచ్చి ఆయన చేతిలోని, కర్రతో యువతిని ఇబ్బంది పెట్టాడు. తన చేతులతోనే ఆమె భుజం మీద కొట్టాడు. అక్కడితో ఆగకుండా.. తన సీటు అడగడంలో తప్పేముందని చెప్పాడు. పోలీసులకు కాల్ చేయండి, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాము. నేను నిన్ను వేధిస్తున్నానని చెప్పు. నాకేం భయం లేదు అంటూ దబాయించడం వీడియోలో కనిపిస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జూన్ 24 న జరిగినట్లు తెలిపారు.Beijing China 🇨🇳- Young woman refused to give her seat to the old man. pic.twitter.com/ybCgv8oY6j— Githii (@githii) June 26, 2024 -
రోడ్డు ప్రమాదంలో వృద్ధదంపతులు దుర్మరణం
బోనకల్(ఖమ్మం): కుమారుడికి వద్దకు వెళ్తున్న వృద్ధ దంపతులకు అదే ఆఖరి ప్రయాణమైంది. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్ట డంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ(92) డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య రుక్మిణి(85)తో మధిరలోనే స్థిరపడ్డారు. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.వృద్ధాప్యం కారణంగా వారి సంరక్షణ కోసం ఒకే కేర్టేకర్గా నియమించడంతో కుమారుల వద్ద కొన్నేసి రోజుల చొప్పున ఉంటున్నారు. బుధవారం మధిరలోని ఇంటి నుంచి ఖమ్మంలో ఉంటున్న పెద్దకుమారుడు వద్దకు మనవడు కొత్తూరు అనిల్, కేర్టేకర్ నాగరాజుతో కలిసి వెళ్తున్నాడు. కారును అనిల్ నడుపుతున్నాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు.ఈ ఘటనలో సూర్యనారాయణ, రుక్మిణి తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. మనుమడు అనిల్, కేర్టేకర్ నాగరాజు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారుకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు లాక్ పడి ఉండడంతో తలుపులు పగులగొట్టి మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీశారు. కారు తలుపులను పగలగొట్టడంలో ఏమాత్రం ఆలస్యమైనా లోపల ఉన్న వారంతా మంటల్లో కాలిపోయే వారని తెలిసింది. -
వృద్ధులకు ఆరోగ్య ధీమా!
అరవై అయిదేళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది అక్షరాలా ఆనందం కలిగించే వార్త. పిల్లలు, విద్యార్థులు, గర్భిణులు, సీనియర్ సిటిజన్లతో సహా అన్ని వర్గాలకూ ఆరోగ్య బీమా పాలసీలు అందివ్వాలనే కొత్త నిర్ణయం వచ్చింది. దేశంలోని బీమా పాలసీలకు సంబంధించి అత్యున్నత నియంత్రణ సంస్థ అయిన ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (ఐఆర్డీఏఐ) ఆ మేరకు బీమా సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై క్యాన్సర్, హృద్రోగం, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ లాంటి వ్యాధులున్నాయని ఆరోగ్య బీమా పాలసీలు నిరాకరించడానికి వీల్లేదని తేల్చింది. అదే సమయంలో, నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యా వయసుల వారికి తగ్గట్టుగా ప్రత్యేకమైన బీమా పాలసీలు రూపొందించుకొనే స్వేచ్ఛ సంస్థలకు ఇచ్చింది. దీంతో, ఇప్పుడిక 65 ఏళ్ళు, ఆపై బడిన తర్వాత కూడా కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకొనే వీలు చిక్కింది. 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కిందకు తెస్తామని అధికార పక్షం పేర్కొన్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం గమనార్హం. అలాగే, సీనియర్ సిటిజన్ల సమస్యలు, ఆరోగ్య బీమా క్లెయిమ్ల సత్వర పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు ప్రాధికార సంస్థ సూచించింది. పాలసీ కొనడానికి ముందే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి తగిన ఆరోగ్య బీమా పాలసీలు తప్పక ఇవ్వాలని పేర్కొంది. ముందుగానే ఉన్న వ్యాధుల (పీఈడీ) విషయంలో బీమా రక్షణకు నిరీక్షించే కాలాన్ని మునుపటి 48 నెలల నుంచి 36 నెలలకే తగ్గించింది. బీమా అంశంలో ఈ సరికొత్త సంస్కరణలు అటు ఊహించని ఆరోగ్య ఖర్చులు ఎదురైన వృద్ధులకే కాక, వయసు మీద పడ్డ తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న ఉద్యోగులకూ పెద్ద ఊరట. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారి నుంచి తమకు ప్రేమాస్పదులైన వ్యక్తులకు రక్షణనిచ్చేందుకు కొండంత అండ. వయోవృద్ధులకు పరిమిత ప్రయోజనాలే అందిస్తున్న ప్రస్తుత ధోరణి నుంచి బీమా సంస్థలు బయటకొచ్చి, తల్లితండ్రులతో సహా పాలసీదారు కుటుంబం మొత్తానికీ సమగ్ర బీమా వసతి కల్పించేలా కొత్త పాలసీలు తేగలుగుతాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను సైతం మార్చగలుగుతాయి.నిజానికి, వయసు మీద పడ్డాకనే ఎవరికైనా ఆరోగ్య బీమా మరింత అవసరం, ఉపయోగం. ఇప్పటి దాకా నిర్ణీత వయసు దాటాక వ్యక్తిగత ఆరోగ్య బీమాకు వీలుండేది కాదు. కానీ, కొత్త సంస్క రణలతో ఆ అడ్డంకి తొలగింది. ప్రత్యేకించి రానున్న రోజుల్లో మన దేశ జనాభాకు ఇది కీలకం. 2011 తర్వాత దేశంలో జనగణన జరగలేదన్న మాటే కానీ, ఐరాస జనాభా నిధి, ఇతర నిపుణుల లెక్క ప్రకారం భారత జనాభా చైనాకు సమానంగా ఉంది. 2023లో ఒక దశలో మనం చైనాను దాటినట్టు కూడా అంచనా. ఈ ఐరాస అంచనాల ఆధారంగా నిరుడు ‘భారత వార్ధక్య నివేదిక – 2023’ను సిద్ధం చేశారు. దాని ప్రకారం దేశంలో 10 శాతమున్న సీనియర్ సిటిజన్ల జనాభా వచ్చే 2050 నాటికి ఏకంగా 30 శాతానికి పెరగనుంది. మరోమాటలో అరవై ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 2022 నాటి 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుతుంది. అది అమెరికా ప్రస్తుత జనాభా కన్నా ఎక్కువ. ఒక్క భారత్లోనే కాదు... అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో వయోవృద్ధులు దాదాపు 16 నుంచి 28 శాతం దాకా ఉన్నారు. మెరుగైన ఆరోగ్య వసతులు, పెరిగిన ఆయుఃప్రమాణం వల్ల ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సీనియర్ సిటిజన్ల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ నిధులతో ప్రజారోగ్య వ్యవస్థలున్నా, ఇతర దేశాల్లో మాత్రం ఖరీదైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణే దిక్కు. అలాంటి చోట్ల ఖర్చెక్కువ, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమాకు చెల్లించాల్సిన ప్రీమియమ్లూ ఎక్కువన్నది నిజమే. కానీ, 65 ఏళ్ళు దాటితే కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి వీలు కాదనే నిబంధన చాలా దేశాల్లో లేదని గమనించాలి. ఇప్పుడు మన దేశమూ ఆ మార్గంలోకి వచ్చి, గరిష్ఠ వయఃపరిమితి షరతు లేకుండా, అన్ని వయసుల వారికీ ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చిందన్న మాట. దానికి తోడు పీఈడీ నిరీక్షణ కాలాన్ని తగ్గించడం, తీవ్ర వ్యాధులున్నా సరే బీమా ఇవ్వాలనడం ప్రజానుకూల, ప్రశంసాత్మక నిర్ణయాలు. ప్రాధికార సంస్థ ఆ మధ్య జీవిత బీమా పథకాల సరెండర్ ఛార్జీల విషయంలో సంస్కరణలు తెచ్చింది. మళ్ళీ ఇప్పుడిలా వినియోగదారుల పక్షాన మరోసారి మరికొన్ని నిబంధనల్ని సవరించడం విశేషం. అయితే, అదే సమయంలో బీమా సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా చూడడం అవసరం. ప్రాధికార సంస్థ ఆదేశాల స్ఫూర్తిని విస్మరించి, అందుబాటులో లేని అతి ఖరీదైన పాలసీలను సంస్థలు తీసుకొస్తే నిష్ప్రయోజనం. అర్థం కాని సాంకేతిక పదజాలం, సంక్లిష్టతలతో పాలసీలు తీసుకొచ్చినా కస్టమర్లు విముఖత చూపుతారు. పాలసీలలో పారదర్శకత పాటిస్తూ, ఇబ్బంది లేకుండా సులభంగా క్లెయిమ్లు పరిష్కారమయ్యే మార్గాన్ని బీమా సంస్థలు అనుసరిస్తే మంచిది. అప్పుడే వినియోగదారులు ఉత్సాహంగా ముందుకు వస్తారు. తాజా బీమా సంస్కరణల తాలూకు ఫలితమూ సమాజానికి అందివస్తుంది. దేశంలోని సీనియర్ సిటి జన్లలో నూటికి 98 మందికి ఇవాళ్టికీ ఆరోగ్య బీమా లేకపోవడం సిగ్గుచేటు. అంతకంతకూ పెరుగు తున్న వైద్య, ఆరోగ్యసేవల ఖర్చు రీత్యా బీమా ఆపత్కాలంలో బలమైన భరోసా. జీవితం పొడు గునా కుటుంబానికీ, సమాజానికీ తమ వంతు సేవ చేసి, ప్రకృతి సహజపరిణామంగా వయసుపై పడ్డ ఈ పండుటాకుల గురించి పాలకులు లోతుగా ఆలోచించాలి. బీమా పాలసీలొక్కటే సరిపోవు. ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగానూ వారి బాగు కోసం ఇతర ప్రత్యామ్నాయాలనూ అన్వేషించాలి. -
ఇద్దరు ఓటర్లు.. 107 కిలోమీటర్లు.. ఎన్నికల అధికారుల సాహసం!
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో లోక్సభ ఎన్నికల కోసం ఇద్దరు వృద్ధులతో ఓటేయించడానికి ఎన్నికల అధికారులు సాహసం చేశారు. ప్రమాదకరమైన మలుపులు, అడవుల గుండా 107 కిలోమీటర్లు ప్రయాణించారు. వివరాల్లోకి వెళ్తే.. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి-చిమూర్ లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో 100 ఏళ్లు, 86 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఎన్నికల అధికారులు అహేరి నుండి సిరొంచ వరకు 107 కిలోమీటర్లు ప్రయాణించి 100 ఏళ్ల కిష్టయ్య మదర్బోయిన, 86 ఏళ్ల కిష్టయ్య కొమెర ఇళ్లకు చేరుకున్నారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసే పరిస్థితిలో లేరు కానీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఎన్నికల అధికారి తెలిపారు. గడ్చిరోలి-చిమూర్ నియోజకవర్గంలో 1,037 మంది 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 338 మంది దివ్యాంగుల దరఖాస్తులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,205 మంది ఓటర్లు ఇంటి వద్ద నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
గురక పెట్టొద్దన్నందుకు పొడిచేశాడు
మేరీల్యాండ్: చెవులకు చిల్లులు పడేలా గురుక పెట్టకురా అన్నందుకు ఓ పెద్దాయనను పొడిచి చంపిన ఘటన అమెరికాలో జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రం మోంట్గోమేరీ కౌంటీలో 62 ఏళ్ల రాబర్ట్ వాలెస్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అదే డూప్లెక్స్ భవనంలో 55 ఏళ్ల క్రిస్టఫర్ కేసీ ఒంటరిగా ఉంటున్నాడు. క్రిస్టఫర్ పెడుతున్న భారీ గురకను వినలేకపోతున్నానని ఏడాదిన్నరగా రాబర్ట్ చెప్పీచెప్పీ విసిగిపోయాడు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. వాళ్లు నచ్చజెప్పినా లాభం లేకపోయింది. క్రిస్టఫర్, రాబర్ట్ల పడక గదులు పక్కపక్కనే ఉండటం, ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో గురక రాబర్ట్కు బాగా ఇబ్బందిపెట్టేది. విసిగిపోయిన పెద్దాయన చివరకు జనవరి 15న సాయంత్రం క్రిస్టఫర్ వరండా దగ్గరికొచ్చి బెదిరించాడు. వినకపోవడంతో అతని కిటికీ స్క్రీన్ను చింపేసి చంపేస్తానని అరిచాడు. ఒకనొక సమయంలో నీ గురక సమస్యకు శస్త్రచికిత్స చేయిస్తానని కూడా మాట ఇచ్చాడు. వాగ్వాదం చాలాసేపు జరిగి ఆగిపోయే సమయానికి క్రిస్టఫర్ తలుపుతీయడంతో రాబర్ట్ మళ్లీ తిట్లపురాణం మొదలెట్టాడు. వీరావేశంతో ఉన్న గురకమహాశయుడు వెంటనే కత్తితో రాబర్ట్ గుండెలపై పలుమార్లు పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
బతికే ఉన్నా మహా ప్రభో...దీనానాథ్ దీన గాథ!
బతికి ఉండగానే చనిపోయినట్టు ప్రకటించిన, ఫించను ఆపివేసిన ఘటన వార్తల్లోనిలిచింది. దీంతో నేను బతికే ఉన్నాను( మై జిందా హూం) అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని నిరసనకు దిగారు. ఆగ్రాలో 70 ఏళ్ల వృద్ధుడు దీనానాథ్ యాదవ్కు చేదు అనుభవం ఎదురైంది. ఇండియా టుడే కథనం ప్రకారం ఆగ్రా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (CDO) కార్యాలయ ఉద్యోగులు ప్రభుత్వ రికార్డుల్లో దీనానాథ్ యాదవ్ చనిపోయినట్టుగా ప్రకటించారు. దీంతో పెన్షన్ఆగిపోయింది. విషయం తెలుసుకున్న దీనానాథ్ సంబంధిత అధికారులను కలిసాడు. గత ఎనిమిది నెలలుగా జిల్ల మెజిస్ట్రేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.. అయినా ఫలితం లేదు. దీంతో నేను బతికే ఉన్నాను అనిరాసి వున్న ప్లకార్డు మెడలో వేలాడదీసుకుని నిరసనకు దిగాడు .దీంతో స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ యాదవ్ అందించిన పత్రాలను పరిశీలించి షాక్ అయ్యారు. విచారణ జరపాల్సింగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. అటు తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడిన దీనానాథ్ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, ప్రతిరోజూ పొలానికి వెళ్తానని, గత రెండేళ్లుగా వృద్ధాప్య పింఛను కూడా తీసుకుంటున్నానని వాపోయాడు. అయితే ఈ ఏడాది మార్చిలో పింఛను ఆగిపోయిందని, తొలుత గ్రామ కార్యదర్శిని, ఆ తరువాత సీడీవో కార్యాలయాన్ని సంప్రదించగా సంతృప్తికర సమాధానం రాలేదని తెలిపారు. నెలల తరబడి పెన్షన్ నిలిచిపోవడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని చట్టపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోఈ నిరసనకు దిగినట్టు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ రికార్డులలో బతికి ఉన్నవారిని చనిపోయినట్టు ప్రకటించడంలాంటి ఘటనలు చాలానే ఉన్నాయనీ, ఇలాంటి బాధితులు వందలాది మంది ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
వేస్ట్ అనుకొంటే..రూ. 36 కోట్లు పలికింది: షాకైన జంట కోర్టుకు
ఎందుకూ పనికి రాదులే అనుకుని ఒక వృద్ధ జంట తమ దగ్గరున్న ఒక రేర్ ఆఫ్రికన్ మాస్క్ను చాలా తక్కువ ధరకే ఒక ఆర్ట్ డీలర్ విక్రయించారు. ఆ తరువాత ఆ డీలర్ దానికి కోట్లకు రూపాయలకు విక్రయించడంతో మోసపోయమాని గుర్తించి లబోదిబోమన్నారు. మోస పోయామంటూ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్లోని నిమెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. MailOnline ప్రకారం 2021లో 81 ఏళ్ల వృద్ధురాలు, ఆమె 88 ఏళ్ల భర్త ఇంటిని శుభ్రం చేస్తుండగా, పురాతన మాస్క్ను గుర్తించారు. పాత సామానుల అమ్ముతున్న క్రమంలోనే ఈ మాస్క్ను కూడా స్థానిక డీలర్కు 158 డాలర్లకు (రూ.13000) విక్రయించారు. అయితే ఆర్ట్ డీలర్ కొన్ని నెలల తర్వాత ఆ మాస్క్ను వేలం వేసి రూ.36 కోట్లు (3.6 మిలియన్ పౌండ్లకు విక్రయించాడు. ఈ విషయాన్ని పేపర్లలో చదివి నివ్వెరపోయారు. మాస్క్ చాలా విలువైనదని అప్పుడు తెలుసు కున్నారు. దీంతో ఆలేస్లోని జ్యుడిషియల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. డీలర్ తమను మోసం చేశాడని, ఉద్దేశపూర్వకంగా ఆ వస్తువు విలువ గురించి తెలిసి కూడా మౌనంగా దాన్ని ఎగరేసుకుపోయాడని వాదించారు. పాత వస్తువుల డీలర్ తమ తోటమాలితో కలిసి కుట్ర పన్నాడని కూడా వీరు ఆరోపించారు. దీనికి పరిహారంగా తమకు సుమారు 5.55 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ డీలర్పై దావా వేశారు. ఆఫ్రికన్ రహస్య సమాజంలో ఆచారాలలో ఉపయోగించే అరుదైన ఫాంగ్ మాస్క్ ఇది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ పెద్దాయన తాత ఆఫ్రికాలో కొలోనియల్ గవర్నర్గా ఉన్నప్పటిదని తెలుస్తోంది. "కార్బన్-14 నిపుణుడి సహాయం తీసుకున్న డీలర్, తమ తోటమాలి ద్వారా తమ కుటుంబ పూర్వీకుల వివరాలను తెలుసుకుని మాస్క్ను అమ్మి సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. అయితే తాను సెకండ్ హ్యాండ్ డీలరే కానీ పురాతన వస్తువుల డీలర్ని కాదని కొన్నపుడు అసలు దాని విలువ తెలియదని కోర్టులో వాదించాడు. దీంతో దిగువ న్యాయస్థానం డీలర్ పక్షాన నిలిచింది. ఈ తీర్పుపై దంపతులు నవంబర్లో నిమ్స్లోని హైకోర్టును ఆశ్రయించారు. అంతే కాదు వేలం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తోటమాలికి కూడా ఇచ్చాడని తెలిపారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఈ కుటుంబంతో రాజీ చేసుకోవాలని డీలర్ ప్రయత్నించాడు. కానీ వారి పిల్లలకు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు రికార్డుల ప్రకారం, డీలర్ ఈ మస్క్ను కొన్న తరువాత డ్రౌట్ ఎస్టిమేషన్ అండ్ ఫావ్ ప్యారిస్ అనే రెండు ఫ్రెంచ్ వేలం హౌసెస్ వారిని సంప్రదించాడు. దీని విలువ చాలా గొప్పదని తెలుసుకున్న డీలర్ ఆఫ్రికన్ మాస్క్ నిపుణులను సంప్రదించాడు. అలాగే మాస్ స్పెక్ట్రోమెట్రీ విశ్లేషణను , రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా దీని అసలు రేటు తెలుసుకుని మరీ మాంట్పెల్లియర్లో ఎక్కువ ధరకు వేలం వేశాడు. కాగా ది మెట్రో న్యూస్ ప్రకారం, ఆఫ్రికా దేశానికి సంబంధించిన అరుదైన కళా ఖండం. 19వ శతాబ్దానికి చెందిన న్గిల్ మాస్క్ గాబన్లోని ఫాంగ్ ప్రజల వినియోగిస్తారు. వివాహాలు, అంత్యక్రియల సమయంలో ఈ మాస్క్ను ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో ఇలాంటి మాస్క్లు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. -
‘నన్ను కొట్టి చంపేస్తున్నాడు’.. కమిషనరేట్లో 105 ఏళ్ల వృద్ధుని రోదన!
యూపీలోని కాన్పూర్లో 105 ఏళ్ల వృద్ధుడు నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని, తన గోడు వెళ్లబోసుకున్నాడు. కార్యాలయానికి వచ్చిన ఆ వృద్ధుడిని చూసిన ఏడీసీపీ అశోక్ కుమార్ ముందుగా ఆతనికి చల్లని నీరు అందించారు. తరువాత అతని బాధేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫోన్ చేసి, ఆ వృద్దుని తరపున ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే కాన్పూర్కు చెందిన రాజ్ బహదూర్ అనే వృద్ధుని గోడు పోలీసులు పట్టించుకోకపోవడంతో.. చేతికర్ర సాయంతో అతను నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. అతనిని చూసిన పోలీస్ కమిషనర్ స్టాఫ్ ఆఫీసర్(ఏడీసీపీ) అశోక్ కుమార్ అతని దగ్గరకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. తనను గ్రామానికి చెందిన ఉత్తమ్ కుమార్ అనే యువకుడు వేధిస్తున్నాడని, కొడుతున్నాడని ఆ వృద్దుడు ఫిర్యాదు చేశాడు. తాను ఆంగ్లేయుల పరిపాలనా కాలాన్ని చూశానని, అప్పట్లో తన వయసు 12 ఏళ్లు ఉంటుందని తెలిపాడు. వృద్దుని గోడు విన్న ఏడీసీపీ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇది కూడా చదవండి: అన్నల మద్యం అలవాటుకు చెల్లెలు బలి.. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు? -
తాతకు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు
-
కారు పార్కింగ్ వివాదం.. కొట్టుకున్న రెండు కుటుంబాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ సంత్ నగర్లోని ఒక అపార్ట్మెంట్లో పార్కింగ్ విషయమై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఒక పెద్దాయనతో సహా ఆ కుటుంబంలోని మహిళలు పార్కింగ్ చేసిన వ్యక్తిని కర్రతో చితకబాదారు. ఈ వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు వీరు అంతరించిపోతున్న భారతీయ కళకు ఊపిరి పోశారన్నారు. ఒకప్పుడు వీధుల్లో కుళాయి వద్ద సర్వసాధారణంగా బిందెలతో కొట్టుకోవడం చూసుంటాం. కానీ ఇప్పుడు నాగరికత పెరిగిన కారణంగా వీధిలోని సంప్రదాయాన్ని అపార్ట్మెంట్లకు బదిలీచేశారు. వేషధారణ అయితే మారింది కానీ గుణం మారలేదు. సంత్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముండే దుష్యంత్ గోయెల్ కారు పార్కింగ్ చేశాడన్న కోపంతో ఆ కుటుంబ పెద్ద కనీసం వారించకుండా ఒక కర్రతో దాడి తెగబడ్డారు. పాపం భర్తను కాపాడేందుకు అతని భార్య మోనా గోయెల్ తోపాటు వారి కుమార్తె కౌశికి కూడా ఎంత అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆ పెద్దమనిషి ఇంట్లోని వారంతా మూకుమ్మడిగా దాడి చేయడంతో దుష్యంత్ కుటుంబంలోని అందరూ గాయపడ్డారు. అనంతరం దుష్యంత్ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పెద్దమనిషి దల్జీత్ సింగ్ అతని కుమారుడు హర్జాప్ ఇద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అదే కుటుంబంలోని ఆడవాళ్లు కూడా దాడిచేసినటు వీడియోలో స్పష్టంగా కనిపించడంతో వారిపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. వారు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు రెండుసార్లు నిరాకరించింది. ఒక్కరికి మాతం కోర్టు ఉపశమనం కలిగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ మధ్య కార్ పార్కింగ్ వివాదాలు ఒకప్పటి బిందుల ఫైట్ కంటే రసవత్తరంగా సాగుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. Kalesh b/w Two Neighbour’s in New Delhi over Car Parking issuepic.twitter.com/A21HCcknf6 — Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్లొ మరో ఘోరం.. ఫ్రీడం ఫైటర్ భార్య సజీవ దహనం -
నమ్మలేని నిజం..'లైఫ్' అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమేనా!…
ఆమె వయస్సు 85 ఏళ్లు… ముంబై నుంచి పూణెకు వెళ్లిపోతోంది… పూణెలో ఓ సీనియర్ సిటిజెన్స్ హోమ్కు… అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి… ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు… ఆమె చదువుకున్నదే… ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసింది. వాళ్లందరూ అమెరికా పౌరులు. అందరికీ ఇద్దరేసి పిల్లలు… వాళ్లంతా హైస్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు… ఈమె అమెరికాకు బోలెడుసార్లు వెళ్లింది… కాన్పులు చేసింది… వెళ్లిన ప్రతిసారీ ఆరు నెలలపాటు ఉండేది… ఇక చాలు అనుకుంది… ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు. అమెరికాకు వెళ్లాలని లేదు, రానని చెప్పేసింది… ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి చాలు… అందుకే ఆమె సీనియర్ సిటిజెన్స్ హోంకు వెళ్లిపోతోంది… వాటినే రిటైర్మెంట్ హోమ్స్ అనండి… అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారుట. ఇక ఆమె కొనసాగిస్తూ.. ‘‘వెళ్తున్నాను… ఇక తిరిగి ఎక్కడికీ రాను… నా విశ్రాంత, చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కున్నాను… వెళ్లకతప్పదు… తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ… ఎప్పుడో గానీ నేను వారి మాటల్లోకి రాను… నేనిప్పుడు ఎవరికీ ఏమీ కాను… ఎవరికీ అక్కరలేదు… ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు… అది రిటైర్మెంట్ హోం… బాగానే ఉంది… ఒక్కొక్కరికీ ఒక సింగిల్ రూం… మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు… టీవీ… అటాచ్డ్ బాత్రూం… బెడ్డు… ఏసీ కూడా ఉంది… కిటికీ తెరిస్తే బయటి గాలి… ఫుడ్డు కూడా బాగుంది… సర్వీస్ బాగుంది… కానీ ఇవేమీ చవుక కాదు… ప్రియమైనవే… నాకొచ్చే పెన్షన్ బొటాబొటీగా ఈ అవసరాలకు సరిపోతుంది… సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే… అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకు ఢోకాలేదు… నా తరువాత ఏమైనా మిగిలితే నా కొడుక్కి వెళ్లిపోతుంది… సో, ఆ చీకూచింత ఏమీ లేదు… ‘నీ ఇష్టం అమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో…’’ అన్నాడు నా వారసుడు… వెళ్లిపోవడానికి సిద్ధమైపోతున్నాను… అకస్మాత్తుగా..అవి నావి ఎలా అవుతాయ్?.. ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా..? కాదుగా… బాక్సులు, బ్యాగులు, అల్మారాలు, ఫర్నీచర్, రోజువారీ మన జీవితంతో పెనవేసుకున్న బోలెడు పాత్రలు… అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు… సేకరణ అంటే నాకిష్టం… లెక్కలేనన్ని స్టాంపులు ఉన్నయ్… చాయ్ కప్పులున్నయ్… అత్యంత విలువైన పెండెంట్లు, బోలెడు పుస్తకాలు… అల్మారాల నిండా అవే… డజన్లకొద్దీ విదేశీ మద్యం సీసాలున్నయ్… బోలెడంత వంట సామగ్రి ఉంది… అరుదైన మసాలాలు… ఇవే కాదు, అనేక ఫోటో అల్బమ్స్… ఇవన్నీ ఏం చేయాలి..? నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు… నా జ్ఞాపకాల్ని అది మోయలేదు… అది భద్రపరచదు కూడా… ఏముంది ఆ గదిలో…? మహా అయితే ఓ చిన్న కేబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా ఓ చిన్న ఫ్రిజ్, ఓ చిన్న వాషింగ్ మెషిన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రోవేవ్ ఓవెన్… అన్నీ అవసరాలే… కానీ నా జ్ఞాపకాల్ని కొనసాగించే సౌకర్యాలు కావు… నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణనూ నాతో ఉంచుకోలేను… అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అనీ, అవి నావి కావనీ అనిపిస్తోంది… అన్నీ నేను వాడుకున్నాను, అంతే… అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే… నావి ఎలా అవుతాయి..? నా తరువాత ఎవరివో… రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు… కానీ వాళ్ల తరువాత అవి ఎవరివో… నిజానికి ప్రపంచ సంపద కదా… మనతోపాటు వచ్చేదేముంది..? వెళ్లిపోయేది ఒక్క దేహమే కదా… అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను… అన్నింటితో బంధం తెంచేసుకున్నా.. కానీ అవన్నీ కొన్నవాళ్లు ఏం చేస్తారు..? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరేవాళ్లకు దేనికి..? వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా… బుక్స్ అమ్మేస్తారు… నా గురుతులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు… ఫర్నీచర్ ఏదో ఓ ధరకు వదిలించుకుంటారు… బట్టలు, పరుపులు బయటికి విసిరేస్తారు… వాళ్లకేం పని..? మరి నేనేం ఉంచుకోవాలి..? నా బట్టల గుట్ట నుంచి కొన్ని తీసుకున్నాను… అత్యవసర వంట సామగ్రి కొంత… తరచూ పలకరించే నాలుగైదు పుస్తకాలు… ఐడీ కార్డు, సీనియర్ సిటెజెన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ బుక్కు… చాలు… అన్నీ వదిలేశాను… బంధం తెంచేసుకున్నాను… నా పొరుగువారికి వీడ్కోలు చెప్పాను… డోర్ వేసి, గడపకు మూడుసార్లు వంగి మొక్కుకున్నాను… ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను… ఎవరో చెప్పినట్టు… ఏముంది..? ఓ దశ దాటాక… కావల్సింది ఒక మంచం… ఓ గది… అత్యవసరాలు… మిగిలినవన్నీ గురుతులు మాత్రమే… ఇప్పుడు అర్థమవుతుంది మనకు… మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు… మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటూ పనికిరానివాటిని సంకెళ్లుగా మిగుల్చుకోవద్దు… వదిలేయాలి… వదిలించుకోవడమే… కీర్తి, సంపద, భవిష్యత్తు… అన్నీ ఓ ట్రాష్… లైఫ్ అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమే… నిజంగా అంతే… అరవై ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి… ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి… అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలేమిటో అర్థమవ్వాలి… మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు… అందుకే బంధం పెంచుకోవడమే వృథా… సో, ఆరోగ్యంగా ఉండండి… ఆనందంగా ఉండండి… ఏదీ మనది కాదు… ఎవరూ మనవాళ్లు కారు… మనిషి ఒంటరి… మహా ఒంటరి… వచ్చేటప్పుడు, పోయేటప్పుడు’’..!! -
అయ్యో.. క్రికెట్ లెజెండ్స్ ఇలా మారిపోయారా?
-
వ్యక్తి ప్రాణాలు తీసిన వందేభారత్-ఆవు ప్రమాదం.. చూస్తుండగానే..
