breaking news
Today News Rondup
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:45 AM 28 June 2023
-
టాప్ 60 న్యూస్ @ 6:45 AM 11 December 2022
-
టాప్ హెడ్లైన్స్ @6:00 Pm 29 నవంబర్ 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @5:30 PM 12 నవంబర్ 2022
-
టాప్ 25 న్యూస్ @ 7:00 AM 22 October 2022
-
టాప్ హెడ్లైన్స్ @6:00Pm 12 అక్టోబర్ 2022
-
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. అనంతను ముంచెత్తిన వాన ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఆ ప్యాకేజీకి ఓకే అంటే మునుగోడు నుంచి తప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. బీజేపీకి బంపరాఫర్ ప్రకటించారు. మునుగోడు బరి నుంచి తప్పుకునేందుకు ప్యాకేజీ సిద్ధమా? అంటూ ప్రశ్నించారాయన. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి రూ. 18,000 కోట్లు కాంట్రాక్టు ఇచ్చారు కదా అంటూ తీవ్ర విమర్శలే గుప్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. డెమొక్రటిక్ పార్టీకి తుల్సీ గబ్బార్డ్ గుడ్బై 20 ఏళ్ల బంధానికి ముగింపు పలికారు తుల్సీ గబ్బార్డ్. అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ చట్ట సభ్యురాలు అయిన గబ్బార్డ్ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ క్రమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రటిక్ పార్టీ దేశంలోని ప్రతీ అంశాన్ని జాతివివక్ష కోణంలోనే నడిపిస్తోందన్న ఆమె.. వీడియో సందేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారామె. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. యూరప్లోనూ యూపీఐ చెల్లింపులు యూరప్కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) యూరప్కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్లైన్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్ఐపీఎల్ ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. బీజేపీలో చేరలేదనే గంగూలీకి అవకాశం ఇవ్వలేదు! భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. ఉక్రెయిన్ కోసం కాదు.. అందుకైతే పుతిన్ను కలుస్తా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిసే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ దురాక్రమణ అంశంపై అసలు చర్చించే ప్రసక్తే లేదని తేల్చేశారు. అయితే ఆ వ్యవహారంపై మాత్రం పుతిన్తో అవకాశం ఉంటే చర్చిస్తానని తెలిపారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాలీవుడ్ ఎంట్రీ.. పాన్ ఇండియా లెవల్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయిన కృతీ శెట్టి మాలీవుడ్కి హాయ్ చెబుతున్నారు. టోవినో థామస్ హీరోగా మలయాళంలో ‘అజయంటే రందం మోషణం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. టీ20 వరల్డ్కప్.. టీమిండియాకు బలం టి20 ప్రపంచకప్ 2022 ప్రారంభానికి ముందు టీమిండియా గుడ్న్యూస్. టీమిండియా ఫ్రంట్లైన్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ టెస్టులో పాసైనట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో షమీకి ఫిట్నెస్ టెస్టు నిర్వహించారు. ఫిట్నెస్ నిరూపించుకోవడంతో షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు. టి20 ప్రపంచకప్కు మరో రెండు వారాలు సమయం ఉండడంతో షమీ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. మానవహక్కుల దూత అశ్విని, తొలి దళిత యువతిగా.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్హెచ్ఆర్సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు ప్రత్యేక దూతగా ఉంటూ... దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టాప్ హెడ్లైన్స్ @6Pm 04 October 2022
-
టాప్ హెడ్లైన్స్ @4:30PM 2 October 2022
-
టాప్ హెడ్లైన్స్ @7:30 Pm 29 September 2022
-
టాప్ 25 న్యూస్ @ 7AM 26 September 2022
-
బిగ్ క్వశ్చన్ : జగన్ పర్యటనతో మారిన కుప్పం సీన్
-
టాప్ హెడ్లైన్స్ @6:00 PM 23 September 2022
-
టాప్ హెడ్లైన్స్ @3 PM 22 September 2022
-
టాప్ హెడ్లైన్స్ @6PM 21 September 2022
-
గన్ షాట్ : అప్పుల కుప్ప వయ్యారి బాబు
-
ఖమ్మం జిల్లాలో బలంగా తయారైన కాంగ్రెస్
-
మార్నింగ్ టాప్-10 న్యూస్ రౌండప్
1. కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు, కారణం ఏంటంటే.. రెబల్స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు జరిగాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కాకుండా మొయినాబాద్లోని ఆయన ఫామ్హౌజ్లో జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అంతేకాదు.. ప్రభాస్ కాకుండా అతని సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. వైఎస్ఆర్ కల్యాణమస్తూ.. బాలికల విద్యకూ ప్రోత్సాహాం పేద వర్గాల యువతుల వివాహాలకు అండగా నిలవడంతో పాటు బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ‘పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి’ అన్నదాన్ని ‘పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి’ అని సవరిస్తూ ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు (కొరిజెండమ్) జారీ చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. జ్ఞానవాపి తీర్పు.. వారణాసిలో 144 సెక్షన్ ఉత్తర ప్రదేశ్లోని ప్రసిద్ధ శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ(సెప్టెంబర్ 12) కీలక తీర్పును వెలువరించనుంది. మసీదుకాంప్లెక్స్లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తరుణంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. నానమ్మ మరణంతో యువరాజుల ఐక్యత! రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్హౌస్ ప్యాలెస్కు తరలించారు. మరోవైపు.. విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. యూఎస్ ఓపెన్లో 19 ఏళ్ల కుర్రాడి సంచలనం యూఎస్ ఓపెన్లో స్పానిష్ యువ సంచలనం 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్ వేదికగా ఆదివారం ఆర్ధ రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నార్వేజియన్ కాస్పర్ రూడ్ను ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. పాక్లో వరద బాధితులను... అక్కున చేర్చుకున్న ఆలయం కనీవిని ఎరగని వరదలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్లో ఓ చిన్న గ్రామంలోని హిందూ దేవాలయం అందిస్తున్న సేవలు అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని జలాల్ ఖాన్ అనే మారుమూల కుగ్రామంలో ఉన్న బాబా మధోదాస్ మందిర్ వరదలో సర్వం కోల్పోయిన కనీసం 300 మంది ముస్లింలకు ఆశ్రయంతో పాటు భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7.చెన్నై-బెంగళూరు రూట్లో ఆకాశ ఎయిర్ సర్వీసులు విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తాజాగా చెన్నై–బెంగళూరు రూట్లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించింది. చెన్నై రాకతో తమ నెట్వర్క్లో అయిదో నగరం చేరినట్లయిందని సంస్థ తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. కృష్ణం‘రాజసం’.. ఆరడుగుల ఆజానుబాహుడు ‘అక్కా చెల్లెలు’ సినిమా తీసిన పద్మనాభరావు ఓ రోజు కృష్ణంరాజుని చూసి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడగడం, అటు మూర్తిరాజు, ఇటు స్నేహితులు ప్రయత్నించి చూడమనడంతో పద్మనాభరావుతో కలిసి హైదరాబాద్ నుంచి మద్రాస్ (చెన్నై) వెళ్లారు కృష్ణంరాజు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో హైదరాబాద్కి తిరిగొచ్చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. ఆ హిమానీనదం.. కరిగితే ప్రళయమే! థ్వాయిట్స్ హిమానీనదం. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోందట. ఎంతలా అంటే ఇప్పుడిది మునివేళ్లపై నిలబడి ఉందట! అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్డే గ్లేసియర్) అని మరోపేరు పెట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. ఉగ్రగోదావరి.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఎగువన కురుస్తున్న వర్షాలతో మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరుగుతోంది. గోదావరి దగ్గర 9 లక్షల క్యూసెక్కులు దాటింది వరద. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పరిస్థితిని సమీకక్షించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టాప్ 60 న్యూస్ @ 6:30 AM 10 September 2022
-
టాప్ 25 న్యూస్ @ 1PM 26 July 2022
-
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి(బుధవారం, జూన్ 1వతేదీ) నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కాగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. సీఎం జగన్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృతజ్ఞతలు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2022 వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని చూపిన చొరవపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంగళవారం కృతజ్ఞతలు తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3.జొకోవిచ్కు షాకిచ్చిన నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్ను ఓడించాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టిన కేకే ప్రేమ గీతాల కంటే విరహ గీతాల్లోనే ఓ భావోద్వేగం ఉంటుంది. కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. అలాంటి విషాద విరహ గీతాలతోనే ఎక్కువగా సినీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు ఆయన.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5.తెలంగాణలో నేడు కాంగ్రెస్ చింతన్ శిబిర్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీపీసీసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు మేధోమథనం జరగనుంది. ‘నవ సంకల్ప శిబిర్’ పేరిట మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని బాల వికాస్ ప్రాంగణంలో బుధ, గురువారాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఉక్రెయిన్ యుద్ధం.. అమెరికా కీలక సాయం రష్యాతో యుద్ధం విషయంలో ఉక్రెయిన్కు కీలక సాయం అందించేందుకు ఎట్టకేలకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. సుదీర్ఘ నిర్ణీత లక్ష్యాలను నాశనం చేసే అత్యాధునిక రాకెట్ వ్యవస్థను ఉక్రెయిన్కు అందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. కానీ.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరుద్దాం రాష్ట్రంలో మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు వెల్లివిరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సమైక్యంగా బలపరుద్దామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. గ్రూప్–1 దరఖాస్తుల గడువు పొడిగింపు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తాజాగా గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తు గడువు పొడిగించింది. మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. అయ్యో.. గుండెను గాబరా పెట్టకండి రాష్ట్రంలో 2020లో అత్యధిక మరణాలు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల వల్లే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో కరోనా వైరస్ సంబంధిత మరణాలు ఉన్నట్టు వెల్లడైంది. రిజిస్ట్రార్ జనరల్, సైన్సెస్ కమిషనర్ ఇటీవల ‘రిపోర్ట్ ఆన్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్స్ 2020’ నివేదికను వెల్లడించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. బీజేపీ ‘పటీదార్ పవర్’.. వర్కవుట్ అయ్యేనా? హార్దిక్ పటేల్. ఒకప్పుడు బీజేపీని వ్యతిరేకించిన పటీదార్ నాయకుడు. పటీదార్లను ఓబీసీలుగా గుర్తించాలంటూ కమళదళంపై గళమెత్తిన నేత. ఇప్పుడు ఆ పార్టీ విధానాలకే జై కొడుతున్నారు. కాంగ్రెస్ను వీడిన ఆయన, ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. ట్విటర్ డీల్తో టెస్లాకు భారీ దెబ్బ ట్విటర్ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయడం తెలిసిందే. అయితే ఆయన సీఈవోగా ఉన్న టెస్లాకు ఈ ప్రభావంతో భారీ దెబ్బ పడింది. 2. మూడు వేలకు చేరువలో కరోనా కేసులు దేశంలో కరోనా తీవ్రత క్రమంలో పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. 3. పుతిన్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పదే పదే అణ్వాయుధం అనే పదం వాడుతుండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే తిట్టిపోశాడు. 4.ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా రియాన్ పరాగ్.. రియాన్ పరాగ్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్లో 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు నాలుగు క్యాచ్లు తీసుకున్న మూడో ప్లేయర్గా పరాగ్ నిలిచాడు. గతంలో కలిస్ (కోల్కతా నైట్రైడర్స్; డెక్కన్ చార్జర్స్పై 2011లో), గిల్క్రిస్ట్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్; చెన్నై సూపర్ కింగ్స్పై 2012లో) ఈ ఘనత సాధించారు. 5. చైనాలో మరో వైరస్.. ప్రపంచంలోనే ఫస్ట్ కేసు కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రాగన్ కంట్రీ చైనాను మరో వైరస్ కలవరపాటుకు గురిచేస్తోంది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. 6. ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి (ఏప్రిల్ 27, బుధవారం) నుంచి మే 9 వరకు జరగనున్న ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 7. నిర్మాతతో పెళ్లి, వ్యభిచారం ఒత్తిడితో నటి ఆత్మహత్యాయత్నం గుడిలో నిర్మాతతో పెళ్లి చేసుకున్న కోలీవుడ్ సీరియల్ నటి.. వ్యభిచారం చేయాలని ఒత్తిడి తేవడంతో నటి ఆత్మహత్యాయత్నం 8. తమిళనాడు తంజావూరులో పెనువిషాదం తంజావూరు రథయాత్రలో మంగళవారం అర్ధరాత్రి దాటాక అపశ్రుతి చోటు చేసుకుంది. రథయాత్రకు కరెంట్ వైర్లు తగలడంతో.. కరెంట్ షాక్తో మంటలు చెలరేగి పది మందికిపైగా భక్తుల దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 9. తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? వేసవిలో మాత్రమే కనిపించే సీజనల్ ఫుడ్ తాటి ముంజలు. ఇవి చూసేందుకు చిన్నవైనా పోషకాల్లో మెండు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే దివ్య ఔషధం. ప్రకృతి వరప్రసాదంగా మారి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి తాటి ముంజల గురించి ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 10. ఆసియా క్రీడల్లో ఆడలేమన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పోటీతత్వం మరింత మెరుగు పడాలనే ఉద్దేశంతో... ఆసియా దేశాలు కాకపోయినా... ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆడాలని ఒసియానియా దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఆహ్వానించింది. కానీ, అవి పాల్గొనమని చెప్పేశాయి. -
టాప్ 60 న్యూస్ @ 6AM 15 April 2022
-
టాప్ 60 న్యూస్ @ 6AM 09 April 2022
-
సాక్షి నేషనల్ న్యూస్@ 2st April 2022
-
టాప్ 60 న్యూస్ @ 6AM 26 March 2022
-
స్పీడ్ న్యూస్ @ 8:45 PM 10 January 2022
-
స్పీడ్ న్యూస్ @ 7PM 10 January 2022
-
స్పీడ్ న్యూస్ @ 7PM 07 January 2022
-
ఏపీ: సాక్షి స్పీడ్ న్యూస్ 3January 2022
-
నేషనల్ స్పీడ్ న్యూస్ @4PM 3rd January 2022
-
నేషనల్ స్పీడ్ న్యూస్ @3.30pm 31 December 2021
-
సాక్షి నేషనల్ న్యూస్ 30 December 2021
-
ఏపీ స్పీడ్ న్యూస్ @ 8:30PM 26 December 2021
-
సాక్షి నేషనల్ న్యూస్ 26 December 2021
-
సాక్షి నేషనల్ న్యూస్ 26 December 2021
-
టాప్ 25 న్యూస్ @ 7AM 26 December 2021
-
సాక్షి బిజినెస్ న్యూస్ 25 December 2021
-
సాక్షి నేషనల్ న్యూస్ 25 December 2021
-
ఏపీ స్పీడ్ న్యూస్ @ 1PM 31 October 2021
-
టాప్ 25 న్యూస్@ 7AM 01 September 2021
-
టాప్ 25 న్యూస్@7AM 14 July 2021
-
టాప్ 25 న్యూస్@ 7AM 11 July 2021
-
టాప్ 25 న్యూస్@1PM 14 March 2021
-
టాప్ 25 న్యూస్@7PM 16 March 2021