జైపూర్: దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన వందే భారత్ రైలు ప్రారంభం నుంచే పలు సవాళ్లు ఎదుర్కొంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ఆకతాయిలు రైళ్లపై రాళ్లతో దాడి చేయగా.. మరికొన్ని చోట్ల ప్యాసింజర్లు చెత్తా చెదారం పడేసిన వార్తలొచ్చాయి. మరికొన్ని చోట్ల సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో పశువులు రైళ్లకు అడ్డుగా వచ్చి మృత్యువాత పడ్డాయి. తాజాగా రాజస్తాన్లో ఓ ఆవు వందే భారత్కు అడ్డుగా వచ్చి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మరో విషాదం ఏంటంటే.. ఆవు శరీర భాగాలు బలంగా ఢీకొట్టడంతో ఆ సమీపంలో మూత్రవిసర్జన చేస్తున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అల్వార్లోని అరవాలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న వందే భారత్ రైలు ఆవును ఢీకొనడంతో, దాని శరీర భాగాలు ఛిద్రమై 30 మీటర్ల దూరంలో మూత్రవిసర్జన చేస్తున్న శివదయాల్ శర్మపైపడి అతను అక్కడికక్కడే మృతి చెందడం కలచివేసింది. చదవండి: కోహ్లీ-గంభీర్ గొడవకు రాజకీయ రంగు.. ఎన్నికల్లో బుద్ధిచెబుతామంటున్న కన్నడిగులు..! రైలును ఢీకొనడంతో.. ఆవు శరీర భాగం దూరంలో ఉన్న శివదయాల్పై పడటంతో అతను అక్కడికక్కడే మరణించాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు భారతీయ రైల్వేలో 23 ఏళ్లు ఎలక్ట్రీషియన్గా పనిచేసి రిటైర్ అయ్యాడని పోలీసులు తెలిపారు. శివదయాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. ఇదిలా ఉండగా సెమీ హై స్పీడ్ వందే భారత్ రైళ్లు ఆవులు, గేదెలను ఢీకొన్న సంఘటనలు ఎక్కువ శాతం ముంబాయి-గుజరాత్ రైల్వే లైన్లో జరిగినట్టుగా ఓ నివేదిక పేర్కొంది. చదవండి: ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ -
తేనెటీగల బీభత్సం.. భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
రావికమతం(అనకాపల్లి జిల్లా): రావికమతం మండలం గర్నికం గ్రామంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. పొలంలో పనిచేసుకుంటున్న వృద్ధ దంపతులు ఆర్లె కామునాయుడు (61), అతని భార్య నూకాలమ్మ( 57)పై శుక్రవారం సాయంత్రం మూకుమ్మడిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన వీరిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త కామునాయుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందగా, భార్య నూకాలమ్మ అక్కడే చికిత్స పొందుతోంది. గ్రామానికి సమీపంలో వారి పశువుల పాకలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం పొలంలో గొర్రెలు కాస్తూ పనులు చూసుకుంటున్న తరుణంలో మేతకు వెళ్లి వచ్చే పశువులు సమీపంలో ఉన్న ఒక చెట్టు వద్ద ఒకదానితో మరొకటి తలపడి అలజడి చేశాయి. చదవండి: కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు దీంతో ఆ చెట్టుపై ఉన్న తేనెపట్టులోని ఈగలు బెదిరి పశువులతోపాటు వృద్ధ దంపతులపైనా గుంపుగా దాడి చేశాయి. దీంతో వారు కేకలు వేయగా సమీపంలోని రైతులు గోనె సంచులు చుట్టుకుని వెళ్లి వారిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ తీసుకువెళ్లారు. కేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కామునాయుడు శనివారం మృతి చెందారు. -
పేరుకే పెద్ద ఆస్పత్రి..కనీసం స్ట్రెచర్ లేక వృద్ధుడి పాట్లు: వీడియో వైరల్
కొన్ని ప్రభుత్వాస్పత్రులు పేరుకే పెద్ద ఆస్పత్రులు గానీ అందులో సౌకర్యాలు మాత్రం నిల్. దీంతో చికిత్స కోసం వచ్చే రోగులు పడే ఇబ్బందులు అంత ఇంత కాదు. చిన చితక పనులు చేసుకునే పేదలకు ఆ ఆస్పత్రులే గతి. దీంతో అక్కడ ప్రభుత్వోద్యోగులు వీళ్లపట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. అచ్చం అలాంటి పరిస్థితి ఓ ప్రభుత్వాస్పత్రిలో వృద్ధుడు ఎదుర్కొన్నాడు. కనీసం రోగిని తీసుకువెళ్లేందకు స్ట్రెచర్లు లేక అతని తీసుకువెళ్తున్న విధానం చూస్తే ఆ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం రాక మానదు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్లోని గాల్వియర్లో సుమారు వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రికి ఓ వృద్ధుడు వచ్చాడు. అతని కాలు విరిగిపోవడంతో చికిత్స కోసం తన కోడలితో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. ఐతే అక్కడ ఆర్థోపెడిక్ విభాగంలోని శ్రీకిషన్ ఓజా(65)ను ట్రామా విభాగానికి తరలించాలని సూచించారు. ఐతే అతన్ని తీసుకువెళ్లేందు కోసం స్ట్రెచర్ కోసం వెళ్లింది కానీ వాటికి చక్రాలు లేవు. దీంతో తన మామను ఒక తెల్లటి క్లాత్లో కూర్చొబెట్టి లాక్కుని వెళ్లింది. అక్కడ నుంచి ఆటో తీసుకుని ట్రామాకేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఐతే అక్కడ రోగులు స్ట్రెచర్లు ఉన్నాయే కానీ పనిచేయనవని చెబతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. Video: No Hospital Stretcher, Elderly Man With Broken Leg Dragged On Cloth In Gwalior Hospital https://t.co/2NAOIfdZ6W pic.twitter.com/F0uWTMiPk3 — NDTV (@ndtv) March 25, 2023 (చదవండి: మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్ ఫైర్) -
ప్రతికూల ఆలోచనల వల్లే ఆందోళన, కుంగుబాటు
లండన్: వృద్ధుల్లో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడికి ప్రతికూల భావోద్వేగాలు, ఆలోచనలే కారణమని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. మనసులో ప్రతికూల ఆలోచనలు మొదలైతే ఆందోళన పెరుగుతున్నట్లు తేల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని సూచించారు. పెద్దల్లో మెదడుపై ప్రతికూల ఆలోచనల ప్రభావం, మానసిక ఆందోళనకు మధ్య గల సంబంధాన్ని స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు. ఇతరుల మానసిక వ్య«థ పట్ల యువకులు, వృద్ధులు ఎలా స్పందిస్తారు? వారి మెదడు ఎలా ఉత్తేజితం చెందుతుంది? వారిలో ఎలాంటి భావోద్వేగాలు తలెత్తుతాయి? అనే దానిపై పరిశోధన చేశారు. మొదటి గ్రూప్లో 27 మందిని(65 ఏళ్లు దాటినవారు), రెండో గ్రూప్లో 29 మందిని(25 ఏళ్ల యువకులు), మూడో గ్రూప్లో 127 మంది వయో వృద్ధులను తీసుకున్నారు. విపత్తుల వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసికంగా బాధపడుతున్న వారి వీడియో క్లిప్పులను, తటస్థ మానసిక వైఖరి ఉన్నవారి వీడియో క్లిప్పులను చూపించారు. యువకులతో పోలిస్తే వయో వృద్ధుల మెదడు త్వరగా ఉత్తేజితం చెంది, ప్రతికూల భావోద్వేగాలకు గురవుతున్నట్లు ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా గమనించారు. వారి మనసులో సైతం ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి వంటి విపరీత భావాలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అలాంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆందోళన, ఒత్తిడి సైతం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపెట్టారు. అధ్యయనం వివరాలను నేచర్ ఏజింగ్ పత్రికలో ప్రచురించారు. -
Viral Video: భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని బండి నడిపిన బామ్మ..
బైక్ రైడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. బైక్ అంటే చాలు కుర్రాళ్లు ఎగిరి గంతులేస్తారు. ఒకప్పుడు మగవారే బైక్లు, కారులు నడిపేవారు. అమ్మాయిలు అసలు రైడింగ్ జోలికి వెళ్లేవారు కాదు. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. యువతులు, మహిళలు కూడా అన్ని వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు. తాజాగా వయసు పైబడిన పెద్దావిడ బండి నడిపి వావ్ అనిపించింది. అంతేగాక వెనుక సీట్లో తాతను కూర్చోబెట్టి బామ్మ డ్రైవ్ చేయడం మరింత స్పెషల్గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. వీడియోలో సుమారు 60 ఏళ్లు ఉన్న ఓ పెద్దావిడ ఎంతో ఉత్సాహంగా, చలాకీగా ద్విచక్ర వాహనం నడిపింది. భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని రోడ్డుపై రయ్ రయ్ అంటూ వెళ్లింది. బామ్మ చక్కగా చీరకట్టుకొని ఉండగా తాత తెల్లటి చొక్కా, పంచె కట్టుకొని కనిపించాడు. దీంతో మాములు బామ్మ కాస్తా బైక్ బామ్మగా మారిపోయింది. ఎలాంటి భయం, బెరుకు లేకుండా బండి నడిపి.. యువకులకు తాను ఎంత మాత్రం తీసిపోనని రుజువు చేసింది. దీనిని వెనకాల వస్తున్న వారు వీడియో తీశారు. సుస్మితా డోరా అనే యువతి తన ఇన్స్టాగ్రామ్లో పోస్టుచేసింది. బామ్మ డ్రైవింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఈ వయసులో బండి నడపడటం గ్రేట్..చూడటానికి ఎంతో అందంగా ఉంది. నీ డ్రైవింగ్కు తిరుగు లేదు’ అంటూ ప్రశంసిస్తున్నారు. కపుల్ గోల్స్ క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. బండి నెంబర్ ప్లేట్ చూస్తుంటే తమిళనాడుకు చెందినదిగా తెలుస్తోంది. View this post on Instagram A post shared by Susmita Dora (@the_aspiring_seed) -
కొడుకు శవంతో 4 రోజులు వృద్ధుడి సహవాసం.. దుర్వాసన రావటంతో..!
చండీగఢ్: పిల్లలు లేకపోవటంతో బాలుడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు ఓ 82 ఏళ్ల వృద్ధుడు. అమాయకత్వం, ఇతరులతో కలుపుగోలుగా ఉండకపోవటంతో పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అయితే, అనారోగ్యంతో దత్తత తీసుకున్న కుమారుడు నాలుగు రోజుల క్రితం మృతి చెందగా.. ఏం చేయాలో తెలియని వృద్ధుడు శవం వద్దే ఉండిపోయాడు. నాలుగు రోజుల తర్వాత ఇంట్లోంచి దుర్వాసన రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అపస్మారక స్థితిలో మృతదేహం వద్ద పడిపోయి ఉన్న వృద్ధుడిని సోమవారం రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘సమాచారం అందుకోవటంతో అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాం. మృతదేహం వద్దే వృద్ధుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన ఏమీ చెప్పటం లేదు. మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఆయనకు అంతగా ఏమీ తెలిసేలా కనిపించటం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.’ అని పోలీసు అధికారి పాల్ చంద్ తెలిపారు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. మృతి చెందిన సుఖ్విందర్ సింగ్ అనే వ్యక్తి బల్వాంత్ సింగ్కు దత్తపుత్రుడిగా స్థానికులు తెలిపారు. ‘వారిని ఇటీవల ఎవరైనా పలకరించారా అనే విషయం తెలియదు. గత నెల రోజులకుపైగా వృద్ధుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందో మాకు తెలియదు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాం.’ అని వెల్లడించారు స్థానికులు. ఇదీ చదవండి: చెల్లి శవంతో 4 రోజులు సహవాసం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. -
‘మాతో ఉండండి.. వేధించకండి..వేడుకుంటున్నాం ’
సాక్షి, హైదరాబాద్: తమతో పిల్లలు మరింత సమయం గడపాలని కోరుకుంటున్నారు కొందరు. అదే సమయంలో పిల్లల వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటున్నారు. మరికొందరు. ఓ వయసు దాటిన తర్వాత అటు సమాజం ఇటు కుటుంబం రెండు వైపులా నిర్లక్ష్యాన్ని ఎదుర్కుంటున్న వృద్ధాప్యపు స్థితిగతులపై ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల వ్యాప్తంగా ‘హెల్పేజ్ ఇండియా’ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించింది. ఇందులో ఎన్నో ఆసక్తికర, ఆలోచించాల్సిన, తప్పకుండా స్పందించాల్సిన అంశాలు వెలుగు చూశాయి. అవి శాతాల వారీగా ఇలా... ఎంతెంత దూరం..ఆరోగ్యం ► కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నవారు 78 శాతం ► డయాబెటిస్ తో 48 శాతం రక్తపోటు సమస్యతో 37 శాతం ► గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు 21 శాతం ► ఆరోగ్యం కోసం రోజూ నడక కొనసాగిస్తున్నారు 76 శాతం ► యోగా, ప్రాణాయామం చేసేవారు 21 శాతం ► సరైన పద్ధతిలో ఔషధాలు వాడుతున్నవారు 71 శాతం ► తమ ఆరోగ్యం పట్ల పిల్లలు శ్రద్ధ తీసుకోవాలంటున్నారు 50 శాతం ► ఆరోగ్య బీమా తమకు అన్ని విధాలా అందుబాటులో ఉండాలంది 43 శాతం ► ఆహారాన్ని నియంత్రిత పద్ధతిలో తీసుకుంటున్నది 69 శాతం ► సరైన ఆరోగ్య సేవలు పొందుతున్నది 32 శాతం ► బలహీనమైన కాళ్ల కారణంగా పడిపోతామని భయపడుతున్నవారు 37 శాతం ► కంటిచూపు తగ్గిందని బాధపడుతున్నవారు 37 శాతం ► ప్రైవేట్ ఆసుపత్రుల్లో, డయాగ్నసిస్ సెంటర్లలోనూ తమకు తక్కువ ధరకు వైద్య సేవలు లభించాలని ఆశిస్తోంది 35 శాతం ఆర్థికం.. అంతంత మాత్రం.. ► ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపైనే ఆధారపడింది 67 శాతం ► ఆర్థిక భద్రత కలిగి ఉంది 58 శాతం ► పింఛను తదితరాలపై ఆధారపడ్డవారు 45 శాతం పరివారం.. పరిస్థితి ఇదీ... ► కుటుంబ సభ్యుల నిరాదరణకు గురవుతున్నది 56 శాతం ► తరచూ కుటుంబ సభ్యుల చేత తిట్లు తింటోంది 36 శాతం ► పిల్లల చేతిలో దెబ్బలు తింటున్నవారు 18 శాతం ► తమ ఉనికిని కుటుంబం నిర్లక్ష్యం చేస్తోందంటున్నవారు 9 శాతం ► తమను ఆర్ధిక ఇబ్బందులు పెడుతున్నారంటున్నవారు 9 శాతం ► వేధింపుల నుంచి ఎలా బయటపడాలో తెలియని వారు 24 శాతం ► తమ కుటంబ సభ్యులకు కౌన్సెలింగ్ కావాలంటున్నవారు 71 శాతం ► సామాజిక వేధింపులకు గురవుతున్నామని అంటోంది 42 శాతం ఇలా ఉన్నాం.. అలా ఉండాలనుకుంటున్నాం... ► సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు 21 శాతం ► సమాజసేవకు సై అంటోంది 25 శాతం ► కుటుంబంతో సమయం గడుపుతున్నవారు 53 శాతం ► సెల్ఫోన్ వాడుతున్న వృద్ధులు 96 శాతం ► వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నవారు 15 శాతం ► తమ వయసువారిని ముఖాముఖి కలుసుకుంటోంది 45 శాతం ► పిల్లలకు దూరంగా ఉన్న వృద్ధుల్లో పిల్లలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నవారు 43 శాతం ► కుటుంబంతోనే ఉన్నప్పటికీ, తమ కుటుంబ సభ్యులు తమతో మరింత సమయం గడపాలని కోరుకుంటున్న వారు 61శాతం ► తమ సమస్యలపై సమాజం స్పందించాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆశిస్తోంది 53 శాతం -
మహిళా సంఘాల తరహాలో వృద్ధుల సంఘాలు
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాల మాదిరే ఇప్పుడు కొత్తగా వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సంఘాలకు ‘ఎల్డర్లీ స్వయం సహాయక సంఘాలు (ఈఎస్హెచ్జీ)’గా పేరు పెట్టారు. మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఆర్థికసాయం అందజేసినట్లే ప్రభుత్వం వృద్ధుల సంఘాలకు కూడా రెండేళ్లపాటు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేలు ఇవ్వనుంది. రెండేళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నట్లే వృద్ధుల సంఘాలకు బ్యాంకు రుణాలను ఇప్పించే అవకాశం ఉంది. ఈ వృద్ధుల సంఘాల్లో.. 60 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు ఒకే సంఘంలోనే సభ్యులుగా కొనసాగవచ్చు. అయితే.. పురుషులు, మహిళల వేర్వేరు సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక సంఘంలో కనీసం పదిమంది, గరిష్టంగా 20 మంది సభ్యులుగా కొనసాగవచ్చు. కొండ ప్రాంతాలతోపాటు ఇతర గిరిజన ప్రాంతాల్లో అత్యంత వెనుకబాటుతనంతో ఉండే 12 కులాలకు చెందిన వారైతే కనీసం ఐదుగురితోనే సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత దశలో క్రమంగా రాష్ట్రమంతా ఈ కార్యక్రమాలను విస్తరించనున్నారు. మూడు విభాగాలుగా.. సంఘాల ఏర్పాటుకు వృద్ధులను మూడు విభాగాలుగా విభజించారు. 1. తమ వ్యక్తిగత పనులు సొంతంగా చేసుకుంటూ, జీవనోపాధి కోసం ఇతర పనులు కూడా చేసుకునేవారు. 2. తమ పనులు మాత్రమే చేసుకుంటూ, ఇంకేమీ చేయలేని వారు. 3. వ్యక్తిగత పనులకు వేరే వాళ్లపై ఆధారపడే స్థితిలో ఉన్న వారు ► ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మొదటి రెండు విభాగాల వారితో మాత్రమే సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సంఘాల ఏర్పాటు ఎందుకంటే.. ► వృద్ధాప్యంలో కూడా వారు సమాజంలో గౌరవంగా జీవించేహక్కును ప్రోత్సహించడం. ► కుటుంబ ఇబ్బందుల కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారి మనసు బాగుండేలా సంఘ సభ్యులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడాన్ని ప్రోత్సహించడం. ► వృద్ధాప్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలపై పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా వారిలో అవగాహన పెరిగేలా చూడటం. సాయం ఇలా.. ► వృద్ధులు సొంత ఆదాయం పెంచుకోవడానికి ఆసక్తి చూపితే వారికి ఆసక్తి ఉన్న అంశంలో శిక్షణ ఇచ్చి ముందుకెళ్లేందుకు సంఘాల వారీగా బ్యాంకు రుణం ఇప్పించే అవకాశం ఉంది. ► సంఘం ఏర్పాటు చేసినప్పుడు రూ. 5 వేలు, తర్వాత సభ్యులకు శిక్షణ కార్యక్రమాల సమయంలో రూ.5 వేలు, తొలి ఏడాది పెట్టుబడిగా మరో రూ.15 వేలు, రెండో ఏడాది రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. 15 మండలాల్లో 3,017 సంఘాలు మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు కార్యకలాపాలను పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. ఆ 15 మండలాల్లో ఈ ఏడాది ప్రాథమికంగా 3,017 సంఘాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికే 1,048 సంఘాలు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు ప్రక్రియలో పాల్గొనే గ్రామ సమాఖ్య అసిస్టెంట్ (వీవోఏ)ల ద్వారానే వృద్ధుల సంఘాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది. వృద్ధుల సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో బాధ్యులుగా ఉన్న ఒక్కొక్కరికీ శిక్షణ ఇవ్వగా, ఆ తర్వాత స్థాయిలో ఎంపికచేసిన మండల సెర్ప్ సిబ్బందికి, ఆయా మండలాల పరిధిలోని గ్రామ సమాఖ్యల సిబ్బందికి, వీవోఏలకు ప్రభుత్వం ఒక దశ శిక్షణను కూడా పూర్తిచేసింది. గ్రామాల్లో వీవోఏలు వృద్ధులను కలిసి సంఘాల ఏర్పాటు ఉద్దేశం వివరించి, సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. -
25 ఏళ్ల తరువాత కుటుంబం చెంతకు..
జగ్గయ్యపేట అర్బన్: మతి స్థిమితం కోల్పోయి భార్యా బిడ్డలకు దూరమై అనాథగా జీవిస్తున్న ఓ వృద్ధుడు 25 ఏళ్ల తరువాత తిరిగి కుటుంబం చెంతకు చేరుకున్నాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక చెరువు బజారుకు చెందిన మణిమాల వెంకట్రావు(70) ముఠా కార్మికుడిగా జీవించేవాడు. అతనికి భార్య వెంకాయమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకట్రావుఒకరోజు అతిగా మద్యం తాగి మతి స్థిమితం కోల్పోయాడు. ఇంటికి చేరుకోలేక తిరిగి తిరిగి చివరకు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతని కోసం కొన్నాళ్లపాటు వెతికి ఆశలు వదులుకున్నారు. ఇలా 25 ఏళ్లు గడిచిపోయాయి. ఇటీవల వెంకట్రావుకు పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో తోటి వారితో తన ఊరు, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పగలిగాడు. దీంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి వెంకట్రావు వివరాలు చెప్పారు. జగ్గయ్యపేట ఎస్ఐ రామారావు వెంటనే విచారణ చేసి స్థానిక చెరువుబజారులో వెంకట్రావు కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుసుకొని, సమాచారమిచ్చారు. రంపచోడవరంలోని వృద్ధాశ్రమంలో ఉన్న వెంకట్రావును అక్కడి పోలీసుల సహాయంతో జగ్గయ్యపేటకు తీసుకొచ్చారు. ఆదివారం జగ్గయ్యపేట పోలీస్స్టేషన్లో వెంకట్రావును అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రైళ్లలో వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించండి
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు నిలిపేసిన చార్జీల రాయితీని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని భారతీయ రైల్వే శాఖను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో తగిన అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. కాగా, ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు గతంలో ఇచ్చిన రాయితీని పునరుద్ధరించామని ఆర్టీసీ తరఫు న్యాయవాది పి.దుర్గాప్రసాద్ ధర్మాసనానికి నివేదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. రైల్వే శాఖ కూడా ఈ దశలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంది. రైళ్లు, ఆర్టీసీ బస్సు చార్జీల్లో వృద్ధులకు గతంలో ఇస్తూ వచ్చిన రాయితీని కోవిడ్ సమయంలో రద్దు చేశారని, తర్వాత దాన్ని పునరుద్ధరించలేదని, ఈ విషయంలో అధికారులకు తగిన ఆదేశాలివ్వాలంటూ శ్రీకాకుళానికి చెందిన జీఎన్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
విశాఖలో అమానవీయం.. వృద్ధుడిని రోడ్డు పక్కన వదిలేసిన కుటుంబం
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ఎంవీపీ కాలనీలోని వెంకోజిపాలెంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కదలేని పరిస్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని సొంత కుటుంబ సభ్యులు నడిరోడ్డుపై వదిలివెళ్లిపోయారు. కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేని ఆ వృద్థుడు కొద్ది రోజులుగా తీవ్రమైన చలిగాల్లోనే బతుకుపోరాటం చేస్తున్నాడు. తొలుత భిక్షాటన చేసుకునే వ్యక్తిగా భావించిన స్థానికులు అతనిని పట్టించుకోలేదు. అయితే రోజులు గడుస్తున్నా అతను అక్కడే ధీనంగా ఉండడం, కదల్లేక రాత్రిపూట చలికి తట్టుకోలేక వణికిపోవడాన్ని గమనించారు. దీంతో స్థానిక పోలీసులకు ఓ పాత్రికేయుడు సహకారంతో సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తనది అప్పుఘర్ ప్రాంతమని, తన కుటుంబ సభ్యులే (కొడుకు, కోడలు) ఇక్కడ వదిలేసి వెళ్లినట్లు వెల్లడించాడు. అయితే పేరుతో పాటు పూర్తి వివరాలు తెలిపే స్థితిలో అతను లేకపోవడంతో పోలీసులు, స్థానికులు ఇండియన్ రెడ్క్రాస్ సంస్థకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రెడ్క్రాస్ సంస్థ ప్రతినిధి మురళీ, కానిస్టేబుల్ రవినాయక్ సహాయంతో సంస్థ ఆశ్రమానికి ఆయన్ను తరలించారు. పోలీసులకు, రెడ్క్రాస్ ప్రతినిధులను స్థానికులు అభినందించారు. చదవండి: ‘నేను రైస్మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి.. -
AP: వృద్ధులకు వరం.. ‘వైఎస్సార్ కంటి వెలుగు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం వరంగా మారింది. ఈ కార్యక్రమం కింద 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. వచ్చే సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని వృద్ధులందరి కంటిచూపు సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో వైద్య, ఆరోగ్యశాఖ చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్ 13 జిల్లాల్లోని 378 వైద్యబృందాలు ఇప్పటివరకు 15,64,710 (అర్హుల్లో 27.51 శాతం) మందికి కంటిపరీక్షలు చేశాయి. 6.04 లక్షల మందికి మందుల ద్వారా నయం అయ్యే సమస్యలున్నట్లు గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 8,23,264 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 5,33,789 మందికి ఇచ్చారు. వైఎస్సార్ కంటివెలుగు పథకం మొదటి రెండు దశల్లో విద్యార్థులకు కంటిపరీక్షలు చేశారు. మొత్తం 70.36 లక్షల మంది (మొదటిదశలో 66 లక్షల మంది, రెండోదశలో 4.36 లక్షల మంది) విద్యార్థులకు కంటిపరీక్షలు నిర్వహించారు. 796 ఆపరేషన్లు చేసిన మచిలీపట్నం వైద్యుడు భాస్కర్రెడ్డి రాష్ట్రంలో 1,27,632 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యబృందాలు గుర్తించాయి. వీరందరికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించింది. రాష్ట్రంలో వారానికి సుమారు ఆరువేల మందికి ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ పథకం కింద అనేకమంది వైద్యులు అత్యధిక సర్జరీలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి 60 ఏళ్లు దాటిన 796 మందికి, 60 ఏళ్లలోపున్న 552 మందికి మొత్తం 1,348 ఆపరేషన్లు చేసి మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి వైద్యుడు భాస్కర్రెడ్డి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచారు. 964 సర్జరీలతో ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు ఎ.ఎస్.రామ్, 921 సర్జరీలతో విజయనగరం జిల్లా ఆస్పత్రి వైద్యుడు కె.ఎన్.మూర్తి తరువాత స్థానాల్లో ఉన్నారు. గుంటూరు జీజీహెచ్లో ఒక ప్రొఫెసర్, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ఏరియా ఆస్పత్రి వైద్యుడు ఇప్పటివరకు ఒక్క సర్జరీ కూడా చేయని వారిలో ఉన్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ పరిధిలో సర్జరీలు చేయని, మొక్కుబడిగా చేస్తున్న వైద్యులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సెప్టెంబర్ నాటికి లక్ష్యసాధన వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి వృద్ధులందరికీ కంటిపరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఈ లోగానే పరీక్షలు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వేగంగా పరీక్షలు పూర్తిచేయడానికి జిల్లా అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. వైద్యుల వారీగా చేస్తున్న సర్జరీలను సమీక్షిస్తున్నాం. అవసరాన్ని బట్టి వైద్యులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. – డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, జేడీ, రాష్ట్ర అంధత్వ నివారణ, కంటివెలుగు సంస్థ -
అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్పై ప్రశంసలు
SSP Sandeep Chaudhary of Srinagar helped Chana seller with 1 lakh సాక్షి, ఇంటర్నెట్: బోసి నవ్వులు చిందిస్తున్న ఈ తాతను చూడగానే.. మనసుకు ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది కదా. కానీ ఈ తాతకు వచ్చిన కష్టం తెలిస్తే.. గుండె బద్దలవుతుంది. కష్టానికి కారకులైన వారి మీద ఎక్కడాలేని కోపం వస్తుంది. కొందరు సోమరిపోతుల మాదిరి కాకుండా.. వయసు మీద పడి.. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినప్పటికి కూడా.. పని చేయడం మానలేదు ఈ తాత. రోడ్డు పక్కన కూర్చుని పల్లీ, బఠాణీలు అమ్ముకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు పల్లీలు అమ్ముతూ దాదాపు లక్ష రూపాయల వరకు పోగు చేశాడు. తాను చనిపోయాక అంత్యక్రియలకు అక్కరకు వస్తుందని ఈ మొత్తాన్ని దాచుకున్నాడు. కానీ దరిద్రులు తాత కష్టార్జితాన్ని దొంగిలించారు. దీని గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఈ విషయం ఓ ఉన్నతాధికారికి తెలిసింది. వృద్ధుడి కష్టం అతడిని కదిలించింది. దాంతో తాత పొగొట్టుకున్న లక్ష రూపాయలను తానే అందించాడు. సదరు ఉన్నతాధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివారలు.. (చదవండి: Mrs Vishnoi: నాన్న కావాలని ఉందన్నారు.. కానీ తిరిగి రాలేదు.. అయినా) జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహమాన్ అనే వృద్ధుడు రోడ్డు పక్క పల్లీలు, బఠాణీలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులు ఉన్నారో లేరే తెలియదు. ఒకవేళ ఉన్నా.. బతికున్నప్పుడు, మరణించిన తర్వాత కూడా తన వల్ల వారు ఇబ్బంది పడకూడదని భావించిన రెహమాన్.. రోడ్డు పక్కన పల్లీలు అమ్ముతూ తద్వారా వచ్చిన డబ్బును కూడబెట్టసాగాడు. ఇలా ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు దాచుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కొందరు దుండగులు రెహమాన్ అంత్యక్రియల కోసం దాచుకున్న మొత్తాన్ని దొంగిలించారు. పాపం జీవితాంతం కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము ఇలా దొంగలపాలవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు రెహమాన్. పోయిన సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకం ఏ కోశాన లేదు. అయినప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: 20ఏళ్ల అవమానాలు: బారాత్, డీజే, విందుతో వృద్ధ జంట పెళ్లి ) రెహమాన్ వ్యధ, బాధ శ్రీనగర్ సీనియర్ సూపరింటెండెంట్ పోలీసు అధికారి సందీప్ చౌదరీని కదిలించింది. రెహమాన్ వివరాలు తెలుసుకున్న సందీప్.. అతడు పొగొట్టుకున్న లక్ష రూపాయలను రెహమాన్కు అందజేశాడు. దీని గురించి శ్రీనగర్ మేయర్ పర్వైజ్ అహ్మద్ ఖాద్రీ తన ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. సందీప్ మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజనులు. Appreciative decision by Srinagar police & @Sandeep_IPS_JKP towards the old aged Channa seller to assist him with the money of one lakh that was looted from his home. Abdul Rehman had saved the laborious money for his last rites; he sells snacks and lives all alone! Salute sir pic.twitter.com/FL0tXvoUWB — Parvaiz Ahmad Qadri (@Parvaiz_Qadri) November 14, 2021 చదవండి: దారుణం: కాచుకోవాల్సిన వారే కాటికి పంపారు.. -
ఫ్రిజ్లో వృద్ధుడి శవం.. డబ్బుల్లేక మనవడే..
సాక్షి, వరంగల్ రూరల్/పరకాల: తోడుగా ఉన్న తాత మరణిం చాడు. గొడవలతో బంధువులు దూరమయ్యారు. దీంతో ఏం చేయాలో ఆ మనవడికి తోచలేదు. అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. తాత పెన్షన్ డబ్బులు వచ్చాక అంత్యక్రియలు పూర్తి చేయాలని భావించాడు. మరణించిన విషయం తెలిస్తే పెన్షన్ డబ్బులు రావేమోనని తాత శవాన్ని ఫ్రిజ్లో దాచిపెట్టాడు. కానీ మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన బైరం బాలయ్య (90)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో బాలయ్య ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. బాలయ్య కుమారుడు హరికృష్ణ భార్య ప్రమీల తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. భార్య చనిపోవడం, సోదరుల మధ్య గొడవలు ఉండటంతో కుమారుడు నిఖిల్తో కలిసి హరికృష్ణ పరకాలలోని తోరండ్ల కైలాసం కాంప్లెక్స్కు నివా సం మార్చాడు. వాస్తు చెబుతూ వచ్చిన డబ్బులతో జీవిస్తున్నాడు. అయితే బాలయ్య కామారెడ్డిలో ఉంటున్న తన ఇద్దరు కుమారులు పట్టించుకోవడం లేదంటూ భార్య నర్సమ్మతో కలిసి హరికృష్ణ దగ్గరకు వచ్చారు. రెండేళ్ల క్రితం కామారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోగా.. ఆయన కుమారుడు నిఖిల్తో కలిసి పరకాలలోనే ఉంటున్నారు. బాలయ్యకు నెలనెలా వచ్చే రూ.40 వేల పెన్షన్తో వీరి జీవితం సాఫీగానే సాగింది. సరిగ్గా ఆరు నెలల క్రితం బాలయ్య భార్య నర్సమ్మ కరోనాతో చనిపోయింది. తల్లి లేకపోవడం, మిగిలిన కుటుంబ సభ్యులు సైతం ఒకరొకరుగా దూరం కావడంతో నిఖిల్ మానసి కంగా కుంగుబాటుకు గురయ్యాడు. అయినప్పటికీ పక్షవాతంతో మంచానపడిన తాతకు అన్ని సపర్యలూ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో బాలయ్య కూడా మరణిం చాడు. అయితే గత నెలలో బాలయ్యకు వచ్చిన రూ.40 వేల పెన్షన్తో రూ.30 వేల వరకు అప్పు తీర్చడంతోపాటు ఇంట్లో ఖర్చులకు ఉపయోగించాడు. దీంతో చేతిలో డబ్బులు లేకుండా పోయింది. తాత చనిపోయిన విషయం తెలిస్తే పెన్షన్ రాదని, ఆయన అంత్యక్రియలు చేయలేనని భావించిన నిఖిల్ తాత శవానికి శాలువా కప్పి, మడతబెట్టి ఫ్రిజ్లో దాచాడు. దుర్వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్.. బాలయ్య చనిపోయిన ఆదివారం నుంచి ఇప్పటివరకు అ దేఇంట్లో నిఖిల్ ఉంటున్నాడు. శవం దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇంట్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాడు. ఏమీ ఎరగనట్టు ప్రవర్తిస్తూ ఎవరికీ విషయం తెలియ కుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో దుర్వాసన వస్తుండటంతో కాంప్లెక్స్ యజమాని కైలాసం నిఖిల్ను రెండు రోజుల క్రితం ప్రశ్నించాడు. పందికొక్కు చనిపోయిందని నిఖిల్ చెప్పడంతో వెళ్లిపోయాడు. గురువారం దుర్వాసన తీవ్రం కావడంతో అనుమానం వచ్చిన కైలాసం ఇంట్లోకి వెళ్లి ఫ్రిజ్ తెరిచి చూశాడు. లోపల శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. నిఖిల్ని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పూర్తి విషయం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. -
వృద్ధులు తక్కువగా ఉన్న రాష్రాలేవో తెలుసా?