-
టాప్ 25 న్యూస్@1PM 05 March 2021
-
టాప్ 25 న్యూస్@4PM 27 Feb 2021
-
టాప్ 25 న్యూస్7PM 22 Feb 2021
-
టాప్ 25 న్యూస్@4PM 12 Feb 2021
-
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనావైరస్ (కోవిడ్-19)నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కరీంనగర్ను వణికిస్తోంది. ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన పది మంది బృందంలో కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి, వైద్యపరీక్షల కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కరోనాను నివారించే చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ గురువారం కీలక ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గూమికూడవద్దని, ఉల్లంఘిస్తే చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. గురువారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సమత కేసులో ఆదిలాబాద్ న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. అనేక పరిణామాల మధ్య దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ.. ఫాస్ట్ట్రాక్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. మరోవైపు సొంత నియోజకవర్గంలో సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్ను ప్రజాసంఘాల నేతలు గురువారం అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ పలు దేశాలకు విస్తరించినట్టు వార్తలు వెలువడుతుండగా, భారత్లో తొలి కేసు నమోదైంది. కేరళకు చెందిన ఒక విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
హై పవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశమైన మంత్రిమండలి.. పలు కీలక అంశాలపై చర్చించింది. మరోవైపు భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా..సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని నాగులబండలో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని మంత్రి హరీష్రావు ప్రారంభించారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం గవర్నర్ బిశ్వమోహన్ హరిచందన్ను మర్వాదపూర్వకంగా కలిశారు. మరోవైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు కనిపించడం లేదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. జనవరి 8న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్ చేపడుతున్నామని వెల్లడించారు. ఇక తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు సంబంధించిన లోగోను, వెబ్సైట్ను గురువారం ప్రారంభించారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు సేవలను మరింత సులభతరం చేస్తున్నట్టు వెల్లడించారు. గురువారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఆరు నెలల లోపే ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారని ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రగతిభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో సమావేశమయ్యారు. హత్యాచారానికి గురైన వెటర్నరి డాక్టర్ ప్రియాంకా రెడ్డి కుటుంబసభ్యులు... తమ ఇంట్లోకి ఎవరూ రాకుండా లోపల నుంచి గేటుకు తాళం వేసుకున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు గడిచిన 52 రోజులుగా చేస్తున్న సమ్మె ఎట్టకేలకు ముగిసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను అసెంబ్లీలోని ఆయన గదిలో ఎన్సీపీ నేతలు కొద్దిసేపు అడ్డగించారు. ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి దీప్తీశ్రీ కేసు చివరికి విషాదంగా ముగిసింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువులకు బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అనంతపురం ఎన్జీవో హోం లో రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆర్ధిక క్రమశిక్షణ తప్పి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ విమర్శించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలతో సుభిక్ష పాలన అందిస్తున్నారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నాయకుడు ఆశ్వర్థామరెడ్డి స్సష్టం చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తున్నందకు ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రామాయపట్నం పోర్టును జాతీయ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వెల్లడించారు. తెలంగాణ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ 15 ఏళ్ల చరిత్రలో ఇంత అబద్ధాలు చెప్పే అధికారులను చూడలేదని అసహనం వ్యక్తం చేసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సభ్యుడైన తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి చెందాడు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఇసుక మాఫియా, స్మగ్లింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇసుక విధానంపై సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు. సాధారణ రైతులు నవంబరు 15లోగా రైతు భరోసా పథకాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇసుక విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాను ఇచ్చిన సలహాను ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్షా నేతృత్వంలో న్యూఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నక్సల్స్ సమస్యపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో అమిత్షా తెలుగు రాష్ట్రాలపై ప్రశంసలు కురిపించారు. టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక సూచన చేసింది.ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చూసుకుంటుందని యూఎస్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్టేబుల్ సమావేశంలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ ఏరియల్ సర్వే.. వరద ముంపు నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి నోటీసులు.. ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లుగానే తెలంగాణ విమోచన దినోత్సవం జరిపి తీరుతామంటున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్.. రెండు రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీ.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్కు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్.. పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి.. -
ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : పాకిస్తాన్కు రాజ్నాథ్ వార్నింగ్!.. ప్రభుత్వాసుపత్రిలో వైద్య సదుపాయాలపై స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్న గవర్నర్.. లోకేష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్న.. ఆర్టికల్ 370 రద్దు పిటిషనర్పై సుప్రీం ఫైర్ .. పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి.. -
ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు... ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘వాలంటీర్ల’ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి... రాజ్భవన్లో తేనీటి విందు ఏర్పాటు చేసిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగరవేసిన తెలంగాణా సీఎం కే చంద్రశేఖర్రావు.. రక్షాబంధన్ పర్వదినాన ఢిల్లీ మహిళలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శుభవార్త.. పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి.. -
ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మరోసారి ఎల్లుండి విచారణ చేపట్టనున్న హైకోర్టు.. రెవెన్యూ శాఖపై వైఎస్ జగన్ సమీక్ష.. కశ్మీర్కు స్వాతంత్ర్యం సాధించేందుకు భారత్తో యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో విధించిన ఆంక్షల్ని జమ్ము ప్రాంతంలో పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు జమ్ముకశ్మీర్ అదనపు డీజీపీ ప్రకటన.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం నామినేషన్లు దాఖలు... పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి.. -
ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాక రాజోలులో హైడ్రామా.. జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్స్టేషన్ను మంగళవారం పరిశీలించిన ఏలూరు రేంజ్ డీఐజీ... స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం ఇంజినీరింగ్ కాలేజీలను గుర్తించే ప్రక్రియ వేగంగా జరగాలని సీఎం ఆదేశం.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అన్నింటిలోనూ ఈ నెల 16న భారీగా చేపపిల్లలు, రొయ్యలు విడుదల చేయాలని ప్రభుత్వ నిర్ణయం... రాజ్యసభ ఎన్నికలకు జైపూర్లో నామినేషన్ దాఖలు చేసిన మాజీ ప్రధాని పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి.. -
ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : తండ్రితో కలిసి బీజేపీలో చేరిన ప్రముఖ రెజ్లర్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ మరోసారి సంచలనం.. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత్-చైనా బంధం ప్రపంచ సుస్థిరతకు బాటలు వేసే దిశగా కార్యాచరణ.. కంచిలోని అత్తివరదరాజు స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్.. నాగార్జున సాగర్లో 26 గేట్లను ఎత్తి నీటి విడుదల.. పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి.. -
ఈనాటి ముఖ్యాంశాలు
కాపు కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లుచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి.. -
నేటి క్రీడా విశేషాలు
-
ఒక్క క్లిక్తో న్యూస్ రౌండప్..
-
ఒక్క క్లిక్తో న్యూస్ రౌండప్..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. మరోవైపు 17 వ లోక్సభ సోమవారం కొలువు తీరింది. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ లోక్సభకు కొత్తగా ఎంపికైన సభ్యులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జేపీ నడ్డా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి.. -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : బద్ధ విరోధి అయిన టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ-కాంగ్రెస్ చేతులు కలుపడం ప్రతికూల సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతుందని కాంగ్రెస్ నేతలు మథన పడుతున్నారు. టీడీపీతో పొత్తు ఇబ్బందికర పరిణామమేనని టీ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఢిల్లీలో అభిప్రాయపడ్డారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) టీడీపీతో పొత్తు.. టీ కాంగ్రెస్లో భిన్న స్వరాలు! ప్రేమవివాహం.. భార్య కళ్లముందే దారుణం పంత్ ఇప్పుడే వద్దు: సెహ్వాగ్ కత్రినా హారతి.. నెటిజన్లు ఫైర్ విజయ్ మాల్యాకు ఎవరి సహకారం ? పెట్రో మంటలు : పేటీఎం భారీ ఆఫర్ -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై మెరీనా బీచ్లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరిగాయి. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) కరుణానిధి అంత్యక్రియలు వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్ ఎన్డీఏ అభ్యర్థికే సేన మద్దతు షావోమి కొత్త ఫోన్ విశ్వరూపం-2 వాయిదా! కోహ్లి సరికొత్త చాలెంజ్ వాట్సాప్లో ఆ ఫీచర్ -
ఒక్క క్లిక్తో నేటి ప్రధాన వార్తలు
సాక్షి,హైదరాబాద్ : కేంద్రంలో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత దేశంలో ప్రజాస్వామ్య ప్రమాణాలు దారుణంగా పడిపోతూ వచ్చాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. భారత్ ఉదార ప్రజాస్వామ్య సూచికలో 2010 నుంచి అతి స్వల్ప పతనం కనిపించగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి భారీ పతనం ప్రారంభమైందని అధ్యయన నివేదిక పేర్కొంది. ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య సూచికలో ప్రస్తుతం భారత స్థానం 81 అని నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో శ్రీలంక, నేపాల్కన్నా వెనకబడి పోవడం గమనార్హం భారత్లో ప్రజాస్వామ్యం పతనం సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత దేశంలో ప్రజాస్వామ్య ప్రమాణాలు దారుణంగా పడిపోతూ వచ్చాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. తాజ్మహల్పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు సాక్షి, న్యూఢిల్లీ : తాజ్మహల్ సంరక్షణపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది సెక్షన్ 497 కొనసాగించాలని కేంద్రం అఫిడవిట్ సాక్షి, వెబ్ డెస్క్ : వివాహేతర సంబంధాల్లో పురుషుడితో సమానంగా స్త్రీని కూడా శిక్షించాలన్న వాదనను కేంద్రం వ్యతిరేకించింది రైతులను వంచించిన కాంగ్రెస్ చండీగఢ్ : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో గత 70 ఏళ్లుగా ప్రజలను వంచించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఫేస్బుక్కు షాక్ : యూకే భారీ జరిమానా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్తో సతమతమవుతోంది. చంద్రబాబు, లోకేష్ల అవినీతికి భయపడే.. సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ చేస్తున్న అవినీతి వల్లే రాష్ట్రానికి ఏ పరిశ్రమలు రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ విమర్శించారు. టీజీ వ్యాఖ్యలపై ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్! సాక్షి, కర్నూలు : మంత్రి నారా లోకేష్ను హిప్నటైజ్ చేశారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై కర్నూలు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి కౌంటరిచ్చారు. నిజాంను తలపిస్తున్న కేసీఆర్ : మురళీధర రావు సాక్షి, హైదరాబాద్ : స్వామి పరిపూర్ణానందను తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. వారంలో జనగామకు వస్తా.. లింగాలఘణపురం: వారం రోజుల్లో జనగామకు వస్తా..చీఫ్ ఇంజనీర్, ఇంజనీర్లతో వచ్చి కలెక్టర్ను కూర్చోబెట్టి తొవ్వ తీస్తా. విశాఖపట్నం-కౌలాలంపూర్ టిక్కెట్ రూ.3,399! న్యూఢిల్లీ : మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘300 మ్యాచ్లు ఆడాను.. నేను పిచ్చోడినా’ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మైదానంలో ఎంతో కూల్గా, ప్రశాంతంగా కనిపిస్తుంటారు. అమ్మమ్మ అయిన యంగ్ హీరోయిన్ జూలి 2’తో బాలీవుడ్లో సెటిల్ అవుదామనుకున్న హీరోయిన్ లక్ష్మీరాయ్కు నిరాశే ఎదురయ్యింది. -
ఒక్క క్లిక్తో నేటి ప్రధాన వార్తలు
సాక్షి, హైదరాబాద్ : న్యాయ చరిత్రలో మరో చారిత్రక అధ్యయం చోటుచేసుకుంది. ఐపీసీలోని వివాదాస్పద సెక్షన్-377పై దాఖలైన రివ్యూ పిటిషన్పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ గతంలో(2013) అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వగా.. ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించేందుకే మొగ్గు చూపింది. ఈ మేరకు విచారణను వాయిదా వేయాలన్న కేంద్రం వినతిని ధర్మాసనం సున్నితంగా తోసిపుచ్చింది. దీంతో ఎల్జీబీటీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. సెక్షన్-377.. కేంద్రానికి ఎదురుదెబ్బ సాక్షి, న్యూఢిల్లీ: సెక్షన్-377 తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ను విచారణను వాయిదా వేయాలంటూ కేంద్రం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్కు విజ్ఞప్తి చేశారు. నీట్ 2018 : మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు చెన్నై : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణత కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. లైంగిక దాడులతో రామ రాజ్యం ఎలా తెస్తారు..? సాక్షి, ముంబై : శ్రీరాముడు దిగివచ్చినా దేశంలో లైంగిక దాడులను ఆపలేడని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీజేపీపై శివసేన విరుచుకుపడింది. ఆ హిట్ లిస్ట్లో ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ : మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ- ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు ప్రముఖులపై జులై 25న జరగనున్న పాక్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జమిలి ఎన్నికలకు సై : వైఎస్సార్ సీపీ సాక్షి, న్యూఢిల్లీ : ఒకే దేశం-ఒకే ఎన్నికలను(జమిలి ఎన్నికలు) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ‘వైఎస్సార్ సీపీ ప్రొడక్ట్స్పై టీడీపీ మమకారం’ సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చంద్రబాబుని రాజకీయంగా బొందపెట్టాలి సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు తిరుపతి వెళ్లనున్నారు. బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పెళ్లికి పీఎఫ్ మనీ తీసుకోవచ్చు న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. ఆ పేరంటే నాకు చాలా ఇష్టం: రోహిత్ బ్రిస్టల్: భారత క్రికెటర్ రోహిత్ శర్మను సహచర ఆటగాళ్లు, అభిమానులు 'హిట్ మ్యాన్' అని ముద్దుగా పిలుచుకుంటారు. బెయిల్పై వచ్చాడు.. పెళ్లి చేసుకున్నాడు అర్థాంతరంగా పీటల మీదే ఆగిపోయిన బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ వివాహం మంగళవారం ఊటిలో జరిగింది. -
ఒక్క క్లిక్తో నేటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల (జూలై) 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 18 రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం, అధికార బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. జులై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల (జూలై) 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి సుష్మా స్వరాజ్కు కాంగ్రెస్ బాసట న్యూఢిల్లీ : విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు షాక్ సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీలో కే్ంద్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. మిస్సైళ్ల వర్షం.. గడగడలాడిన రియాద్ రియాద్: మిస్సైల్స్ దాడులతో ఆదివారం అర్థరాత్రి సౌదీ అరేబియా గడగడలాడిపోయింది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం: విజయసాయి రెడ్డి సాక్షి, శ్రీకాకుళం : ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశముందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు ఆటో యూనియన్లకు వైఎస్ జగన్ భరోసా! సాక్షి, మామిడికుదురు : ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్ సవాల్ను స్వీకరించిన ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విసిరిన సవాల్ను కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి స్వీకరించారు. 29న గద్వాల్కు కేసీఆర్ సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29న జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు పార్లమెంటరీ ప్యానల్ ముందుకు పీఎస్బీల సారథులు న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్యానల్ ముందు 11 ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) అధినేతలు ఈ మంగళవారం హాజరు కాబోతున్నారు ఈ రోజు టీమిండియాకు వెరీ వెరీ స్పెషల్ లండన్: జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. సరిగ్గా 35 ఏళ్ల క్రితం టీమిండియా తొలి వన్డే వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది అంచనాలను పెంచేసిన గోల్డ్ ట్రైలర్ 1948 లండన్ ఒలంపిక్స్లో భారత్ హకీలో గోల్డ్ పతాకం సాధించటం అన్న నేపథ్యంతో(కల్పిత గాథ) రీమా ఖగ్టీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రమే ‘గోల్డ్’. -
ఒక్క క్లిక్తో నేటి ముఖ్యాంశాలు
సర్వే ఫలితాలు చూసి షాకయ్యా: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: మంచి పనులు చేసే ప్రభుత్వాలను, పార్టీలను ప్రజలు వదులుకోరని, టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని జనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ 100 పైచిలుకు స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సిటీ కాంగ్రెస్ మాజీ చీఫ్, మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరారు. ఏ క్షణమైనా ఎన్నికలు : విజయసాయి రెడ్డి సాక్షి, విజయనగరం : ఏ క్షణమైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రావొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయి రెడ్డి సూచించారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తాం సాక్షి, నల్గొండ : కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బతుకమ్మ పండుగ ఇప్పుడు కవితమ్మ పండగగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. వైఎస్సార్కు ‘భారతరత్న’ ప్రకటించాలి హనుమాన్జంక్షన్ రూరల్ (గన్నవరం): ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ‘భారత రత్న’ బిరుదు ప్రదానం చేయాలని ఆయన సన్నిహితుడు, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వేదికగా మరో ఉద్యమం సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీ మరో ఉద్యమానికి వేదిక కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఎన్నో పర్యవరణ ఉద్యమాలను నిర్వహించిన చిప్కో ఇప్పుడు ఢిల్లీలో ఉద్యమానికి సిద్ధమైంది. ఈ అభ్యర్థి ఆస్తులు రూ.22,300 కోట్లు! ఇస్లామాబాద్: త్వరలో జరగనున్న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో కళ్లు చెదిరే ఆస్తులున్న అభ్యర్థి బరిలోకి దిగాడు. నాడబ్బు నాకు ఇచ్చేయండి కర్ణాటక : కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తీవ్ర పోరు జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్థన్ రెడ్డి స్పందించారు. విజయవాడలో దారుణం సాక్షి, విజయవాడ : నగరంలోని కేఎల్ ప్రాథమిక ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వికటించడంతో నలుగురు చిన్నారులు పరిస్థితి విషమంగా మారింది. స్కూలుపై పగ; 90 సెకన్లలో విద్యార్థి హత్య..! వడోదర: గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. యాజమాన్యంపై పగ పెంచుకున్న 10వ తరగతి విద్యార్థి ఎలాగైనా స్కూలును మూసేయించాలని పథకం పన్నాడు. బిగ్బాస్కు షాక్ సాక్షి, చెన్నై: తమిళ బిగ్ బాస్ షోకు సినీ కార్మిక సంఘం ఫెఫ్సీ (ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) షాకిచ్చింది. రషీద్ ఖాన్పై మోదీ ప్రశంసలు న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ క్రికెట్ యువ సంచలనం రషీద్ ఖాన్పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
వార్తా తరంగిణి
సాక్షి, హైదరాబాద్ : తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని మోదుకూరులో లైంగిక దాడికి గురైన ఏడేళ్ల బాలికకు ఆస్పత్రికి వచ్చి 6 గంటలు గడిచినా చికిత్స అందించక పోవడం గమనార్హం. గైనకాలజిస్టులు అందుబాటులో లేరంటూ వైద్య సిబ్బంది బాధిత చిన్నారికి పరీక్షలు చేయడం లేదు. దీంతో తమ పాపకు ఏమౌతుందోనని బాలిక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11 గంటలకు బాలికను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చినా వైద్యుల నిర్లక్ష్యంతో సాయంత్రం ఐదు గంటలు దాటినా చికిత్స ప్రారంభించలేదు. మోదుకూరు బాధితురాలికి ఇంకా అందని వైద్యం సాక్షి, గుంటూరు: తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని మోదుకూరులో లైంగిక దాడికి గురైన ఏడేళ్ల బాలికకు ఆస్పత్రికి వచ్చి 6 గంటలు గడిచినా చికిత్స అందించక పోవడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రామకృష్ణ ఫైర్ సాక్షి, విజయవాడ : కొద్ది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయలకు వెళ్లడం ఖాయమని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. నియంతృత్వ పాలకుడు మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2019లో బీజీపీని ఓడించడమే తమ లక్ష్యం అని ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. ఏపీకి ప్రథమ శత్రువు చంద్రబాబే సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్కు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీని రాష్ట్రానికి రెండో శత్రువుగా, కాంగ్రెస్ని మూడో శత్రువుగా భావిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబుకు అవినాష్ రెడ్డి లేఖ సాక్షి, వైఎస్సార్ కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వైఎస్సార్ కడప జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తుంగభద్ర డ్యాంలో ఉన్న నికర జలాలను చిత్రావతి జలాశయానికి తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ లేఖ రాశారు. మహిళల కోసం ప్రత్యేక మెట్రో స్టేషన్ సాక్షి, హైదరాబాద్: మహిళల కోసం ప్రత్యేకంగా మెట్రో స్టేషన్ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 21 తర్వాత టీఎస్ఆర్టీసీ సమ్మె! సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం ‘చలో బస్భవన్’ చేపట్టారు. దీంతో బస్భవన్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఎం కేసీఆర్తో కలిసి అనుదీప్ లంచ్! సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షల్లో టాపర్గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రత్యేకంగా అభినందించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు అనుదీప్, ఆయన తల్లిదండ్రులు సోమవారం ప్రగతి భవన్కు వచ్చారు. రోడ్డుపై షటిల్ ఆడిన విక్టరీ వెంకటేశ్ మొన్న క్రికెట్ దేవుడు సచిన్ రోడ్డు పైకి వచ్చి క్రికెట్ ఆడారు. స్టేడియంలో ఆడటం వేరు. బయట రోడ్డుపైకి వచ్చి పిల్లలతో ఆడటం వేరు. స్వయంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఆడటంతో ఆ వీడియో వైరల్గా మారింది. రోజూ 3వేల కోట్ల విలువైన రూ. 500 నోట్ల ముద్రణ మనీలా: దేశంలో నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో రూ. 3 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లను ప్రతి రోజూ ముద్రిస్తున్నామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం నగదు లభ్యత సంతృప్తికర స్థాయిలో ఉందని, అదనపు డిమాండ్ను అందుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రధాని మోదీకి లీగల్ నోటీసులు సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు పరువు నష్టం దావా వేశారు. రూ. 100 కోట్లకు ఆయన దావా వేసినట్లు తెలుస్తోంది అతి తక్కువ ధరలో పానసోనిక్ స్మార్ట్ఫోన్ సాక్షి, ముంబై: ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానసోనిక్ తన నూతన స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. 'పీ95' పేరుతో ఎంట్రీ లెవల్ 4 జీ స్మార్ట్ఫోన్ను సోమవారం విడుదల చేసింది. బ్లూ, గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు రూ.4,999 ధరకు ఫ్లిప్కార్ట్ సైట్లో లభిస్తున్నది. రోహిత్ కంటే రాహుల్ బెస్ట్.! ఇండోర్ : టీమిండియా ఓపెనర్గా రోహిత్ శర్మ బదులు కేఎల్ రాహుల్ తీసుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్-11 సీజన్లో కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. -
నేటి ప్రధాన వార్తలు
సాక్షి, హైదరాబాద్ : కారల్ మార్క్స్ 200వ జయంతి సందర్భంగా వామపక్ష నేతలు విజయవాడలో నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణ కారల్ మార్క్స్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ‘రఘురామ కృష్ణంరాజు నాలుక చీరేస్తాం’ ఏపీలో రోజుకో అరాచకం.. నిన్న దాచేపల్లి.. నేడు తేతలి! సాక్షి, అమరావతి : ఏపీలో జరుగుతున్న వరుస దారుణాలు మహిళాలోకాన్ని కలవర పెడుతున్నాయి. దాచేపల్లి దారుణం తర్వాత రోజుకో ప్రాంతంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. విద్యార్థులపై కళాశాల డైరెక్టర్ అరాచకం విజయవాడ : హాస్టల్ విద్యార్థులపై కళాశాల డైరెక్టర్ దాడి చేసిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెల్ఫోన్లో పాటలు వింటూ.. సాక్షి, రంగారెడ్డి : సెల్ఫోన్ ఇప్పుడు మానవుడి జీవితంలో నిత్యావసర వస్తువు. మనిషి జీవితంలో మొబైల్ ఎంతలా అల్లుకుపోయిందంటే అది లేకుండా.. అక్రమ వసూళ్ల కేసులో నయీం భార్య అరెస్టు సాక్షి, యాదాద్రి భువనగిరి: గ్యాంగ్స్టర్ నయీం భార్య హసీనా బేగంను భువనగిరి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. వైద్యం కోసం ఉస్మానియాకు.. మహిళపై దారుణం! సాక్షి, హైదరాబాద్ : భర్త కొట్టాడని పోలీసు స్టేషన్ను ఆశ్రయించిన ఓ మహిళకు దారుణమైన అనుభవం ఎదురైంది. వైద్యం కోసం పోలీసులు నిర్లక్ష్యంగా ఆమెను ఒంటరిగా.. కథువా ఘటన : న్యాయవాదికి ఎమ్మా వాట్సన్ మద్దతు లాస్ ఏంజెల్స్ : జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కుతున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు సాక్షి, కృష్ణా : విశాఖ జిల్లా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మలు టీడీపీని వీడి శనివారం వైఎస్సార్సీపీలో చేరారు. బీజేపీ గెలిస్తే.. సూసైడ్ చేసుకుంటా అన్నాడు! సాక్షి, బెంగళూరు: జనతాదళ్ సెక్యూలర్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ కాంగ్రెస్ను రక్షిస్తుందని, బీజేపీపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందని జేడీఎస్ నేతలను మోదీ విమర్శించారు. ‘ఇంతలోనే ఎంత ఎదిగే రామ్ చరణూ’ రంగస్థలం సినిమా రిలీజై ఐదు వారాలు గడుస్తున్నా సినిమా హవా మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్న.. అమెజాన్ను దెబ్బతీయడం కోసం మరో దిగ్గజం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు గట్టిపోటీ ఇచ్చేందుకు ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్లు మెగా డీల్ను కుదుర్చుకోగా, మరో దిగ్గజ కంపెనీ కూడా అమెజాన్ను దెబ్బతీయడానికి.. నాకు వారిద్దరూ ఒక్కటే.. సాక్షి , న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్లో భారత సత్తాను ప్రపంచానికి చాటిన సైనా నెహ్వాల్, పీవీ సింధూలను ఫిక్కీ మహిళా విభాగం గోల్డెన్ గర్ల్స్ ఆఫ్ బాడ్మింటన్ పేరుతో ఘనంగా సన్మానించింది. -
నేటి ప్రధాన వార్తలు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బుధవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా సాధనసమితి నేతలు చలసాని శ్రీనివాసరావు, తాడి నరేష్, కొండా నర్సింగరావు, సదాశివరెడ్డి, అప్పలనాయుడు, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్తో ప్రత్యేక హోదా సాధన సమితి నేతల భేటీ ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బుధవారం భేటీ అయ్యారు. ప్రగతి భవన్ గడీ పగలగొడతాం: కోదండరాం ప్రజాస్వామిక స్పూర్తికి విరుద్ధంగా కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమెత్తారు. ఎక్కడ యూటర్న్ చూసినా ఆయనే గుర్తొస్తారు! ‘రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడ యూటర్న్ కనిపించినా.. చంద్రబాబే గుర్తొస్తున్నారు. యూటర్న్ తీసుకోవాల్సి వచ్చినా.. ఇది చంద్రబాబు రహదారి, మనకెందుకులే అని ముందుకు వెళ్లాలని అనిపిస్తోంది. ఫిలిప్పీన్స్లో భారత విద్యార్థులపై దాడి ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తన్న భారతీయ విద్యార్థులపై తాగిన మత్తులో ముగ్గురు స్థానికులు దాడికి పాల్పడ్డారు. తప్పుగా మాట్లాడితే దండించలేను : ఉప రాష్ట్రపతి ప్రతి రాజ్యసభ సభ్యుడు హిందీ భాషలో తప్పనిసరిగా మాట్లాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ-బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఏపీ పెట్టుబడుల విషయంపై టీడీపీ-బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పిచాయ్ దిగ్భ్రాంతి.. సత్య నాదెళ్ల విచారం! ప్రముఖ వీడియో షేరింగ్ కంపెనీ యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ మంగళవారం ఉదయం కాల్పులు జరపడం కలకలం రేపింది. బాహుబలితో ‘రంగస్థల’ బ్రహ్మ..! రామ్ చరణ్ హీరోగా రంగస్థలం చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని ఓ స్టార్ హీరోతో చేయనున్నట్టుగా తెలిపారు. భర్త గురించి సానియా ట్వీట్.. వైరల్ తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చికెన్లా ఉంటాడని భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లైక్స్, షేర్లు చేయడంతో వైరల్గా మారింది. షాకింగ్: లక్షల కోట్ల రూపాయల రుణాలు రద్దు ప్రభుత్వరంగ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు చెక్కేస్తున్న బడాబాబుల బండారం సామాన్య ప్రజానీకం గుండెల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంటే.. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి షాక్ తగిలింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం కుమారుడు శ్యామ్ బాబుతో సహా మరో ఇద్దరిని నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేయాలని డోన్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. కాగా తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. (చెరుకులపాడు నారాయణరెడ్డి గత ఏడాది మే 22న దారుణ హత్యకు గురయ్యాడు.) నారాయణ రెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు : హరిబాబు తెలంగాణలో పులి.. ఢిల్లీలో పిల్లి ‘పవన్ కల్యాణ్కు తెలంగాణ అవసరం లేదా?’ ‘చైనా మమ్మల్నే లేపేద్దామనుకుంటే ఊరుకోం..’ ముంచుకొస్తున్న ప్రళయాగ్ని! పిల్లాడి నుంచి మోదీకి ఊహించని ప్రశ్న.. నో ఆన్సర్ ‘దేశంలో లూటీ.. విదేశాల్లో భేటీ’ ఒక రేపిస్టుకోసం జాతీయ జెండాతోనా.. ఆడవాళ్లను దొంగ పెళ్ళిళ్లు చేసుకున్న కి‘లేడీ’ రామ్ చరణ్ని బీట్ చేసిన అల్లు అర్జున్ రాంగోపాల్ వర్మ అరెస్ట్కు రంగం సిద్ధం? ఐపీఎల్ వేళలపై మల్లగుల్లాలు.. జాతీయ హాకీ జట్టు... అండగా రాష్ట్ర ప్రభుత్వం -