60 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య దేశంలో భారీగా పెరుగుతోంది. 1961 నుంచి ఇందుకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే వీరి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2011 నుంచి పరిశీలిస్తే రాష్ట్రంలోనూ వీరి జనాభా పెరుగుతూ వస్తోంది. అప్పటి జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో వృద్ధుల శాతం 10.1 శాతం ఉంటే 2021కి అది 12.4 శాతానికి పెరిగింది. అదే 2031 నాటికి 16.4 శాతానికి పెరుగుతుందని అంచనా. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఆర్థిక పరిపుష్టి, మెరుగైన ఆరోగ్య సంరక్షణ.. వైద్య సౌకర్యాలేనని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎల్డరీ ఇండియా–2021 నివేదిక స్పష్టంచేసింది. తమిళనాడులో అధికంగా.. ప్రస్తుతం దేశ్యాప్తంగా వృద్ధులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు (13.6 శాతం), హిమాచల్ప్రదేశ్ (13.1 శాతం), పంజాబ్ (12.6 శాతం), ఆంధ్రప్రదేశ్ (12.4 శాతం) అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే, వృద్ధులు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ (7.7 శాతం), ఉత్తరప్రదేశ్ (8.1 శాతం), అస్సాం (8.2 శాతం) ఉన్నాయి. ఇక 2031 నాటికి కేరళలో 20.9 శాతానికి, తమిళనాడులో 18.2 శాతానికి, హిమాచల్ప్రదేశ్లో 17.1 శాతానికి, ఆంధ్రప్రదేశ్లో 16.4 శాతానికి, పంజాబ్లో 16.2 శాతానికి వీరు పెరుగుతారని అంచనా. పిల్లల సంఖ్య తగ్గుతోంది ఇక జనాభా లెక్కలను పరిశీలిస్తే దేశంలో 0–14 ఏళ్ల వయస్సుగల పిల్లల సంఖ్య 1971 వరకు పెరుగుతూ వచ్చింది. ఆ తరువాత వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇందుకు సంతోనోత్పత్తి రేటు తగ్గడమేనని తేలింది. మరోవైపు.. వ్యక్తి ఆరోగ్య సౌకర్యాల లభ్యత, పోషక స్థాయి పెరగడంతో పాటు మెడికల్ సైన్స్ టెక్నాలజీలో వేగవంతమైన పురోగతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు అనేక వ్యాధులను నియంత్రించడం తేలికైంది. దీంతో వృద్ధుల మరణాలు తగ్గి వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఫలితంగా అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఇటు పట్టణ ప్రాంతాల్లోనూ మనిషి ఆయుర్ధాయం పెరుగుతూ వస్తోంది. దేశంలో 1970–75 మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్ధాయం సరాసరిన 48 ఏళ్లుండగా.. 2014–18కు వచ్చేసరికి అది 68 సంవత్సరాలకు పెరిగింది. అదే సమయంలో పట్టణాల్లో ఆయుర్ధాయం వయస్సు 58.9 ఏళ్ల నుంచి 72.6 సంవత్సరాలకు పెరిగింది. దేశం మొత్తం మీద 2011 నుంచి చూస్తే 0–14 సంవత్సరాల వయస్సు గల జనాభా తగ్గుతూ వస్తుండగా 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతేకాక.. దేశంలోను, రాష్ట్రంలోను 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో మహిళలే అత్యధికంగా ఉండటం గమనార్హం. 2011 జనాభా లెక్కల నుంచి 2021, 2031 అంచనాల్లోనూ అటు దేశం ఇటు రాష్ట్రంలోనూ వృద్ధుల్లో మహిళల సంఖ్యే అధికం. -
మీ ఇంట్లో వృద్ధులున్నారా? అయితే, ఈ మార్పులు చేయాల్సిందే!
చలాకీగా ఉండే వయసు హరించుకుపోయి జీవిత చరమాంకానికి చేరుకునే తరుణంలో మనిషికి మానసిక స్వాంతన ఎంతో అవసరం. తన అనుకున్నవారికి తానే భారం అవుతున్నానన్న బాధ పెద్దవారికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లోవారిదే! ఇందుకోసం ఇంట్లో పెద్దల అవసరాలకు తగినట్లు కొద్దిపాటి మార్పులు చేయించడం కీలకమని డాక్టర్ల సలహా. దీనివల్ల వృద్ధులు తమ పనులు తాము చేతనైనంత వరకు సొంతంగా చేసుకుంటూ, ఒకరిపై ఆధారపడకుండా జీవించే వీలు చిక్కుతుంది. ఒకరిపై ఎక్కువగా ఆధారపడకుండా వృద్ధాప్యం గడిచేందుకు ఇంట్లో చేయాల్సిన చిన్నపాటి మార్పులను చూద్దాం! ► అవసరమైన చోట్ల వీల్చైర్ లేదా వాకర్ కోసం ర్యాంప్ ఏర్పాటు చేయాలి. ► టాయిలెట్లు, షవర్ల దగ్గర హ్యాండ్ రెయిల్స్, గ్రాబ్ బార్స్ను ఏర్పరచాలి. ► వీలుంటే మాములు టాయిలెట్ల బదులు ఒక్కటైనా రైజ్డ్ టాయిలెట్ ఏర్పాటు చేయించడం మంచిది. ► ఇంట్లో స్మోక్, హీట్ డిటెక్టర్లను ఇన్స్టాల్ చేయించాలి ►వృద్దులకు అవసరమైనంత గాలి, వెలుతురు ఇంట్లోకి వచ్చేలా అవసర వెంటిలేషన్ ఏర్పరచాలి. ►నిద్రలో నడిచే అలవాటు ఉన్న వారుంటే ఆటో సెన్సర్లను ఇన్స్టాల్ చేయించడం ద్వారా రాత్రుళ్లు వారి కదలికలపై కన్నేసి ఉంచొచ్చు. ►ఇంట్లో అనవసరమైన ఫర్నిచర్, సామగ్రి అడ్డదిడ్డంగా లేకుండా సర్దుకోవాలి. ►టెలిఫోన్ , ఇంటర్నెట్ తదితర వైర్లేవీ కాళ్లకు అడ్డం తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►ఇంట్లో కరెంట్ కనెక్షన్లు షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్త వహించాలి. వీలయినంత వరకు ఎవరో ఒకరు పెద్దవారిని గమనిస్తూ ఉండడం, వారికి వేళకు సరైన ఆహారాన్ని అందించడం, మందులు వాడుతుంటే మర్చిపోకుండా సమయానికి అందించడం, వారి మాటలకు విసుక్కోకుండా వారితో కొంత సమయం గడపడం, వీలైతే వారికి ఏదైనా వ్యాపకం కల్పించడం వంటి చర్యలు వృద్ధాప్యంలో ఉన్నవారికి ఊరటనిస్తాయి. ఒకవేళ తప్పనిసరైన పరిస్థితుల్లో పెద్దవారిని వృద్ధాశ్రమాల్లో చేర్చాల్సివస్తే సదరు ఆశ్రమాల్లో పైన పేర్కొన్న అంశాలున్నాయో, లేదో పరిశీలించి ఎంచుకోవడం మంచిది. -
సూపర్ సే ఊపర్..పెద్దాయన స్టెప్స్కు నెటిజన్లు ఫిదా!
సాక్షి, హైదరాబాద్: కుర్రకారే డాన్స్ చేయాలా? వయసు పైబడితే ఏమి..అంటూ అదరిపోయే స్టెప్పులతో ఈ మధ్య సోషల్ మీడియా సంచలనం రేపుతున్నారు. తాజాగా ఓ పెద్దాయన ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అని మరోసారి నిరూపించారు. యూత్ఫుల్ బాలీవుడ్ సాంగ్కు ఆకట్టుకునే డ్యాన్స్తో ఇరగ దీశారు. ఈ డ్యాన్సింగ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. 2002 నాటి బాలీవుడ్ హిట్ మూవీ ‘ క్యా దిల్ నే కహా’ లోని ‘సజ్నా తేరే ప్యార్ మే’ సాంగ్కు పెద్దాయన తన డ్యాన్స్ మూమెంట్స్తో అదరగొట్టేశారు. దీంతో సూపర్సే ఊపర్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడిది, డ్యాన్స్ చేసిన ఆయన ఎవరు లాంటి వివరాలపై స్పష్టత లేదు. కానీ ఈ సరదా సరదా వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. -
20ఏళ్ల అవమానాలు: బారాత్, డీజే, విందుతో వృద్ధ జంట పెళ్లి
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లో హింస, మహిళలపై దారుణాలకు సంబంధించిన కథనాలనే ఎక్కువగా వింటూ ఉంటాం కదా. అయితే యూపీలోని ఉన్నావ్ జిల్లాలో ఒక వృద్ధ జంటకు వైభవంగా వివాహం జరిపించిన ఘటన ఒకటి ఆసక్తికరంగా మారింది. అంతేకాదు దాదాపు 20 సంవత్సరాలు సహజీవనం తరువాత ఈ పెళ్లి జరగడం మరో విశేషం. మరో విశేషం ఏమిటంటే, పెళ్లి ఖర్చులన్నీ గ్రామ సర్పంచ్, ఇతర గ్రామస్తులు భరించడం. దీంతో ముచ్చటైన పెళ్లి సందడితో అధికారికంగా ఒక్కటైన ఈ జంటకు అతిధులందరూ అభినందనలు తెలిపారు ఈ స్టోరీలోని వృద్ధ దంపతులు, సారీ నూతన వధూవరుల పేర్లు నరేన్ రైదాస్(60), రామ్రతి (55). వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరిద్దరూ 2001నుండి కలిసి జీవిస్తున్నారు. అయితే వివాహం చేసుకోకుండా కలిసి కాపురం చేయడంపై గ్రామస్తులనుంచి చాలా అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా తమ జీవనాన్ని కొనసాగించారు. వీరికి అజయ్ అనే 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చివరికి కుమారుడితోపాటు, గ్రామపెద్దల ప్రోత్సాహంతో అధికారికంగా ఆ పెళ్ళి వేడుక కాస్తా ముగించేందుకు అంగీకరించారు. తద్వారా గత రెండు దశాబ్దాలుగా తాము పడుతున్న వేదనకు, కొడుకు ఎదుర్కొంటున్న అవమానాలను చెక్ పెట్టాలని ఇద్దరూ భావించారు. గ్రామ పెద్ద రమేశ్కుమార్, సామాజిక కార్యకర్త ధర్మేంద్ర బాజ్ పేయీ కలిసి గంజ్ మొరాదాబాద్, రసూల్పూర్ రూరి గ్రామంలో నరైన్, రామ్రతిని వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. వివాహానికి ముందు వీరు గ్రామంలోని బ్రహ్మదేవ్ బాబా ఆలయాన్ని సందర్భించి ఆశీస్సులు తీసుకున్నారు. అంతేనా బ్యాండ్ బాజాలతో బారాత్, డీజేతో సందడి చేశారు. అనంతరం చక్కటి విందును కూడా ఏర్పాటు చేశారు. ముదిమి వయసులో,అదీ షష్టిపూర్తి చేసుకోవాల్సిన తరుణంలో కొడుకు సమక్షంలో ఒక్కటైన ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు అందజేశారు. -
క్షణాల్లో కదిలిన సీఆర్పీఎఫ్ సిబ్బంది, షాకింగ్ వీడియో
సాక్షి,లక్నో: రెప్పపాటులో మృత్యుముఖం నుంచి ఒక వ్యక్తిని కాపాడిన షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్లాట్ఫాంల వద్ద అప్రమత్తంగా ఉండాలని, , కదులుతున్న రైళ్లను ఎక్కొద్దు, దిగవద్దు అంటూ పదే పదే ర్వైల్వే శాఖ హెచ్చరిస్తున్నా, చాలామంది ప్రమాదం అంచున నిలబడుతున్నారు. కానీ రక్షణ సిబ్బంది మెరుపు వేగంతో కదిలి వారిని కాపాడుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్నఇలాంటి షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించి, కాపాడిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెప్పపాటు నిర్లక్ష్యం నిండు జీవితాన్ని బలితీసుకుంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా చూశాం. గుండెల్లో రైళ్లు పరిగెట్టించే ఇలాంటి వీడియోలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయినా పట్టించుకోకుండా చాలామంది అదే నిర్లక్క్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఆందోళన పుట్టిస్తోంది. తాజా ఘటన వివరాల్లోకి వెళితే..ఘజియాబాద్ రైల్వే స్టేషన్లో గోమతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫాంపైకి వస్తోంది. అంతలోనే ఒక వృద్ధుడు రైల్లోంచి దిగుతూ పట్టు తప్పి జారి పోయాడు. దీన్ని గమనించిన ఆర్పీఎఫ్ అధికారి శరవేగంతో ఆ వృద్ధుడిని సురక్షితంగా కాపాడారు.వృద్ధుడు రైల్లోంచి జారి పట్టాలపై పడిపోతున్న దృశ్యం అక్కడి వారిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కానీ పోలీసులు సకాలంలో స్పందించడంతో లిప్తపాటులో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ప్లాట్ఫాంపై ఉన్న వారంతా ఊపిరి పీల్చు కున్నారు. మరోవైపు చాకచక్యంగా వ్యవహరించి వృద్ధుడిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ త్రిలోక్ శర్మ, శ్యామ్ సింగ్లను పొగడ్తలతో ముంచెత్తారు. गाज़ियाबाद रेलवे स्टेशन पर एक बुजुर्ग यात्री को मौत के मुँह से बचाया @RPF_INDIA के कॉन्स्टेबल त्रिलोक शर्मा और कांस्टेबल श्याम सिंह को रेलवे पुलिस ने इस काम के लिए सराहा है pic.twitter.com/FwCsjvrQzC — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 6, 2021 -
Mallanna Sagar: మనోవేదనతో చితి పేర్చుకుని దూకేశాడు
సాక్షి, సిద్ధిపేట్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మల్లన్న సాగర్లో ఇళ్లు కోల్పోయి ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధుడు చితి పేర్చుకుని, ఒంటిపై కిరోసిన్ పోసుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తొగుట మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తొగుట మండలం వేములగాట్కు చెందిన మల్లారెడ్డి భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా కాలం వెల్లదీస్తున్నాడు. కూతురి కుమారుడు(మనవడు) అప్పుడప్పుడు తాత దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. కొన్ని నెలల క్రితం మల్లారెడ్డి ఉన్న ఇంటి జాగా మొత్తం మల్లన్న సాగర్ ప్రాజెక్టులో పోయింది. ఈ నేపథ్యంలో మృతుడు డబుల్ బెడ్ రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇంటిని మంజూరు చేసి ఒంటరి వాడన్న కారణంతో వెనక్కు తీసుకున్నారు. ఇంటిని ఖాళీ చేయించారన్న మనో వేదనతో గురువారం అర్థరాత్రి తను నివాసం ఉండే ఇంట్లో చితి పేర్చుకుని..కిరోసిన్ పోసుకుని అందులో దూకాడు. దీంతో సజీవ దహనమయ్యాడు. మల్లారెడ్డి మనవడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం: కాచుకోవాల్సిన వారే కాటికి పంపారు..
మందస(శ్రీకాకుళం జిల్లా): మనవళ్లు తనవాళ్లు కాలేకపోయారు. ఆస్తిపై ప్రేమ పెంచుకున్న వారు తాతయ్యపై అభిమానం చూపలేకపోయారు. కష్టం వస్తే కాచుకోవాల్సిన వారే కాటికి దారి చూపారు. కదల్లేని వయసు లో ఉన్న తాతను నాటు తుపాకీతో కాల్చి చంపేశారు. మందస మండలం చికిడిగాం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పారిగ కమలొ(85) అనే వృద్ధుడు చికిడిగాంలో నివాసముంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తె లు రొంబ, జయంతి, సుకుంతల, ఒక కుమారుడు రమ్మో ఉన్నారు. రమ్మోకు ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్య జమ్మకు ముగ్గురు కొడుకులు బుడ్డు, లక్ష్మణ్, దేవరాజులు ఉన్నారు. రెండో భార్య మాధవికి మనోజ్ అనే కుమారుడు ఉన్నారు. మనోజ్ ప్ర స్తుతం అసోంలో ఉంటున్నాడు. కమలొకు ఏడెకరాల భూమి ఉంది. ఈ ఆస్తి విషయంలో రమ్మో తన తండ్రితో ఎప్పుడూ గొడవ పడుతుండేవారు. మనవళ్లు కూడా తాతతో నిత్యం తగాదా పడుతుండేవారు. దీ నిపై కోర్టుకు కూడా వెళ్లారు. కేసును కమలొ గెలిచా రు. అయితే ఆస్తి గొడవల కారణంగా కమలొ ఊరి లోనే ఉన్న చిన్నకుమార్తె సుకుంతల ఇంటిలో ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఇంటి నుంచి తుపాకీ పేలి న శబ్ధం రావడంతో బయట నిద్రిస్తున్న సుకుంతల కూతురు సీత లోపలకు వెళ్లి చూసింది. కమలొ రక్తపు మడుగులో గిలగిలలాడుతూ కనిపించడం, ఆయన ఛాతీపై బుల్లెట్ గాయం ఉండడంతో పెద్దగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికే కమలొ మృతి చెందారు. తాను ఇంటిలోపలకు వెళ్లేటప్పటికి అక్కడ బుడ్డు, లక్ష్మణతో పాటు రాయగడ బ్లాక్, గారబంద పంచాయతీ లోవ గ్రామానికి చెందిన సవర బుడ్డు(24) పారిపోతూ తనకు కనిపించారని సీత పోలీసులకు తెలిపారు. ఆస్తిని కుమార్తెలకు ఇచ్చేస్తాడన్న అనుమానంతోనే మనవళ్లు నాటు తుపాకీతో ఈ దారుణానికి పాల్పడ్డారని ఆమె మందస పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాస్త ఆలస్యంగా.. చికిడిగాంలో హత్య జరిగిందన్న సమాచారంతో కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, సోంపేట సీఐ డీవీవీ సతీష్కుమార్, మందస ఎస్ఐ బి.రామారావులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీకాకుళం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్టీమ్ వచ్చాయి. డాగ్ స్క్వాడ్ నిందితులు తిరిగిన ప్రాంతాల్లోనే తిరగడంతో పోలీ సుల అనుమానం బలపడింది. క్లూస్, క్రైమ్ టీమ్లు ఘటనా స్థలంలో బుల్లెట్ను స్వాధీనం చేసుకున్నా యి. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించాయి. అయితే ఘటన ఆదివారం రాత్రి జరిగినా పోలీసులు అక్కడకు వెళ్లేందుకు కాస్త సమయం పట్టింది. చికిడిగాం కాస్త అడవుల్లో ఉండడం, మావోయిస్టులు సోమవారం బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు ఈ ప్రాంతానికి వెళ్లడానికి వెనుకడుగు వేశారు. భారీ బందోబస్తు మధ్య సంఘటనా స్థలానికి పోలీసు అధికారులు వెళ్లి దర్యాప్తు చేశారు. సోంపేట సీఐ సతీష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను పట్టుకుంటామని డీఎస్పీ శివరామిరెడ్డి చెప్పారు. చదవండి: ఏళ్ల తరబడి తిష్ట: కదలరు.. వదలరు! అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్కోర్టులే.. -
కరోనా టీకా: జనాభాలో యవ్వనులే అధికం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో ఆ వయసు వారు 2.62 కోట్ల మంది ఉంటారని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 18-44 ఏళ్ల వయస్కులు 1.82 కోట్ల మంది ఉంటారని, వారు కొత్తగా వ్యాక్సిన్కు అర్హులవుతారని అంచనా వేసింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారు 80 లక్షల మంది ఉండగా వారందరికీ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అందులో ఇప్పటికే 28 లక్షల మందికి టీకా వేశారు. ఇక 18-45 ఏళ్ల మధ్య వయసులోని 1.82 కోట్ల మందికి మే 1 నుంచి వ్యాక్సిన్ వేస్తారు. 45 ఏళ్లు పైబడిన వారికి ఎప్పటిలాగే ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తుంది. కానీ 18-45 లోపు వయసు వారి నుంచి నిర్దిష్ట రుసుము తీసుకొని టీకాలు వేసేందుకు ప్రైవేటు సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ మందికి... కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఒక కుటుంబంలో ఎవరికైనా వస్తే అందరికీ వ్యాపించే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్లో ఎక్కువగా యువత వైరస్ బారిన పడుతోంది. ఉపాధి, ఉద్యోగాల్లో ఆ వయసువారే ఎక్కువగా ఉండటం, పైగా చాలా మంది నిర్లక్ష్యం వహించడంతో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలే అందుబాటులో ఉండటంతో వాటి కొరత వల్ల డోస్లు పూర్తిస్థాయిలో రాష్ట్రానికి రావడం లేదు. దీంతో అనేక ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో నిల్వలు లేక ప్రజలను వెనక్కు పంపుతున్నారు. అన్ని కంపెనీలకు అనుమతి ఇవ్వడం వల్ల టీకాలు విరివిగా అందుబాటులోకి వస్తాయి. పైగా తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకాలు ఇవ్వొచ్చు. రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ప్రభుత్వ యంత్రాగానికి ఉంది. ఆ ప్రకారం జరిగితే తెలంగాణలో ఇప్పటివరకు వేసిన వారిని మినహాయిస్తే కేవలం 23 రోజుల్లోనే 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయవచ్చు. ఎలాంటి కొరత లేకుండా టీకాలు సరఫరా అయితే మేలోనే టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉచితమా.. కాదా? ఈ ఏడాది జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవగా తొలుత వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్లైన్ వర్కర్లకు వేశారు. ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45-59 ఏళ్ల వయసులో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వేశారు. ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఇస్తున్నారు. అందులో వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా టీకాలు ఇచ్చారు. 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రం ప్రభుత్వంలో ఉచితంగా వేస్తుండగా ప్రైవేటులో ఒక డోస్కు రూ.250 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు 18-44 ఏళ్ల మధ్య వయసులోని వారికి ఉచితంగా ఇవ్వబోమని కేంద్రం ప్రకటించగా ఆ వయసు వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా వేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని వైద్య వర్గాలు తెలిపాయి. అలాగే మే ఒకటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని కేంద్రాల్లో టీకా వేయాలన్న దానిపైనా అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో మే ఒకటో తేదీ నుంచి వేసే టీకాపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉండాలో కూడా కసరత్తు చేస్తున్నారు. ఆస్పత్రులకు రాని వారికి ఇళ్లకు వెళ్లి టీకాలు వేసే కార్యక్రమం ఏమైనా ఉంటుందా అనే దానిపైనా నిర్ణయం తీసుకోనున్నారు. -
జనంలోకి వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాన్య ప్రజలకు కరోనా టీకా కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అవుతుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాధాన్యంగా 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా అందజేస్తామని ఆయన ప్రకటించారు. వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్రెడ్డితో కలసి డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సోమవారం లాంచనంగా సాధారణ జనానికి టీకా కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఎంపిక చేసిన 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు. ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,200 మందికి టీకా వేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్లోనే ప్రారంభం అవుతుందని, రెండో తేదీ నుంచి పూర్తిస్థాయిలో టీకా కార్యక్రమం ఉంటుందని వివరించారు. మున్ముందు వెయ్యి కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. రెండు ప్రాధాన్య వర్గాలకు నాలుగైదు నెలలపాటు టీకా కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. రెండో డోస్ కూడా అదే కేంద్రంలో వేస్తామన్నారు. ఆ మేరకు షెడ్యూల్ ఖరారు చేస్తామని వెల్లడించారు. వెంటనే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీచేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సాధారణ ప్రజల్లో 50 లక్షల మంది రెండు ప్రాధాన్య వర్గాలకు టీకాలు వేస్తామన్నారు. ‘ధ్రువీకరణ’ సమర్పించాలి... దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎంబీబీఎస్ డాక్టర్ లేదా ఆపై స్థాయి వైద్యుడి నుంచి తాము జారీ చేసే నమూనా ఆధారంగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దాన్ని కోవిన్ యాప్లో అప్లోడ్ చేశాకే టీకా వేస్తామని తెలిపారు. 20 రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తామన్నారు. లబ్ధిదారులు వారంలోగా యాప్లో రిజిస్ట్రేషన్తోపాటు దగ్గరలో ఉన్న బూత్కు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకొని టీకా పొందవచ్చన్నారు. అన్ని టీకాలు సురక్షితమేనని, ఎవరికి ఏ కంపెనీ టీకా ఇస్తామనేది బయటకు వెల్లడించబోమని ఆయన చెప్పారు. 45–59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా అనెక్జర్–1బీ కాపీ ఇంటర్నెట్లోనూ, కోవిన్ యాప్లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆ ఫార్మాట్ను ఆధారం చేసుకొని వైద్యులు సర్టిఫికేట్ ఇస్తారని శ్రీనివాసరావు వివరించారు. కోవిన్ 2.0 వెర్షన్ యాప్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం నుంచే అందుబాటులోకి వచ్చిందని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సోమవారం టీకా ఇస్తామన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి కూడా అదే రోజు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ప్రతి సెంటర్లోనూ సాధారణ ప్రజలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులకు కూడా టీకా వేస్తామన్నారు. నిర్దేశించిన రోజున టీకా వేయించుకోలేనివారు తదుపరి రీ షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు. జ్వరం లేదా ఒళ్లు నొప్పులు సాధారణమే... టీకా వేసుకున్నాక జ్వరం లేదా ఒళ్లు నొప్పులు ఉండటం చాలా మందిలో సహజమేనని డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఎవరికైనా టీకా వేసిన అరగంటలోనే తీవ్ర దుష్ప్రభావాలు కనిపిస్తాయని, కాబట్టి వారు అరగంటపాటు తమ పరిశీలనలోనే ఉండాలన్నారు. ఇంటికి వెళ్లాక ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సమీప ఆసుపత్రికి వెళ్లాలని, లేకుంటే 104 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. అన్ని వసతులున్న ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే టీకా వేస్తామన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బుధ, ఆదివారాల్లో టీకాలు వేయరని, ప్రైవేటులో మాత్రం వారమంతా వేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. దశలవారీగా కేంద్రాల పెంపు... వ్యాక్సినేషన్ ప్రక్రియ కొద్ది సెంటర్లతో ప్రారంభించి దశలవారీగా విస్తరిస్తామని డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. మున్ముందు 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ), 19 ఏరియా ఆసుపత్రులు, 29 జిల్లా ఆసుపత్రుల్లో, 9 బోధనాసుపత్రుల్లో కరోనా టీకా వేస్తామన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న 215 ప్రైవేటు ఆసుపత్రులను టీకా వేసేందుకు గుర్తించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా ఉచితమని, ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధర రూ. 150, సర్వీస్ చార్జీ రూ. 100 వరకు వసూలు చేసుకోవడానికి కేంద్రం అనుమతించిందన్నారు. అంతకంటే ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదన్నారు. అందుబాటులో డాక్టర్: డీఎంఈ టీకా కేంద్రాల్లో లబ్దిదారులు వేచి ఉండే గది వద్ద ఒక డాక్టర్, టీకా వేశాక అరగంట సేపు పరిశీలనలో ఉండే చోట మరో డాక్టర్ అందుబాటులో ఉంటారని డీఎంఈ రమేష్రెడ్డి తెలిపారు. రెండో ఫేజ్ కరోనా వ్యాక్సిన్ రెండు ప్రాధాన్య వర్గాలతో ప్రారంభం అవుతుందన్నారు. తొలుత కొన్నిచోట్ల మాత్రమే టీకా ప్రారంభిస్తామన్నారు. ఒకేసారి జనం పోటెత్తకుండా ఉండేందుకు కొన్ని సెంటర్లలోనే ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు అంగీకరించాయన్నారు. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ప్రభుత్వమే టీకాలను సరఫరా చేస్తుందన్నారు. రాష్ట్ర టీకా కేంద్రం నుంచి జిల్లా కోల్డ్చైన్ పాయింట్లకు వ్యాక్సిన్లను సరఫరా చేసి వారికి ఇస్తామన్నారు. అంతకుముందే వారు టీకాలకు డబ్బులు చెల్లించి రసీదు తీసుకుంటారని, ఆ మేరకు వాటికి పంపిణీ జరుగుతుందన్నారు. 29–42 రోజుల మధ్య రెండో డోసు కరోనా రెండో డోసును తొలి డోసు తీసుకున్న 28వ రోజున లబ్ధిదారులు తీసుకోవాలన్న నిబంధన ఇప్పటివరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం దాన్ని తాజాగా మార్చింది. తొలి డోసు వేసుకున్న 29వ రోజు నుంచి 42వ రోజు మధ్య ఎప్పుడైనా లబ్ధిదారులు రెండో డోసు తీసుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆసుపత్రికి రావల్సిందేనని తేల్చిచెప్పింది. ఎవరైనా ఆసుపత్రికి వచ్చే పరిస్థితి లేకపోతే వారిని అంబులెన్స్లో తీసుకురావాలని సూచించింది. 50 లక్షలు: టీకాలు పొందబోయే సాధారణ ప్రజానీకంలోని రెండు ప్రాధాన్య వర్గాల వారి సంఖ్య. 4.43 లక్షలు: జనవరి 16 ఇప్పటివరకు టీకా వేసుకున్న వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్ల సంఖ్య. (మొదటి డోస్ 2.95 లక్షల మంది, రెండో డోస్ 1.47 లక్షల మంది) 215: టీకా వేసేందుకు గుర్తించిన ఆరోగ్యశ్రీ జాబితాలోని ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య. టీకాలు ఇచ్చే కేంద్రాలు... 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ) 19 ఏరియా ఆసుపత్రులు 29 జిల్లా ఆసుపత్రులు 9 బోధనాసుపత్రులు 215 ప్రైవేటు ఆసుపత్రులు నేటి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇలా... ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 45 ప్రైవేటు ఆసుపత్రులు 48 ప్రభుత్వ ఆసుపత్రులు ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,600 మందికి టీకాలు -
డ్రైనేజీలో తండ్రి అస్థికలు కలిపిన కొడుకు.. కారణం..
లండన్ : జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్న సామెతకు చక్కటి ఉదాహరణ బ్రిటన్కు చెందిన కెవిన్ మెక్గ్లిన్చి అనే 66 ఏళ్ల వ్యక్తి. పబ్ అంటే ఇష్టపడే ఈ పెద్ద మనిషి తన చివరి కోరికతో ఫ్యామిలీని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కెవిన్ అడిగింది పిచ్చి కోరికైనా.. చివరి కోరిక కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని దాన్ని నెరవేర్చింది ఫ్యామిలీ. వివరాలు.. కెవిన్ మెక్గ్లిన్చికి కోవెంట్రీలోని ‘హోలీ బుష్’ పబ్ అంటే ఎంతో ఇష్టం. ప్రతీ రోజు అక్కడికి వెళ్లేవాడు. చల్లగా ఓ గ్లాసు బీరు పుచ్చుకునేవాడు. చావు దగ్గర పడ్డ కొద్దిరోజుల ముందు కుటుంబసభ్యుల్ని ఓ పిచ్చి చివరి కోరిక కోరాడు. తను చనిపోయిన తర్వాత అస్థికలను పబ్ ముందున్న డ్రైనేజీలో కలపాలన్నాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత అతడి కోరికను అర్థంచేసుకున్నారు. మొదటి జయంతి రోజున కెవిన్ కుమారుడు ఓవెన్, కూతురు కాస్సిడీ ఇతర కుటుంబసభ్యులు హోలీబుష్ పబ్ దగ్గరకు చేరుకున్నారు. కెవిన్ మెక్గ్లిన్చి, ఓవెన్, కాస్సిడీ ఓవెన్ తండ్రి అస్థికలను ఓ గ్లాసు బీరులో కలిపి, దాన్ని పబ్ముందున్న డ్రైనేజీలో పారబోశాడు. దీంతో తండ్రి చివరి కోరిక తీరింది. దీనిపై ఓవెన్ మాట్లాడుతూ.. ‘‘ మా నాన్నకు హోలీ బుష్ పబ్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతీ రోజు అక్కడికి వెళ్లేవాడు. అక్కడి డ్రైనేజీలో తరచూ ఏదో ఒకటి పాడేసేవాడు. అవి ఎలాంటివంటే జుట్టు, గోర్లు లాంటివి. డ్రైనేజీలో ఆయన తన అస్థికలు ఎందుకు కలపమన్నారంటే.. మేము అటువైపు వెళ్లిన ప్రతీసారి గుర్తుకురావాలన్న ఉద్దేశ్యంతో’’ అని పేర్కొన్నారు. చదవండి : ‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ మీకు!’ ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు! -
84 ఏళ్ల కోపిష్టి వృద్ధుడు.. భార్యను చంపి..