టుడే న్యూస్ రౌండప్
రేణమాల (ఉదయగిరి నియోజకవర్గం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : అక్రమంగా ఇసుకను దోచుకుంటూ, అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టి ఈడ్చిన ఎమ్మెల్యేను కాల్చి పారేయకుండా, కనీసం అరెస్టు చేసి జైల్లో వేయకుండా.. బాధితురాలిపై చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్ర జేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చెప్పిన మాటలు అక్షర సత్యమని అన్నారు. గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణమాల గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ‘సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఓ దళిత మహిళను బట్టలూడదీసి అవమానించి, ఆ ఘటనను చిత్రించి సోషల్మీడియాలో పెడితే చర్యలు లేవు. మహిళలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదును మహిళా కమిషన్ తీసుకోకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన కమిషన్ ఫిర్యాదును స్వీకరించింది’ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేను జైల్లో పడేసి ఉంటే అకృత్యాలు మళ్లీ జరిగేవా? ‘టీడీపీ నేతల బండరాన్ని బయటపెడతాం..’ కోదండరాంతో రేవంత్రెడ్డి భేటీ టీఆర్ఎస్ పాలనలో అప్పులు రెట్టింపు చెట్టు, చేప, ప్రకృతి.. ఇంట్రస్టింగ్ ఫ్రైడే ‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’ స్టాఫ్తో మంత్రుల సెక్స్.. ప్రధాని కీలక నిర్ణయం ట్రంప్ నెత్తిన మరో బాంబు ‘చోటా మోదీ’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ ఆయన జయంతి జరిపితే.. ఖబడ్దార్ చిన్నారి నరబలి కేసులో షాకింగ్ నిజాలు! మాల్యాను మించిపోయిన మరో కేడీ అదిరే 'ముగింపు' కోసం ఫైనల్లో శ్యామ్ -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం లోక్సభలో 11గంటలకు బడ్జెట్ను ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది ఐదోసారి. ఎన్డీయే సర్కార్కు ఇది పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్. బడ్జెట్ ప్రత్యేక కథనాలు కేంద్ర బడ్జెట్ 2018-19 హైలైట్స్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం లోక్సభలో 11గంటలకు బడ్జెట్ను ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. బడ్జెట్ 2018 ; మోదీ సర్కార్ పల్లెబాట సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కార్ గ్రామీణ భారతంపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. గురువారం... తెలుగు రాష్ట్రాలకు జైట్లీ షాక్ సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై గంపెడాశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. విభజన... 2018 బడ్జెట్ : పెరిగేవి, తగ్గేవి సాక్షి, ముంబై: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం కేంద్ర బడ్జెట్ 2018 ను ప్రవేశపెట్టారు. అంచనాలకనుగుణంగానే గ్రామీణ ఆర్థికవృద్ధి, వ్యవసాయానికి... బడ్జెట్పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి -------------------- రాష్ట్రీయం -------------------- రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఏం దక్కింది! సాక్షి, హైదరాబాద్: కేంద్ర వార్హిక బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. అత్తెసరు... ఆంధ్రప్రదేశ్కు మరోసారి అన్యాయం సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మరోసారి అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం.. కేంద్ర బడ్జెట్: పెదవి విరిచిన టీఆర్ఎస్ ఎంపీలు! సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్పై మరింత స్పష్టత రావాల్సి ఉందని, ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించారో కేంద్ర ఆర్థికమంత్రి... ఓట్ల గారడీ బడ్జెట్: రఘువీరా రెడ్డి విజయవాడ : కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది పూర్తిగా ఓట్ల గారడీ బడ్జెట్ అని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరా రెడ్డి... బస్తీమే సవాల్: కేటీఆర్ నేను సిద్ధమే.. నువ్వూ సిద్ధమా? సాక్షి, హైదరాబాద్: ఐటీ మంత్రి కే తారకరామారావు విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు. 2019 ఎన్నికల్లో... బడ్జెట్పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి -------------------- సినిమా -------------------- ‘మహారాజ్.. మీరు ఎప్పుడు అంటే అప్పుడు రెడీ’ ఈ శుక్రవారం టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్ మహారాజ్ రవితేజ, గురువారం అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. సోషల్ మీడియా... ‘2.ఓ’.. మరో నాలుగు నెలలు వాయిదా సౌత్ సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. వీరి కాంబినేషన్లో ఘనవిజయం సాధించిన రోబో... నిఖిల్కు జోడిగా కేథరిన్ విభిన్న చిత్రాలతో విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్, ఇప్పుడు రీమేక్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ కిరిక్ పార్టీకి... బడ్జెట్పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి -------------------- క్రీడలు -------------------- నాలుగులో రహానే..! డర్బన్: ఆరు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ గురువారం టీమిండియాతో ఆరంభమైన తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన... చెత్త ట్రాక్ రికార్డు.. ఏం చేస్తారో? సాక్షి, స్పోర్ట్స్ : టెస్ట్ సిరీస్ చేజారినప్పటికీ చివరి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా విక్టరీ కైవసం చేసుకుంది.... బడ్జెట్పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి -------------------- బిజినెస్ -------------------- మెడికల్ హెల్త్ కేర్..అదో పెద్ద జిమ్మిక్కు సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆర్థిక బడ్జెట్పై విమర్శలు గుప్పించారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఇంకా... జైట్లీ బడ్జెట్లో విన్నర్స్, లూజర్స్ వీరే! న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పూర్తి స్థాయి బడ్జెట్ 2018ను నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంత... త్వరలో గోల్డ్ పాలసీ సాక్షి, న్యూడిల్లీ: బంగారాన్ని అసెట్ క్లాస్గా అభివృద్ధి చేయాలనే దిశగా ఆలోచిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాటి బడ్జెట్... బడ్జెట్పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి -------------------- అంతర్జాతీయం -------------------- థియేటర్లోకి తలదూర్చి సినిమాను చూడొచ్చు.. సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లలో నచ్చిన సినిమాలను చూడడం నేడు చాలా మందికి అలవాటు. వెలుతురు మధ్య కళ్లు చిట్లించుకొని తదేకంగా చూడడం వల్ల కళ్లే... రూ. 14లక్షల వాచ్ను తెలివిగా కాజేశారు సింగపూర్ : మారుతున్న కాలంతో పాటు దొంగలు కూడా తెలివిగా చోరీలకు పాల్పడుతున్నారు. కొనుగోలుదారులుగా నటించిన ఇద్దరు దొంగలు యజమాని కళ్లు గప్పి రూ. 14.3.. హాట్ టాపిక్గా మంత్రి రాజీనామా వ్యవహారం లండన్ : సాధారణంగా ఎవరైనా కాస్త ఆసల్యం అయితే క్షమాపణలు చెప్పి సరిపెడుతుంటారు. కానీ, ఇక్కడ ఓ మంత్రి తన పదవికే రాజీనామా చేయటం బ్రిటన్లో కలకలం రేపింది... బడ్జెట్పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి -
టుడే న్యూస్ రౌండప్
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారని, చంద్రబాబే దళారిగా మారి.. రైతులను దళారులకు అమ్మేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదని, రైతులు బాబు పాలనలో తీవ్ర అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టి కేవలం వ్యక్తిగత లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోనున్నారని వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. మరిన్ని కథనాలు.. మోదీతో చంద్రబాబు భేటీ.. అందుకేనా! రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టి కేవలం వ్యక్తిగత లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని.. కరువు, చంద్రబాబు కవలపిల్లలు చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారని, చంద్రబాబే దళారిగా మారి.. రైతులను దళారులకు అమ్మేస్తున్నారని... 'రాజీనామా చేసి తప్పుకుంటా..' తెలంగాణలో జరుగుతున్న అవినీతి ప్రపంచంలో ఎక్కడా లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వేధింపుల కేసు: బీజేపీ చీఫ్ కుమారుడికి బెయిల్ యువతిపై వేధింపుల కేసులో హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలాకు బెయిల్ మంజూరైంది. దేశంలో బీటెక్ విద్యార్థుల దారుణ దుస్థితి బీ. జయచంద్రన్ 2011 సంవత్సరంలో తమిళనాడు, తంజావూరులోని 'పెరియార్ మణియమ్మై ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ' నుంచి... భారతీయులకు శుభవార్త.. గ్రీన్కార్డుపై కొత్త బిల్లు అమెరికాలోభారతీయులు ఊరట కల్పించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘అజ్ఞాతవాసి’ అక్కడే లెక్క తప్పిందా..! బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అజ్ఞాతవాసిపై వర్మ ట్వీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ... భారత్లో దూసుకుపోతున్న ట్రంప్ టవర్స్ ట్రంప్ టవర్స్ భారత్లో దూసుకుపోతుంది. లాంచైనా తొలి రోజే ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ కింద రియాల్టీ సంస్థ ఎం3ఎం ఇండియా 20 లగ్జరీ అపార్ట్మెంట్లను... బీబీఎల్ చరిత్రలో తొలిసారి.. బ్రిస్బేన్: ప్రపంచ క్రికెట్లో పలు రకాలైన అవుట్లతో బ్యాట్స్మెన్ పెవిలియన్ బాటపడుతూ ఉంటారు. అందులో అబ్స్ట్రక్టింగ్ అవుట్ ఒకటి. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్ : ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారా? అని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలవరంపై విచారణ జరిపితే చంద్రబాబు నెలరోజుల్లోపే జైలుకు వెళ్తారని చెప్పారు. మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మరిన్ని కథనాలు మీకోసం.. చంద్రబాబుకు ఆ దమ్ముందా? ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు... 'వైఎస్సార్ మరణం ఏపీకి దురదృష్టకరం' దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రతికుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని, దాని ఫలాలు కూడా ప్రజలకు అందేవని కాంగ్రెస్... వైఎస్ జగన్ పాదయాత్ర @ 800 కి.మీ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 'కేసీఆర్కు ఇండియా బుల్స్పై ఎందుకంత ప్రేమ?' కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ నేత కేసీఆర్పై నిప్పులు చెరిగారు. అత్యంత ఇష్టమైన వ్యక్తిపై బన్నీ ట్వీట్ 'ప్రపంచంలోనే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్ యూ' అని ట్వీట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. జాతీయ గీతంపై సుప్రీం తీర్పు.. విజయం ఎవరిదీ? దేశంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రతి ఆటకు ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్లే చేయాలని, అలా ప్లే చేసినప్పుడు ప్రేక్షకులు... ‘అజ్ఞాతవాసి పరిహాసమేమో అనుకున్నా..!’ అదృష్టదేవత ఎప్పుడు ఎవరికి ఎందుకు వరమిస్తుందో తెలియదు! ఒకవేళ వరమిచ్చినా అది నిజమని నమ్మాలనిపించదు! టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూలు ఖరారు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్తో ట్వంటీ20 సిరీస్ ఆడనుంది. మెక్డొనాల్డ్స్కు వార్నింగ్ నోటీసు మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లు తీవ్ర వివాదంలో కూరుకుపోతున్నాయి. చహల్ వీడియోపై గేల్ కామెంట్స్.. వైరల్! భారత యువ స్పిన్నర్ యుజవేంద్ర చహల్ ఈ ఏడాది టీ20లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. జోయలుక్కాస్పై దేశవ్యాప్తంగా ఐటీ దాడులు ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయలుక్కాస్కు ఆదాయ పన్నుశాఖ షాక్ ఇచ్చింది. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన గురువారం పెద్దూరులో తనను కలిసి మద్దతు తెలిపిన ప్రజలతో మాట్లాడారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే అత్యధికంగా బీసీలు ఉన్నారని, వారందరికీ చంద్రబాబు ఏం చేశారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్నారు. పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు: ముద్రగడ సాక్షి, వెంకటగిరి : జనసేన అధినేత పవన్కల్యాణ్పై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్కల్యాణ్ ఎవరో తనకు తెలియదని... 'మందకృష్ణపై కక్ష సాధిస్తున్నారు' ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. గజల్ శ్రీనివాస్ను కఠినంగా శిక్షించాలి! సాక్షి, విజయవాడ: ప్రముఖ గజల్ శ్రీనివాస్ రాసలీలల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గజల్ శ్రీనివాస్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు... అంతుపట్టని ప్రదీప్ వ్యవహారం సాక్షి, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ వ్యవహారం అంతుచిక్కడం లేదు. ఎట్టిపరిస్థితుల్లో కౌన్సెలింగ్కు... ‘బ్యాంకు ఉద్యోగులను పెళ్లి చేసుకోకండి’ లక్నో : బ్యాంకు ఉద్యోగులను పెళ్లి చేసుకోవద్దంటూ ఇస్లామిక్ మత సంస్థ దారుల్ ఉలూమ్ ధియోబంద్ ఫత్వాను జారీ చేసింది. బ్యాంకుల్లో పని చేస్తున్న చాలా... 'ప్లీజ్.. నన్ను మీ రాజకీయాల్లోకి లాగొద్దు' సాక్షి, మీరట్ : తనను రాజకీయాల్లోకి లాగొద్దని అలియా ఖాన్ అనే ఉత్తరప్రదేశ్కు చెందిన విద్యార్థిని వేడుకుంది. తాను కృష్ణుడి వేషం వేయడం, భగవద్గీత... ఈ నెల 31 అంతరిక్షంలో వింత న్యూఢిల్లీ : ఈ నెల 31 విశ్వంలో అద్భుతం జరగనుంది. చరిత్రలో అత్యంత అరుదైన బ్లూమూన్ సంపూర్ణ చంద్రగ్రహణం చీకట్లో కనువిందు చేయనుంది. పాక్పై భారత సైన్యం ప్రతీకారం.. 15మంది ఖతం! జమ్మూ: అకారణంగా తమ జవాన్ను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్ సైన్యంపై భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. భద్రతా దళాలు బుధవారం రాత్రి పాక్ ఆర్మీ... రేప్ చేసి వీడియోతీసి, సోషల్ మీడియాలో పెట్టి.. పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఇద్దరు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సుల్తానాబాద్... రోహిత్ కెప్టెన్.. కోహ్లికి నో ఛాన్స్ న్యూఢిల్లీ: ప్రముఖ క్రీడల వెబ్సైట్ ఈఎస్పీఎన్ 2017 సంవత్సరానికి క్రికెట్ జట్లను ప్రకటించింది. గతేడాది గొప్పగా రాణించిన క్రికెటర్లతో మూడు... పెళ్లి బాజాలు.. నిశ్చితార్ధానికి శ్రీలంక..? ముంబై : బాలీవుడ్లో మరో భారీ వివాహ వేడుక జరగబోతోందా?. ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది. సుపరిపాలన, అభివృద్ధికి ప్రజలు గట్టి మద్దతు తెలిపారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -------------------- రాష్ట్రీయం -------------------- ‘2019 ఎన్నికల్లో మేమే హీరోలం’ 2019 ఎన్నికల్లో ఏపీలో తామే హీరోలమవుతామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం చెప్పారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..... 'అన్ని వర్గాల వారికి అండగా ఉంటా' చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశారు. ఇపుడు ఉన్నత చదువులు చదవాలంటే రూ. లక్షల్లో ఫీజులున్నాయి.. రాజన్న రాజ్యంలో కష్టాలు తీరతాయి.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అనంతపురం జిల్లా.. మోదీ పనితీరుకు జనం జేజేలు: లక్ష్మణ్ గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. కన్ఫ్యూజన్లో కేటీఆర్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తనను కన్ఫ్యూజన్కు గురి చేస్తున్నాయని తెలంగాణ మంత్రి కే తారకరామారావు ట్వీట్ చేశారు... -------------------- జాతీయం -------------------- ఔను ఓడిపోయాం.. కారణం అదే: ఒప్పుకున్న సీఎం! హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అంగీకరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి... ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు గుజరాత్లో ముస్లిం ప్రాధాన్యం పెరుగుతోందనడానికి అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలే నిదర్శనమని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్... బీజేపీ విజయానికి కారణాలేమిటీ? గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచిన్పటికీ, రిజర్వేషన్ల అంశంపై పాటిదార్లు దూరం అయినప్పటికీ ఫలితాల్లో... ఎన్నికల ఫలితాలపై నేతల రియాక్షన్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పలువురు కేంద్ర మంత్రులు, నేతలు స్పందించారు. గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీనే... నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని గుజరాత్ కాంగ్రెస్ ఇంచార్జి, రాజస్థాన్ మాజీ... -------------------- అంతర్జాతీయం -------------------- ఉద్యమ నేత కాల్చివేత... పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. గాజాలోని వెస్ట్ బ్యాంక్ వద్ద పాలస్తీనియన్ ఉద్యమ నేత అయిన ఇబ్రహీం అబు తురాయను... విమాన ప్రమాదంలో ముగ్గురి మృతి విమాన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన సంఘటన అమెరికాలోని ఇండియానా రాష్ట్రం మిడ్వెస్ర్టన్లో జరిగింది. కాపాడినందుకు థ్యాంక్స్.. ట్రంప్కు పుతిన్ ఫోన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు చెప్పారు. సెయింట్ పీటర్ బర్గ్లో ఉగ్రవాదులు దాడులకు... -------------------- సినిమా -------------------- జెంటిల్ మెన్ పవన్ కళ్యాణ్ కు థాంక్స్ త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిన 'అజ్ఞాతవాసి' చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్న... అవన్నీ వదంతులే! అంజలి కోలీవుడ్, టాలీవుడ్లలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. -------------------- క్రీడలు -------------------- ఇంగ్లండ్ చెత్త రికార్డు యాషెస్ సిరీస్ను ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఒక చెత్త రికార్డును కూడా మూట గట్టుకుంది. యాషెస్ ఆసీస్ కైవసం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఆసీస్ 3-... ధోని అంచనా తప్పింది..! టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రివ్యూ కోరాడంటే దానికి తిరుగుండదు. ఆ క్రమంలోనే డీఆర్ఎస్ను ధోని రివ్యూ సిస్టమ్గా మార్చేశారు అభిమానులు.... టీమిండియా ఆల్ టైమ్ బెస్ట్ రికార్డు శ్రీలంకతో ఇక్కడ జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా టీమిండియా ఆల్ టైమ్ బెస్ట్ రికార్డును నమోదు చేసింది. లంకేయులతో ఆఖరి వన్డేలో... వారితో మమ్మల్ని పోల్చకండి: చాహల్ ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ లు... -------------------- బిజినెస్ -------------------- విమాన ప్రయాణీకులకు భారీ ఊరట విమాన ప్రయాణీకులకు ఇది నిజంగా శుభవార్తే. భారీగా బాదేస్తున్న విమాన టికెట్ల కాన్సిలేషన్ చార్జీలపై విమానయాన మంత్రిత్వ శాఖ త్వరలోనే... లోకసభకు సప్లిమెంటరీ డిమాండ్ గ్రాంట్ రెండవ సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను బీజేపీ ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. రూ. 33,380 కోట్లు నికర... స్మార్ట్ రికవరీ : మార్కెట్లకు బీజేపీ జోష్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బుల్స్కు, బీజేపీకి గట్టి పోటీ నెలకొంది. తొలుత కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం కనబర్చడంతో భారీగా పతనమైన... యూ టర్న్.. డబుల్ సెంచరీ గుజరాత్ ఎన్నికల ఫలితాలను ప్రతిబింబిస్తూ స్టాక్మార్కెట్లు కదులుతున్నాయి. ఆరంభంలో 700 పాయింట్లకుపైగా మార్కెట్లు తాజా ఫలితాల సరళి... -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురంలో మద్య వ్యతిరేక పోరాటం చేస్తూ అసువులు బాసిన ముదునూరి సుబ్బమ్మ మరణానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని, అందుకు పూర్తి బాధ్యత ఆయనే వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ------------------------------------------- రాష్ట్రీయం -------------------------------------------- మంత్రి కామినేనికి చేదు అనుభవం.. సాక్షి, బుట్టాయగూడెం: బుట్టాయగూడెం ప్రభుత్వాసుపత్రి నూతన భవన ప్రారంభోత్సవానికి హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కు చేదు అనుభవం... చెన్నారెడ్డి కుటుంబానికి జగన్ పరామర్శ సాక్షి, అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష... ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని నేరేడుగొండలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు.... కాంగ్రెస్ నుంచి 30 మంది సీనియర్లు ఔట్? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 30 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఈ సారి టికెట్లు గల్లంతయ్యే అవకాశాలు.. ------------------------------------------- జాతీయం -------------------------------------------- అధ్యక్షుడిగా మొదటి స్పీచ్.. మోదీపై నిప్పుల వర్షం! సాక్షి, న్యూఢిల్లీ: ఇన్నాళ్లు రాజకీయాల పట్ల కొంత విముఖత ఉన్నట్టు కనిపించిన రాహుల్గాంధీ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు.... గుజరాత్లో ఓడినా.. రాహుల్ హీరోనే! సాక్షి, న్యూఢిల్లీ : నువ్వా-నేనా అన్న రీతిలో ఎన్నికల ప్రచారం.. బీజేపీ-కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ విమర్శలు.. వెరసి గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం దేశం... గుజరాత్ ఫలితాలు తలకిందులయ్యేనా?! సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీయే మళ్లీ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ప్రీ,.. తీవ్ర భావోద్వేగానికి లోనైన సోనియాగాంధీ! సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తన తనయుడు రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా సోనియాగాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ------------------------------------------- అంతర్జాతీయం -------------------------------------------- ట్రంప్ ప్రకటన.. కేంద్రంపై ఒవైసీ సీరియస్ సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రష్యా ఆ పనిచేస్తే! భయంతో వణుకుతున్న బ్రిటన్!! లండన్ : కమ్యూనిస్ట్ దేశమైన రష్యాను తలుచుకుని బ్రిటన్ భయపడుతోంది. ప్రధానంగా సముద్ర జలాల్లో ఉన్న కేబుల్స్కు రష్యా ఎక్కడ సమస్యలు తీసుకువస్తుందన్న... అర్ధరాత్రి భారీ భూకంపం జకర్త : ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్గా పేరొందిన ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జావా తీర... సౌత్ చైనా సీపై డ్రాగన్ డేగ కన్ను బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా మరింత పట్టుబిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సముద్రాన్ని 24 గంటల పాటు పరిశీలించేందుకు ప్రత్యేక... ------------------------------------------- సినిమా -------------------------------------------- రకుల్ ప్రీత్ ‘దాగుడుమూతలు’ డీజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించిన దర్శకుడు హరీష్ శంకర్, ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మహేష్.. వెంకీ.. త్రివిక్రమ్...? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా అజ్ఞాతవాసి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నాని రెడీ.. సెన్సార్ కూడా అయిపోయింది 2017కు సక్సెస్ తో గుడ్ బై చెప్పేందుకు యంగ్ హీరో నాని రెడీ అయిపోయాడు. ఈ ఏడాది వరుస విజయాలతో సత్తా చాటిన నాని మరోసారి ఎమ్సీఏతో అదే జోరును కంటిన్యూ... ------------------------------------------- క్రీడలు -------------------------------------------- 'సెంచరీ'ల రికార్డుకు చేరువలో.. అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రికెట్ జట్టు ఒక రికార్డును ఒకసారి సృష్టించడమే గొప్ప. సిరీస్ను సాధిస్తారా? విశాఖ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా గత మ్యాచ్లో అద్బతమైన విజయాన్ని సాధించిన టీమిండియా ఇప్పుడు సిరీస్పై కన్నేసింది. ఆఖరిదైన మూడో వన్డేలో... డబుల్ సెంచరీతో ఇరగదీశాడు.. పెర్త్: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఇక్కడ జరుగుతున్న... ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు కొలంబో:రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, హెర్ష్లీ గిబ్స్ వీరంతా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు. అయితే తాజాగా భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర... ------------------------------------------- బిజినెస్ -------------------------------------------- ఈ ల్యాప్టాప్ ఖరీదు రూ.7 లక్షలు ఏసర్ ఇండియా శుక్రవారం ప్రీడేటర్ 21 ఎక్స్ పేరుతో నూతన గేమింగ్ ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. బెర్లిన్లో 2016లో ఐఎఫ్ఏలో తొలుత దీన్ని లాంచ్ చేసిన... ఫేస్బుక్లో కొత్త ఫీచర్..ఇలా చెక్ పెట్టొచ్చు! ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోఅద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. మన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవారిని ... ఫిబ్రవరి 1నుంచే ఇ-వే బిల్లు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పన్ను పరిధిలో ఇ-వే బిల్లు విధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, రాప్తాడు : మహానేత కలలు కన్న రైతు సంక్షేమ రాజ్యం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తానని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. పెట్టుబడిని తగ్గించి, సాగునీటి, మార్కెట్ సౌకర్యాలను పెంచడం ద్వారా రాష్ట్రంలోని రైతులు అందరినీ రారాజులుగా చేస్తామని మాట ఇచ్చారు. మరికొద్దిరోజుల్లో ఏర్పాటుకాబోయే ప్రజాప్రభుత్వం.. యుద్ధప్రాతిపాదికన అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తుందని హామీ ఇచ్చారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని, రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తు పరిహార నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 34వరోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో బహిరంగ సభను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ------------------------------------------- రాష్ట్రీయం -------------------------------------------- ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల డీఎస్సీకి హాజరు కావాలంటే తప్పనిసరిగా అర్హత సాధించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం అమరావతిలో విడుదల చేశారు. రాజమౌళికి చంద్రబాబు ఝలక్ రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ భవన నిర్మాణానికి రాజమౌళి ఇచ్చిన సూచనలను ముఖ్యమంత్రి తిరస్కరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం మనందరి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల అనుభవం, విద్యార్హతను బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. హోంగార్డులకు సీఎం కేసీఆర్ వరాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హోంగార్డులపై వరాలు కురిపించారు. హోంగార్డుల జీతాలను రూ.12 వేల నుంచి రూ. 20 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. కలకలం: మళ్లొస్తోంది.. మైనింగ్ జోన్ ! రంగారెడ్డి జిల్లా యాచారంలో మైనింగ్ జోన్ మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో స్థానిక రైతుల్లో భయాందోళన మొదలైంది. టీడీపీకి ఉమా మాధవరెడ్డి రాజీనామా సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ------------------------------------------- జాతీయం -------------------------------------------- ఆధార్ లింక్పై కేంద్రం మరో గుడ్న్యూస్ ఆధార్ అనుసంధానంపై కేంద్రం మరో గుడ్న్యూస్ చెప్పింది. బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నెంబర్ను లింక్ చేసుకునే డెడ్లైన్ డిసెంబర్ 31ను విత్డ్రా చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మొట్టమొదట సీప్లేన్ ఎక్కింది మోదీ కాదు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు సముద్ర విమానం (సీప్లేన్)లో జేమ్స్బాండ్లా ప్రయాణించి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'సీ ఛేంజ్'ను తీసుకు రావాలని భావించారు. అక్కడే ఆయన పెద్ద పొరపాటు చేశారు. మాటల కత్తులు దూసి.. తొలిసారి ఎదురుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం పరస్పరం అభివాదం చేసుకున్నారు. రామసేతు నిజమే: అమెరికన్ సైన్స్ చానల్ రామాయణం నిజంగానే జరిగిందని, రామసేతు మానవ నిర్మిత కట్టడమేనని తాజాగా అమెరికన్ సైన్స్ చానల్ కథనం ప్రసారం చేసింది. ------------------------------------------- అంతర్జాతీయం -------------------------------------------- గుడ్న్యూస్: మార్స్పై చిగురిస్తున్న ఆశలు! అంగారక గ్రహం (మార్స్)పై జీవం మనుగడ సాగించగలదా.. అక్కడి బౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న ఆసక్తికర విషయాలు త్వరలోనే మనకు తెలిసే అవకాశాలున్నాయి. అమెరికాతో పోరాటం: కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ.. తమ అణ్వాయుధ సంపత్తి గణనీయంగా పెంచుకున్న నేపథ్యంలో అమెరికాతో పోరాటంలో గెలిచి తీరుతామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రతినబూనారు. ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అలాబామా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి డౌగ్ జోన్స్ విజయం సాధించారు. ఆ.. కలయిక ప్రపంచానికే ప్రమాదం! పాకిస్తాన్లో ఈ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు మొత్తం ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెట్టెలా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ------------------------------------------- బిజినెస్ -------------------------------------------- రూ.1 కే విమాన టికెట్ దేశీయ బడ్జెట్ క్యారియర్ ఎయిర్ డెక్కన్ విమాన ప్రయాణీకులకు బంపర్ఆఫర్ ఇచ్చింది. తమ కస్టమర్లకు రూ.1 కే విమాన టికెట్ను ఆఫర్ చేస్తోంది. బిట్కాయిన్పై ఐటీ ఫస్ట్ బిగ్ యాక్షన్ సంచలన వర్చ్యువల్ కరెన్సీ బిట్కాయిన్ వ్యవహారంలో దేశంలో తొలిసారి ఐటీ శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా బిట్కాయన్ ఎక్సేంజ్లపై ఆదాయ పన్ను శాఖ సర్వే నిర్వహించింది. ఎల్జీ కొత్త ఫోన్ వచ్చేసింది ఎల్జీ కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. వి 30+ పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. జియో ఐపీవోపై రిలయన్స్ స్పందన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఐపీవోకు రానుందన్న వార్తలను రిలయన్స్ కొట్టిపారేసింది. ------------------------------------------- సినిమా -------------------------------------------- అందరి కళ్లు బాహుబలి 2నే వెతికాయి బాహుబలి -2 : ది కన్క్లూజన్ మరో రికార్డు సొంతం చేసుకుంది. 2017కు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్లో అత్యంత ఎక్కువసార్లు శోధించిన అంశంగా ముందు వరుసలో నిలిచింది. నెక్ట్స్ వీరే.. గతంలో సన్నిహితంగా మెలిగిన సల్మాన్, కత్రినాలు ఒక్కటి కావాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు. మంజుల నిర్మాతగా నాని సినిమా విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల ఓ సినిమాను నిర్మించనుంది. నితిన్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న నితిన్ సినిమా కోసం ఇంట్రస్టింగ్ టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. టైటిల్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపించేలా ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ------------------------------------------- క్రీడలు -------------------------------------------- పెళ్లిరోజున రో‘హిట్’.. రితిక హైలెట్! పెళ్లిరోజున ఎవరైనా ఏం చేస్తారు. ఆఫీసుకు సెలవుపెట్టి రోజంతా కుటుంబంతో సరదా గడుపుతారు. కానీ రోహిత్ శర్మ బరిలోకి సరికొత్త రికార్డు లిఖించాడు. లక్మల్పై కసితీర్చుకున్న రోహిత్.! భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్ లక్మల్పై కసి తీర్చుకున్నాడు. 19 ఏళ్ల తర్వాత టీమిండియా.. భారత్-శ్రీలంక మధ్య మొహాలీలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్మెన్ చేలరేగిపోయారు. తరుణ్–సౌరభ్ జంటకు టైటిల్ దక్షిణాఫ్రికా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కోనా తరుణ్కు టైటిల్ దక్కింది. -