ముంబై : కాటికి కాళ్లు చాపిన వయసులో కర్కశంగా ప్రవర్తించాడో భర్త. భార్యను కత్తితో పొడిచి చంపి, ఇంట్లోనే నిప్పంటించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని డోంబివ్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బలిరామ్ పాటిల్(84) అతడి భార్య పార్వతీ, కుటుంబసభ్యులతో కలిసి డోంబివ్లి, పాండురంగావాడీలోని తమ బంగ్లాలో నివాసం ఉంటున్నారు. బలిరామ్ ముక్కోపి, ప్రతీ చిన్న విషయానికి సీరియస్ అయ్యేవాడు. దీంతో భార్యతో ఎప్పుడూ గొడవపడేవాడు. ఆదివారం తెల్లవారుజామున కూడా భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన బలిరామ్ భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ( మహిళను వివస్త్రను చేసి.. వేళ్లు విరగ్గొట్టి..) అనంతరం ఆమె మృతదేహానికి నిప్పంటించి ఇంట్లోంచి పరారయ్యాడు. ఉదయం 8 గంటల సమయంలో వృద్ధుల గదిలోంచి పొగలు రావటం గుర్తించింది అతడి కోడలు. వెంటనే ఇంట్లోవారికి విషయం చెప్పింది. వారంతా తలుపులు బద్ధలు కొట్టి చూడగా మంచంపై సగం కాలిపోయి ఉన్న పార్వతి మృతదేహం కనపడింది. బలిరామ్ కూడా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి
భోపాల్: వారంతా వయసు పైబడిన వృద్ధులు.. సంతానానికి బరువయ్యారో.. లేక నా అన్న వారు ఎవరు లేరో తెలియదు.. ఉండటానికి ఇళ్లు లేదు. పొద్దంతా వీధుల వెంట తిరుగుతూ.. రాత్రికి షాపుల ముందు.. రోడ్డు పక్కన తల దాచుకుటారు. వారి పట్ల దయ చూపాల్సిన ప్రభుత్వం కళ్లెర్ర చేసింది. ఇలాంటి వారి వల్ల నగర ప్రతిష్ట దెబ్బ తింటుందని భావించి.. అత్యంత అమానవీయ రీతిలో వారిని ఓ మున్సిపాలిటీ బండిలో తీసుకెళ్లి ఊరి బయట వదిలేశారు. చలిలో ఆ ముసలి ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ ఏటు వెళ్లలేక అవస్థపడ్డ తీరు వర్ణానాతీతం. వీరి అవస్థ చూసిన గ్రామస్తులు సిబ్బంది తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో వారిని తిరిగి నగరంలోకి తీసుకెళ్లారు. ఇక ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు ప్రభుత్వ అధికారిపై దుమ్మెత్తిపోశారు నెటిజనులు. దెబ్బకు దిగి వచ్చిన ప్రభుత్వం ఆ ఉన్నతాధికారిని సస్పెండ్ చేసింది. గుండెతరుక్కుపోయే ఈ సంఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. (చదవండి: కూతురి కోసం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో) ఆ వివరాలు.. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతాప్ సోలంకి డిప్యూటి కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సోలంకి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది నగరంలో ఇళ్లు లేకుండా రోడ్డు పక్కన నివసించే వారిని గుర్తించి నగర శివార్లలోని గ్రామం సమీపంలో విడిచిపెట్టారు. ఇలా తరలించిన వారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. మున్సిపల్ సిబ్బంది వీరందరిని ఓ ట్రక్కులో ఎక్కించి.. గ్రామం సరిహద్దులో వదిలేశారు. పాపం చలిలో వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక, దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇక అధికారుల చర్యలను నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేశారు. దాంతో మున్సిపల్ అధికారులు వారిని తిరిగి సిటీలోకి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక మున్సిపల్ సిబ్బంది తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతాప్ సోలంకితో సహా ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇక జిల్లా కలెక్టర్ ఆ వృద్ధుల బాగోగులను చూసుకోవాల్సిందిగా సూచించారు. ఈలాంటి చర్యలను ఏ మాత్రం సహించబోనని హెచ్చరించారు. आज इंदौर में नगर निगम कर्मचारियों द्वारा वृद्धजनों के साथ अमानवीय व्यवहार के संबंध में मुझे जानकारी मिली। इस मामले में जिम्मेदार नगर निगम उपायुक्त सहित दो कर्मचारियों को तत्काल प्रभाव से निलंबित करने और कलेक्टर इंदौर को बुजुर्गों की समुचित देखभाल करने का निर्देश दिया है। — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 29, 2021 -
ఆ అంకుల్ దగ్గర ఓ బ్యాగ్ కొనడం మర్చిపోకండి!
వృద్ధాప్యం శాపంలా భావిస్తూ కాటికి కాళ్లు చాపుకుని రోజులు వెళ్లబుచ్చుతుంటారు చాలా మంది. అతి తక్కువమంది మాత్రమే దేవుడు ఆయుష్షును బోనస్లా ఇచ్చాడు అనుకుంటూ ఉన్న జీవితాన్ని అర్ధవంతంగా మలుచుకుంటారు. అలా అర్థవంతంగా జీవిస్తున్న జోషి అనే 87 ఏళ్ల వ్యక్తి కథ ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పడేసే గుడ్డ పీలికలతో సంచులను తయారు చేసి, వాటిని విక్రయిస్తూ ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటున్నాడు. అంకుల్ జోషి.. ముంబైలోని డొంబివాలిలో ఈ తాత చేతి సంచులను అమ్ముతూ కనిపిస్తుంటాడు. స్వశక్తిపై జీవిస్తున్న జోషి కథను ట్విట్టర్ యూజర్ గౌరీ వెలుగులోకి తెచ్చారు. ‘అంకుల్ జోషి’ వయసు 87. అతను అమ్మే ఒక్కో సంచి రూ .40 నుండి రూ. 80 మధ్యలో ఉంటుంది. సోఫా, కర్టెన్ తయారీదారులనుంచి చిరిగిన క్లాత్లను సేకరిస్తాడు. వాటిని జాగ్రత్తగా ఒక్కోటి జత చేస్తూ సంచులను కుడతాడు. అతను డోంబివాలి ఫడేకే రోడ్డున కూర్చుని ఉంటాడు. ఎవరైనా అటుగా వెళితే ముంబై జోషి అంకుల్ను కలిసి ఒక బ్యాగ్ కొనడం మాత్రం మర్చిపోవద్దు’ అని తన ట్వీట్ ద్వారా సందేశం ఇచ్చారు గౌరి. వయసు పైబడినా ఎవరిమీదా ఆధారపడకుండా చేతి సంచులను తయారుచేస్తూ, వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తున్న జోషి అంకుల్ నేటి తరాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
వైరల్: ప్రేమ ఎంత మధురమో చూడండి..
ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఏ వయసులోని వారైనా తమ ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్త పరుస్తుంటారు. ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమిస్తున్నాను అని చెప్పడమే కాదు. వాళ్లకు కావాల్సిన దానిని ఇచ్చి మన ప్రేమను తెలియ జేయవచ్చు. మన ఇంట్లో వాళ్లకు లేదా ఇష్టపడేవాళ్లకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి వాళ్లను సర్ప్రైజ్ చేయాలనుకుంటాం ఆ క్షణంలో వాళ్ల ముఖంపై కలిగే చిరునవ్వు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తాజాగా ఓ వ్యక్తి తన భార్యకు ఇచ్చిన గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇక్కడ ఆ జంట నవ దంపతులు కాదు.. వారికి పెళ్లి అయ్యి 67 సంవత్సరాలు అవుతోంది. (భర్త లేడు: కొడుకును పెళ్లాడిన తల్లి?) ఓ వృద్ధుడు తన భార్యకు చిన్న గిఫ్ట్ బాక్స్ను అందించాడు. ఆమె ఆశ్చర్యంగా దానిని తీసుకొని తెరిచి చూడగా షాక్కు గురైంది. అందులో అచ్చం ఆమె నర్సింగ్ హోమ్లో పోగొట్టుకున్న పెళ్లినాటి ఉంగరం లాంటిదే ఉంది. దీన్ని చూసిన వృద్ధురాలు ఆనందంలో తేలిపోయింది. అయితే తన భార్య పెళ్లి ఉంగరం పోయిందని తెలుసుకున్న అతడు ఆమెకు కొత్త డైమండ్ ఉంగరాన్ని కొని తెచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బుధవారం ఓ మీడియా తన ట్విటర్లో పోస్టు చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 36 వేల మంది చూడగా.. అనేక మంది నెజిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘నిజమైన ప్రేమకు అంతం ఉండదు.. ఈ వీడియో చూస్తుంటే కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు.’ అంటూ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (వైరల్: టాయిలెట్లోకి పాము ఎలా వచ్చింది!) Man surprises his wife of 67 years with a new diamond ring after she lost her wedding ring at the nursing home pic.twitter.com/3ovKiODGlP — Zero Gravity Media (@zerogravityhxp) August 18, 2020 -
చెప్పిన కూర వండలేదని..
కాశీబుగ్గ: డబ్బై ఏడేళ్ల వయసు.. ఎన్నో కష్టాలు చూసి ఉంటారు. మరెన్నో అనుభవాలు మూటగట్టుకుని ఉంటారు. ఏడు దశాబ్దాల జీవితంలో ఎనలేని ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు. కానీ క్షణికావేశం ముందు ఆ అనుభవం ఎందుకూ కొరగాకుండా పోయింది. ఇంట్లో తాను అడిగిన కూర వండలేదని ఓ వృద్ధుడు ప్రాణం తీసుకున్నారు. పలాసలో గురువారం జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. మరోవైపు కరోనా కారణంగా కంటైన్మెంట్ జోన్లలో ఉంటూ బయటకు వెళ్లలేకపోతున్న కొందరి మానసిక స్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పలాస 18వ వార్డు పరిధిలోని అన్నపూర్ణ వీధికి చెందిన బెల్లాల ఆంజనేయులు (77) గురువారం ఉదయం నేలబావిలో దూకి మరణించారు. గురువారం పప్పు వండాలని ఆంజనేయులు ఇంట్లో భార్య నాగరత్నంకు చెప్పారు. అయితే ఆమె వండకపోవడంతో కోపోద్రిక్తుడై క్షణికావేశంలో సమీపంలోని నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి కుమారుడు ఉన్నాడు. కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు సంఘట నా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్యతో తగాదా పడి ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
మలి సంధ్యలో మరణ శాసనం.. కారణాలేమిటో..?
కాయాకష్టం చేసి కుటుంబాన్ని పోషించుకున్న ఇంటి పెద్దలు.. మలి వయసులో మనుమలు, మనువరాళ్లు, కొడుకులతో సుఖసంతోషాలతో ఉండాల్సిన వారు ఆత్మహత్య చేసుకుంటూ కుటుంబానికి శోకం మిగిల్చుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 రోజుల వ్యవధిలో దాదాపు 12 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులా.. అనారోగ్యమా.. కుటుంబ కలహాలా.. కారణమేదైనా తమకుతామే మరణ శాసనం లిఖిస్తూ ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. సాక్షి, వేములవాడ రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో వారం వ్యవధిలో ముగ్గురు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. వేములవాడ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన సంగెపు మల్లారెడ్డి మే 21న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ మండలం చెక్కపల్లికి చెందిన జక్కుల దేవయ్య మే 25న నూకలమర్రి శివారులో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్లీ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లిలో అనారోగ్య కారణాలతో వృద్ధుడు మే 30న ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నింపింది. అలాగే మే17న జగిత్యాల మండలం సంగంపల్లికి చెందిన దాసరి రాజమల్లు, కాల్వశ్రీరాంపూర్ మండలం జగ్గయ్యపల్లెకు చెందిన వృద్ధురాలు మణెమ్మ క్రిమిసంహారకమందు తాగి, మే 18న వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన లస్మవ్వ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మే 19న జమ్మికుంట రూరల్ మండలం చింతలపల్లికి చెందిన పుల్లూరి పోచమ్మ, మే 24న ఎలిగేడు మండలం దూళికట్టకు చెందిన మచ్చ రాజమల్లయ్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా 15రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. (రౌడీషీటర్ దారుణహత్య) కారణాలేమిటో..? వయోభారం, అనారోగ్యం, మలి వమపెలొ కుటుంబసభ్యులకు భారం కాకుండా తనువు చాలించాలనే ఆలోచనతో పలువురు వృద్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండి నా అనే వాళ్లు లేకపోవడంతో ఇక తాము ఉండలేమనే మనోవేధన, భావనతో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయా గ్రామస్తుల నోట వినిపిస్తోంది. మలి సంధ్యలో కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఆయా గ్రామాల్లో తోటివారిని కలిచివేస్తోంది. (పెద్ద మనసు చాటుకున్న వెటోరి ) భరోసా కల్పిస్తే.. వృద్ధాప్యంలో ఉన్నవారికి కుటుంబ సభ్యులు మేమున్నామనే భరోసా కల్పిస్తే వారిలో మనోధైర్యం కలుగుతుంది. ఆస్తితగాదాలు, మనస్పర్థలు, ప్రేమానురాగాలు లాంటి కారణాలతో వృద్ధ వయస్సులో మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు దారి తీస్తున్నాయి. – జక్కని రాజు, సైకాలజిస్టు, కరీంనగర్ ఇతరులకు భారం కావొద్దనే.. వృద్ధాప్యంలో కొంత మంది తనవల్ల ఇతరులకు ఇబ్బంది కలుగవద్దని ఆలోచిస్తు న్నారు. తను మరొకరి భారం కావద్దనే ఉద్దేశ్యంతో బలన్మరణాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న. మరొకరితో సేవలు చేయించుకోవడం ఇష్టం లేక కూడా కొంత మంది వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నా అభిప్రాయం. – ఆనందరెడ్డి, వైద్యాధికారి, వేములవాడ -
‘13ఏళ్లు ఒంటరిగానే.. ఇంకెంత కాలం?’
ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. కానీ ఏ వయసు వారికి అయినా సరే తమను ప్రేమించే మనిషి కావాలి. ముఖ్యంగా జీవిత చరమాంకంలో తోడు లేకుండా బతకడం ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో లేటు వయసులో వివాహం చేసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతుంది. తాజాగా ఇలాంటి లేటు వయసు ప్రేమ కథ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. అమెరికాకు చెందిన జెన్ రోసెన్(87) భర్త 2007లో మరణించాడు. భర్త మరణం రోసెన్ను బాగా కృంగదీసింది. జీవితం శూన్యంగా మారినట్లు భావించింది. ఇలాంటి సమయంలో రోసెన్ మనవరాలు కార్లీ లేక్ ఆమెకు తోడుగా నిలిచింది. మనవరాలు చూపించే ప్రేమంతో రోసెన్ నెమ్మదిగా ఆ బాధ నుంచి కోలుకుంది. అంతా బాగుంది అనుకున్న సమయంలో కార్లీ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో మరోసారి రోసెన్ ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందని బాధపడసాగింది కార్లీ. ఈ సమస్యకు ఓ శాశ్వత పరిష్కారం ఆలోచించాలనుకుంది. ఈ క్రమంలో 87 ఏళ్ల వయసులో తన బామ్మ కోసం ఓ తోడును వెతకాలని భావించింది కార్లీ. మ్యాచ్.కామ్లో బామ్మ వివరాలు పొందుపర్చింది. కొద్ది రోజుల తర్వాత బామ్మకు సరిపోయే వ్యక్తి విక్ వైట్(84)ను కలిసింది. విక్ విశ్రాంత ఆపరేషన్ మానేజర్. రోసెన్ లాగానే కొన్నేళ్ల క్రితం అతడి భార్య మరణించింది. స్నేహితులు మ్యాచ్.కామ్లో అతడి వివరాలు పొందు పర్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విక్-రోసెన్లు కాలిఫోర్నియాలో కలిసి ఉంటున్నారు. ఈ సందర్బంగా విక్ మాట్లాడుతూ.. ‘మొదటి సారి మేం కాఫీ షాప్లో కలుసుకున్నాం. మూడు గంటల పాటు మాట్లాడుతూనే ఉన్నాం. కాఫీకని వచ్చిన వాళ్లం చివరకు లంచ్ చేసి వెళ్లాం. అలా మొదటి రోజు నుంచే మేం ఒకరికి ఒకరం బాగా నచ్చాం’ అన్నాడు. రోసెన్ మాట్లాడుతూ.. ‘కరోనా కష్టకాలంలో మేం ఒకరికి ఒకరం తోడుగా ఉన్నాం. ప్రతి నిమిషం సంతోషంగా కలసి జీవిస్తున్నాం. నా కుమార్తె ‘అమ్మ నువ్వు చాలా ఫాస్ట్ అయ్యావ్ అన్నది’. అప్పుడు నేను.. ‘ఇప్పుడు నాకు 87 సంవత్సరాలు. విధవరాలిగా 13 ఏళ్లు బతికాను. ఇంకా ఎంత కాలం ఇలా ఉండాలి.. దేని కోసం నిరీక్షించాలి’ అని ప్రశ్నించాను. దానికి తన దగ్గర సమాధానం లేదు’ అన్నది. అంతేకాక ‘జీవిత చరమాంకంలో నాకు ఇంత మంచి బహుమతి ఇచ్చిన నా మనవరాలికి కృతజ్ఞతలు. తను ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి’ అన్నారు రోసెన్. బామ్మ సంతోషంతో స్ఫూర్తి పొందిన కార్లీ.. జీవిత చరమాంకంలో ఒంటరిగా ఉంటూ తోడు కోసం వెతుకుతున్న వారి కోసం ఓ వెబ్సైట్ను ప్రారంభించే యోచనలో ఉంది. బామ్మ సంతోషం కోసం మనవరాలు చేసిన ప్రయత్నం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
60 ఏళ్ల వయసు దాటిందా..జాగ్రత్త!
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 60 ఏళ్ల వయసు దాటిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రసామాజిక, న్యాయసేవా మంత్రిత్వ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారు ఎవరూ బయటకు రాకూడదని, అదే విధంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు ఇంట్లో తమ గదిని వదిలి బయటకు అసలు రావద్దని చెప్పారు. ఈ మేరకు సామాజిక, న్యాయసేవ మంత్రిత్వ శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. ► 60 ఏళ్ల వయసు దాటి, శ్వాసకోశ, కిడ్నీ, గుండె జబ్బులు, మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి కరోనా వైరస్ రిస్కు ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి ► వీళ్లందరూ ఇంటికి వచ్చే అతిథులను కలవకూడదు ► భౌతిక దూరం పాటిస్తూ..యోగా లాంటి వ్యాయామాలు చేయాలి ► వ్యక్తిగత శుభ్రత బాగా పాటించాలి ► వేడి ఆహారం తీసుకోవడంతో పాటు అందులో పోషకాలు ఉండేలా చూసుకోవాలి ► దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులకు ఫోన్ చేయాలి ► నీళ్లు ఎక్కువగా తాగాలి మానసిక రుగ్మతలు ఉంటే 08046110007 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చెయ్యాలి వీళ్లు ఏమి చేయకూడదంటే.. ► కరోనా వైరస్ లక్షణాలున్న వారిని కలవకూడదు ► ఎవరితోనూ కరచాలనం చేయకుండా ఉండాలి ► జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు ► హారర్ సినిమాలు, బ్రేకింగ్ న్యూస్లు చూడకూడదు ► పొగాకు, మద్యం సేవించే అలవాటు ఉంటే తక్షణమే మానేయాలి. -
అయ్యా...నా డబ్బులు వచ్చాయేమో చూడు...!
మునుగోడు : నాకు ప్రతి నెలా వస్తున్న ఆసరా పింఛన్ ఒక్కసారిగా నిలిచిపోయింది. ఎందుకు రాలేదు సారు అంటే మండల పరిషత్ కార్యాలయంలో అడుగుపొమ్మని పోస్టాఫీసు ఉద్యోగులు చెప్పారు. అక్కడికి వెళ్లి అడిగితే సరిచేశాం వచ్చే నెలా వస్తుంది తీసుకోమని ఎంపీడీఓ మేడం చెప్పింది...తిరిగి మరుసటి నెల ఫోస్టాఫీసుకు వచ్చి అడిగితే రాలేదని చెప్పారు. దీంతో ఈ రోజైనా వస్తుందేమోనని ప్రతి రోజూ ఇక్కడికి వచ్చి వారిని చూడమని వేడుకుంటున్నా...అని మండల కేంద్రానికి చెందిన నారగోని మల్లయ్య అనే వృద్ధుడు శనివారం తన గోడును సాక్షికి మొరపెట్టుకున్నాడు. మునుగోడుకు చెందిన మల్లయ్యకు 15 ఏళ్లుగా వృద్ధాప్య పింఛన్ వస్తుంది. అయితే ఆ డబ్బులతో తన కుమారులపై ఆధార పడకుండా అతడికి అవసరమైన వైద్య ఖర్చులు, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నాడు. కానీ సెప్టెంబర్ నుంచి డబ్బులు రావడం లేదు. దాంతో ఆయన ఎన్ని కార్యాలయాలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇతడితో పాటు మరో 8 మంది లబ్ధిదారులు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. విషయాన్ని ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని పింఛన్ డబ్బులు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. -
ప్రాణం మీదకు తెచ్చిన జెట్ కాయిల్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : దోమల్ని చంపటానికి వెలిగించిన జెట్ కాయిల్ ఓ వృద్ధుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఆయన ఏమరపాటు కారణంగా మంటల్లో కాలి ప్రాణాలకోసం పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన బుధవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బూర్గంపహాడ్ మండలం గౌతమిపురానికి చెందిన దాసరి వెంకన్న (75) అనే వ్యక్తి నిన్న రాత్రి నిద్రపోయే సమయంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని జెట్ కాయిల్ వెలిగించాడు. దాన్ని మంచంపై పెట్టి ప్రశాంతంగా నిద్రపోయాడు. కొద్ది సేపటి తర్వాత జెట్ కాయిల్ మంచంపై ఉన్న దుప్పటికి అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో వెంకన్న మంటల్లో కాలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వృద్ధుడ్ని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యాధికారుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. -
ధోతీ కట్టుకున్నాడని రైల్లోనుంచి దింపేశారు!
లక్నో : ధోతీ ధరించిన కారణంగా ఓ వృద్ధుడిని రైల్లోనుంచి కిందకు దింపేశారు సిబ్బంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఎతవా నగరంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ బరబంకీకి చెందిన రామ్ అవధ్ దాస్(82) ఎతవా నుంచి ఘజియాబాద్ వెళ్లటానికి శతాబ్ధి ఎక్స్ప్రెస్లో టిక్కెట్ రిజర్వ్ చేసుకున్నాడు. గురువారం ఉదయం ఘజియాబాద్ వెళ్లటానికి ఎతవా రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. శతాబ్ధి ఎక్స్ప్రెస్ స్టేషన్కు చేరుకోగానే అందులోకి ఎక్కాడు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆయనదగ్గరకు చేరుకున్న రైల్వే సిబ్బంది రామ్ అవధ్ దాస్ వేసుకున్న దుస్తులను, అతని వాలకాన్ని చూసి కిందకు దింపేశారు. వారి ప్రవర్తనతో కలత చెందిన పెద్దాయన కిందకు దిగి వేరే బోగిలోకి ఎక్కబోయేలోగా రైలు కదిలి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన రామ్ అవధ్ దాస్ సిబ్బంది ప్రవర్తనపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. రామ్ అవధ్ దాస్ మాట్లాడుతూ.. ‘‘ నాకు టిక్కెట్ ఉన్నా రైల్వే సిబ్బంది, టిక్కెట్ కలెక్టర్ నన్ను బోగిలోకి అనుమతించలేదు. వారి తీరుతో నాకు చాలా బాధకలిగింది. నేను వేసుకున్న (ధోతీ)దుస్తులు వారికి నచ్చకపోవటం వల్లే నన్ను కిందకు దించేశారు. మనం ఇంకా బ్రిటీష్ పాలనలో ఉన్నామా? అనిపించింద’’ని తెలిపారు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు.. ‘‘అతడు పొరపాటున వేరే బోగిలోకి ఎక్కటం మూలానే సిబ్బంది అతన్ని కిందకు దింపేశారు. వాళ్లు అతన్ని కించపరచలేదు. అతడు వేరే బోగిలోకి ఎక్కే సమయంలో రైలు కదిలి వెళ్లిపోయింద’’ని వెల్లడించారు. -
అందని ఆసరా
మెదక్జోన్: ‘ఆసరా’ కోసం లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. నెలనెలా 5వ తేదీ లోపున అందాల్సిన పింఛన్లు నెలన్నర గడిచినా ఇప్పటివరకు అందలేదు. వచ్చిన పింఛన్ డబ్బులతో మందులు కొనుక్కునేవారు చాలామంది ఉన్నారు. పింఛన్ సకాలంలో రాకపోవడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి మొత్తం 1,03,213 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా 5వ తారీఖు లోపల రూ.11.20 కోట్లు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. కొంతమందికి పోస్టాఫీసుల ద్వారా అందుతుండగా మరికొందరికి నేరుగా వారి ఖాతాల్లో జమవుతున్నాయి. మరికొంత మందికి గ్రామాల్లో సీఏలు అందిస్తున్నారు. ఇప్పటివరకు దివ్యాంగులకు నెలకు రూ.1,500 ఇస్తుండగా మిగతా వారికి రూ.వెయ్యి చొప్పున అందజేస్తున్నారు. పింఛన్దారుల్లో 80 శాతం మంది వృద్ధులు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరిలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు పింఛన్ రాగానే నెలకు సరిపడా మందుగోలీలను కొనుగోలు చేస్తారు. మందుగోలీలు అయిపోయి పింఛన్ రాక వారు ఇబ్బంది పడుతున్నారు. వీరిలో ముఖ్యంగా కొడుకులు లేనివారు, అనాథల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. దివ్యాంగులకు వచ్చే రూ.1,500 పింఛన్పై వారి కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పింఛన్ డబ్బులు వస్తేనే రేషన్బియ్యం కొనుగోలు చేసి నెలంతా జీవనం సాగించే కుటుంబాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి ఆసరా పైకం అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఏ అధికారి కనిపించినా సారూ మా పింఛన్ వచ్చిందా? అంటూ ఆరా తీస్తున్నారు. రెట్టింపు ఎప్పుడో? రెండోసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ తాము తిరిగి అధికారంలోకి వస్తే పింఛన్లు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చి ఆరునెలలు కావస్తున్నా పింఛన్ల పెంపుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నూతనంగా 57 సంవత్సరాల లోపు ఎంతమంది ఉన్నారనే జాబితాను మాత్రం ఇప్పటికే గ్రామీణాబివృద్ధిశాఖ అధికారులు సర్వే చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,03,213 మంది మంది అన్ని రకాల పింఛన్దారులు ఉండగా 57 సంవత్సరాలు నిండిన వారు 38,978 మంది ఉన్నారు. వీరిలో పింఛన్కు అర్హులైన వారు 10,982 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తవారితో పాటు పాతవారికి పింఛన్ పెంచితే ప్రస్తుతం నెలనెలా ఇస్తున్న రూ. 11.20కోట్లకు బదులు మూడింతలు పెరుగుతుంది. మందుగోలీలకు పైసల్లేవు నాకు బీపీ, దమ్ము ఉన్నాయి. నెలనెలా పింఛన్ రాగానే మందుగోలీలు కొంటాను. ఈసారి ఇంకా పింఛన్రాలేదు. మందుగోలీలు అయిపోయి పదిరోజులు అవుతోంది. నాకు పింఛన్ వస్తదని నా కొడుకులు ఎవరూ మందుగోలీలు తేరు. గా పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తయో ఏమో. పోచయ్య, వృద్ధాప్య పింఛన్దారుడు, జంగరాయి, చిన్నశంకరంపేట పింఛన్ వస్తేనే పూట గడిచేది మాది నిరేపేద కుటుంబం. నాకు పింఛన్ వస్తేనే పూట గడుస్తుంది. నెలనెలా వచ్చే పింఛన్తో రేషన్బియ్యం తెచ్చుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఈనెల ఇంకా పింఛన్ రాకపోవడంతో ఈనెల సరుకులు తీసుకోలేదు. త్వరగా వచ్చేలా చూడాలి. – బాల్రాజు, దివ్యాంగుడు పాల్వంచ, టేక్మాల్ మండలం -
ఓటింగ్లో రియల్ సెలబ్రిటీలు
2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు నాలుగో దశ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. భారత వాణిజ్య రాజధాని ముంబై సహా దేశంలోని మొత్తం 8 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోలింగ్లో ముఖ్యంగా ముంబై పలువురు బాలీవుడ్ నటీనటులతో పాటు, పలు వ్యాపారవర్గాలకు చెందిన బిజినెస్ టైకూన్లు, వివిధ కార్పొరేట్ దిగ్గజాలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆకర్షణీయంగా నిలిచారు. వీరందరికి తోడునేడు ఓటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో చాలామందిసెలబ్రిటీలను మరిపిస్తూ మండేఎండను కూడా లెక్క చేయకుండా పలువురు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు తమ ప్రాథమిక హక్కును వినియోగించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా బాలాఘాట్ నియోజకవర్గంలో శాంతి బాయి పాండే (115) అనే వృద్ధ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే చేయి చేయి పట్టుకుని జట్టుగా వచ్చిన ఒక వృద్ధ జంట ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అబ్బుర పర్చింది. రాజస్థాన్లోని సిరాహి జిల్లాలో ఆకార్భట్టా పోలింగ్బూత్లో ఇద్దరు కొత్త పెళ్లికూతుళ్లు ముచ్చటగా నిలిచి ఆకట్టుకున్నారు. అక్కాచెల్లెళ్లయిన వీళ్లిద్దరూ వివాహ వేడుకకు ముంద పోలింగ్ స్టేషన్కు తరలి వచ్చారు. ఓటు వేసిన అనంతరం పెళ్లి పీటలెక్కేందుకు నిర్ణయించుకున్నారు. ముంబైలోని చెంబూరు స్వర్ణంబాల్ క్రిష్ట స్వామి(103)వీల్ చెయిర్లో వచ్చి మరీ తన ఓటు వినియోగించుకోవడం విశేషం. బిహార్లో 95 ఏళ్ల వృద్ధుడు తన బంధువు సహాయంతో ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. సూయిధాగా నటుడు వరుణ్ ధావన్ ఒక పెద్దావిడకు సహాయం నెటిజనుల ప్రశంసలను దక్కించుకున్నాడు. ముంబైలోని ఒక పోలింగ్ కేంద్రం మెట్లు ఎక్కుతున్న మహిళకు తన చేయి అందించారు. రియల్ సెలబ్రిటీ అంటూ ఈ పిక్స్ వైరల్ అయ్యాయి. -
మధురం శివమంత్రం... మరువకే ఓ మనసా!