టుడే న్యూస్ రౌండప్
న్యూఢిల్లీ: ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన మనం కలిసి సాగితే ఎంతో చేయగలం. ఆర్థిక వృద్ధి, సంస్కరణలను ప్రోత్సహించడం, ఉగ్రవాదంపై పోరాడటం, భద్రత సహకారాన్ని పెంపొందించుకోవడం వంటి విషయమాల్లో మన ప్రాధాన్యాలు ఉమ్మడివి’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ అన్నారు. -------------------- రాష్ట్రీయం -------------------- గోనెగండ్ల చేరుకున్న వైఎస్ జగన్ సాక్షి, గోనెగండ్ల : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు... ఏపీ సచివాలయం వద్ద తీవ్ర కలకలం సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయం వద్ద తీవ్ర కలకలం రేగింది. సచివాలయం గేటు వద్ద మంగళవారం ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మనసులో మాట బయటపెట్టిన యనమల సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మనసులో మాట బయటపెట్టారు. హైదరాబాద్ మెట్రో పట్టాలెక్కిందోచ్... సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. హెచ్ఐసీసీలో మోదీ-ఇవాంక భేటీ సాక్షి, హైదరాబాద్ : జీఈ సదస్సు 2017 ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక టంప్ భేటీ అయ్యారు. ప్రధాని ప్రయాణించిన మెట్రోకు ఓ ప్రత్యేకత.. సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం మెడలో మెట్రో మణిహారం అందంగా కొలువుతీరింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో ప్రారంభమైంది. -------------------- జాతీయం -------------------- జీఈఎస్పై ఐఎస్ ఉగ్రవాదుల గురి! సాక్షి, హైదరాబాద్ : హైదారాబాద్లో జరుగుతున్న గ్లోబెల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమావేశం(జీఈఎస్)పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదలు దాడి చేసే అవకాశం ఉందని... బీజేపీ విజయానికి నాటి మోదీ డ్రీమ్ టీంకే టాస్క్ సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలు... గన్తో వేటాడుతూ బుక్ అయిన మంత్రి సాక్షి, ముంబై : సోషల్ మీడియాలో ఇప్పుడు మహారాష్ట్ర మంత్రి గిరీశ్ దత్తాత్రేయ మహాజన్ చేసిన పని వైరల్ అవుతోంది. 2 కోట్లు ఇస్తే సీఎం సెక్సు సీడీ చేయిస్తా.! అహ్మదాబాద్: రెండు కోట్లు ఇస్తే తను కూడా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మార్ఫింగ్ సెక్సు వీడియోలు తీసుకురాగలనని పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్... సాక్షి, న్యూఢిల్లీ: రాజ్పుత్ వర్గీయుల వ్యతిరేకతతో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న ‘పద్మావతి’ సినిమాకు ఊరట లభించింది. యోగీ బాటలో.. కేజ్రీవాల్! సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బాటలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణిస్తున్నారు. యోగీ యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక..... -------------------- అంతర్జాతీయం -------------------- ‘నేను ఉగ్రవాదిని కాను’ న్యూఢిల్లీ : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్.. తాను ఉగ్రవాదిని కాదని ప్రకటించుకున్నారు. మిస్సింగ్ విమానం.. విషాదం మాస్కో : కనిపించకుండా పోయిన ఓ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రష్యాలోని తంబోవ్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. -------------------- సినిమా -------------------- మూర్ఖంగా చేయకండి.. అభిమానికి హీరో ట్విట్ ! ముంబై: హీరోలు సినిమాలో చేసే స్టంట్స్ అభిమానులపై ప్రభావం చూపుతాయి. బాహుబలి-2 సినిమాలో ప్రభాస్ ఏనుగు తొండంపై పైకి ఎక్కుతాడు. 'భాగమతి' తమిళ రైట్స్ కు భారీ రేటు అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను యువీ క్రియేషన్స్ సంస్థ భారీ... యమధీర : చరణ్ Vs తారక్ బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ఇటీవల తన సోషల్ మీడియా... కామెడీకే ఓటేసిన అల్లరోడు ఇటీవల వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడ్డ అల్లరి నరేష్ సుడిగాడు సినిమాతో చివరిసారిగా సక్సెస్ అందుకున్నాడు. -------------------- క్రీడలు -------------------- 'అతనొక గ్రేట్ బ్యాట్స్మన్' బ్రిస్బేన్:యాషెస్ సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్పై దిగ్గజ... కెరీర్ అత్యధిక పాయింట్లతో.. దుబాయ్:అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్లో భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు చతేశ్వర్ పుజారా రెండో ర్యాంక్కు ఎగబాకాడు. విరాట్-అనుష్కల డ్యాన్స్ అదిరింది! ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సాగరికను మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ రిసెప్షన్ సోమవారం సాయంత్రం ముంబైలోని తాజ్.. అత్యుత్తమ స్పిన్నర్ అతనే:మురళీ కొలంబో:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో విశేషంగా రాణించి ఎనిమిది వికెట్లు సాధించడంతో పాటు మూడొందల... -------------------- బిజినెస్ -------------------- జియోఫోన్ సేల్స్ మళ్లీ ప్రారంభం ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రిలయన్స్జియో ఫీచర్ ఫోన్ విక్రయాలను పునఃప్రారంభమయ్యాయి. ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు ప్రకారం ఓ లింక్తో... జియో క్యాష్బ్యాక్ ఆఫర్ మరికొన్ని రోజులు టెల్కోలు తీసుకొస్తున్న ప్లాన్లకు షాకిస్తూ ముఖేష్ అంబానీ కంపెనీ తీసుకొచ్చిన ట్రిపుల్ క్యాష్బ్యాక్ ఆఫర్ మరికొన్ని రోజుల పాటు కస్టమర్లకు అందుబాటులో... విమాన ప్రయాణికులకు త్వరలో గుడ్న్యూస్ సాక్షి, న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు త్వరలోనే విమానయాన సంస్థలు గుడ్న్యూస్ చెప్పనున్నాయి. ప్రయాణికులపై ఇప్పటి వరకు విధిస్తున్న అత్యధిక రద్దు... చివరి వరకూ నష్టాలే..10400 దిగువకు నిప్టీ సాక్షి,ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఐటీ కౌంటర్లలో అమ్మకాలతో సెన్సెక్స్ 106 పాయింట్లు... -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, కోడుమూరు: రైతుల కళ్లలో నీళ్లు వస్తే దేశానికి అరిష్టమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 19వ రోజు కర్నూలు జిల్లా కోడమూరులో రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు వచ్చానని, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అన్నదాతలకు ఒరిగిందేమీ లేదన్నారు. కర్షకులు కష్టాలు తీర్చేందుకు వారి దగ్గర నుంచే సూచనలు తీసుకుంటానని చెప్పారు. ------------------------------------ రాష్ట్రీయం ---------------------------------- గిడ్డి ఈశ్వరి ఎన్ని కోట్లు తీసుకున్నారు? సాక్షి, విజయనగరం : గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే... పేపర్లు బల్లకేసి కొట్టిన డిప్యూటీ సీఎం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అసైన్డ్ కమిటీల విషయమై సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కేఈ... ‘వైఎస్ జగన్ సీఎం అయ్యాకే పెళ్లి’ సాక్షి, వాకాడు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యే వరకు తాను పెళ్లి చేసుకోనని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు... బాబుకు ఝలక్.. డ్యామ్షూర్గా వైఎస్సార్సీపే గెలుస్తుంది: గిడ్డి ఈశ్వరి సాక్షి, అమరావతి: డ్యామ్షూర్ పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే విజయం సాధిస్తుంది.. అధికార పార్టీ టీడీపీ గూటికి చేరిన తర్వాత పాడేరు... ‘తీన్మార్’ బిత్తిరి సత్తిపై దాడి, ఆస్పత్రికి తరలింపు! సాక్షి, హైదరాబాద్ : 'తీన్మార్' కార్యక్రమంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘బిత్తిరి సత్తి’ పై దాడి జరిగింది. హైదరాబాద్లోని V6 చానల్... స్టాలిన్కు థ్యాంక్స్ చెప్పిన కేసీఆర్ సామాజిక న్యాయం సాధించే విషయంలో రాష్ట్రాల అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించిన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కు తెలంగాణ... ------------------------------------ జాతీయం ---------------------------------- లాలూకు ఎన్ఎస్జీ భద్రత ఉపసంహరణ సాక్షి, పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్కు కొనసాగుతున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రతను కేంద్రం ... గుజరాత్లో ఆశ్చర్యకర పరిణామం! అహ్మదాబాద్: గుజరాత్లో 182 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 20 శాతంపైగా ఉన్న ముస్లిం ఓటర్లు 20 స్థానాల్లో ప్రభావం చూపించనున్నారు. నేనే జయ కూతురినంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఆగ్రహం! సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలినంటూ మరో మహిళ ముందుకొచ్చారు. జయలలిత కూతురిని తానేనని, కావాలంటే తనకు డీఎన్ఏ పరీక్ష... గుజరాత్ బిడ్డగా నాపై ఎలాంటి మచ్చా లేదు.. సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికలను అభివృద్ధి, వారసత్వ రాజకీయాల మధ్య పోరాటంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ---------------------------------- అంతర్జాతీయం ------------------------------- మిస్ యూనివర్స్గా మిస్ దక్షిణాఫ్రికా.! లాస్వెగాస్: మిస్ యూనివర్స్-2017 కిరిటాన్ని మిస్ దక్షిణాప్రికా డెమి లేహ్ నెల్ పీటర్స్ కైవసం చేసుకున్నారు. ఆదివారం అమెరికా, లాస్వేగాస్లో... బద్దలుకానున్న అగ్నిపర్వతం.. భయాందోళనలు డెన్పసర్(ఇండోనేసియా) : ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించే ఇండోనేసియా ప్రాంతంలో ప్రజలు మరోసారి భయాందోళనలు చెందుతున్నారు. 'మహా ప్రళయం కోరల్లో న్యూజిలాండ్' వెల్లింగ్టన్ : పెను భూకంపాలు న్యూజిలాండ్ ద్వీపంలో విధ్వంసం సృష్టిస్తాయని సోమవారం జియాలజిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. అక్రమంగా ఆస్ట్రేలియా వెళ్తూ..! కొలంబో: పడవలో అక్రమంగా ఆస్ట్రేలియాకు వలసవెళ్తున్న 22మందిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. తమకందిన సమాచారం మేరకు పుట్టలం కోస్టల్ టౌన్ వద్ద... ---------------------------------- సినిమా ----------------------------------- పవన్ ‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్ వచ్చేసింది పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే సినిమాకు 'అజ్ఞాతవాసి' అన్న... ఘనంగా నటుడి చిన్నా కుమార్తె వివాహ రిసెప్షన్ ప్రముఖ సినీ నటుడు చిన్నా కుమార్తె మోనిక వివాహ రిసెప్షన్ ఆదివారం ఘనంగా జరిగింది. ------------------------------------ క్రీడలు ------------------------------------------ కోహ్లిని కాదని.. పాక్ కెప్టెన్కు ఓటేశాడు! నాగ్పూర్:ఇటీవల కాలంలో టీమిండియా విజయాల్లో కెప్టెన్ విరాట్ కోహ్లి పాత్ర వెలకట్టలేనిది. అటు కెప్టెన్గా, ఇటు బ్యాట్స్మన్గా కోహ్లి... విరాట్ సేన 'భారీ' విజయం నాగ్పూర్:శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 'భారీ' విజయం సాధించింది. అశ్విన్ అరుదైన ఘనత నాగ్పూర్:టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 96 ఏళ్ల 'ట్రిపుల్ 'రికార్డు బ్రేక్ ఈస్ట్ లండన్(దక్షిణాఫ్రికా): ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 96 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డు తాజాగా బద్దలైంది. ------------------------------- బిజినెస్ --------------------------------- ఇరకాటంలో ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు, కేసు నమోదు బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ ఇరకాటంలో కూరుకుపోయారు. జియో వల్ల భారీగా పెట్టుబడులు రైటాఫ్ రిలయన్స్ జియో ఉచిత వాయిస్, డేటా ఆఫర్ల వెల్లువ టెలికాం కంపెనీలను భారీగా దెబ్బతీసింది. దాదాపు 50 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను టెలికాం కంపెనీలు... ఆపిల్ రాక ఎంతో ఆనందదాయకం ప్రపంచపు టెక్ దిగ్గజం ఆపిల్, తన కంపెనీ తయారీ యూనిట్ను భారత్లో ఏర్పాటుచేయడానికి కేంద్రం సపోర్టు ఇస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి... -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్ : ‘చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏం చేశాడంటే.. మధ్యనిషేదం గోవిందా. ఉద్యోగాలకు ఉన్న భరోసా గోవిందా. ప్రభుత్వ సంస్థలు గోవిందా. వర్షాలు, రైతులు గోవిందా. ఇళ్ల నిర్మాణాలు గోవిందా. పెన్షన్లన్నీ గోవిందా. ప్రజా సంక్షేమ పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలను గోవిందా అనిపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇచ్చిన హామీని నెరవేర్చలేని వ్యక్తి తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితులు రావాలని, అప్పుడే రాజకీయాలపై, నేతలపై ప్రజలకు విశ్వసనీయత ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. మరిన్ని కీలక కథనాలు మీకోసం.. ---------------------- రాష్ట్రీయం --------------------- ఏపీ ప్రభుత్వం వింత పోకడ చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వింత పోకడలు పోతోంది. చంద్రబాబు పాలనలో అన్నీ గోవిందా!: వైఎస్ జగన్ ‘చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏం చేశాడంటే.. మధ్యనిషేదం గోవిందా. ఉద్యోగాలకు ఉన్న భరోసా గోవిందా. ప్రభుత్వ సంస్థలు గోవిందా.. ‘బాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలి’ సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రహసనంగా మార్చేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి మండిపడ్డారు. గురువారం... అరకు ఎంపీకి బెదిరింపు మెయిల్స్ ' నేను ఏసీబీ అధికారిని.. మీ వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది. అందుకు సంబంధించిన వివరాల