‘‘కాశయ్యా...కాశయ్యా’’ అనే పిలువు వినబడడంతో వెనక్కి తిరిగి చూశాడు కాశయ్య. అక్కడొక పండు వృద్ధుడు.‘‘ఏమిటయ్యా...బొడ్డు కోసి పేరు పెట్టినట్లు పిలుస్తున్నావు. నా పేరు నీకెలా తెలుసు?’’ఆశ్చర్యంగా అడిగాడు కాశయ్య.‘‘నీ తాత ముత్తాతలందరూ నాకు తెలుసు కాశయ్యా. తిన్నయ్య ఇల్లు తెలుసా నీకు?’’‘‘ఏ తిన్నయ్య?’’‘‘బోయ తిన్నయ్య. అతనికి నేను బంటుని’’ అన్నాడు ఆ వృద్ధుడు.‘‘బాగుంది బాగుంది...మూరెడు మనిషికి బారెడు బంటు. బోయవాడంటావు...వాడికి నువ్వు బంటునంటావు. భలే గమ్మత్తుగా ఉంది’’ అని వెటకారం చేశాడు కాశయ్య.‘‘అతని సేవకునిగా ఉండాలనినాకు బుద్ధి పుట్టింది. ఉంటాను. ఇందులో తప్పేముంది?’’ అని అడిగాడు వృద్ధుడు.‘‘అడవిలో అవి ఇవి కొట్టుకొని తినేవాడు నీకేం ఇవ్వగలడు తాతా?’’ అడిగాడు కాశయ్య.‘‘తనువు, మనసు అన్నీఇస్తాడు. అతనిలాగా కోట్ల మంది ఉన్నా...వాళ్లకు నేను సేవ చేస్తాను’’ వివరించాడు వృద్ధుడు.‘‘ధనం లేకుండా మనసు, తనువు ఉన్నా ఏం చేసుకుంటావు తాతయ్యా? కూర వండుకుంటావా?’’వెటకారంగా నవ్వాడు కాశయ్య. ‘‘ధనం ఎందుకు కాశయ్యా...అది ఇవ్వాళ ఉంటుంది. రేపు వెళ్లిపోతుంది. అతని మంచితనానికి లొంగిపోయి అతనికి బంటుగా కుదురుకున్నాను...అయితే అతని ఇల్లు ఎక్కడ ఉందో తెలియదా? ఎవర్నైనా కనుక్కొని వెళతానులే...’’ అంటూ రెండడుగులు వేసి తుళ్లిపడబోయాడు తాతయ్య.‘‘అయ్యో పాపం ఈ వయసులో నీకు ఈ కష్టం ఏమిటి తాతయ్యా. ఏది అది నాచేతికివ్వు’’ అని తాతయ్య నెత్తి మీద ఉన్న మూటను తీసుకోబోతుంటే...‘‘వద్దు బాబూ...వద్దు. ఎవరి బరువు వారే మోయాలి. ఒకరి బరువు ఇంకొకరు మోయడం సాధ్యమవుతుందా’’ అంటూ వారించబోయాడు తాతయ్య.కాశయ్య వింటేగా!‘‘ఫరవాలేదు, ఇవ్వు తాతయ్యా’’ అని తాతయ్య నెత్తి మీది మూటను తీసుకొని తన నెత్తి మీద పెట్టుకున్నాడు.అంతే...బరువు భరించలేక ‘‘చచ్చాన్రోయ్’’ అని అరిచాడు. మూటను తిరిగి తాతయ్యకు ఇచ్చి...‘‘ఇదేమిటి! కైలాసపర్వతం ఎత్తిన రావణుడి పరిస్థితి అయింది నాకు. గుడ్లు ఊడి వచ్చాయి. చేతులు నొప్పెడుతున్నాయి’’ అన్నాడు బాధగా కాశయ్య.ఆ తరువాత...‘ఇంత బరువు ఉంది.ఏమిటున్నాయి ఇందులో?’’ అని అడిగాడు.‘‘బట్ట, పాత, ధనం, ధాన్యం, పాపం, పుణ్యం...ఇంకా ఏవేవో ఉన్నాయి. అందుకే వద్దని చెప్పాను’’ అన్నాడు ఆ పెద్దాయన.‘‘పాపం, పుణ్యమా!’’ ఆశ్చర్యపోయాడు కాశయ్య.‘‘నువ్వు చూస్తే మనిషి మాత్రుడిలా లేవు. నీపేరేమిటి తాతయ్యా?’’ అని అడిగాడు కాశయ్య.‘‘ఈ పేదవాడి పేరుతో విలువ ఏముందయ్యా...ఈ లోకంలో చుట్టాలు,స్నేహితులు, నచ్చిన వాళ్లు నచ్చని వాళ్లు అందరూ...శివయ్య...శంకరయ్య...రుద్రయ్య అని పిలుచుకుంటారు. పాపం చేతులు నొప్పెడుతున్నట్లున్నాయి. పోతాయిలే’’ అంటూ బయలుదేరాడు తాతయ్య.‘‘ఇతని సంగతి చూస్తే ఏదో వింతగా ఉంది’’ అని ఆశ్చర్యపడేలోపే కాశయ్య చెయ్యినొప్పి క్షణాల్లో మాయమైపోయింది.‘‘శివయ్య...శంకరయ్య...రుద్రయ్య...ఏమీ అర్థం కాకుండా ఉంది’’ అన్నాడు అయోమయంలో నుంచి వచ్చిన ఆనందంతో! ‘‘అమ్మా...అమ్మా...’’‘‘ఎవరయ్యా?’’‘‘ఈ మూటను మీకు ఇవ్వమని పంపాడు మీ ఆయన. ఇందులో వడ్లు, ధాన్యం, బట్టలు, పండ్లు ఉన్నాయి. నా భార్య చిరిగిపోయిన కోక కట్టుకొని ఉంటుంది. నేను వచ్చేసరికి కొత్త కోక కట్టుకోమని పదేపదే చెప్పాడు’’ అని చెప్పాడు తాతయ్య.‘‘గాలివానలో మా బావ ఏమయ్యాడో తెలియక అల్లాడుతున్న నా ఆరాటాన్ని తగ్గించావు. నువ్వు ఎవరు తాతయ్య?’’ అని అడిగింది ఆ ఇల్లాలు.‘‘మీ బావకు నేను బంటునమ్మా’’ అని చెప్పాడు తాతయ్య.‘‘బంటువా!’’ పెద్దగా ఆశ్చర్యపోయింది ఆమె!!‘‘కాశయ్యా...కాశయ్యా’’ అని అరుచుకుంటూ వస్తున్నాడు తిన్నడు. ‘‘బాబోయ్ భూతం’’ అని జడుసుకున్నాడు కాశయ్య.‘‘నేను భూతాన్ని కాదయ్యా...నిన్న నీ బోధనలు విని కండ్లు తెరిచినవాడిని. ఈ పామరుడికి ఈశ్వర మహిమ చూపించావు. జ్ఞానభిక్ష పెట్టావు. నువ్వు చెప్పినట్లే ప్రార్థించాను. రెండు కుందేళ్లు దొరికాయి. ఒక కుందేలు మాంసం కాల్చి ఈశ్వరుడికి పెట్టాను’’ అన్నాడు భక్తి నిండిన కళ్లతో తిన్నడు.‘‘అన్నట్లు నీ పేరేమిటి?’’ అడిగాడు కాశయ్య.‘‘తిన్నడు’’‘‘కోయతిన్నడా...నీకు ఆ శివయ్య సేవకుడిగా ఉన్నాడా?’’‘‘అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడా కాశయ్యా...అసలే నేను ఒక కటిక దరిద్రుడిని. నాకు సేవకుడు కూడానా! అతనే ఈశ్వరుడు. భిక్షగాడిలా నాకు రెండుసార్లు కనిపించాడు! పేరేమిటి? అని అడిగితే శివయ్య అని చెప్పాడు. నేను తెలుసుకోలేకపోయాను. నేను ఇంట్లో లేనప్పుడు నా పెళ్లాం దగ్గరకు వచ్చి నా సేవకుడినని చెప్పినా పెళ్లానికి దర్శనం ఇచ్చి వెళ్లాడు’’ తన్మయంగా చెబుతున్నాడు తిన్నడు.‘‘మహానుభావా, నువ్వు చాలా ధన్యాత్ముడివి. కాశీ...నేనే ఈశ్వరుడినని చెప్పి ఉంటే నీ పాదాల దగ్గర పడి ఉందునే. నా మనసు తెలుసుకోలేకపోయావా’’ తనకు తారసపడ్డ తాతను గుర్తుచేసుకుంటూ అన్నాడు కాశయ్య.‘‘కాశయ్యా, విచారించకు. రా...గుడికి వెళదాం. అతనితో స్వయంగా మాట్లాడదాం. అతని కోసం చాలా చోట్ల వెదికాను. ఎక్కడా కనిపించలేదు. కాశయ్య ఈరోజు నుంచి నువ్వే నా గురువు’’ అన్నాడు తిన్నయ్య.‘‘మహానుభావా, పరమపాపాత్ముడైన కైలాసశాస్త్రి కొడుకుని. నేను నీకు గురువా?’’ బెరుగ్గా అన్నాడు కాశయ్య.ఆ తరువాత....‘‘దా...గుడికి వెళదాం. మహేశ్వరుడిని ప్రార్థిద్దాం.ఈరోజు నుంచి నువ్వే నేను. నేనే నువ్వు’’ అన్నాడు.శివాలయంలో..తిన్నడు పాడుతున్నాడు.... ‘మధురం శివమంత్రం...మరువకే ఓ మనసా’ -
కొడుకు కళ్లెదుటే తల్లి.. దారుణ హత్య
రామగుండం: పట్టణంలోని ముబారక్నగర్లో ఓ సైకో చేతిలో శుక్రవారం పట్టపగలు ఓ వృద్ధురాలు హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. ముబారక్నగర్కు చెందిన సమ్మెట తిరుపతి క్షౌ రవృత్తిని నిర్వహిస్తుంటాడు. అదే కాలనీలో తన నివాసముండగా.. పక్కపక్కన రెండు గదులున్నాయి. అందులో ఒక గదిలో తిరుపతి కుటుంబసభ్యులతోపాటు మరో గదిలో తిరుపతి తల్లి సమ్మెట బాలమ్మ(65) నివాసముంటోంది. పక్కింట్లో ఉండే నగునూరి నరేష్(25) అనే యువకుడు ఏడాది క్రితం తిరుపతి కుటుంబసభ్యులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో.. నరేష్పై రామగుండం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై రాజ్కుమార్గౌడ్ సదరు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించి పంపించారు. కుటుంబసభ్యులు నరేష్ను మందలించి ప్రవర్తన మార్చుకోవాలని సూచించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటి నుంచి తిరుపతి కుటుంబసభ్యులపై కక్ష పెంచుకొని అదును కోసం చూస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బాలమ్మ మంచంలో నిద్రించడం గమనించాడు. వృద్ధురాలి గదిలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న గొడ్డలితో తలపై మోదాడు. శబ్దం రావడంతో తిరుపతి కుటుంబసభ్యులు అప్రమత్తమై వెళ్లి చూడగా.. వారి ముందే తలపై మరోసారి గొడ్డలితో వేటు వేశాడు. దీంతో అక్కడకక్కడే మృతిచెందింది. అడ్డుకోబోయిన తిరుపతిపై సైతం దాడి చేసేందుకు యత్నించి పారిపోయాడు. సమ్మెట తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బుద్ధె స్వామి, ఎస్సై పసుల దత్తాత్రి తెలిపారు. సందర్శించిన డీసీపీ ఘటన స్థలిని గోదావరిఖని డీసీపీ రక్షిత కె.మూర్తి సందర్శించారు. కుటుంబసభ్యులను వివరాలడిగి తెలుసుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుంటామని, సైకోగా మారిన నగునూరి నరేష్ను పట్టుకొని చట్టపరమైన శిక్ష పడేందుకు చర్యలు చేపడతామని అన్నారు. -
తరచు నేరాల బారినపడుతున్న వృద్ధులు
సాక్షి, సిటీబ్యూరో: సైదాబాద్ ఠాణా పరిధిలో బుధవారం వృద్ధ దంపతులపై జరిగిన దాడి నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. రాజధానిలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల భద్రత, వారి యోగక్షేమాలను కనుక్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడమే ఇందుకు కారణం. అయితే దేశరాజధాని ఢిల్లీ పోలీసులు మాత్రం కొన్నేళ్ల క్రితమే వృద్ధులకు భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా ‘సీనియర్ సిటిజన్స్ సెల్’ ఏర్పాటు చేశారు. ఇలాంటి సెల్ను నగరంలోనూ ఏర్పాటు చేయాలని గతంలోనే భావించినా ఇప్పటికీ ఈ ప్రతిపాదనలు అమలులోకి రాలేదు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ సెల్ మంచి ఫలితాలు సాధిస్తోంది. తమ బిడ్డలు ఇతర ప్రాంతాలు, విదేశాల్లో నివసిస్తున్న వృద్ధులు తమ వివరాలు, చిరునామాలను ఈ సెల్లో నమోదు చేసుకుంటున్నారు. వారితో పాటు కుటుంసభ్యులు ఉద్యోగాలకు వెళ్తుండటంతో పగటిపూట ఒంటరిగా నివసిస్తున్న వారి వివరాలనూ రిజిస్టర్ చేశారు. రెండేళ్లల్లో 19,716 మంది వృద్ధుల వివరాలు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు వారిలో 12,812 మందికి ప్రత్యేక గుర్తింపుకార్డులూ జారీ చేశారు. ఈ కార్డుల్లో వారి చిరునామాతో పాటు రక్తగ్రూపు, వారి అనారోగ్య సమస్యలు, డాక్టర్ పేరు, సంప్రదించే నంబరు, అత్యవసర సమయాల్లో ఎవరికి సమాచారం ఇవ్వాలనే వివరాలనూ నమోదు చేశారు. అంతేగాక ఆడిట్ పేరుతో నిత్యం వారి ఇళ్లకు వెళుతూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఫలితంగా వృద్ధులకు భరోసా లభించడంతో పాటు వారిపై జరిగే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. నగరంలో నాన్చుడే... నగరంలోనూ ఒంటరిగా ఉంటున్న వృద్ధుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీనిని ఆసరాగా తీసుకున్న నేరగాళ్లు పంజా విసురుతున్నారు. 2010లో పళ్లం రాజు పెద్దమ్మపై దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వీటికి పరిష్కారం వెతికే దిశలో కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒంటరి వృద్ధులు నగర వ్యాప్తంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా స్థిరపడిన వారిలో ఎక్కువ మంది వెస్ట్జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ఒంటరితనంతో బాధపడుతూ, తమ భావాలను పంచుకోవాలని ఆశిస్తూనే అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతుంటారు. వీరికి ఆసరాగా ఉండటమే కాకుండా భరోసాను ఇచ్చేందుకు సీనియర్ సిటిజన్స్ సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీరి బాధ్యతలు ఏరియాల వారీగా కానిస్టేబుళ్లకు అప్పగిస్తామని, దీని వల్ల మరుగున పడిపోయిన బీటు కానిస్టేబుల్ వ్యవస్థకూ ప్రాణం పోసినట్లువుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల దీనిపై దృష్టి పెట్టిన నగర పోలీసులు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది అధికారిక యాప్ ‘హాక్ ఐ’కు అనుబంధంగా పని చేయనుంది. వృద్ధ దంపతులపై దాడి మలక్పేట: పట్టపగలు ఓ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు అగంతకులు వృద్ధ దంపతులపై దాడి చేసి, చోరీకి యత్నించిన సంఘటన బుధవారం సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నర్సింహారావు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి శారపు వామనమూర్తి(75) అతని భార్య అనురాధా(68)తో కలిసి సైదాబాద్, ఫర్హా కాలనీలో ఉంటున్నారు. ఉద్యోగరీత్యా అతని కుమారుడు అమీర్పేట్లో, కుమార్తె బెంగుళూర్లో ఉంటున్నారు. ఇంటి పక్క పోర్షన్, పైపోర్షన్ అద్దెకు ఇచ్చారు. బుధవారం కిరాయి వాళ్లు ఇంట్లో లేని సమయంలో ఇంటి వెనుక నుంచి వంటగదిలోకి చొరబడిన ఇద్దరు అగంతకులు ‘డబ్బులు ఎక్కడ పెట్టారు’ అంటూ హిందీలో అడుగుతూనే వంటగదిలో ఉన్న రోకలి బండతో వామనమూర్తి తలపై మోదారు. అనంతరం కత్తితో అతడిని పొడిచేందుకు ప్రయత్నించగా అనురాధా చెయ్యి అడ్డం పెట్టడంతో గాయాలయ్యాయి. వామనమూర్తి తలకు బలమైన గాయం కావడంతో సృహ కోల్పోయాడు. అగంతకులు అనురాధాను కత్తితో బెదిరిస్తూ డబ్బులు ఎక్కడ పెట్టావ్ చూపించు అంటూ భయపెట్టారు. ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించగా ఆమె గట్టి కేకలు వేయడంతో అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దీనిని గుర్తించిన స్థానికులు బాధితులను మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈస్ట్జోన్ డీసీపీ రమేష్రెడ్డి, అడిషనల్ డీసీపీ గోవింద్రెడ్డి, టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ చైతన్య, మలక్పేట ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్ నర్సింహ్మారావు సంఘటన స్థలాన్ని సందర్శించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. కాలనీలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితులకు ఎమ్మెల్యే బలాల పరామర్శ వృద్ధ దంపతులపై దాడి విషయం తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల మలక్పేట యశోద ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఫర్హా కాలనీలోని వారి ఇంటిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. తెలిసిన వారి పనేనా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దాడి పాల్పడటం, మంగళవారం అనురాధ ఏటీఎంలో రూ.40 వేలు డ్రా చేసింది. ఆ డబ్బులు ఎక్కడ పెట్టావ్ అని ఆడగటం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల విషయం తెలిసిన వ్యక్తులే చోరీకి యత్నించి ఉంటారని కాలనీవాసులు భావిస్తున్నారు. అదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పెన్షన్ కోసం వచ్చి.. ప్రాణాలు విడిచి
సాక్షి, పశ్చిమ గోదావరి: తణుకు నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ కోసం గంటల తరబడి నిలబడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన అత్తిలి మండలం మంచిలిలో జరిగింది. వివరాలలోకి వెళితే.. మంచిలికి చెందిన కర్రి వెంకటరెడ్డి అనే 75ఏళ్ల వృద్ధుడు పెన్షన్ తీసుకోవటానికి మంచిలి పంచాయితీకి వచ్చాడు. సాయంత్రం నాలుగు గంటలకి ఎమ్మెల్యే వస్తారని.. ఉదయం 9 గంటలలోపు వచ్చిన వారికే పెరిగిన పెన్షన్ ఇస్తామని పంచాయితీ అధికారులు మెలిక పెట్టడంతో ఎక్కువమంది అక్కడికి వచ్చారు. పెన్షన్ కోసం చాలా సేపు నిలబడి అలిసిపోయిన వెంకటరెడ్డి.. చివరకు పెన్షన్ తీసుకోకుండానే ప్రాణాలు విడిచాడు. దీంతో పంచాయతీ సిబ్బంది చనిపోయిన వృద్ధుడి పెన్షన్ డబ్బులు హుటాహుటిన అతడి ఇంటికి తెచ్చి ఇచ్చారు. -
‘ఆసరా’గా చేసుకుని..
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాల్లో నిలువు దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. సేవలను బట్టి వసూళ్ల పర్వం నడుస్తోంది. నూతన ఆధార్ కార్డులు, పాత కార్డుల్లో పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా మార్పులు తదితర సేవల కోసం ఆధార్ కేంద్రాల నిర్వాహకులు అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ పెన్షన్ పొందడానికి లబ్ధిదారుల వయస్సును 57 సంవత్సరాలకు కుదించిన విషయం తెలిసిందే. దీంతో ఆసరా పెన్షన్ పొందడానికి ఉవ్విళ్లూరుతున్న జనం, వారి ఆధార్ కార్డుల్లో వయస్సు మార్పిడి చేసుకోవడానికి ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రజల అవసరాన్ని ‘ఆసరా’గా చేసుకుని ఆధార్ నిర్వాహకులు నిబంధనలకు విస్మరించి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారు. జిల్లాలో గల మండలానికో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని మీ సేవా నిర్వాహకులకు అధికారులు మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 27 కేంద్రాలు మండలాల్లో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ(ఈఎస్డీ) సంస్థకు చెందిన 20 ఆధార్ కేంద్రాలుండగా, సీఎస్సీకి చెందిన ఆధార్ కేంద్రాలు 16 ఉన్నాయి. ఆధార్ కేంద్రాల్లో సేవల పేరిట అడ్డగోలుగా వసూళ్ల పర్వం నడుస్తున్నా.. పర్యవేక్షణ చేసే సంబంధిత అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు తావిస్తోంది. ఇటు తహసీల్దార్లు కూడా చూసీ చూడనట్లు ఉంటున్నారు. తనిఖీల మాటే లేకుండా పోయింది. ఆధార్ కేంద్రాల నిర్వాహకులతో అధికారులు మిలాఖత్ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా గుంజుతున్నారు.. ఆధార్ కేంద్రాల్లో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేట్టాయి. వీలైనంత త్వరలో ప్రయివేటు వ్యక్తులు నడుపుతున్న ఆధార్ కేంద్రాలను తొలగించి మండల, పట్టణ ప్రాంత కేంద్రాల్లో గల ప్రభుత్వ కార్యాలయాల్లోకి తరలించాలని, వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఇటీవల తెలిపింది. దీంతో తాము నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాలకు గడ్డుకాలం వచ్చి పడిందని దోపిడీకి తెరలేపారు. ఇదే సమయంలో ఆధార్ కార్డుల్లో వయసు మార్పిడికి డిమాండ్ పెరగడం కూడా వారికి అవకాశంగా మారింది. నిజానికి కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకునే వారి నుంచి ఎలాంటి రుసుము తీసుకోకూడదు. కానీ రూ. 200 వరకు తీసుకుంటున్నారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. అదే విధంగా పాత కార్డుల్లో చేర్పులు మార్పులకు రూ. 25 రుసుము తీసుకోవాల్సి ఉండగా రూ. 300 పైగా తీసుకుంటున్నారు. ఆధార్ కార్డులో వయస్సు మార్పిడి జరిగితే తమకు రూ. 2 వేల పెన్షన్ వస్తుందనే ఆశతో ఆధార్ నిర్వాహకులు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు. దీంతో ఈ విషయం దాదాపు బయటకు రావడం లేదు. ఇంద ల్వాయితో పాటుగా మాక్లూర్, డిచ్పల్లి మండలాల్లో కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే సిరికొండ, నవీపేట్, నిజామాబాద్ నగరం, బాల్కొండ, భీమ్గల్, బోధన్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. -
చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై కేసు
కృష్ణాజిల్లా, యనమలకుదురు (పెనమలూరు) : అభం శుభం తెలియని చిన్నారిపై ఓ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తింటంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు ఇందిరానగర్–2 కు చెందిన భిక్షాలు (60) చెప్పుల వ్యాపారం చేస్తాడు. అతను ఆదివారం రాత్రి ఇంటి పక్కనే ఉంటున్న చిన్నారిని (3) ఇంట్లోకి పిలిచాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి వచ్చిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో ఏడవటంతో చిన్నారి తల్లితండ్రులు రావటంతో భిక్షాలు పారిపోయాడు. ఈ ఘటనపై చిన్నారి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. -
పెరిగిన ఆసరా...
సాక్షి, మెదక్: ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 1,03,410 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వీరిలో దివ్యాంగులకు రూ.1,500, మిగితా వారికి వెయ్యి రూపాయల చొప్పున అందచేస్తున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమచేస్తున్నారు. వచ్చే సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెల నుంచి దివ్యాంగులకు రూ.3,016, మిగిలిన లబ్ధిదారులకు రూ.2,016 పింఛన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మూడు రోజుల క్రితం విడుదల చేశారు. నూతన మార్గదర్శకాలు జిల్లా అధికారులకు అందాల్సి ఉంది. 57 సంవత్సరాలు నిండిన వృద్ధులు పింఛన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు కార్డులోని వయస్సును ప్రామాణికంగా తీసుకొని పింఛన్కు అర్హులయ్యే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అర్హత వయస్సు నిండిన వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పింఛన్ డబ్బులు చేతికందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు గాను 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి నిధులు కేటాయించి ఎన్నికలల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ సొమ్ముతో పాటు, కొత్త వారికి పింఛన్ అందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా ఆసరా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. నవంబరు 19న ప్రకటించిన తుది జాబితా ప్రకారం వారిని ఎంపిక చేశారు. జిల్లాలో 57 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వరకు 36,954 మంది ఉన్నట్లు గుర్తించారు. పింఛన్ పొందేందుకు పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు లోపు సంవత్సర ఆదాయం మాత్రమే ఉండాలి. మూడెకరాల లోపు తరి భూమి, ఏడున్నర ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులుగా ఉంటారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛన్ అందజేస్తారు. ప్రస్తుతం జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఓ) అధికారులు సేకరించిన వివరాలపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేయించనున్నారు. పోలింగ్ బూత్స్థాయి అధికారులకు జాబితాను అందచేసి వారి ద్వారా పరిశీలింపచేస్తారు. తర్వాత డీఆర్డీఓ అధికారులు, గ్రామైక్య సంఘం, ఇందిరా క్రాంతి పథకం సీసీల చేత క్షుణ్ణంగా విచారణ చేయించనున్నారు. అలాగే ఎంపిక చేసిన వారి ఇళ్ళకు వెళ్లి ఆధార్ కార్డు, సెల్ఫోన్ నంబర్లను సేకరించనున్నారు. ఒకటికి రెండుమార్లు వడపోత అనంతరం లబ్ధిదారుల తుదిజాబితాను ప్రకటించనున్నారు. ఈ జాబితాను కలెక్టర్ ఆమోదించిన తర్వాత పింఛన్ మంజూరుకు ఉన్నతాధికారులకు పంపిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ఆసరా పథకం కింద ప్రతినెలా రూ.10.78 కోట్లు చెల్లిస్తున్నారు. లబ్ధిదారుల అర్హత వయస్సును 57 సంవత్సరాలకు కుదించడం, దివ్యాంగులు, మిగితా వారికి పింఛన్ మొత్తం పెంచనుండటంతో ప్రభుత్వంపై భారం పడనుంది. జిల్లాలో కొత్తగా లబ్ధిదారుల చేరికతో సుమారు రూ.50 లక్షలకు పైగా భారం పడనుంది. ఏప్రిల్ నుంచి పింఛన్ మొత్తం పెంచితే పాత, కొత్త లబ్ధిదారులతో కలిపి జిల్లాలో సుమారు రూ.30 కోట్ల వరకు చేరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ... గ్రామాల్లో వీఆర్వోలు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పాల్గొంటారు. ఇలా ఎంపిక చేసిన జాబితాను గ్రామసభల ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వచ్చిన వాటిని పరిశీలించి తుదిజాబితాను రూపొందించడం జరుగుతుంది. లబ్ధిదారుల ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు సేకరిస్తారు. గ్రామాల్లోని లబ్ధిదారుల జాబితాను ఎంపీడీఓలు, పట్టణాల్లోని లబ్ధిదారుల జాబితాను కమిషనర్లు పరిపాలన అనుమతి కోసం కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం తెలిపిన అనంతరం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతం ఉన్న ఆసరా సాఫ్ట్వేర్లో లబ్ధిదారుల వివరాలను అప్లోడ్ చేస్తారు. త్వరలోనే తుది జాబితా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం ప్రస్తుతం 57 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వరకు ఉన్న వారి వివరాలను సేకరించడం జరుగుతుంది. ఈ మేరకు పోలింగ్బూత్ అధికారుల ద్వారా లబ్ధిదారుల సంఖ్యను తేల్చడం జరుగుతుంది. గ్రామైఖ్య సంఘం, సీసీలతో విచారణ జరిపించి తుది జాబితాను రూపొందిస్తాం. ఏప్రిల్ నుంచి పెరగనున్న ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. –భీమయ్య, డీఆర్డీఓ ఏడీ, మెదక్ -
‘ఆసరా’ రెట్టింపు
కల్వకుర్తి టౌన్: ఆసరా సామాజిక పింఛన్లు రెట్టింపు కానున్నాయి. ఇప్పటివరకు వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న వెయ్యి రూపాయల ఫించన్ రూ.2,016కు పెరగనుంది. అలాగే వికలాంగులకు ఇస్తున్న రూ.1,500లు రూ.3,016కు పెరగనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు రెట్టింపు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు అణుగుణంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికితోడు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే వయస్సును 65ఏళ్ల నుంచి 57ఏళ్లకు తగ్గించింది. దీనితో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య లక్షకుపైగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలో నిధులు కేటాయించన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.200 నుంచి రూ.2వేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సామాజిక భద్రత పింఛన్ రూ.200లు ఇచ్చేవారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫించన్లను రూ.వెయ్యికి పెంచింది. వికలాంగులకు రూ.1,500కు పెంచింది. ప్రస్తుతం రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరోసారి పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వికలాంగులు, వితంతువు, చేనేత, కల్లుగీత కార్మికులు, హెచ్ఐవీ, బోధకాలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు ఇలా అనేక రకాల పింఛన్లు అందిస్తోంది. వీరిలో వృద్ధాప్య, వికలాంగులకు మాత్రమే పింఛన్లు రెట్టింపు కానున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు 63,065, వికలాంగులు 23,743 మంది ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 46,065 మంది వృద్ధాప్య, వికలాంగులు 13,976 మంది లబ్ధిదారులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వృద్ధాప్య 24,314 మంది, వికలాంగులు 11,166 మంది తీసుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో 28,536 మంది వృద్ధాప్య, వికలాంగులు 11,047 మంది ఉన్నారు. వివరాలు సేకరిస్తున్నాం జిల్లాలో గతంలో ఇస్తున్న ఆసరా పింఛన్లకు అదనంగా 57ఏళ్ల వయస్సు ఉన్నవారి వివరాలు కూడా సేకరిస్తున్నాం. ఓటరు జాబితాల నుంచి సేకరించి, జాబితా సిద్ధం చేస్తున్నాం. ఒక కుటుంబంలో ఒక్కరు మాత్రమే పింఛన్ తీసుకోవడానికి అర్హులు. 57ఏళ్లలోపు వారు, మరే ఇతర ఫించన్ తీసుకుంటున్న వారు అనర్హులు. దానికి సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తున్నాం. – సుధాకర్, డీఆర్డీఓ పీడీ, నాగర్కర్నూల్ -
ఆసరా రూ.80 కోట్లు !
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎన్నికల హామీల అమలుకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుడుతోంది. కొత్త ప్రభుత్వంలో ఆసరా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి, వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సును 57కు కుదిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అటు ఇటుగా రూ.39 కోట్ల వరకు పింఛన్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవీ, ఫైలేరియా పేషంట్లకు ఆసరా పింఛన్ల ద్వారా ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఆసరాగా ఇస్తోంది. సర్కారు పింఛన్లను రెట్టింపు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తం డబుల్ కానుంది. వృద్ధాప్య పింఛన్ల వయస్సును 64 నుంచి 57కు తగ్గించడంతో వేలాది మంది కొత్తగా వృద్ధాప్య పింఛన్లకు అర్హులు కానున్నారు. ఈ మేరకు నెలకు సుమారు రూ.80కోట్ల పైనే ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులకు చెల్లించనున్నారు. ఈ పెరిగిన ఆసరా పింఛన్లు ఏ నెల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతాయనే దానిపై స్పష్టత రావడం లేదు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు 57 వృద్ధాప్య పింఛన్లు పొందాలంటే 64 సంవత్సరాలు ఉండాలనేది దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన. ఈ నిబంధనను సడలించి 57 ఏళ్లు నిండిన వారందిరికి వృద్ధాప్య పింఛన్లు అందజేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్లోని నాలుగు జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి ఓటర్ల జాబితాలోని వయస్సునే ప్రామాణికంగా తీసుకోనుండడంతో ఆ మేరకు పంచాయతీల వారీగా అర్హుల గుర్తింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. 1953 నుంచి 1961 లోపు జన్మించిన వారందరిని గుర్తిస్తున్నారు. ఓటర్ల జాబితాల్లోని వయసు ఆధారంగా కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. ఇప్పటికే మెజారిటీ వీఆర్ఓలు గ్రామాలలో అర్హుల జాబితాలను తయారు చేసి తహసీల్దార్లకు అందజేయగా, వారు కలెక్టర్లకు కూడా పంపించారు. ఈ జాబితాను పరిశీలించి కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రెట్టింపు కానున్న పింఛన్లు ఉమ్మడి ఆదిలాబాద్లో ప్రస్తుతం 3,62,721 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 1,13,941 మంది వృద్ధాప్య పింఛనుదారులే ఉన్నారు. వీరి తర్వాత వితంతువులైన మహిళా పింఛనుదారులు 1,26,669 మంది. ఇక ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులతోపాటు హెచ్ఐవీ, ఫైలేరియా పేషంట్లు 10 కేటగిరీల్లో కలిపి నెలకు సుమారు రూ.39 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లింపులు జరుపుతోంది. ముఖ్యమంత్రి ఎన్నికల హామీ మేరకు వృద్ధులు, వితంతుల, ఒంటరి మహిళలలు, ఇతర కేటగిరీల్లోని వారికి ఇప్పుడిస్తున్న రూ.1,000ని రూ. 2,016 , దివ్యాంగుల పింఛన్లను రూ.1500 నుంచి రూ.3016కు పెంచారు. ఈ లెక్కన ఆసరా పింఛన్ల బడ్జెట్ కూడా రెట్టింపు కానుంది. ఇక వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సును 64 నుంచి 57కు కుదించడం వల్ల ప్రతి జిల్లాలో వేలాది మంది కొత్తగా పింఛనుదారులు కానున్నారు. ఈ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్లో పింఛన్లకు రూ.80 కోట్లపైనే వెచ్చించాల్సి ఉంటుంది. నిర్మల్లోనే అధికం ఆసరా పింఛన్ల లబ్ధిదారులు నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ బీడీ కార్మికులు ఏకంగా 63,206 మంది ఉండడంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. అన్ని కేటగిరీల పింఛను దారులు కలిపి 1,48,679 మంది ఉండగా, వీరి కోసం ప్రభుత్వం రూ.15.37 కోట్లు నెలకు వెచ్చిస్తోంది. అతి తక్కువగా కుమురంభీం జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 51,201గా ఉంది. వీరికి నెల నెలా రూ.6.10 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. వయస్సు పరిమితి తగ్గించడంతో ఈసారి కుమురంభీం జిల్లాలో కూడా లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
ఆతిథ్య హృదయం
విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము ఆతిథ్యానికి, ఔదార్యానికి మారు పేరు. సోదరుడు చనిపోతే అతని కొడుకైన లోతూను తనతోపాటే ఉంచుకొని పెంచి పెద్దవాణ్ణి చేసిన అద్భుతమైన ప్రేమ ఆయనది. ఒకరోజున ముగ్గురు పరదేశులు ఇంటికొచ్చారు. తన ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్లవద్దని వారిని బతిమాలి మరీ అప్పటికప్పుడు అత్యంత రుచికరమైన భోజనాన్ని తన భార్యౖయెన శీరాతో వండించి వారికి పెట్టాడు. పరదేశులు కదా మంచి వాళ్లో చెడ్డవాళ్లో నాకెందుకులే అని ఆయన ఆలోచించవచ్చు. అప్పటికే శీరా వృద్ధురాలు. ఆమెనెందుకు కష్టపెట్టడం అని కూడా అనుకోవచ్చు. ముక్కూమొహం తెలియని వాడికి భోజనం పెడితే ఏమొస్తుంది? అని కూడా భావించవచ్చు. ఇది అవిశ్వాసుల ఆలోచనాతీరు. అలా ఆలోచించలేకపోవడమే అబ్రాహాము ప్రత్యేకతగా భావించి అలాంటి మరికొన్ని సుగుణాల కారణంగా దేవుడాయన్ని విశ్వాసులకు జనకుణ్ణి చేశాడు. ఆ రోజు వచ్చిన వారు పరదేశులు కాదు, పరదేశుల్లాగా కనిపించిన దేవదూతలని అబ్రాహాముకి ఆ తర్వాత అర్థమయింది. వారు తృప్తిగా భోజనం చేసి సంతోషంగా వెళ్లిపోతూ, త్వరలోనే అబ్రాహాము, శీరాలు కడు వృద్ధాప్యంలో కూడా ఒక కుమారుని పొందబోతున్నారని, ఆ మేరకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరబోతున్నదని నిశ్చయతనిచ్చి వెళ్లిపోయారు. ఈ విషయాన్నే హెబ్రీ పత్రికలో ప్రస్తావిస్తూ కొందరు పరదేశులకు ఆతిథ్యమిచ్చి తమకు తెలియకుండానే దేవదూతలకు సేవచేశారని శ్లాఘించారు (ఆది 18: 1–15; హెబ్రీ 13:2) ఆతిథ్యం విశ్వాసుల ఇంటికి సంబంధించిన విషయం కాదు, అది వారి హృదయానికి చెందిన విషయం!! – ఆశ్రయ -
మంటకలిసిన మానవత్వం.. అనారోగ్యంతో ఉన్నాడని..
సభ్య సమాజం తలదించుకునేలా.. మానవత్వం మంట కలిసిందా అని ప్రశ్నించేలా ఓ విషాద ఘటన తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో చోటుచేసుకుంది. సిరిసిల్ల నెహ్రూనగర్లోని అద్దె ఇంట్లో నివాసముంటున్న సిరిపురం వెంకటమల్లు(70)ను అనారోగ్యంతో ఉన్నాడనే కారణంతో చనిపోతే ఇల్లు శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని కనుకుంట్ల మల్లయ్య ఆసుపత్రి నుంచి ఇంట్లోకి రావడానికి అనుమతించలేదు. ఇంటిముందు ఉంచేందుకు సైతం ఒప్పుకోలేదు. దాంతో గత్యంతరం లేక వెంకటమల్లు కుటుంబసభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా ఇందిరమ్మకాలనీ ఊరు చివరకు తరలించారు. అక్కడే కప్పుకునే బట్టలతో గుడిసె లాంటిది ఏర్పాటు చేసుకొని వారం రోజులుగా చలిలోనే వెల్లదీస్తున్నారు. గురువారం వెంకటమల్లు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచాడు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిపురం వెంకటమల్లు ఎన్నో ఏళ్లుగా మరమగ్గాల కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సంవత్సర కాలంగా అనారోగ్యంగా ఉండటంతో పని చేయడం లేదు. తరచూ సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు. సిరిసిల్ల నెహ్రూనగర్లో కనుకుంట్ల మల్లయ్య ఇంట్లో రూ.వెయ్యికి గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వారం రోజుల పక్షం రోజుల క్రితం వెంకటమల్లు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయగా.. ఇంటి యజమాని మల్లయ్య ఇంట్లోకి తీసుకురావడానికి అనుమతించలేదు. ఎంత ప్రధేయపడినా ఒప్పుకోలేదు. దాంతో దిక్కుతోచని స్థితిలో ఆటోలో కార్మిక క్షేత్రం ఇందిరమ్మకాలనీ ఊరి చివరికి తీసుకొచ్చారు. ఊరి చివరన దుస్తులతో గుడిసె లాంటి నిర్మాణం ఏర్పాటు చేసుకొని చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ వెల్లదీస్తున్న క్రమంలో గురువారం ఉదయం 9 గంటలకు వెంకటమల్లు మరణించాడు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు మమత, రమ్య, కొడుకు మధన్ ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహం జరగగా.. కొడుకు మధన్ ఐటీఐ చదువుతున్నాడు. గూడు లేని పక్షుల వలే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మనసున్న చాలామందిని కంటతడి పెట్టించింది ఈ ఘటన. మనుషుల్లో మానవత్వం ఉందా లేక చచ్చిపోయిందా అని మనకి మనమే ప్రశ్నించుకునే పరిస్థితిని కల్పించింది ఈ సంఘటన. వెంకటమల్లు కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేయూతనందించాలని, ఉండడానికి గూడు కల్పించాలని ఇందిరమ్మకాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కౌన్సిలర్ ఔదార్యం సిరిసిల్లటౌన్: కార్మిక క్షేత్రం సిరిసిల్లకు చెందిన సిరిపురం వెంకటమల్లు(65) అనే నేత కార్మికుడు గురువారం అనారోగ్యంతో చనిపోయాడు. పట్టణంలోని నెహ్రూనగర్కు చెందిన వెంకటమల్లు చాలా రోజులుగా స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం అనారోగ్యంతో చనిపోగా.. సొంతిల్లు లేక అతడి శవాన్ని యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మృతదేహాన్ని తంగళ్లపల్లిలోని ఇందిరానగర్కు తరలించారు. కుటుంబసభ్యుల వద్ద అంత్యక్రియలు జరపడానికి డబ్బులు లేకపోవడంతో.. 15వ వార్డు కౌన్సిలర్ అన్నారం లావణ్యశ్రీనివాస్ రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు. -
వృద్ధుల హక్కులను గుర్తించాలి: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలోని వృద్ధులకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను గుర్తించి, వాటిని అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వృద్ధాశ్రమాల వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని కోరింది. వృద్ధుల సంక్షేమంపై సంజీవ్ పాణిగ్రాహి, సీనియర్ న్యాయవాది అశ్వినీ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం..‘వృద్ధుల గౌరవం, ఆశ్రయం, ఆరోగ్యంతో జీవించే హక్కును రక్షించటానికి, అమలు చేయటానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి’అని పేర్కొంది. వృద్ధాప్య పింఛను విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో వృద్ధులకు వైద్య సదుపాయాలు, వృద్ధాప్య వ్యాధుల చికిత్సా నిపుణులు ఎందరున్నారో తెలపాలని కోరింది. ‘తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమ, నిర్వహణ చట్టం–2007 సరిగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. వృద్ధుల హక్కుల పరిరక్షణ సక్రమంగా అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, చర్యలు తీసుకోవాలి’అని ఆదేశించింది. జనవరి 31వ తేదీలోగా కేంద్రం సమాధానాలు తెలియజేయాలని కోరుతూ కేసును వాయిదా వేసింది. కాగా, 2011 లెక్కల ప్రకారం దేశంలో 10.38 కోట్ల మంది వృద్ధులుండగా 2026 నాటికి వీరి సంఖ్య 17.3 కోట్లకు చేరుకుంటుందని అంచనా. -
పేదోడి ఇంట్లో దొంగతనం
అనంతపురం, పరిగి: పేదోడి ఇంట్లో చోరీ జరిగింది. పింఛన్ సొమ్ము అపహరణకు గురవడంతో బాధిత వృద్ధ దంపతులు లబోదిబోమంటున్నారు. శ్రీరంగరాజుపల్లి ఎస్సీ కాలనీలో ముత్యాలప్ప గారి నరసింహప్ప తన భార్యతో కలిసి ఓ ఇంట్లో నివాసముంటున్నారు. వీరి ఏకైక కుమార్తెకు పెళ్లి చేశారు. ఇక నరసింహప్ప దంపతులు కూలి పనులు చేయడం చేతకాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే పింఛన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. ఒక పూట భోజనం చేస్తే మరో పూట పస్తులుండి కాలం నెట్టుకొస్తున్నారు. పింఛన్ డబ్బులో నెలనెలా కొంత పొదుపు చేసుకుంటూ బీరువాలో భద్రంగా దాచుకున్నారు. ఈ క్రమంలో గత సోమవారం రాత్రి గ్రామంలోనే ఉంటున్న కూతురి ఇంటికి వెళ్లారు. అక్కడే పడుకుని మంగళవారం ఉదయాన్నే ఇంటికి వచ్చేశారు. అప్పటికే తాళం పగులగొట్టి ఉండటంతో ఆత్రుతగా లోనికి వెళ్లారు. బీరువా తెరిచి.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం గమనించారు. దాచుకున్న డబ్బు కనపడకపోయే సరికి కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు రూ.12వేలు చోరీ అయ్యిందని వాపోయారు. ముసలివయసులో తమ అవసరాలకు ఉపయోగపడుతుందని ఒక పూట తిని.. మరొక పూట పస్తులుండి దాచుకుంటే ఇలా అయ్యిందే అంటూ విలపించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం పోలీసులు గ్రామానికి వచ్చి వివరాలు సేకరించారు. -
ఇద్దరు
ధైర్యం అంటే అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానంలోకి వెళ్లి రావడం కాదు. ఉదయాన్నే ఇంటి నుండి బయల్దేరాక, లోకంలో నానా రకాలైన మనుషులతో తలపడి మనసు పాడు చేసుకోకుండా తిరిగి క్షేమంగా ఇంటికి చేరడం. పిరికితనం అంటే ‘బాబోయ్ దెయ్యం’ అని భయపడి పరుగెత్తడం కాదు. కష్టం రాగానే, ‘దేవుడా కాపాడు’ అని వలవల ఏడ్చేయడం. నలుగురు మనుషులు ఆ చీకట్లో కూర్చొని ఉన్నారు. ఆ నలుగురూ నాలుగు రకాల వయసుల వాళ్లు. ఒక యువకుడు. ఒక వృద్ధుడు. ఒక మధ్యస్థుడు. నాలుగో వ్యక్తి వయసే.. సరిగ్గా తెలియడం లేదు. పుట్టినప్పట్నుంచీ అతడు ప్రతి వయసులోనూ పదేళ్లు తక్కువగానే కనిపించేవాడు. వాళ్లు నలుగురూ కూర్చొని ఉన్న చోటు.. ఒక ప్రమాద స్థలి. అదొక మలుపు. అక్కడెప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడికి సమీపంలోనే రైలు పట్టాలు ఉన్నాయి. అక్కడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే అవి అనుకోని ప్రమాదాలు కావు. అనుకుని చేసుకునే ఆత్మహత్యలు! యువకుడు బాధపడుతున్నాడు. అందానికి కిరీటం ఉంటుంది. తెలివికి స్కాలర్షిప్ ఉంటుంది. ధైర్యానికి పతకం ఉంటుంది. అందవిహీనులకు, తెలివిలేనివాళ్లకు, భయస్థులకు ఈ లోకంలో చోటు లేదా? వారినెవరూ గుర్తించరా? అని ఆవేదన చెందుతున్నాడు. వృద్ధుడు యువకుడి వైపు ప్రేమగా చూశాడు. ‘‘చూడబ్బాయ్. లోకంలో ఏదైతే తక్కువగా ఉంటుందో దానికే విలువ ఉంటుంది తప్ప, తక్కువైనదేదీ ఈ లోకానికి విలువైనది కాదు’’ అన్నాడు. అర్థం కానట్లు చూశాడు యువకుడు. వృద్ధుడు నవ్వాడు.‘‘అందం తక్కువ. లోకం పట్టించుకోదు. చదువు తక్కువ. పట్టించుకోదు. ధైర్యం తక్కువ. పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదంటే.. ఇలా తక్కువగా ఉండేవాళ్లే మనుషుల్లో ఎక్కువ. అందం, ప్రతిభ, ధైర్యం.. ఇవి ఉండేవాళ్లు మనుషుల్లో తక్కువగా ఉంటారు కనుక, ఆ తక్కువగా ఉండేవాళ్లను పట్టించుకుంటుంది. లోకం నైజమిది. ఇందులో బాధపడవలసిందీ, వెళ్లి బావిలో పడవలసిందీ ఏమీ లేదు’’ అన్నాడు యువకుడి తలపై జుత్తును చేత్తో నిమురుతూ. నాలుగో వ్యక్తి మౌనంగా వింటున్నాడు. అతడికీ ఈలోకం ఏ రూపంలోనూ గుర్తింపును ఇవ్వలేదు. అతడి జీవితం ఓ రోజు అకస్మాత్తుగా ‘మలుపు’ తిరిగే వరకు ‘వయసు తక్కువతనమే’ అతడి గుర్తింపు. ‘‘అయినా లోకం తీరింతే? నన్ను పిరికివాడు అంది. నిజానికి నేను పిరికివాడిని కాదు’’ అన్నాడు మధ్యవయస్కుడు.. మాటల మధ్యలోకి వచ్చి. ‘‘ఒంటి మీద కండలున్నాయ్. కళ్లు చురుగ్గా ఉన్నాయ్. మీకు పిరికితనం ఏంటి?’’ అన్నాడు యువకుడు.. మధ్యస్థుడితో. వృద్ధుడు పెద్దగా నవ్వాడు. ‘‘పిరికితనం బాడీలో ఉండదబ్బాయ్. మైండ్లో ఉంటుంది’’ అని ఆ యువకుడితో అని.. ‘‘ఎందుకు నిన్ను ఈ లోకం పిరికివాడు అంది చెప్పు? నీ బాధలు లోకానికి చెప్పుకున్నావా? లేక, లోకంలోని బాధలు నువ్వు చూడలేకపోయావా?’’ అని మధ్యస్థుడిని అడిగాడు. మధ్యస్థుడు విరక్తిగా నవ్వాడు. ‘‘అర్థం చేసుకోవలసిన వాళ్లే నన్ను పిరికివాడు అన్నారు’’ అన్నాడు. ‘‘ఎవరు ఆ అర్థం చేసుకోవలసినవాళ్లు’’.. అడిగాడు నాలుగో వ్యక్తి. ‘‘మా డాక్టర్’’ చెప్పాడు మధ్యస్థుడు. ‘‘నిజమే.. డాక్టర్లకు వెటకారం ఎక్కువైంది ఈ మధ్య. ‘తల తిరుగుతోంది డాక్టర్’ అంటే.. ‘భూమి తిరుగుతోంది కదా.. అందుకే తల తిరుగుతోంది’ అంటున్నారు..’’ అన్నాడు నాలుగో వ్యక్తి. ‘‘అసలు.. డాక్టర్ దగ్గరకి మీరెందుకు వెళ్లారు అంకుల్’’ అన్నాడు యువకుడు ఆ మధ్యస్థుడిని. ‘‘ఓ రోజు ఒంట్లో గాబరాగా ఉంటే వెళ్లాను. బీపీ ఉందన్నాడు. వరుసగా నాలుగు వారాలు బీపీ చూశాక మందులు రాసిచ్చాడు. నాకిదేం ఖర్మ అనుకున్నాను. లైఫ్ లాంగ్ వాడాలన్నాడు. రోజూ ఒకే టైమ్కి మాత్ర పడాలన్నాడు. మాత్రకు ముందు ఏదైనా తినాలని అన్నాడు’’ అని చెప్పాడు మధ్యస్థుడు.‘‘ఎందుకాయన మిమ్మల్ని పిరికివాడు అన్నాడు అంకుల్..’’ కుతూహలంగా అడిగాడు యవకుడు. ‘‘హాహ్హాహా.. పేషెంట్ని పిరికివాడు అంటే.. డాక్టర్ ధైర్యస్థుడు అయిపోతాడు. అందుకని అలా అని ఉంటాడు’’ అని పెద్దగా నవ్వాడు నాలుగో వ్యక్తి.వృద్ధుడు ఏం మాట్లాడ్డం లేదు. రయ్యిన మలుపు తిరుగుతున్న వాహనాలను చూస్తూ మౌనంగా వీళ్ల మాటలు వింటున్నాడు. అతడికనిపించింది..మలుపు దగ్గర కూడా ఈ మనుషులు రయ్యిన ఎందుకు తిరుగుతారోనని!యువకుడి వైపు చూసి చెప్పాడు మధ్యస్థుడు.. ‘‘మాత్ర వేసుకోవడం మర్చిపోయి, ఓ రోజు డాక్టర్ దగ్గరికి పరుగెత్తుకెళ్లాను. ‘ఏమైంది?’ అన్నాడు. ‘బీపీ మాత్ర వేసుకోవడం మర్చిపోయాను డాక్టర్’ అన్నాను. ‘అయితే ఏమైంది?’ అన్నాడు. ‘ఏదో తేడాగా ఉన్నట్లుంది’ అన్నాను. బీపీ చెక్ చేశాడు. ‘నార్మల్’ అన్నాడు. ‘ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోకపోతే ఏం కాదు’ అని చెప్పాడు’’.‘‘అప్పుడన్నాడా.. మిమ్మల్ని పిరికివాడని’’ అడిగాడు యువకుడు. ‘‘అప్పుడు కాదు. ఇంకోసారి వెళ్లాను. ‘బీపీ టాబ్లెట్ వేసుకున్నానో, వేసుకోలేదో గుర్తుకు రావడం లేదు. ఒకవేళ వేసుకుని ఉండి, మళ్లీ వేసుకుంటే బీపీ డౌన్ అవుతుందా? వేసుకుని ఉంటాన్లెమ్మని ఊరుకుంటే.. బీపీ రైజ్ అయ్యే అవకాశం ఉందా?’’ అని డాక్టర్ని అడగడానికి వెళ్లాను. ‘‘అప్పుడన్నాడా నిన్ను పిరికి అని’’ అడిగాడు నాలుగో వ్యక్తి. ‘‘అప్పుడు కాదు’’ అన్నాడు మధ్యస్థుడు. ‘‘మరి!’’‘‘మళ్లీ ఓ రోజు పరుగున వెళ్లాను డాక్టర్ దగ్గరకి. ‘మళ్లీ ఏమైంది!’ అన్నాడు. ‘వేసుకోవలసిన టైమ్ కంటే ఓ గంట ముందు బీపీ టాబ్లెట్ వేసుకున్నాను డాక్టర్. ఏమైనా అవుతుందా?’ అని అడిగాను.అప్పుడన్నాడు.. ‘నీ అంత పిరికి మనిషిని నేనింత వరకూ చూళ్లేదు’ అని. అప్పట్నుంచీ నన్నంతా పిరికివాడిలా చూడ్డం మొదలుపెట్టారు. ఈ పాడులోకంలో బతకడం వేస్ట్ అనిపించింది.. అందుకే ఓ రోజు..’’అని ఆగి, యువకుడి వైపు చూశాడు మధ్యస్థుడు. అతడలా చూడగానే వృద్ధుడు అకస్మాత్తుగా పైకి లేచాడు. యువకుడి భుజం మీద చెయ్యి వేసి అక్కడి నుంచి చీకట్లోకి నడిపించుకు వెళ్లాడు!‘‘ఈరోజు ఎలాగైనా ఆ కుర్రాణ్ణి మోటివేట్ చేసి పట్టాల మీదకు తీసుకెళ్దామనుకున్నా. ముసలాడు పడనివ్వలేదు’’ తిట్టుకున్నాడు మధ్యస్థుడు. ‘‘నేను కూడా.. మలుపులో ఎవరైనా దొరక్కపోతారా అని కూర్చున్నాను. ఆ ముసలి పీనుగ కళ్లన్నీ మలుపు మీద, నా మీదే ఉన్నాయి’’ అన్నాడు నాలుగో వ్యక్తి. ‘‘అడుగో మళ్లీ ఇటే వస్తున్నాడు చూడు’’ అన్నాడు మధ్యస్థుడు. ‘‘అవునవును ఇక రాత్రంతా ఇక్కడే డ్యూటీ చేసేస్తాడు..’’ తిట్టుకున్నారు ఇద్దరూ. ‘‘ఏంటి? నా గురించేనా?’ అంటూ వాళ్లను సమీపించాడు వృద్ధుడు. అతడి పక్కన ఆ యువకుడు లేడు. భద్రంగా ఇంటికి పంపించేసినట్లున్నాడు. - మాధవ్ శింగరాజు -
అందరు చూస్తుండగానే గొంతు కోసేశాడు
గుర్రంపోడు(నాగార్జునసాగర్) : నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామంలో ఆది వారం సాయంత్రం ఓ వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. గ్రామస్తులు చూస్తుండగానే ఓ యు వకుడు వృద్ధుడి గొంతుకోసి హత్య చేశాడు. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రా మానికి చెందిన శివార్ల లింగయ్య(65) అనే వృ ద్ధుడు గ్రామ సెంటర్లో నడుచుకుంటూ వస్తున్నా డు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన కొట్ర అనిల్ అనే యువకుడు కత్తితో వెనుక నుంచి పొడిచి కింద పడిపోగానే కత్తితో గొంతుకోసి కత్తిని అక్కడే పడవేసి పారిపోయాడు. గమనించిన పక్కనే ఉన్న కొందరు దగ్గరకు చేరుకునేలోపే దారుణం జరి గింది. తీవ్ర రక్తస్రావంతో వృద్ధుడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. అనుమానంతో.. కోట్ర అనిల్ రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. లింగయ్య చేతబడి చేస్తున్నాడనే అనుమానం అనిల్ కుటుంబ సభ్యుల్లో నెలకొంది. గతంలో ఇదే విషయమై లింగయ్యపై దాడి చేయగా గ్రామంలో పంచాయితీ కూడా జరిగింది. పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో వివాదం అంతటిలో ముగిసింది. ఇటీవల అనిల్ ఆరోగ్యం క్షీణించడంతో ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. తన అనారోగ్యానికి లింగయ్య చేతబడే కారణమనే అనుమానంతో యువకుడు కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. హతుడు లింగయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని మల్లేపల్లి సీఐ శ్రీకాంత్రెడ్డి, ఎస్ఐ క్రాంతికుమార్లు పరిశీలించారు. నింది తుడు పరారీలో ఉన్నాడు. మండలంలో నాలుగో ఘటన ! గుర్రంపోడు మండలంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27 మండలంలోని తెరాటిగూడెం గ్రామంలో చేతబడి నెపంతో గ్రామం నడిబొడ్డున ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గతంలో తేనెపల్లిలోనే గ్రామంలో వృద్ధురాలు, తానేదార్పల్లి గ్రామంలో వృద్ధుడు హత్యకు గురయ్యారు. తాజాగా లిం గయ్య.. ఈ హత్యలన్నీ మంత్రాల నెపంతోనే జరిగినవే. బాగా అభివృద్ధి చెందిన గ్రామాల్లోనూ మంత్రాలు అనే మూఢనమ్మకాలతో దారుణాలు జరుగుతుండడం గమనార్హం. పోలీసులు కళా జాతా ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలతో అవగాహక కల్పిస్తునే ఉన్నా గ్రామాల్లో మూఢనమ్మకాల జాడ్యం వీడడం లేదు. -
అరవైలో ఇరవై!
కొందరు యువకులు పుట్టుకతోనే వృద్ధులేమో కానీ.. ఈ వృద్ధుల్లో మాత్రం వయసు మీదపడినా ఉత్సాహమే ఉత్సాహం. కృష్ణా రామా అంటూ ఓ దగ్గర కూర్చోవడం వాళ్ల చేత కాదు. సాటి పండుటాకుల్లో మనో స్థైర్యాన్ని నింపడమే వారి పని. అదే వాళ్లకు కొండంత బలం. అక్టోబర్ 1 ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్గా ఐక్యరాజ్య సమితి జరుపుతోంది. భారత్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వృద్ధులంటే ఇలా ఉండాలి అంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చెన్నైకి చెందిన ఉధవి అనే స్వచ్ఛంద సంస్థ. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఐదేళ్ల కింద మొదలైంది. అక్కడ వలంటీర్లంతా 75 ఏళ్ల పైబడిన వారే ఉండటం ఈ సంస్థ ప్రత్యేకత. వృద్ధులైతేనే సాటి వారి కష్టాలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో సీనియర్ సిటిజన్లనే వలంటీర్లుగా నియమించింది ఆ సంస్థ. ఇప్పుడు వారే ఒక సైన్యంగా మారారు. తమని తాము ఉత్తేజంగా ఉంచడమే కాదు, ఆపదలో ఉన్న తోటివారికి అండదండగా ఉంటున్నారు. అటు నుంచి ఫోన్ కాల్ ఒకటి వస్తుంది. ఏడుపు, బాధిస్తున్న ఒంటరితనం, ఏం చేయాలో తెలియని నిస్సహాయత, ఒక్కోసారి ఆత్మహత్యవైపు ప్రేరేపించే ఆలోచనలు. అయినవాళ్లు పట్టించుకోకపోతే ఆ బాధ అంతా ఇంతా కాదు. ఆ బాధ పంచుకోవడానికి ఒకరు కావాలి. అలాంటి ఫోన్ రాగానే 76 ఏళ్ల వయసున్న సుందర గోపాలన్ అనే వలంటీర్ రెక్కలు కట్టుకొని ఆ బాధితుల దగ్గరకి వెళ్లిపోతారు. వాళ్లతో కబుర్లు చెబుతారు. నవ్విస్తారు. కాసేపు పార్కుకి తీసుకెళ్లి చల్లగాలిలో వాకింగ్ చేస్తారు. 76 ఏళ్ల వయసులో కూడా తాను ఎంత హాయిగా ఉన్నానో వాళ్లకి చెబుతారు. అలా ఏదో ఒక్కసారి కాదు. వారంలో రెండు, మూడు సార్లు వాళ్ల దగ్గరికి వెళ్లి వస్తుంటారు. మళ్లీ వారి ముఖం మీద చిరునవ్వు వచ్చేవరకు కౌన్సెలింగ్ ఇస్తారు. ‘ఒంటరితనం మనిషిని చంపేస్తుంది. నా భర్త చనిపోయినప్పుడు అదెంత బాధిస్తుందో నాకు తెలిసొచ్చింది. అలాంటి బాధలో ఉన్నవారిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. జీవితం ముందుకు వెళ్లేలా వారికి అన్ని విధాలుగా సాయపడగలను’ అని సుందర గోపాలన్ వివరించారు. వేదవల్లి శ్రీనివాస గోపాలన్. ఆమె వయసు 85. ఈ వయసులో కూడా స్వెట్టర్లు అల్లుతారు. హ్యాండ్బ్యాగ్స్ తయారు చేస్తారు. వాటిని ఇరుగుపొరుగు వాళ్లకి, స్నేహితులకి అమ్మి ఆ వచ్చిన డబ్బుని కష్టాల్లో ఉన్న వృద్ధులకి ఇస్తూ ఉంటారు. ‘మా అమ్మ ఎప్పుడు చూసినా అదే పనిలో ఉంటుంది. తనని తాను కష్టపెట్టుకుంటుంది. ఆ పని వద్దన్నా వినిపించుకోదు. ఎంత ఎక్కువ మందికి సాయపడితే తనకు అంత తృప్తి అంటుంది. కానీ మాకు ఆమె ఆరోగ్యం ఏమైపోతుందోనన్న ఆందోళన ఉంటుంది‘అని వేదవల్లి కుమార్తె కృష్ణవేణి చెప్పుకొచ్చారు. ఉధవి సంస్థ వ్యవస్థాపకురాలు సబితా రాధాకృష్ణన్. ఆమె వయసు 75 ఏళ్లు. అయినవాళ్లు ఎవరూ లేక ఒంటరితనంతో బాధపడే వృద్ధుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపడం కోసమే ఆమె ఈ సంస్థ స్థాపించారు. చిన్న చిన్న అవసరాలైనా నేనున్నానంటూ తీరుస్తారు. గుళ్లు గోపురాలు తిప్పడం, షాపింగ్కు తోడు వెళ్లడం, రెస్టారెంట్లకి తీసుకువెళ్లడం, బ్యాంకు పనుల్లో సాయపడడం వంటివి చేస్తూ ఉంటారు. ‘సీనియర్ సిటిజన్ల దైనందిన కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఒంటరితనాన్ని పోగొట్టడమే మా సంస్థ ప్రధాన ఉద్దేశం. వలంటీర్లు అదే వయసు వారు ఉంటే వారి మధ్య వేవ్ లెంగ్త్ బాగా ఉంటుందని సీనియర్సిటిజన్లనే వలంటీర్లుగా నియమిస్తున్నాం‘అని సబిత వెల్లడించారు. ఇలాంటి సంస్థల అవసరం ఉంది మన దేశంలో సీనియర్ సిటిజన్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో వారి సంఖ్య పెరిగిపోతోంది. -
గోరువెచ్చని కన్నీరు
ఇంటి బయట కానుగ చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తూ, మట్టిలో పిచ్చి గీతలు గీసుకుంటున్న కోటయ్య, వ్యాను ఆగిన శబ్దానికి కంగారుగా తలెత్తి చూశాడు. అతని మనసంతా రాత్రి పెద్దాసుపత్రికి అంబులెన్సులో పోయిన తన కొడుకు రాములు గురించే ఆలోచిస్తోంది. ఏ క్షణాన ఏ వార్త వినాలో అనే ఆందోళన అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతలో దడాలున వ్యాన్ డోరు తెరుచుకుంది. అందులోంచి తన కొడుకు స్నేహితుడు రమణ దిగాడు. రాత్రి వాడే రాములు హఠాత్తుగా గుండెల్లో నొప్పంటూ పడిపోతే అప్పటికప్పుడే అంబులెన్సుకి ఫోను జేసి, హడావుడిగా ఆసుపత్రికేసుకెళ్ళింది. కోటయ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. లేచి నిలబడి ఏమైందని అడగబోతుండగా‘రే రమణ జాగ్రత్తగా పట్టుకుని దింపురా’ అంటూ లోపల్నించి ఎవరివో మాటలు వినిపించాయి. ఆ మాటల్తో పాటు ఓ స్ట్రెచర్ డోరులోంచి బయటికొచ్చింది. దాన్ని రమణ, ఇంకో వ్యక్తి ఇద్దరూ కలిసి జాగ్రత్తగా కిందికి దించారు. కోటయ్య మెల్లగా అడుగులు వేసుకుంటూ స్ట్రెచర్ దగ్గరికొచ్చి నిలబడి, రమణ వైపు ఏమైందన్నట్టు చూశాడు. రమణ సమాధానం చెప్పకుండా తలొంచుకుని నిలబడ్డాడు. వణుకుతున్న చేతిని నెమ్మదిగా ముందుకు చాచి, స్ట్రెచర్ మీదున్న తెల్లగుడ్డను తొలగించి చూశాడు కోటయ్య. రాములు...!నిర్జీవంగా...! మొదలు నరికిన చెట్టులాగా ఒక్కసారిగా కూలిపోయాడా అరవై ఏళ్ళ వృద్ధుడు. నోటి నుండి మాటలు రావడం లేదతనికి. ‘హమ్మా... ఎంత పని చేసినావురా దేవుడా...!? ఆ తీసుకొనిపొయ్యేదేదో నన్ను తీసుకోని పోగూడదట్రా స్వామీ...!’ అంటూ తలబాదుకుంటూ ఏడవటం మొదలుపెట్టాడతను. ఆ ఏడుపుకి చుట్టుపక్కల ఇళ్ళలోని వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైందేమోనని. కొంతమంది అతన్ని పట్టుకుని లేవదీసి, ఓదార్చడం మొదలుపెట్టారు. కొంతమంది ఎలా జరిగిందని ఆరాలు తీయడం మొదలుపెట్టారు.ఈ హడావుడికి ఇంటి గుమ్మానికి ఆనుకుని నిద్రపోతున్న మల్లి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఇంటి ముందంతా జనం. ఏమైందో అర్థమయ్యేలోపు ఓ నలుగురు ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆమెను పట్టుకుని ఏడవటం మొదలుపెట్టారు. కొందరు శవాన్ని తీసుకొచ్చి, గుమ్మంలో పరిచిన చాప మీద దక్షిణ దిశగా తల వుండేట్టు పడుకోబెట్టారు. నెమ్మదిగా లేచి వెళ్ళి రాములు శవం పక్కన కూర్చుంది మల్లి. అంతా ఏదో మాయలా ఉందామెకి. చుట్టూ ఉన్న జనమంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రమణ, కోటయ్య దగ్గర నంబర్లు తీసుకుని బంధువులందరికీ ఫోన్లు చేస్తున్నాడు. ఊళ్ళో పెద్దలంతా వచ్చి ఇంటి ముందేసిన షామియానా కింద కాసేపు కూర్చుని వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళంతా రాగాలు తీస్తూ ఏడుస్తున్నారు. కానీ మల్లి మాత్రం ఏడవటం లేదు. ఎందుకో ఆమెకి ఏడుపు రావడం లేదు. ‘మొగుడు చచ్చినా దాని కంట్లోంచి చుక్క నీళ్ళు కూడా రావడం లేదు! ఏం మనుషులో, ఏం సంసారాలో..!’ఎవరో దెప్పిపొడుస్తున్నారు. ‘అయినా ఇప్పట్లో మొగుడికంత విలువ ఎవరిస్తున్నార్లే.. ఆ కాలం ఎప్పుడో పోయింది.’ మరెవరో అందిస్తున్నారు.అవేమీ వినిపించడంలేదామెకి. గతమంతా మనసులో సుళ్ళు తిరుగుతుండగా, రాముల్నే చూస్తోందామె. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు. గురవయ్యకున్న ఇద్దరి కూతుర్లలో మొదటి కూతురు మల్లి. రెండో కూతురు జయ. మల్లి జయంత అందంగా ఉండదు. జయ కూడా పెద్ద అందగత్తేం కాదు. ఇద్దరూ చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నారు. అప్పట్నుంచీ పెళ్ళాం మీద దిగులుతో గురవయ్య తాగుడు మొదలుపెట్టాడు. పిల్లల్ని పట్టించుకునేవాడే కాదు. తెల్లవారుజామున పోతే ఎక్కడెక్కడో తిరిగి, దాదాపు అర్ధరాత్రి అవుతుండగాతూలుతూ ఇంటికొచ్చేవాడు. అంతవరకూ బిక్కు బిక్కుమంటూ ఎదురుచూస్తూ కూర్చునేవాళ్ళిద్దరూ. అమ్మ లేకపోవడంతో నానా అవస్థలు పడుతూ తమ పనులు తామే చేసుకునే వాళ్ళు.కొన్నాళ్ళ తర్వాత గురవయ్య స్తోమతలేక మల్లిని బడి మాన్పించేశాడు. జయ మాత్రం రోజూ బడికి వెళ్ళేది. ఇంట్లో మల్లిఒక్కతే ఒంటరిగా అన్ని పనులు చేసేది. ఖాళీగా ఉన్నప్పుడు ఏమీ తోచక అమ్మ నేర్పించిన పాటలు పాడుకునేది. తనలో తాను నవ్వుకునేది.ఏడ్చుకునేది. అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్ళేది. శాంతమ్మ టిఫిన్ సెంటర్లో పాత్రలు కడిగేది. ఎవరైనా అడిగితే చిన్న చిన్న పనులు చేసి పెట్టేది.ఆ వచ్చిన డబ్బుల్ని తన కంటే చెల్లికే ఎక్కువ ఖర్చుపెట్టేది. జయ అంటే అంత ఇష్టం తనకి. మల్లికి పదిహేనేళ్ళు రాగానే మొదటిసారిగా ఓ పెళ్ళి సంబంధం వచ్చింది. మగపెళ్ళి వాళ్ళొచ్చి పిల్లను చూసి వెళ్ళారు. కానీ వాళ్ళకి మల్లి నచ్చలేదు. జయ నచ్చింది. మల్లి బాధపడలేదు. సంతోషించింది. తను కాకపోయినా తన చెల్లయినా ఓ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోందని. జయకి పెళ్ళై వెళ్ళిపోగానే, మల్లికి దిగులు మొదలైంది. ఎప్పుడూ పరధ్యానంగా, ఏదో ఆలోచించుకుంటూ ఉండేది. గురవయ్య మాట్లాడించినా మాట్లాడేది కాదు. ఇంట్లోంచి బయటికి వచ్చేదే కాదు. ఎన్నెన్ని కలలు కనింది తను. ఎన్నెన్ని ఆశలు పెట్టుకుంది జీవితం మీద. అవన్నీ అడియాసలైపోతున్నాయన్న ఊహే, బతుకు మీద విరక్తి పుట్టించేదామెకి. మరమనిషిలా అన్ని పనులు చేసేది. తిండి ధ్యాసే లేదు. గురవయ్య మరీ బలవంతపెడితే, నాలుగు ముద్దలు తినేది. కొన్ని కొన్ని సార్లు ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ఆమెకు భయమేసేది. అందుకే పెందలకడనే అన్ని పనులు చక్కబెట్టుకుని, గుడిసెలో దీపం వెలిగించి, తండ్రి కోసం ఎదురుచూస్తూ కూర్చునేది. గురవయ్య ఎప్పటిలాగే బాగా చీకటి పడ్డాకగాని వచ్చేవాడు కాదు. కానీ ఆ వేళ మాత్రం కొంచెం తొందరగానే వచ్చేశాడు. వస్తూ వస్తూ తనతో పాటూ కోటయ్యని కూడా వెంటబెట్టుకొచ్చాడు. రావడం రావడమే ‘నాయనా...? నాయనా...?’ అంటూ మల్లిని కేకేశాడు. మల్లి భయం భయంగా బయటికొచ్చింది. ‘రొండు మంచినీళ్ళు తేపో... మావకి.’ తూలుతూ అన్నాడు గురవయ్య. నోట్లోంచి గుప్పుమంది సారాయి వాసన. నీళ్ళు తెచ్చిచ్చి తలుపు దగ్గర నిలబడుకుంది మల్లి. నీళ్ళు తాగి చెప్పడం మొదలు పెట్టాడు కోటయ్య.‘‘ఇంకేం రా గురవా...? పిల్లని చూస్తే మంచి బిడ్డ గానే ఉండాది. నీకిష్టమని ఒకమాట చెప్పేసినావంటే, ఈ వారమన్నా లేదా రేపు వారమన్నా వచ్చి చూసుకోనిపోతాం. ఏవంటావా?’‘అట్నే కానీ మావా’ అన్నాడు గురవయ్య మళ్ళీ తూలుతూ.‘పిల్లని కూడా ఒకమాట అడిగి చూడు. ఏమంటాదో. ’ అన్నాడు కోటయ్య మల్లి వైపు చూసి.‘ఆ పిల్ల ఏమంటాది మావా... నేనెంత చెప్తే అంత. నా కూతురు నా మాట జవదాటదు.’ నవ్వాడు గురవయ్య.‘సరే! మరి నేనింక బయలుదేరుతా. నువ్వేమీ భయపడాల్సిన అవసరంలేదు.నాగ్గూడా ఆడబిడ్డలు లేరు. ఇచ్చినావంటే నా కూతురు మాదిరిగా చూసుకుంటా. ఇద్దో ఇదే నా కొడుకు ఫోటో. సూడు.’ అంటూ గురవయ్యకి ఫోటో ఇచ్చి, మంచంలోంచి పైకి లేచాడు కోటయ్య.మల్లి తలుపు చాటు నుంచి మాటలన్నీ వింటూనే ఉంది. మరి కాసేపటికి కోటయ్య వెళ్ళిపోయాడు. గురవయ్య ఫోటో గూట్లో పెట్టి, గబగబా నాలుగు మెతుకులు తిని మత్తుగా పడుకుండిపోయాడు. మల్లికి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. ఎందుకో ఆ ఫోటో చూడాలనిపించింది. నెమ్మదిగా వెళ్ళి గూట్లో ఉన్న ఫొటో తీసి, దీపపు కాంతిలో చూసింది. చాలా కాలం తర్వాత ఆ రోజు మల్లి ముఖంలోకి వెలుగొచ్చింది.పెదాలపై చిరునవ్వు పూసింది. ఇది జరిగిన ఓ వారం పది రోజులకు ఊరి చివర కొండ మీదున్న గుడిలో ఏ హంగు, ఆర్భాటాలు లేకుండా మల్లికి రాములుతో పెళ్ళి జరిగింది. పెళ్లయిన తర్వాత ఆమె చాలా ఒద్దికగా ఉండేది. ఎప్పుడూ భర్తను కనిపెట్టుకుని, అతనికేం కావాలో అడక్కుండానే చేసిపెట్టేది. అతను పనికెళ్ళి వచ్చేసరికి అన్ని పనులు చేసేసి, వేడి నీళ్ళు పెట్టి, దగ్గరుండి స్నానం చేయించేది. అన్నాలు తిన్నాక, ఇద్దరూ మేడ మీద పడుకుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ‘జీవితం మొత్తం ఇలానే గడిచిపోతే బాగుణ్ణు.’ అనిపించేదామెకి. కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. పెళ్ళైన నెల తర్వాత ఓ రోజు, పనికి వెళ్ళిన రాములు గుండె నొప్పంటూ మధ్యాహ్నానికే ఇంటికొచ్చేశాడు. సమయానికి ఇంట్లో కోటయ్య కూడా లేకపోయేసరికి మల్లికి కంగారు మొదలయ్యింది. ‘డాక్టరుకి చూపిద్దాం పద బావా.’ అంటూ రాముల్ని బయల్దేరదీసింది. రాములు వినలేదు.‘వద్దులేవే. ఊరికే ఎందుకు డాక్టర్ దగ్గరికి పొయ్యేది? మొన్నే పట్నం పొయ్యి చూపించుకుని వచ్చినాం. అప్పుడు తెచ్చుకున్న మాత్రలు అట్నే ఉండాయి. అవి ఏసుకుని పడుకుంటే తగ్గిపోతాదిగానీ. సొంబులో నీళ్ళు ముంచుకొని, ఆ మాత్రల సంచి ఇట్టా ఎత్తుకుని రా.’ అన్నాడు నొప్పికి అల్లాడిపోతూ.మల్లి మాత్రలు, నీళ్ళు తెచ్చి ఇచ్చింది. కాసేపటి తర్వాత నొప్పి తగ్గి కాస్త ఉపశమనం కలిగింది రాములుకి.తర్వాత కూడా అప్పుడప్పుడు రాములు కడుపు నొప్పితో బాధ పడేవాడు. అలా జరిగిన ప్రతిసారీ మాత్రలో, నాటు మందులో తీసుకునేవాడు. నొప్పి తగ్గుముఖం పట్టేది. కోటయ్య కూడా అక్కడితో వదిలేసేవాడు. మల్లికి మాత్రం రాములు నొప్పితో బాధ పడుతున్న ప్రతిసారీ చివుక్కుమనేది. ఏం జరుగుతుందో ఏమోనని మనసు గాభరా పడేది. అలా మరో రెండు నెలలు గడిచిపోయాయి. మల్లి మనసులో మళ్ళీ జీవితం మీద ఆశలు చిగురించడం మొదలుపెట్టాయి. రోజు రోజుకీ రాములు మీద మమకారం పెరిగిపోతోంది. ఇద్దరి మధ్యా బంధం గట్టిపడుతోంది.ఆ రోజురాత్రి మల్లి ఎందుకో సంతోషంగా ఉంది. ఇద్దరూ మిద్దె మీద వెన్నెల్లో, చాప మీద పడుకుని శరత్కాలపు వెన్నెలను ఆస్వాదిస్తున్నారు. కానుగ చెట్టు గాలికి మెల్లిగా ఊగుతోంది. కాసేపు మాట్లాడుకున్నాక, ‘బావా...’ అంది మల్లి నిర్మలంగా ఉన్న ఆకాశం కేసి చూస్తూ.‘ఊ...’ అన్నాడు రాములు కళ్ళు మూసుకుని.‘నీకో మాట చెప్పాలి.‘ అందామె‘చెప్పు.’ అన్నాడు రాములు కళ్ళు తెరవకుండానే.‘ఇప్పుడు నాకూ...’ అని మల్లి ఇంకా ఏదో చెప్పబోతుంటే‘...అమ్మా...!’ అంటూ మూలిగాడు రాములు.ఉలిక్కిపడి చూసింది మల్లి.రాములు గుండె నొప్పితో మెలికలు తిరుగుతున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పందిట్లో పడుకున్న కోటయ్యను లేపుకొచ్చిందామె. ఇద్దరూ కలిసి రాములు చేత మాత్రలు మింగించారు. అయినా నొప్పి తగ్గలేదు. ఈసారి నాటు మందులు కూడా విఫలమయ్యాయి. అర్ధరాత్రి అయ్యేసరికి నొప్పి తారస్థాయికి చేరింది. రాములు నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు. ఊపిరి సరిగ్గా ఆడటం లేదతనికి. శరీరం ఉబ్బిపోతోంది. చెమటలు పోసేస్తున్నాయి. ఇక లాభం లేదని, కోటయ్య పక్కింటి రమణని కేకేశాడు. రమణ రావడం, అంబులెన్సుకి ఫోను చెయ్యడం, మరో ఇద్దరి సాయంతో ఆస్పత్రికి ఏసుకెళ్ళడం అన్నీ నిముషాల్లో జరిగిపోయాయి. ఆ రాత్రంతా గుమ్మానికి ఆనుకుని ఏడుస్తూనే ఉంది మల్లి. ఎప్పుడో తెల తెలవారుతుండగా నిద్రపట్టిందామెకి. లేచి చూసేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. రాత్రి తెల్లటి అంబులెన్స్ వ్యానులో వెళ్ళిన రాములు, పొద్దునకల్లా నల్లటి మార్చురీ వ్యానులో శవమై తిరిగొచ్చాడు. ఏ తప్పు చేయకపోయినా కొందరి జీవితాలు ఎందుకిలా విషాదమయం అయిపోతాయో ఎవ్వరికీ తెలియదు.అంత జరిగినా కూడా ఆమె ఏడవటం లేదు. అదే అక్కడున్న వారందరికీ ఆశ్చర్యంగా ఉంది. కోటయ్య తరపున వాళ్ళు ఎవరెవరో వస్తున్నారు. రాములు వైపు బాధగానూ, మల్లి వైపు వింతగానూ చూసి వెళ్ళిపోతున్నారు.‘పొద్దు పోతోంది ఇంక ఎత్తుబడి కానీయ్యండయ్యా.’ ఊరిపెద్ద సలహా ఇస్తున్నాడు.‘ఇంకా ఆ పిల్ల బంధువులెవరూ రాలేదే.!’ ఇంకో పెద్ద మనిషి సంజాయిషీ చెప్తున్నాడు.‘ఆ గురవయ్య తాగేసి ఏ చెట్టు కిందో పడిపోయుంటాడు. వోడి కోసం కూర్చుంటే కాదు. కానీయండి. కానీయండి.’ అంటున్నాడు ఊరిపెద్ద.‘ఆ నా కొడుకేమో ఎవరికో ఒకరికి ఇచ్చి చేసేయాలని చేసేశాడు. ఈడు చచ్చిపోయా..! ఇంకో రెండు రోజులుంటే ఆ కోటయ్య కూడా పోతాడు. ఆ తర్వాత ఆ బిడ్డ బతుకెట్ట?’ పాడె కడుతున్న ముసలోడు గొణుగుతున్నాడు.‘వోడికి గుండె జబ్బు ఉందని వాళ్ళ అబ్బకి ముందే తెలుసు తాతా. అంతా తెలిసే పాపం ఆ పిల్ల గొంతు కోశారు.’ ముసలోడికి పాడె కట్టడంలో సాయం చేస్తున్న యువకుడు చెప్తున్నాడు.పాడె సిద్ధమైంది. శవం కాళ్ళ దగ్గర టెంకాయ కొట్టి, పాడె మీద పడుకో బెట్టారు. ముందు కోటయ్య కుండలో నిప్పులు పట్టుకుని నడుస్తుండగా, రమణ, అతనితో పాటూ మరో ముగ్గురు యువకులు పాడె ఎత్తుకుని శ్మశానానికి బయల్దేరారు. సరిగ్గా అప్పుడొచ్చింది జయ. ఎలా తెలుసుకొని వచ్చిందో ఏమో. ఆటో దిగి పరిగెత్తుకుంటూ వచ్చి, పాడె వెళ్ళిపోతున్న వైపు నిరామయంగా చూస్తూ నిలబడ్డ మల్లిని ఒక్కసారిగా పొదివి పట్టుకొని ఏడవడం మొదలుపెట్టిందామె. మల్లి మాత్రం నిశ్చలంగా ఉంది. ఒక ఉలుకూ లేదూ, పలుకూ లేదు.‘ఏవైందే నీకు? కనీసం ఇప్పుడైనా ఏడవ్వే.’ అంటూ వెక్కి, వెక్కి ఏడుస్తోంది జయ.మల్లి ముఖంలో ఎటువంటి భావము లేదు. ఆమె కళ్ళు కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి. ఆమె మనసులో ఓ మథనం జరుగుతోంది. వర్షం ముందు ఏర్పడే నిశ్శబ్దంలాంటిది కాస్సేపామెని చుట్టుముట్టిన తర్వాత, నెమ్మదిగా ఆమె కళ్ళలోంచి, బుగ్గల మీదుగా జారాయి గోరువెచ్చని కన్నీళ్ళు. దూరంగా వెళ్ళిపోతున్న రాములు శవం కనుమరుగవుతుండగా... ఆప్యాయంగా తన మూడు నెలల కడుపును తడుముకుంటూ మౌనంగా ఏడ్చిందామె. అది ఏడుపు కాదు. రోదన. వెంకట్ ఈశ్వర్ -
కథలు చెప్పే తాతలు కామాంధులై..
మనవరాళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీయాల్సిన వృద్ధులు.. మదమెక్కిన మృగాలుగా మారుతున్నారు. తాతయ్యా అనే పిలుపుతో ఆనందాన్ని పొందాల్సిన కొందరు.. పసిమొగ్గలపై పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కమ్మని కథలు చెప్పి.. పిల్లల స్వచ్ఛమైన నవ్వుల్లో సంతోషాన్ని వెతుక్కోవాల్సిన ముదిమిలో.. కామపిశాచాలై రెచ్చిపోతున్నారు. శుక్రవారం జిల్లాలోని గుంటూరు, తాడేపల్లి మండలం నులకపేటలో ఇద్దరు వృద్ధులు బాలికలపై లైంగిక దాడికి యత్నించారు. సమాజపు విలువలను పాతాళంలోకి నెట్టేశారు. గుంటూరు, తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేట ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. మనవరాలు వయసున్న చిన్నారులపై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... నులకపేట రేంజ్ వద్ద నివాసం ఉండే యాభై సంవత్సరాల బెల్లం తిరుపతిరావుకు ఇద్దరు కుమార్తెలు. వారిరువురికి పెళ్లిళ్లయ్యాయి. భార్య ఇటీవల కూతుళ్లను చూసిరావడానికి వారింటికి వెళ్లింది. ఇంట్లో తిరుపతిరావు ఒక్కడే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో పక్క ఇంట్లో నివాసం ఉంటున్న 13 ఏళ్ల వయసు బాలికను, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మరో 9 ఏళ్ల బాలికను మామ్మ పిలుస్తుంది రండంటూ, చేతులు పట్టుకొని ఇంటికి లాక్కెళ్లబోయాడు. అయితే 13 ఏళ్ల బాలిక మామ్మ లేదు కదా, మేం ఇంటికి రామంటూ విడిపించుకొని పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది. రెండో బాలికను తిరుపతిరావు తన ఇంట్లోకి తీసుకువెళ్లి, తలుపులు వేసి, అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నం చేశాడు. పారిపోయిన రెండో బాలిక తన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఆమె తిరుపతిరావు ఇంటికి వచ్చి తలుపులు తెరవమని అరవగా, తిరుపతిరావు తలుపులు తెరవలేదు. దీంతో ఆమె చుట్టుపక్కల వారిని పిలవడంతో, గమనించిన తిరుపతిరావు తలుపులు తీసుకుని ఇంట్లోనుంచి పరారయ్యాడు. జరిగిన ఘటనపై స్థానికులు 100కు ఫోన్ చేసి చెప్పగా, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నడిపించిన మాట
స్వామీ వివేకానంద ఒకరోజు హిమాలయాల్లో సుదీర్ఘమైన కాలిబాట గుండా ప్రయాణిస్తున్నారు. అప్పుడు బాగా అలసిపోయి, ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉన్న ఒక వృద్ధుణ్ణి ఆయన చూశారు. స్వామీజీని చూస్తూ ఆ వృద్ధుడు నైరాశ్యంతో ఇలా అన్నాడు: ‘‘ఓ మహాశయా! ఇప్పటిదాకా ఎంతోదూరం నడిచి నడిచి అలసి సొలసి ఉన్నాను. ఇక ఎంతమాత్రమూ నేను నడవలేను. నడిచానంటే నా ఛాతీ బద్దలయిపోతుంది’’ అన్నాడు. ఆ స్థానంలో మనం ఉంటే ఏమి చేసేవాళ్లం? మహా అయితే ఆ వృద్ధుణ్ణి ఎత్తుకుని భుజాన వేసుకుని అతి కష్టం మీద కొంతదూరం నడిచేవాళ్లం . లేదంటే పెద్దాయన కదా, కాళ్లు పట్టుకున్నా పుణ్యమేలే అని కాసేపు కాళ్లు నొక్కి, సేదతీర్చి అప్పుడు ఆయనని నడిపించేవాళ్లమేమో! అయితే, స్వామి వివేకానంద అలా చేయలేదు. ఆ వృద్ధుడి మాటలను ఓపిగ్గా విని ఇలా అన్నారు:‘‘మీ కాళ్ల దిగువన చూడండి. మీ కాళ్ల కింద ఉన్న బాట, మీరు ఇప్పటి దాకా నడచి వచ్చిన బాట, మీ ముందు కనిపిస్తున్నది కూడా అదే బాట! అది కూడా త్వరలోనే మీ కాళ్లకింద పడిపోవడం ఖాయం’’ అన్నారు. అంతే, ఈ స్ఫూర్తిదాయక వచనాలు ఆ వృద్ధునికి కొండంత బలాన్నివ్వడంతో ఆయన తన కాలినడకను కొనసాగించాడు. – డి.వి.ఆర్. -
జీవసమాధికి యత్నించిన లచ్చిరెడ్డికి కౌన్సెలింగ్
గుంటూరు, మాచర్లరూరల్:ఆధ్యాత్మిక భావనతో జీవసమాధిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడికి అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వవలసివచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన తాతిరెడ్డి లచ్చిరెడ్డి అనే వృద్ధుడు ఇహలోక ఈతిబాధల నుంచి విముక్తి పొందేందుకు సజీవ సమాధిలోకి వెళ్లనున్నట్టు కుటుంబసభ్యులకు, బంధువులకు తెలిపాడు. అందుకు గాను 10 అడుగుల గొయ్యి కూడా సిద్ధం చేసుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవడంతో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మాచర్ల తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్ఐ లోకేశ్వరరావు ఆగమేఘాలపై గన్నవరం గ్రామానికి వెళ్లి లచ్చిరెడ్డి, అతని కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మానవ జీవితం ఎంతో విలువైనదని, బతికుండగా జీవసమాధి చేసుకోవడం నేరమని లచ్చిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. లచ్చిరెడ్డి మానసిక స్థితిని గమనించి, ఆయన మళ్లీ ఇటువంటి ప్రయత్నాలు చేసుకోకుండా బాధ్యత తీసుకోవాలని కుమారులు రామకృష్ణారెడ్డి, అక్కిరెడ్డిలకు తెలిపారు. వీఆర్వో బి.వెంకటేశ్వర్లు తదితరులున్నారు. -
సాయి అతీంద్రియ శక్తి
సాయిలీలలు ఆశ్చర్యకరంగానూ నమ్మలేని విధంగానూ ఉంటాయి. దాసగణు అనే భక్తుడు సాయిని అనుమతి కోరాడు – గంగలో స్నానం చేసి రావాలని. అది కూడా ప్రయాగలోనే అని. ఎప్పటిలాగానే సాయి చిరునవ్వు నవ్వి ‘గణూ! గంగాస్నానానికి ప్రయాగ దాకా వెళ్లాలా? ఈ మన ద్వారకమయే ప్రయాగ, ఇదే ద్వారక, ఇదే పండరిపురం కూడా’ అనడంతో దాసగణు సాయి పాదాల మీద ఆనందంగా శిరస్సు వాల్చి నమస్కరించాడో లేదో, సాయి పాదాల బొటన వేళ్లలో కుడి బొటన వేలు నుండి గంగా, ఎడమ బొటన వేలు నుండి యమునా ధారాపాతంగా ప్రవహించసాగాయి. అందరూ వింతగా చూస్తూ ఆ రెండు నదుల జలాన్నీ తీర్థంగా తీసుకున్నారు. ఇలా జరగడం సాధ్యమా? సాధ్యమే అయితే ఎలా? అనేది మన సందేహం. ఇది ఎలా సాధ్యం? సాధారణంగా మన లక్షణం ఎలా ఉంటుందంటే.. మనం చేయగలిగింది ఎంతో, ఏదో అలాగే అందరూ చేయగలుగుతారనీ, అలా కాకుండా గనుక ఎవరైనా చేస్తే.. అది ఎంత మాత్రం నిజం కాదనీ, అసలు నిజమయ్యే వీలే లేదనీ అనుకుంటుంటాం. ఇంకాస్త పైకి ఆలోచిస్తే.. ఇలాంటివి జరిగాయని చెప్పడం అభూతకల్పనలేనని వాదిస్తూ, అలాంటి వాటిని ప్రచారం కానీయకుండా చేస్తూ ఉంటాం. మంచిదే. అయితే ఇదే యుగంలో మన కళ్ల ముందే జరిగిన కొన్ని వాస్తవాల్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలూ చెప్పినవాటినీ చూపించినవాటినీ మనం ఈ సందర్భంలో గమనిద్దాం!భోపాల్లో అలాగే బీహార్లో కూడా పెద్ద భూకంపం వస్తే ఆ వచ్చిన కాలంలో పడిన భవంతుల మట్టి పెళ్లల కింద 72 గంటల పాటు ఒక వృద్ధుడు (68 ఏళ్లు) ఉండిపోయాడు. ఎవరికీ కనపడకుండా కావాలని దాక్కోవడం కాదు. తన మీద మట్టిపెళ్లలు పడి ఆ సమయంలో అరిచినా వినిపించనంతగా అయిపోయింది పరిస్థితి. నీళ్లూ తిండీ గాలీ మరి ఎలా లభించాయో తెలియదు. తర్వాత తవ్వుతుంటే కొన ఊపిరితో ఉంటే ఆయనని పైకి తీస్తే బతికాడు. దీన్ని నమ్మడం సగటు మనిషికి సాధ్యమా? మరి అతణ్ణి ఆ పెళ్లలని తీస్తూ, పైకి రప్పించడాన్ని ప్రసారమాధ్యమాలే చూపించాక కాదని అనలేముగా! మరి ఇదేమిటి?ఏడు సంవత్సరాల బాలుడు. పుట్టిందగ్గర్నుండే కనిపించిన ప్రతి వస్తువు మీదా చేతితో లయకి సరిపడే తీరులో కొడుతూ ఉండడం చేస్తూ ఉండేవాడు. సరిగ్గా 7వ సంవత్సరం వచ్చిందో లేదో సొంతంగా 5 మద్దెలని ఒకదాని పక్కన ఒకదానిని ఉంచి లయబద్ధంగా ఆ శాఖలో ప్రవీణులైన వారి ముందు వాయించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీన్ని కాదనగలమా?ఒక రైలు వేగంగా పరిగెడుతుంటే నిండు నెలలు నిండిన గర్భిణి శౌచాలయంలోనికి వెళ్లిందో లేదో, ఆ శిశువు, వ్యక్తులంతా కాలకృత్యాలు తీర్చుకునే ఆ గదిలో ఉండే నేలబారుకన్నం నుండి కిందికి పడిపోయింది. వెంటనే బండిని ఆపితే అది ఆ వేగానికి దాదాపు 1 కి.మీ. దూరంలో ఆగింది. వ్యక్తులు వెనక్కి పరుగెత్తారు. నిమిషాల క్రితం పుట్టిన శిశువు రైలు పట్టాల మధ్యనున్న నల్లకంకరరాళ్ల మీద ఎత్తు నుంచి పడడం, ఈ వ్యక్తులు ఆ శిశువుకోసం వెదకడం, కొంత సమయం గడిచిన తర్వాత కూడా ఆ శిశువు బతికే ఉండడం ఇది నమ్మగల నిజమేనా? మరి చూపించారుగా మాధ్యమాల్లో..గుండె నుండి పలుగు (గునపం లేదా గడ్డపారు) హృదయం నుండి వీపుని చీల్చుకుని ఇవతలికి వస్తే బతికి ఉండడం నిజం కాదా?కొన్ని కుక్కలు పిల్లి పిల్లలకి పాలు ఇవ్వడం, కొన్ని పదుల సంఖ్యలో పాముల్ని ఒక గదిలో పెట్టుకుని వాటి మధ్య పడుకుంటే అవి ఇటూ అటూ తిరుగుతూ అతణ్ని పట్టించుకోనట్లుగానూ, అతణ్ని ఓ రాయో, రప్పో, కొయ్య కర్రో అన్నట్లుగా భావిస్తూ అతణ్ని ఏ మాత్రం కరవకపోవడాన్ని చూస్తున్నాం కదా! ఇది ఆశ్చర్యం కాదా? ఏ మార్గం లేని కాలంలో, ఏ వంతెనా నిర్మించబడని కాలంలో ఏ ఊరికి ఏది తోవయో తెలుసుకునే వీలు ఏ మాత్రమూ ఉండని కాలంలో, చలీ వేడిమీ వర్షాలు ప్రకృతి ధర్మానికి అనుగుణంగా ఉండే కాలంలో, చేతిలో ఏ ఆహారానికి సంబంధించిన ముందు ఏర్పాట్లు లేకుండా, ఎక్కడ ఉండాలో ఆ వివరాలు తెలియకుండా ముందుగా అనుకోకుండా తానొక్కరే ఇటు రామేశ్వరం నుండి అటు హిమాలయ పర్వతం వరకూ (ఆ సేతు శీతాచలం) ఆదిశంకరులవారు తన 19వ ఏట, అది కూడా కాలినడకన వెళ్లొచ్చారంటే అది కళ్లకి కనిపించిన సత్యం కదా! అది అబ్బురపరిచే విషయం కాదూ? కొండ చిలువలు, పాములు, పులులు, సింహాలు, తోడేళ్లు విచ్చలవిడిగా తిరిగే తిరుమల అడవుల్లో గోగర్భమనే పేరున్న గుహలో రాత్రీ పగలూ అనే భేదమే లేకుండా తపస్సు మాత్రమే చేస్తూ సిద్ధిని పొందిన స్వాములవారిని మనం దాదాపు 200 సంవత్సరాల క్రితమే చూసి ఉండటం విస్మయపరిచే విషయం కాదా?ఈ తీరుగా ఎన్నెన్నో జరుగుతున్నా వాటిని ఆ సమయంలో చూసి ‘అబ్బో! ఆశ్చర్యం’ అనుకోవడం, మళ్లీ కొంతకాలం కాగానే మర్చిపోవడం. మళ్లీ మనదైన ధోరణిలో ఇవన్నీ నిజం కాదంటూనో, నమ్మవద్దంటూనో నోరేసుకుని పడటం సరైన పనేనా? పైవన్నీ కూడా దైవం ఏర్పాటు చేసిన లీలలు. అందరికీ అన్ని శక్తులూ ఉండవు, రావు కూడా. అలాగే అందరి మీదా దైవం తన శక్తిని ప్రసరింపజేయడు. అనుగ్రహాన్ని చూపించడు. ఇనుమనే లోహం అన్నింటి ఆకర్షణకీ లోను కాదు. కేవలం అయస్కాంతమనే దానికే లోబడుతుంది. శిశువు కూడా తనని కన్నతల్లి మాత్రమే – ఇతడు తండ్రి, ఇతడు అన్న.. అంటూ చెప్పినప్పుడు మాత్రమే అంగీకరిస్తాడు తప్ప ఆ తల్లి తనకి అలా పరిచయం చేయనప్పుడు ఒప్పుకోలేడు. చుట్టాల్లో ఎవర్నో చూపించి ‘ఫలానా’ అని చెప్తే ‘ఔనా? నిజమేనని నమ్మమంటావా?’ అన్నట్లు తల్లివైపే చూస్తాడు. ఆమె అంగీకారానికి లోబడే నమ్మడం, నమ్మకపోవడం చేస్తాడు. అంటే ఏమన్నమాట? సాధారణ జీవితాన్ని మాత్రమే గడిపే మనం మనదైన సగటు ఆలోచనల్లో ఉంటూ, అలా ఉన్నప్పుడూ అలాగే జరిగినప్పుడూ మాత్రమే ఆ సంఘటనలనీ లేదా ఆ సందర్భాలనీ నమ్ముతున్నామన్నమాట. అది సరికానే కాదని నిరూపించే ఘట్టాలే పైవన్నీ. సాయి కూడా అంతే! ఒక మసీదు గోడకి ఆనుకుని కూచోవడం, చలి లేదు, వాన లేదు, ఎండ లేదు ఎప్పుడూ ఆ ప్రదేశంలోనే ఉంటూ ఉండటం, లేదా ఆ పాడుబడిన మసీదులో తలదాచుకోవడం... ఇక తిండి విషయానికొస్తే భిక్షాటన ద్వారా వచ్చే రొట్టెలని తెచ్చుకోవడం, వాటిని మూతలు లేని పాత్రలోనే ఉంచడం, అటు నుండి కుక్కలు ఇటు నుండి పిల్లులూ ఇతర ప్రాణులు వచ్చి సగం కొరికినా, ఎత్తుకుపోయినా ఆ ఉన్నవాటినో మిగిలినవాటినో తింటూ జీవించడం... తానెప్పుడూ వ్యాధిగ్రస్తుడైనట్టుగా ఎక్కడా కనిపించకపోవడం... ఇవన్నీ కళ్లముందు కనిపించిన నిజాలేగా! కాదనలేం కదా!ఇప్పుడు ఇది ఎలా సాధ్యమయిందో చూద్దాం!శరీరంలో ఉండే కళ్లూ, చెవులూ, ముక్కూ, కాళ్లూ చేతులూ.. ఇలా అన్ని అవయవాల్నీ చూడగలుగుతున్నాం. అయితే శరీరంలో దాగిన మనసూ బుద్ధీ అనే వాటిని మాత్రం మనం చూడలేం. మనసు అనేది ఓ కోతిలాగా చంచలంగా ఉంటూ చెడుపనిని సైతం చేయవలసిందిగా ప్రేరేపిస్తుంటుంది. ఉదాహరణకి.. ఎవరైనా కొంత సొమ్మును ఎక్కడైనా పడవేసుకుంటే.. దాన్ని చూసిన కన్ను మనసుకి ఆ సమాచారాన్ని చేరవేస్తే.. ‘అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూడు జాగ్రత్తగా! లేని పక్షంలో జేబులో పెట్టెయ్! ఎవరడిగినా అది నాదే అని చెప్పు!’ అని ప్రేరేపిస్తుంది మనసు. చేసేవరకూ ప్రోత్సహిస్తుంది కూడా. అయితే తల్లిదండ్రుల సంస్కారం, మనల్ని పెంచిన, మనం పెరిగిన వాతావరణమనేదానికి అనుగుణంగా ‘బుద్ధి’ అనేది ఉంటుంది కాబట్టి, ఆ బుద్ధి ఇలా అంటుంది... ‘అది తప్పు, మనమే అలా పోగొట్టుకున్న పక్షంలో దొరికితే బాగుండుననుకుంటాం కదా! అలా ఆ సొమ్ము దొరికిన వ్యక్తి మనకిస్తే, ఎంతో ఆనందపడి ఆ వ్యక్తికి కృతజ్ఞులమయ్యుంటాం కదా! అదే మరో తీరులో జరిగి ఆ సొమ్ము మన వద్ద పట్టుబడి మనం దొంగగా నిరూపింపబడితే పరువుపోతుంది. మన మీద దొంగ అనే ముద్రపడుతుంది కదా!?’ అని. ఇదుగో! ఈ మనసుని ఆ బుద్ధికి లోబడేలా చేసినట్లయితే వ్యక్తి సరైన తీరులో జీవితాన్ని సాగిస్తాడు. కీర్తి ప్రతిష్టల్ని గడిస్తాడు. ఆ మనసే బుద్ధి ద్వారా ఈ శరీరాన్ని బాగా వ్యాయామం చేయవలసిందని శాసిస్తే ఆ శరీరం బాగా వ్యాయామాన్ని చేసి శరీరబలాన్ని సాధించి, వ్యక్తిని ఓ ‘పహిల్వాన్’ అని అందరూ అనేలా చేస్తుంది.అదే మరి మనసూ బుద్ధీ కలిసి తపస్సుని ప్రారంభించి ఏకాగ్రతతో దైవధ్యానం మీదే దృష్టిని పెడితే.. శరీరవ్యాయామం ద్వారా ఇంద్రియశక్తిని పొందగలిగితే.. (కన్నూ కాలూ చేయీ.. ఇలా అన్ని ఇంద్రియాలూ బలపడడం మంచి శక్తిని కలిగి ఉండడం) ఈ మనసూ బుద్ధీ కలిసి వాటికి సంబంధించిన మరో వ్యాయామం ద్వారా ఇంద్రియాలని అదుపు చేసి తమ అధీనంలో ఉంచుకోగల శక్తిని అంటే.. అతీంద్రియశక్తిని సాధింపజేస్తాయి వ్యక్తికి. అంటే కొద్దిగా వివరించుకోవాలి. త్వక్ (శరీరం) అనేది మొదటి ఇంద్రియం. ఇది ఎన్నో అవయవాల సమూహం. చలికీ వేడికీ కొంతవరకూ తట్టుకోగల ధర్మం కలిగినది మాత్రమే. అతీంద్రియ శక్తి అంటే.. చలీ వేడీ అనే వాటి ప్రభావానికి అతీతంగా ఉండటమని అర్థం. కుంభమేళాలో నాగాసాధువులు ఎక్కడి నుండి వస్తారో తెలియదు. గుంపులు గుంపులుగా వస్తూ ఎముకలు కొరికే చలిలో ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా ఉన్న శరీరంతో పరుగులు పెడుతూ గడ్డకట్టించే నీటిలో చక్కగా స్నానాన్ని సంతోషంగా ముగించి వెళ్లిపోతారు. ఎక్కడుంటారో ఎప్పుడు తింటారో, తినేందుకు వాళ్లకి ఏం దొరుకుతుందో ఊహాతీతం. అలాగే రెండవ ఇంద్రియమైన కన్ను, తాను చూడగలిగినంత దూరాన్ని మాత్రమే చూడగలుగుతూ ఉంటే, అతీంద్రియ శక్తిని సాధించిన వ్యక్తికుండే కన్ను గడిచిన సందర్భాన్నీ, వస్తువుని చూడడం కాకుండా, వ్యక్తుల్ని భౌతికంగా చూడడం కాకుండా, వాళ్లలో దాగిన విశేషాల్ని కనుక్కోగలుగుతుంది. ఇది నిజం కాబట్టి ఎందరో వ్యక్తులుంటే సాయి కొందర్ని మాత్రమే తన సమక్షానికి రావలసిందిగా నిరంతరం సేవలో ఉండవలసిందిగా కోరాడు. కోరతాడు. అలాంటి వారిలో ఒకడే దాసగణు. మనకి జ్ఞానాన్ని బుద్ధికి చేరవేసే శక్తి ఉన్న శరీర భాగాలని (ఇంద్రియాలు) జ్ఞానేంద్రియాలు అంటాం. వాటిలో మొదటిది త్వక్ (శరీరం). అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు పైన అనుకున్నట్టు ఏ వాతావరణానికైనా దుఃఖించదు. అదే సాయి మసీదు గోడకానుకుని మనకి తెలియజేసిన సత్యం. రెండవ జ్ఞానేంద్రియం కన్ను. అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు జరిగిన, జరుగుతున్న, జరగబోయే విషయాలని చూడగలుగుతుంది. ఇది నిజం కాబట్టే సాయి ఆ రోజున అన్నా సాహేబు బయలుదేరి వెళ్తుంటే.. ఈ రైలు ఆ స్టేషనులో ఆగదంటూ సూచించి మరీ రాగలిగాడు. మూడవది చెవి. అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా వాటిని వినగలుగుతుంది. ఇది నిజం కాబట్టే సాయి, ఆనాడు అన్నా సాహేబూ బాలాసాహేబూ ‘కర్మలూ వాటి ఫలితాలూ’ అనేదాని గురించి వాదప్రతివాదాలని తనకి వినిపించనంత దూరంలో చేసుకున్నా ‘ఎవరు గెలిచారు వాదంలో?’ అనగలిగాడు. నాలుగవది జిహ్వ (నాలుక). ఇది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఆ నోటితో ఏం మాట్లాడితే అది జరుగుతుంది. ఇది నిజం కాబట్టే దాసగణుతో మాట్లాడుతూ ‘నువ్వు రాదలుచుకోకపోయినా ఎందుకు రావో, ఇక్కడే సేవ చేస్తూ ఎలా ఉండవో చూస్తా’ అని అనగలిగాడు. ఐదవ ఇంద్రియం ఘ్రాణం(ముక్కు). అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఎవరికెంత పూర్వజన్మసంస్కారవాసన ఉందో ఈ విషయాన్ని గ్రహించగలగడం సాధ్యమౌతుంది. ఇది నిజం కాబట్టే సాయి తన వద్ద ఎవరెవరు ఉండవలసినవాళ్లో ఉండగలిగేవాళ్లో తెలుసుకుని, పూర్వజన్మసంస్కారపరులైన అలాంటివారిని మాత్రమే తన స్థానానికి పిలుచుకున్నాడు. వచ్చేలా చేసుకోగలిగాడు.ఈ అతీంద్రియశక్తి జ్ఞానేంద్రియాల విషయంలో పై తీరుగా ఫలిస్తే, అదే అతీంద్రియశక్తి కర్మేంద్రియాలైన మాట, కాలు, చేయి మొదలైన వాటిలో కూడా ఫలించి మాట ద్వారా వశం చేసుకోగలగడం, కాలు ద్వారా గంగా యమునల్ని ప్రవహింపజేయగలగడం.. ఇలా బాబా చేసిన మరిన్ని లీలలని తెలుసుకుందాం! ఎందుకు తెలుసుకోవాలిట? మన జీవితంలో కూడా తీవ్రాతి తీవ్రమైన అసాధ్యమైన సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఇలా తన లీల ద్వారా మనల్ని బయటపడేయగలడు కాబట్టి! (సశేషం) - డా. మైలవరపు శ్రీనివాసరావు -
తొమ్మిది పదుల యువకుడు
పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెం రూరల్: ఆవేశ పడితే బీపీ.. శారీరక వ్యాయామం లేకపోతే సుగర్.. కాస్త ఎక్కువగా నడిస్తే కీళ్ల నొప్పులు.. ఇవి నేటి ఆధునిక మానవుడిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు. కానీ వీటికి భిన్నంగా పట్టణంలోని రెండో వార్డుకు చెందిన కవల కృష్ణమూర్తి(91) నిలుస్తున్నారు. తొమ్మిదో తరగతి చదివిన కృష్ణమూర్తి తొమ్మిది పదుల వయస్సు పైబడినప్పటికీ తన పనులు తాను చేసుకుంటూనే కళ్లజో డు లేకుండా వార్తా పత్రికలు చదవడం విశేషం. వయస్సు పైబడే కొలదీ వచ్చే బీపీ, సుగర్, కీళ్లనొప్పులు వంటివి ఏమీ ఆయన దరి చేరలేదు. వయస్సు పైబడినప్పటికీ నిత్య యవ్వనుడిగానే ఆయనను పేర్కొనవచ్చు. తన ఆరోగ్య రహస్యంపై ఆయనను ప్రశ్నిస్తే మాత్రంఇలా చెప్పుకొచ్చారు. ఆహారం విషయంలో సమయ పాలన పాటించడం, ఎటువంటి చెడు అలవాట్లు లేకపోవడమే కారణమంటున్నారు. ఆయన ప్రస్తుత దినచర్య విషయానికొస్తే... ఉదయం రెండు ఇడ్లీలు తిని తొమ్మిది గంటలకు ఇంటి వద్ద బయల్దేరి నెమ్మదిగా అదే వార్డు యర్రా నారాయణస్వామి మున్సిపల్ పాఠశాల ఆవరణలోని గ్రంథాలయానికి రావడం వార్తా దినపత్రికలను చదవడం. తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం5 గంటలకు భోజనం. ఇదే ఆయన ఆహార పట్టిక. తొమ్మిది పదుల వయస్సు పైబడిన వృద్ధాప్యంలోనూ కనీసం కళ్లజోడు కూడా లేకుండా వార్తాపత్రికలను మొదటి నుంచి చివరి పేజీ అక్షరం వదలకుండా అవలీలగా చదివేస్తారు. ఈ వయస్సులో కనీసం బీపీ, సుగర్, కీళ్లనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఆయన దరి చేరకపోవడం విశేషం. -
బండరాయితో మోది వృద్ధుడి హత్య
పుల్కల్(అందోల్) : గుర్తు తెలియని వ్యక్తులు 70సంవత్సరాల వృద్ధుడిని బండరాయితో మోది హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని చౌటకూర్ శివారులో శనివారం తెల్లావారుజామున చోటుచేసుకుంది. మృతుడిని సెల్ఫోన్ ఆధారంగా గుర్తించారు. ఇందుకు సంబధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన ఒగ్గు భాగయ్య(70) ఇంట్లో నుంచి గత బుధవారం ఆస్పత్రికి వెళుతున్నానని చెప్పి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాని శుక్రవారం వరకు ఎక్కడికి వెళ్లింది.. ఎవరి వద్ద ఉన్నది తెలియలేదన్నారు. శుక్రవారం రాత్రి పుల్కల్ ఎస్ఐ ప్రసాద్రావు చౌటకూర్ శివారులో భాగయ్య మృతిచెంది ఉన్నాడని సమాచారం ఇవ్వగా తాము వెళ్లి చేశామన్నారు. ఇదిలా ఉంటే గుర్తుతెలియని వ్యక్తులు జోగిపేట నుంచి నమ్మించి చౌటకూర్ శివారులోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. కోన్నాల–చౌటకూర్ శివారు మధ్య గల డప్పు మొగులయ్య వ్యవసాయ పోలం వద్ద భాగయ్యను బండరాయితో మోది హత్య చేసినట్లుగా ఎస్ఐ ప్రసాద్రావు తెలిపారు. సంఘటన స్థలంలో రెండు బిర్యాని ప్యాకేట్లు, ఒక బాండ్ పెపర్, సెల్ఫోన్ లభించింది. దీన్నిబట్టి భాగయ్యను తెలిసిన వారే అక్కడికి తీసుకొచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి వెలుగు చూసిన ఈ సంఘటనను సంగారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, జోగిపేట సీఐ తిరుపతిరాజులు సందిర్శించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించిన ఎలాంటి ఆచూకి లభించలేదు. ఈ మేరకు మృతదేహాన్ని జోగిపేట ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
అత్యంత వృద్ధ మనిషి కన్నుమూత
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మనిషిగా గుర్తింపు పొందిన వయోలెట్ మోసె బ్రౌన్ 117 ఏళ్ల వయసులో మరణించింది. తీవ్ర డీహైడ్రేషన్కు గురై ఆమె ఈనెల 15న తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1900, మార్చి 10న బ్రిటిష్ పాలనలోని జమైకాలో బ్రౌన్ జన్మించారు. 2015లో బ్రౌన్ 115వ పుట్టిన రోజు సందర్భంగా బ్రిటన్ రెండో ఎలిజబెత్ రాణి ఆమె గౌరవార్థం ఓ లేఖను పంపారు. ఈ ఏడాది జూలై 27న 117 ఏళ్ల 139 రోజుల బ్రౌన్ పేరును గిన్నిస్ బుక్ అత్యంత వృద్ధ మహిళగా తమ రికార్డులో నమోదు చేసింది. ‘పంది మాంసం, కోడి మాంసం తప్ప అన్నీ తింటా. రమ్ లాంటి మత్తు పానీయాల జోలికిపోను’ అని బ్రౌన్ తన ఆరోగ్యరహస్యం చెప్పారు. ఆమె రెండో కొడుకు వయసు ప్రస్తుతం 96 ఏళ్లు కావడం విశేషం. బ్రౌన్ మరణంతో జపాన్కు చెందిన నబీ తాజిమా(117 ఏళ్ల 46 రోజులు) అత్యంత వృద్ధ మనిషిగా నిలుస్తారు. -
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
దుర్గి: గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఆదివారం జరిగింది. శనివారం సాయంత్రం నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి వెళ్లాలని అడిగొప్పల చేరుకుని ఆటోలు లేకపోవటంతో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బస చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆ వృద్ధుడు మృతిచెందినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న దుర్గి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. వృద్ధుడి వయసు సుమారు 75 సంవత్సరాలు ఉండవచ్చని, తెల్లపంచ, తెల్లచొక్కా ధరించి ఉన్నాడు. అతని వద్ద సంచిలో దుప్పటి, కండువా, జేబులో బస్సు టికెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వృద్ధుడు నర్సరావుపేట, చిలకలూరిపేట పరిసర ప్రాంతాలకు చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కర్మకాండలకూ డబ్బుల్లేవు..
‘మా అల్లుడు మూడు రోజుల క్రితం రైలు ప్రమాదంలో చనిపోరుుండు. మూడొద్దుల కర్మకు చేతిలో చిల్లి గవ్వలేదు.. ఉన్న డబ్బంతా బ్యాంకులోనే ఉంది.. దయుంచి పైసలు ఇయ్యండి..’.. అంటూ ఓ వృద్ధుడు బ్యాంకు మేనేజర్ వద్ద బోరున విలపించాడు. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తికి చెందిన అరుులపురం చంద్రయ్య వేదన ఇది. లింగాలఘణపురం గ్రామీణ వికాస్ బ్యాంకులో ఆయనకు రూ.42 వేల డిపాజిట్ ఉంది. అరుుతే జనగామలో ఉండే తన కుమార్తె భర్త మూడు రోజుల కింద రైలు ప్రమాదంలో మృతి చెందాడు. అక్కడ పుట్టింటి తరఫున చేయాల్సిన మూడు రోజుల కర్మ కార్యక్రమం కోసం డబ్బులు కావాలి. చేతిలో సొమ్ము లేకపోవడంతో చంద్రయ్య బ్యాంకుకు వచ్చాడు. కానీ బ్యాంకులో డబ్బు లేదనడం తో ఏం చేయాలో తెలియక బోరున విలపిం చాడు. అది గమనించిన మేనేజర్ రాజా మోహన్ తన వద్ద ఉన్న రూ.4 వేలు చంద్ర య్యకు ఇచ్చి పంపారు. -
మానవత్వం చాటుకున్న పోలీసులు
ప్రొద్దుటూరు క్రైం: ఓ వృద్ధుడు స్టేషన్ సమీపంలో పడిపోయి ఉండటంతో చలించిన పోలీసులు అతనికి మంచి బట్టలు తొడిగి ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. దువ్వూరుకు చెందిన వెంకటసుబ్బయ్య అనే వృద్ధుడికి నా అన్న వాళ్లు ఎవ్వరూ లేరు. అతనికి నాలుగు రోజుల క్రితం కామెర్లు సోకాయి. అయితే ఎక్కడికి వెళ్లలేని స్థితిలో ఉన్న అతను స్టేషన్ సమీపంలోనే కుప్పకూలి పోయాడు. నాలుగు రోజులుగా అక్కడే పడిపోయి ఆహారం లేకపోవడంతో బక్కచిక్కిపోయాడు. అందరూ చూస్తున్నారే గానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అతని పరిస్థితిని చూసి చలించిన త్రీ టౌన్ కానిస్టేబుళ్లు ప్రసాద్, నాగరాజు, సహారా వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి నరేంద్ర శనివారం సాయంత్రం వృద్ధుడికి మంచి బట్టలు తొడిగి, 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళ్లారు. త్రీ టౌన్ మహేష్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వెంకటసుబ్బయ్యకు వైద్యం అందేలా చొరవ తీసుకున్నారు. కామెర్లు పూర్తిగా తగ్గే వరకు ఆస్పత్రిలోనే ఉంచుకోవాలని ఎస్ఐ డాక్టర్లతో చెప్పారు. -
'ఇదొక యువకుల పైశాచికత్వం'
-
'ఇదొక యువకుల పైశాచికత్వం'
అహ్మదాబాద్: అది గాంధీమహాత్ముడు నడిచిన నేల. అహింస అనే ఆయుధం పుట్టిన పుణ్యభూమి.. కానీ, ఆ అహింస హింసపాలై మట్టిలో కలిసిపోయిందేమో అని అనుకోక మానదు ఈ ఘటన చూస్తే. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా ఎనిమిదిమంది యువకులు అంతా ఉడుకునెత్తురుతో ఉన్నవారే. కానీ అందులో సంస్కారలేమి అనే రక్తం పారుతోందనుకుంట. ఓ పాన్ డబ్బాదగ్గరకు వెళ్లి అక్కడ తమకు కావల్సిన వస్తువులు తీసుకొని డబ్బులు అడిగినందుకు పాన్ డబ్బా యజమాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. రోడ్డుపైకి ఈడ్చి చావు దెబ్బలు కొట్టారు. అదికూడా ఏమాత్రం దయలేకుండా పాన్ షాపులో ఉన్న అతడిని బయటకులాగి కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంత జరుగుతున్న తమకు ఏమీ పట్టనట్లుగా చుట్టూ నిల్చుని కొందరు వ్యక్తులు చూస్తుండటం మానవత్వం ధైర్యాన్ని కోల్పోయిందో.. స్వార్థాన్ని పులుముకుందో అనిపిస్తుంది. సెప్టెంబర్ 1న జరిగిన ఈ కళ్లు చెదిరే ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. -
చింతే తోడూ నీడ
'నాకు ఆస్తిపాస్తుల్లేవు.. రేయింబవళ్లు కూలికి పోయి.. నా నలుగురు బిడ్డల్ని కంటికి రెప్పలా పెంచాను. వారిని ప్రయోజకుల్ని చేశాను. ఇపుడేమో వయసు మీద పడింది. కష్ట పడలేని స్థితిలో ఉన్నా. ఆదరించి ఆదుకుంటారనుకున్న కన్నబిడ్డలు ఛీదరించుకున్నారు. దీంతో ఇలా రోడ్డున పడ్డాను. పక్కనున్న చింత చెట్టు తొర్రలో తలదాచుకుంటున్నాను' ఇది.. తల్లిదండ్రుల బాగోగులు చూడని బిడ్డల మానవత్వానికి ఓ ప్రశ్నలా.. సమాజ గమనానికి ఉదాహరణలా మిగిలిన ఎనభై ఏళ్ల ఓ వృద్ధుడి దీన గాథ. తిరుపతి మంగళం : ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీనివాసులు(80). చెట్టు తొర్రనే నీడగా చేసుకుని, కనిపించిన వారినల్లా చేయి చాచి అడుగుతూ.. ఆకలితో అలమటిస్తూ.. జీవిత చరమాంకంలో ఒంటరిగా నరక యాతన అనుభవిస్తున్నాడు. విషయం తెలియడంతో 'సాక్షి' ఆయనను పలకరించింది. కన్నీటితో తన మనోవేదనను, గుండెల్లో గూడుకట్టుకున్న బాధను, పడిన కష్టనష్టాలను ఏకరువు పెట్టాడు. శ్రీనివాసులు.. నగరి నియోజకవర్గంలోని ఇరుగువాయి గ్రామానికి చెందిన వాడు. నలుగురు సంతానం. కొడుకులు కుప్పయ్య, జయరామ్, పొన్నుస్వామితో పాటు కూతురు మల్లీశ్వరి ఉన్నారు. వారిని కంటికి రెప్పలా పెంచాడు. ఆస్తిపాస్తులేవీ లేకున్నా.. కన్న బిడ్డల్నే ఆస్తులుగా భావించి.. బాధ్యత గా పెంచి పెద్ద చేశాడు. వారికి పెళ్లిళ్లు చేసి ప్రయోజకుల్ని చేశాడు. ఇద్దరు కొడుకులు మంగళంలోని వెంకటేశ్వర కాలనీ, మరో కొడుకు బొమ్మల క్వార్టర్స్, కూతురు తిరుపతిలోని తాతయ్యగుంటలో స్థిరపడ్డారు. కాాలం పరుగులో వయసు మీద పడింది. భార్య ఐదారేళ్ల క్రితం చనిపోయింది. కూలికి వెళ్లి కష్ట పడలేని స్థితి. దీంతో ఇంటికి పరిమితమయ్యాడు. కన్న బిడ్డలపై ఆధారపడాల్సి వచ్చింది. తిరుపతి, వెంకటేశ్వర కాలనీలోని కొడుకుల వద్దకు చేరాడు. తమకు బరువయ్యావంటూ కన్న కొడుకులూ.. కోడళ్ల చీదరింపులు తప్పలేదు. గుండె బరువుతో బయటకు వచ్చేశాడు. ఇది తెలిసి తాతయ్యగుంటలో కూతురు తండ్రిని అక్కున చేర్చుకుంది. కొంత కాలం కంటికి రెప్పలా చూసుకుంది. అయితే కొడుకులు తిరిగి తండ్రిని తమ వెంట తీసుకెళ్లారు. తర్వాత నాలుగు రోజులకే ఛీదరింపులు, అవమానాలు మళ్లీ మొదలయ్యాయి. అంతే.. కన్నబిడ్డలపై మమకారం వదిలేసి.. మనసు చంపుకుని రోడ్డున పడ్డాడు. అయిన వారెందరున్నా.. ఒకరికి భారం కాకూడదనుకున్నాడు.. దాదాపు రెండు నెలల క్రితం తిరుపతి కరకంబాడి మార్గంలోని అక్కారాంపల్లికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఓ చింతచెట్టును ఆశ్రయంగా చేసుకున్నాడు. చెట్టు తొర్రలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఎంత ఎండలు కాసినా, వాన కురిసినా అక్కడి నుంచి కదలడం లేదు. చలించిన మాజీ సర్పంచ్... ఈ వృద్ధుడిని చూసి తిమ్మినాయుడుపాళెం మాజీ సర్పంచ్ ఆదం సుధాకర్రెడ్డి చలించి పోయారు. ఉదయం, రాత్రి తన ఇంటి వద్ద నుంచి భోజనం అందిస్తున్నాడు. మధ్యాహ్నం వృద్ధుడు ఉంటున్న చెట్టు పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు అందించే భోజనాన్ని ఆయనకు పెట్టిస్తున్నాడు. అతని జానెడు కడుపునకు నాలుగు మెతుకులు అందించి మానవత్వం చాటుకుంటున్నాడు. ఈ వృద్ధుడిని దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాల్సి ఉంది. -
వృద్ధుడు ఆత్మహత్య
రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు ఆంధ్రతండాలో భూక్య దాసు(69) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకు న్నాడు. ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు కొంతకాలం క్రితం చని పోయాడు. చిన్నకొడుకు కుటుంబం తో సహా హైదరాబాద్లో ఉంటున్నా డు. దాసు భార్య లక్ష్మితో కలసి తం డాలోనే ఉంటున్నాడు. ఆలనాపాలనా లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపం చెందిన దాసు ఆదివారం అర్ధరాత్రి ఉరేసుకున్నాడు. -
వృద్ధుడి ఆకలి చావు!
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో సోమవారం ఓ గుర్తుతెలియని వృద్ధుడు ఆకలి చావుకు గురయ్యాడు. వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చిన అతడు ఇస్లాంపూర, గౌలిగూడ ప్రాంతాల్లో భిక్షాటన చేసేవాడు. దొరికినప్పుడు తినడం.. లేకుంటే పస్తులుండడం చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం ఆకలితో అలమటించి చనిపోయాడు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో వృద్ధుడు మృతి
విజయవాడ టౌన్: నిత్యం రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే విచారణ కేంద్రం వద్ద అరవై సంవత్సరాల వృద్ధుడు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించాడు. బుధవారం ఉదయం 7 గంటల వరకు అతనిని ఎవరూ పట్టించుకోలేదు. ప్రయాణికులు దాటుకుని వెళ్తున్నారే తప్ప అతని గురించి కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు. చనిపోయిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
అవయవదానంతో ముగ్గురి ప్రాణాలు కాపాడిన వృద్ధుడు
సాక్షి, ముంబై: తను మరణిస్తూ అవయవదానంతో మరో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టాడు ఓ వృద్ధుడు (66). వివరాలు... డోంబివలిలో నివాసముంటున్న జయంతిలాల్ భానుశాలి నవీముంబైలో క్యాషియర్, అకౌంటెంట్గా పని చేస్తున్నారు. అయితే ఇటీవల కార్యాలయంలో పనిచేస్తూ కళ్లు తిరిగి పడిపోవడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగవకపోవడంతో కుటుంబ సభ్యులు మరో ఆస్పత్రికి తరలించారు. కాగా, నవీముంబైలోని ఆస్పత్రి వైద్యులు రోగి పరిస్థితి గురించి బంధువులకు వివరించారు. అవయవదానం పట్ల కూడా అవగాహన కల్పించారని రోగి బంధువులు తెలిపారు. భానుశాలిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా జుపిటర్ ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడి వైద్యులు బ్రెయిన్ డెడ్గా గుర్తించారు. దీంతో అతని బంధువులు జుపిటర్ ఆస్పత్రిలోని 39 ఏళ్ల వ్యక్తికి కాలేయం, 62 ఏళ్ల వ్యక్తికి కిడ్నీని దానం చేశారు. మరో కిడ్నీని సైఫీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి దానం చేశారు. ఈ సందర్భంగా జుపిటర్ ఆస్పత్రి వైద్యులు గౌతమ్ రమా కాంత్ మాట్లాడుతూ.. బ్రెయిన్ డెడ్ అయిన రోగిని కాపాడేందుకు ఎంతో ప్రయత్నం చేశామన్నారు. అతను ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో పరిస్థితి గురించి రోగి బంధువులకు వివరించామన్నారు. అవయవ దానం గురించి చెప్పగానే రోగి బంధువులు వెంటనే ఒప్పుకున్నారని వైద్యులు పేర్కొన్నారు. అవయవదానం చేయడం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని, నగర వాసులు అవయవదానం పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యుడు అభిప్రాయపడ్డారు. -
13 ఏళ్ల బాలికపై 68 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనలో కూడా మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. గతంలో పలుమార్లు రాజధాని కోల్కతా సహా పలు ప్రాంతాల్లో బాలికలు, మహిళలపై అత్యాచార సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మరో దారుణ సంఘటన నాదియా జిల్లాలో చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని సేన్పూర్ - శ్యాంనగర్ ప్రాంతంలో 68 ఏళ్ల వృద్ధుడొకడు తన ఇంటి పక్కనే ఉండే పదమూడేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈనెల నాలుగో తేదీనే ఈ సంఘటన జరిగినా, బాలిక తల్లి కొత్వాలీ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసిన తర్వాతే వెలుగులోకి వచ్చింది. తారక్ దాస్ హైస్కూల్లో చదివే ఆ బాలికపై పొరుగింట్లో ఉండే కాలా చంద్ మోండల్ అత్యాచారం చేశాడు. ఇంటి దగ్గర్లో ఉన్న పొలానికి వెళ్తుండగా అతడీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏడో తరగతి చదువుతున్న ఆ బాలిక భయంతో తొలుత ఎవరికీ చెప్పకపోయినా, తర్వాత తన నాయనమ్మకు శుక్రవారం నాడు విషయం చెప్పింది. నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులోనే తానలా చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.