ఫైల్ ఏసీబీ కార్యాలయంలో ఉంది. రైతుల ఆత్మహత్యాయత్నంపై చలించిన జగన్ కృష్ణాజిల్లా నున్న పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం ఘటన అంశంపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. నాపై దాడి చేస్తోంది బీజేపే... రచయిత అయిన తనపై ఆర్యవైశ్యులతో కలిసి బీజేపీ తీవ్రంగా దాడి చేస్తోందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆరోపించారు. ఆ ఇద్దరు దళితులు ఏమయ్యారు? నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో ఇద్దరు దళితులను దారుణంగా అవమానించిన కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఓటుకు నోటు.. అస్సలు తప్పించుకోలేరు తెలంగాణ మంత్రి కేటీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి... పర్యాటకులను దోచుకున్న యువకుల అరెస్ట్ వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవిలో ప్రయాణికులు, పర్యాటకులను బెదిరించి దోచుకున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ---------------------- జాతీయం --------------------- నీటిలో వేసినా కరగలేదు.. ప్లాస్టిక్ చక్కెర కలకలం మైసూరు నగరంలో నకిలీ చక్కెర కలకలం రేపింది. ఉల్లి ధరలకు కేంద్రం చెక్ ఉల్లి ధరలకు చెక్ పెడుతూ దేశంలో సరఫరాలను పెంచేందుకు ఉల్లికి టన్నుకు 850 డాలర్ల కనిష్ట ఎగుమతి ధర(ఎంఈపీ)ను గురువారం ప్రభుత్వం... బీఎస్పీకి ఓటేస్తే బీజేపీకి వెళ్లింది.. యూపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంల లోటుపాట్లు చోటుచేసుకున్నాయి. రెండాకుల గుర్తు... శశికళ వర్గానికి షాక్ అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రెండాకుల గుర్తును పళని-పన్నీర్ వర్గానికి కేటాయిస్తూ... సైబర్దాడులు ప్రధాన ముప్పు సురక్షితమైన సైబర్ స్పేస్ జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. ---------------------- అంతర్జాతీయం --------------------- 100 కత్తి పోట్లు.. తల నరికి.. గుండె కోసి.. అమెరికాలోని రౌడి ముఠా ఓ వ్యక్తిని బుధవారం అతి కిరాతకంగా హతమార్చి పబ్లిక్ పార్కులో పాతి పెట్టింది. రద్దీ రైల్లో పాము.. వీడియో వైరల్ రద్దీగా ఉన్న రైలులో ఒక్కసారిగా పాము కనిపించింది. ఇంకేముంది ప్రయాణికుల అరుపులతో రైల్లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. హాఫీజ్ విషయంలో పాక్ తప్పు చేస్తోంది! ముంబై మారణ హోమం ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ మహ్మద్ సయ్యిద్ను గృహ నిర్భందం నుంచి విముక్తి కల్పిస్తూ బుధవారం ... ఆ సంక్షోభం ఇక ముగిస్తే మంచిది గత అధ్యక్షులకు భిన్నంగా రష్యాతో మైత్రి కొనసాగించటం చర్చనీయాంశంగానే కాదు.. సొంత దేశంలోనే ట్రంప్పై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ‘వీటో’ మార్పులకు వ్యతిరేకం: అమెరికా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లోని భద్రతా మండలి శాశ్వత సభ్యులకు మాత్రమే పరిమితమైన వీటో అధికారంలో మార్పులు చేయడం లేదా సభ్యుల సంఖ్యను మార్చడాన్ని... ---------------------- సినిమా --------------------- మేఘాకు మరో ఛాన్స్ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే మేఘా ఆకాష్కు కోలీవుడ్లో మరో అవకాశం తలుపు తట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు చిత్రాలున్నాయి. రత్తాలుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఖైదీ టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేసి లక్ష్మీ రాయ్ పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. 'యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం' సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జవాన్. రచయిత బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రయిలర్ ను గురువారం... సేమ్ టూ సేమ్.. ఉపాసన రియాక్షన్ ఓవైపు రంగస్థలం షూటింగ్లో పాల్గొంటు బిజీగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్చరణ్.. ---------------------- క్రీడలు --------------------- కోహ్లిని ఆకాశానికి ఎత్తేసిన పాక్ దిగ్గజం ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో 50 శతకాల్ని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బీసీసీఐపై భగ్గుమన్న కోహ్లి.. వరుస సిరీస్లపై ఆగ్రహం! ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా వరుస క్రికెట్ సిరీస్లు నిర్వహిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీరుపై టీమిండియా కెప్టెన్... ఒక్కటైన జహీర్-సాగరిక టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేను జహీర వివాహం చేసుకున్నాడు. క్వార్టర్స్ లో సింధు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. ---------------------- బిజినెస్ --------------------- పన్ను మినహాయింపులో వారికి భారీ ఊరట? పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుందా? తాజా నివేదికల ప్రకారం ఆదాయ పన్ను మినహాయంపులో పెన్షనర్లకు భారీ ఉపశమనం. జీఈఎస్-2017 ఉద్దేశం ఏమిటి? తెలంగాణా రాజధాని నగరం హైదరాబాద్లో ఇపుడు ఎక్కడ చూసినా గ్లోబల్ ఎంట్రపెన్యూయర్షిప్ సమ్మిట్ 2017 (జీఈఎస్), ఇవాంకా ట్రంప్.. మార్కెట్లు అక్కడక్కడే బలహీనమైన గ్లోబల్ సంకేతాలతో ఆద్యంతం ఒడిదుడుకులుగా సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్పలాభాలతో ముగిశాయి. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఈ నెల 11,12 తేదీల్లో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. -------------------- రాష్ట్రీయం --------------------- రైతులకు వైఎస్ జగన్ కచ్చితమైన హామీ! సాక్షి, జమ్మలమడుగు (వైఎస్ఆర్ జిల్లా): ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం... పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ఇదే.. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు టెన్త్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి గంటా... అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? కొడంగల్: నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని, వారి ఆశీర్వాదంతో తాను రాజకీయాల్లో ఎదుగుతున్నట్లు కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే... పాలమూరులో ఐటీపార్క్.. గద్వాల్లో హ్యాండ్లూమ్ ప్లాంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్ సత్ఫలితాలను ఇస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్కు ఇదే నా సవాల్ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. -------------------- జాతీయం --------------------- ముఖ్యమంత్రుల మాటల యుద్ధం సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీని ఆవరించిన పొగమంచు, వాతావరణ కాలుష్యం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి కారణంగా నిలిచింది. ఐటీ దాడుల షాక్.. శశికళను 20 ఏళ్లపాటు జైల్లో పెట్టినా.. సాక్షి, చెన్నై: ఆదాయపన్న శాఖ (ఐటీ) పెద్ద ఎత్తున జరిపిన దాడులతో శశికళ వర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శశికళ ఆర్థిక సామ్రాజ్యం లక్ష్యంగా, ఆమె బంధువులు... వచ్చేస్తున్నాడు..!? తలైవా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? ఇంతకాలం వస్తున్న పుకార్లకు పుట్టిన రోజు చెక్ పెట్టనున్నారా? కమల్హాసన్కు పోటీగా అడుగులు... బీజేపీలో చేరాలంటూ.. బెదిరింపులు సాక్షి, బెంగళూరు : భారతీయ జనతాపార్టీ అధినాయత్వంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. -------------------- అంతర్జాతీయం --------------------- ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ‘మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదే’ వాషింగ్టన్ : పాకిస్తాన్కు కొంత కాలంగా వరుస షాక్లు ఇస్తున్న అమెరికా.. తాజాగా మరో గట్టి ఝలక్ ఇచ్చింది. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పడ్డ ప్రముఖ ఉగ్రవాద... దో మినిట్.. బస్ లండన్ : వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లితే.. అక్కడి వైద్యులు రోగులు చెప్పేది(అనారోగ్యం గురించి) ఎంత శ్రద్ధగా వింటున్నారో తెలియజేస్తూ లండన్కు చెందిన... -------------------- బిజినెస్ --------------------- జీఎస్టీ ఎఫెక్ట్: 8 ఏళ్ల కనిష్టానికి పసిడి డిమాండ్ సాక్షి, ముంబై: బులియన్ వ్యాపారంపై ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలు, గ్రామీణ ప్రాంతాలనుంచి డిమాండ్ బాగా తగ్గడంతో 2017లోబంగారం డిమాండ్ భారీగా... షాకింగ్: నోట్ల ముద్రణను తగ్గిస్తున్న ఆర్బీఐ? సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణను రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాగా తగ్గించిందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో... ఆధార్ అనుసంధానం: వీటికి కూడా మాండేటరీ సాక్షి,న్యూఢిల్లీ: ఆధార్ నంబర్తో అనుసంధానంపై మరో షాకింగ్ న్యూస్ను బీమా రెగ్యులేటరీ సంస్థ ప్రకటించింది. -------------------- సినిమా --------------------- ఆ సీన్లు అనుకోకుండా తీశారు.. క్షమించండి సాక్షి, చెన్నై : అతుల్య రవి కోలీవుడ్లో సెన్సేషన్ హీరోయిన్. ఈ ఏడాది మొదట్లో వచ్చిన కాదల్ కన్ కట్టుదే చిత్రంతో యూత్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్... కొత్త దర్శకుడితో విజయ్..! అర్జున్ రెడ్డి సినిమక్తో ఒకసారిగా స్టార్గా మారిపోయిన విజయ్ దేవరకొండ, వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా.. చెర్రీపై ఉపాసనకు కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా? టాలీవుడ్ స్టార్ కపుల్ రాంచరణ్, ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి దాంపత్య జీవితం హాయిగా సాగిపోతోంది. ఎవరేమన్నా.. పట్టించుకోకుండా... ఎంతో కష్టపడి తీశాను.. ఆ రూమర్స్ నమ్మకండి! తన తాజా సినిమా ’పద్మావతి’పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. -------------------- క్రీడలు --------------------- కోహ్లికి ధైర్యం చెప్పిన హార్దిక్! తిరువనంతపురం: న్యూజిలాండ్ తో మంగళవారం జరిగిన చివరి టీ 20లో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్మీడియాలో ఒక్క పోస్ట్.. కోహ్లికి అన్ని కోట్లా! న్యూడిల్లీ : ప్రపంచంలో అధికంగా సంపాదించే ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకరు. అయితే సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా కోహ్లికి ఆదాయం ఎంత... ధోని ఫామ్ పై నెహ్రా స్పందన న్యూఢిల్లీ:న్యూజిలాండ్ తో రెండో టీ 20లో నెమ్మదైన ఆట తీరుతో విమర్శల పాలైన ఎంఎస్ ధోనికి మాజీ భారత ఆటగాడు ఆశిష్ నెహ్రా అండగా నిలిచాడు. పాక్ కు విండీస్ మరో ఝలక్! కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కు మరోసారి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. టీ20ల్లో సంచలనం.. హ్యాట్రిక్ సహా 10 వికెట్లు జైపూర్ : టీ20 క్రికెట్లో రాజస్థాన్కు చెందిన యువ బౌలర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని నివాసంలో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. రేవంత్కు మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్తోపాటు మరికొందరు నేతలకు కూడా రాహుల్ కండువాలు కప్పారు. ---------------------- రాష్ట్రీయం --------------------- కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చింతమనేని దాష్టీకం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన దాష్టీకాన్ని ప్రదర్శించారు. ‘గడ్కరీ చెప్పినా చంద్రబాబు వినడం లేదు’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ను మాయ ప్రాజెక్ట్లా తయారు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పార్థసారధి వ్యాఖ్యానించారు. సీఎం ఎవరు? బాహుబలి ఎవరు? కాంగ్రెస్ అద్వానీ ఎవరు? ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సీఎల్పీ నాయకుడు జానారెడ్డి... ఢిల్లీ వేదికగా కేసీఆర్కు రేవంత్ సవాల్! తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశించారని, అందుకే ఎలాంటి ప్రయోజనాలు చూడకుండా... ---------------------- జాతీయం --------------------- ప్రధాని మోదీకి చల్లటి కబురు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్పై మోదీ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ చల్లటి కబురు చెప్పారు. మరి మగవారి గౌరవం మాటేంటి? ఓ అత్యాచార కేసులో వాదనల తీర్పు సందర్భంగా ఢిల్లీ న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీజేపీకి ఝలక్.. వద్దంటే వదిలేయండి! ‘సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటారో వెళ్తారో తేల్చుకోండి’ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విసిరిన సవాలుకు మిత్రపక్షం శివసేన... మోదీకి పోటీగా ‘ముగ్గురు మొనగాళ్లు’ అటు పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం.. ---------------------- అంతర్జాతీయం --------------------- కొడుకు తల ఇరుక్కుంటే.. వీడియో తీస్తూ..! బుడి బుడి అడుగులు వేసే తమ బుజ్జాయిలకు ఏదైనా చిన్నగాయం కావడం, లేదా వారు ఏడవడం చేస్తేనే తల్లిదండ్రుల మనసు చివుక్కుమంటుంది. అతీత శక్తులు ఉన్నాయా...? ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే విషయాన్ని నాసా ప్రకటించింది. ఆకాశగంగను చైనా అందకుండా చేస్తుందా? భారత్ - చైనాల మధ్య మరో భారీ పోరాటం ఆరంభం కాబోతోంది. నిన్నటివరకూ భారత్తో భూమి(డోక్లాం) కోసం పోరాడిన చైనా.. ఇక నుంచి నీటి పోరుకు... కమ్యూనిజం అక్కడ ఎలా బతికుందంటే... సుందరమైన ప్రాంతాలున్న రాష్ట్రం, గాడ్స్ ఓన్ కంట్రీగా కేరళ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ---------------------- సినిమా --------------------- అబ్బో.. అలాంటి ఆశ లేదు.. ఎందుకంటే! నాకు అలాంటి ఆశ లేదంటోంది నటి అనుపమ పరమేశ్వరన్. ఇంతకీ ఈ బ్యూటీ చెప్పేదేమిటనేగా మీ ప్రశ్న? మలయాళం చిత్రసీమకు ప్రేమమ్ అంటూ రంగప్రవేశం... అదిరింది... అసలు రిలీజ్ అవుతుందా..! ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా మెర్సల్. ఇళయ దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి... అర్జున్ రెడ్డికి అద్భుతమైన అవకాశం పెళ్లి చూపులు సినిమాతో తొలి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో హాట్ టాపిక్ గా మారిపోయాడు. హిట్ డైరెక్టర్ కొడుకు ఇరగదీశాడు..! భలే భలే మొగాడివోయ్ సినిమాతో స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయిన దర్శకుడు మారుతి. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో విజయాన్నిఅందుకున్న మారుతి త్వరలో... మాస్ స్పెషలిస్ట్తో మహేష్..! టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూట్ మారుస్తున్నాడు. ---------------------- బిజినెస్ --------------------- రెస్టారెంట్లకు, మాల్స్కు కేంద్రం తాజా ఆదేశాలు రెస్టారెంట్లకు, మాల్స్కు, షాపింగ్ అవుట్లెట్లకు కేంద్రం సరికొత్త ఆదేశాలు జారీచేసేందుకు సిద్ధమైంది. వారికి భారీగా డిమాండ్, జీతం రూ.4 కోట్లు ప్రస్తుతం భారత్ డిజిటల్ దిశగా పరుగులు పెడుతోంది. ప్రాఫిట్ బుకింగ్:దలాల్ స్ట్రీట్ వెనకడుగు వరుస రికార్డు స్థాయిలతో మురిపించిన దేశీయ స్టాక్మార్కెట్లు చల్లబడ్డాయి. రికార్డులకు బ్రేక్: నష్టాల్లో మార్కెట్లు నాలుగు రోజుల నుంచి రికార్డుల మోతతో దంచికొట్టిన స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో కిందకి పడిపోయాయి. ---------------------- క్రీడలు --------------------- టీమిండియా గెలిస్తే.. పాక్ కు టాప్ ర్యాంకు! మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా టీమిండియా-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య బుధవారం తొలి టీ 20 జరుగనుంది. బూమ్రా 'టాప్' లేపాడు! అంతర్జాతీయ టీ 20 ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు ప్రధాన పేసర్ జస్ఫ్రిత్ బూమ్రా టాప్ లేపాడు. కివీస్ పై 'ఖాతా' తెరుస్తారా? మూడు వన్డేల సిరీస్ అనంతరం దొరికిన కొద్దిపాటి విరామంతో టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. రోహిత్ శర్మ సరికొత్త రికార్డు భారత క్రికెట్ జట్టు వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్ : తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు రేవంత్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కేసీఆర్ కుటుంబం సాగిస్తోన్న దోపిడీకి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుందనుకున్నవేళ.. అక్కడి రాజకీయ బద్ధశత్రువులు కలిసిపోయారని, అదే మాదిరిగా తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని అన్నారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘ఆత్మీయులతో మాట-ముచ్చట’ సభలో ఆయన మాట్లాడారు. మరికొన్ని ముఖ్య కథనాలు ఇవే.. ---------------------- రాష్ట్రీయం --------------------- సింగపూర్ పేరుతో ఆయింట్మెంట్ చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విమానం ఎక్కించి సింగపూర్ చూసి రమ్మనడమేంటని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ... చంద్రబాబుకు తెలిసే జరుగుతున్నాయా? ఖాకీ డ్రెస్సు వేసుకున్న కేడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. వచ్చే వారంలో టీడీపీకి రాజీనామా: కవిత సినీ నటి కవిత వచ్చే వారంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఏపీలో బద్ధశత్రువులు కలిశారు.. తెలంగాణలో వద్దా?: రేవంత్ తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు రేవంత్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రేవంత్ రెడ్డి భారీ జాబితా ; టీడీపీకి చావుదెబ్బే! మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న రేవంత్ రెడ్డి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న తెలుగుదేశం పార్టీని... 'ఆ ఉద్యోగాలను వంద శాతం భర్తీ చేస్తం' త్వరలో లక్షా 12 వేల ఉద్యోగాలు 100 శాతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ---------------------- జాతీయం --------------------- మమతా సర్కార్పై సుప్రీం సీరియస్ సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ లింకేజ్ను అనివార్యం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ... భారత్ హిందువులదే: శివసేన శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత్ తొలుత హిందూ దేశమేనని స్పష్టం చేసింది. మరింత దూకుడు పెంచిన రాహుల్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేపో, ఎల్లుండో చేపట్టేందుకు సిద్ధమైన ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. సుప్రీం కోర్టు.. పలు కీలక ఆదేశాలు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు సోమవారం పలు కీలక కేసులు విచారణకు వచ్చాయి. ---------------------- అంతర్జాతీయం --------------------- సౌదీ మహిళలకు మరో గుడ్న్యూస్ సౌదీ మహిళలకు మరో గుడ్న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఇటీవలే సౌదీ మహిళలు డ్రైవింగ్ చేయొచ్చని పేర్కొన్న ప్రభుత్వం, తాజాగా మహిళలను స్పోర్ట్స్... రాజాధి రాజు.. రాజభోగాలు..! ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అణు యుద్ధం.. ప్రతీ దేశం నాశనం! ఉత్తర కొరియా ఒకవేళ విధ్వంస కాండకు సిద్ధమైతే... ఆసియా దేశాలన్నీ తమ అణు ఆయుధాలను బయటకు తీయాల్సి ఉంటుందని అమెరికా రక్షణ... టూమచ్ ట్రంప్, వెంబడించి మరీ... ప్రపంచానికి పెద్దన్నగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి ఓ గౌరవం ఉంది. ---------------------- క్రీడలు --------------------- దటీజ్ కోహ్లీ: పది రోజుల్లోనే మళ్లీ సాధించాడు! టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. తాను కోల్పోయిన అగ్రస్థానాన్ని కేవలం పదిరోజుల్లోనే... ఓహ్.. వాటే సిక్స్.. ఆ సిక్సర్ను చూస్తూ బిత్తరపోయిన కోహ్లి! న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి చెలరేగి.. అద్భుతమైన సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్... మాజీ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం హైదరాబాద్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంవీ శ్రీధర్(51) హఠాన్మరణం చెందారు. షోయబ్-సానియాల ట్వీట్లు వైరల్ శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్లోను పాకిస్తాన్ 3–0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ---------------------- సినిమా --------------------- ఆ సిన్మాను అందుకే తిరస్కరించా! భల్లాల దేవుడు రానా హీరోగా తెరకెక్కిన ’నేనే రాజు నేనే మంత్రి’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ తేజ మళ్లీ ఫామ్లోకి వచ్చారు. అయితే... ఘనంగా స్టార్ హీరో కూతురి వివాహం కోలీవుడ్ హీరో ‘చియాన్’ విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం సోమవారం ఉదయం చెన్నైలో పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ లోకి రేవంత్: తనదైన శైలిలో స్పందించిన వర్మ తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు రేవంత్రెడ్డి అధికారికంగా ప్రకటించగా.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రేవంత్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ---------------------- బిజినెస్ --------------------- ఎన్ఆర్ఐ అయితే ఆ అకౌంట్లు క్లోజ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు, పబ్లిప్ ప్రావిడెంట్ ఫండ్ వంటి చిన్న పొదుపు పథకాల నిబంధనలను ప్రభుత్వం సవరించింది. మార్కెట్ల దూకుడు, రికార్డ్ ముగింపు దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచి పటిష్టంగా ఉన్న మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి. నిఫ్టీ... సరికొత్త రికార్డుల మోత గత కొన్ని రోజులుగా మోత మోగిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్ : ఏళ్లుగా తెలుగుదేశం- భారతీయ జనతాపార్టీల మధ్య కొనసాగుతోన్న స్నేహం విచ్ఛిన్నం కావడానికి రేవంత్ రెడ్డి వైఖరే ప్రధాన కారణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. రేవంత్ కోసం తాను ఎంతో చేశానని, కష్టసమయంలో అండగా నిలిచానని చెప్పుకొచ్చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు సుముఖంగానే ఉన్నారని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారినప్పుడే రాజీనామాను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పంపినట్టు తెలిపారు. తన రాజీనామాను స్పీకర్ పెండింగ్లో పెట్టారని చెప్పారు. స్పీకర్ ఆమోదించకుంటే తామేమి చేయగలమని అన్నారు. తాము రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేయడం తమకు సమస్యేనని ఒప్పుకున్నారు. ---------------------- రాష్ట్రీయం --------------------- రేవంత్ వల్లే టీడీపీ-బీజేపీ దోస్తీ చెడింది! ఏళ్లుగా తెలుగుదేశం- భారతీయ జనతాపార్టీల మధ్య కొనసాగుతోన్న స్నేహం విచ్ఛిన్నం కావడానికి రేవంత్ రెడ్డి వైఖరే ప్రధాన కారణమని... రాజీనామా చేశా: మంత్రి ఆది సంచలన వ్యాఖ్యలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు సుముఖంగానే ఉన్నారని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. విదేశీ పర్యటనలతో కాలయాపన చేస్తున్న సీఎం ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుటే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనల పేరుతో కాలయాపన చేస్తున్నారని.. బీజేపీ అధ్యక్షుడి ప్రసంగం: కుప్పకూలిన వేదిక నల్గొండ జిల్లా బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన సభా వేదిక అకస్మాత్తుగా కూలింది. 'అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ ఖాళీ' రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఉదయం నిజామాబాద్ రుద్రూరు మండలంలో పర్యటించారు. ---------------------- జాతీయం --------------------- జీఎస్టీపై విమర్శలకు కేంద్రం భారీ సమాధానం నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాయన్న విమర్శలకు కేంద్రం ఘాటుగా సమాధానమిచ్చే ప్రయత్నం చేసింది. దేవుడా.. రాహుల్కు మంచి బుద్ధి ప్రసాదించు! కేంద్రమంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాహుల్ గాంధీమీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ రాహుల్ గాంధీ... చావు బతుకుల మధ్య తెల్గీ దేశాన్ని ఆర్థికంగా కుదిపేసిన నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం ప్రధాన సూత్రధారిగా అబ్దుల్ కరీం తెల్గీ ఆరోగ్యం విషమించినట్లు సమాచారం.... నోట్ల రద్దు కష్టాలు: నవంబర్ 8 బ్లాక్డే నోట్ల రద్దు మిగిల్చిన కష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించి ఏడాది అవుతున్న సందర్భంగా ఈనెల 8న బ్లాక్ డే పాటించాలని ---------------------- అంతర్జాతీయం --------------------- అదృష్టంతో బతికిపోయింది..! ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది. క్షణకాలం పాటు శరీరం భయంతో కంపించిపోయే ఘటన. సైనికులకు చైనీస్లో శిక్షణ చైనా సరిహద్దులో ఇండో టిబెటన్ సరిహద్దు (ఐటీబీపీ) దళాలకు చైనా (మాండరిన్)భాషలో ప్రావీణ్యం కల్పించాలని భారత సైన్యం యోచిస్తోంది.. ప్రపంచం కంటతడి పెట్టింది యుద్ధ వాతావరణంలో మగ్గుతున్న సిరియాలో జరగుతున్న దారుణాలకు ప్రపంచం మరోమారు కంటతడి పెట్టింది. ఆకలితో అలమటించి, కృశించిపోయిన సమర్ దోఫ్దా అనే... ముఖం నుంచి చెమట రూపంలో రక్తం శరీరం మీద ఒక్క చిన్నగాటైనా లేకుండా ఓ యువతి ముఖం, అరచేతుల నుంచి రక్తం వస్తుండటం వైద్యులను ఆశ్చర్యపర్చింది. ---------------------- బిజినెస్ --------------------- ఆ రంగంలో నియామకాలు పెరిగాయ్ బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగంలో నియామాకాలు పెరిగినట్టు తెలిసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో... జరిమానాలు రద్దు, అకౌంట్లలోకి డబ్బులు ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేసినందుకు విధించిన జరిమానాలను ప్రభుత్వం మాఫీ చేసింది.. బలపడిన రూపాయి డాలర్తో పోల్చుకుంటే దేశీయ కరెన్సీ రూపాయి బలపడింది. వరుస నష్టాలకు చెక్ చెప్పి లాభాల్లో కొనసాగుతోంది. ఒప్పో మరో కొత్త ఫోన్ .. మూడు వేరియంట్లలో చైనీస్ టెక్ కంపెనీ ఒప్పో త్వరలోనే మరో కొత్త హై ఎండ్ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోలాంచ్ చేయబోతోంది. ---------------------- సినిమా --------------------- సై రా అప్ డేట్ : రవివర్మన్ అవుట్ ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. 'అదిరింది'.. ఈ వారం కూడా డౌటే..! విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సూపర్ హిట్ సినిమా మెర్సల్. బీజేపీ నేతల అభ్యంతరాలు, డాక్టర్ల నిరసనల మధ్య భారీ వసూళ్లు సాధిస్తున్న మెర్సల్ సినిమా... రెహమాన్ స్వరం.. కీరవాణి గళం..! సంగీత దర్శకులు తాము సంగీతమందించిన చిత్రాల్లో పాటలు పాడినా.. ఇతర సంగీత దర్శకుల చిత్రాల్లో పాటలు పాడటం చాలా అరుదు. ---------------------- క్రీడలు --------------------- మాకు బేధాలుండవు! భారతదేశం తరఫున క్రికెట్ ఆడేవాళ్లంతా.. భారతీయులే అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదని దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్.. నిషేధిత జట్టుకు రూ.850 కోట్ల పరిహారం 2011లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి నిషేధానికి గురైన కొచ్చి టస్కర్స్ కు రూ. 850 కోట్ల భారీ పరిహారం దక్కనుంది. గత కొంతకాలంగా... బాజా మోగనుంది.. ఒక్కటవుతున్న విరుష్క! గత కొన్నేళ్లుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మల చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. అదే టీమిండియా బలం: సచిన్ గత రెండు రోజుల క్రితం న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో శతకం సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్... ఈసారి కోహ్లిని ఎగతాళి చేస్తూ.. ఇటీవల భారత్ తో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో తమ జట్టు ఓటమి పాలుకావడాన్ని జీర్ణించుకోలేని ఆసీస్ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత డీన్... -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్: వృత్తినైపుణ్యం ఉండి, పొట్టకూటి కోసం పరాయి రాష్ట్రాలకు వలసపోయిన చేనేత కార్మికులు తిరిగి సొంతగడ్డ తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు ఆయన ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా రూపుదిద్దుకోనున్నఈ టెక్స్టైల్ పార్కు ద్వారా లక్షల మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని, ఇకపై నేతన్నలు వలసలు పోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. -------------------------------- రాష్ట్రీయం-------------------------------------- బాబ్బాబు.. మాతో రండి! సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇటీవల అధికార పార్టీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. తన వెంట టీడీపీలో ఎవ్వరూ చేరలేదన్న అపప్రదతో... అలాంటి వ్యక్తితో చంద్రబాబు ఫొటోలా? సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ రాష్ట్రంలో రౌడీలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార... కాంగ్రెస్కు కొత్త ఊపిరి! సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తెలుగుదేశం పార్టీలో తాజాగా చిచ్చుపెట్టిన అనుముల రేవంత్రెడ్డితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు ‘చేయి’ కలిపారు. ఆయన... కన్ఫర్మ్: రేవంత్ వస్తున్నాడు..! వికారాబాద్ అర్బన్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడం గల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని అలంపూర్ ఎమ్మెల్యే... ------------------------------------------- జాతీయం -------------------------------------------- టార్గెట్ వసుంధర రాజె సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తరచూ పంచ్లు పేల్చుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాజాగా రాజస్థాన్ సీఎం వసుంధర రాజెను టార్గెట్ చేశారు. ప్రభుత్వ... గుజరాత్లో ఊహించని పరిణామం అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తాడని అంచనాలు... ఆ రాత్రి ఇండియా ఇలా... సాక్షి,న్యూఢిల్లీ: దీపావళి రాత్రి వెలుగులు విరజిమ్మే సమయంలో దేశం ఎలా వెలిగిపోతుందో చూడాలని అనుకోవడం సహజం. అయితే కోట్లాది భారతీయుల కలలను సాకారం చేశారు... ------------------------------------------- అంతర్జాతీయం -------------------------------------------- ఆల్రెడీ పాక్లోకి ఎంటరయ్యాడు ; చైనా గుబులు ఇస్లామాబాద్ : ‘‘ఇప్పటికే అతను పాకిస్థాన్లోకి ఎంటరయ్యాడు. పేరు.. అబ్దుల్ వలీ. అతని పాస్పోర్ట్, వీసా డిటెయిట్స్ పంపిస్తున్నాం. గుర్తుంచుకోండి..... నది ఒడ్డున భయానక దృశ్యం.. పరుగులు బ్రిస్టల్ : నది ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఓ వ్యక్తి శరీరాన్ని చూసి ప్రజలు పరుగులు తీశారు. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రంప్ అభిశంసన కోసం రంగంలోకి బిలినీయర్! న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన కోసం ఆ దేశ బిలియనీర్ ఒకరు పోరాటాన్ని ప్రారంభించారు. ట్రంప్ను వెంటనే అధ్యక్ష పదవి నుంచి... ------------------------------------------- సినిమా -------------------------------------------- ఎన్టీఆర్ సినిమాకు పవన్ క్లాప్ జై లవ కుశ సినిమాతో మరో భారీ విజయాన్ని నమోదు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొత్త చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. 'రాజా ది గ్రేట్' దర్శకుడి ఆవేదన తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను వేదిస్తున్న ప్రధాన సమస్య పైరసీ. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా.. రిలీజ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు... బాలీవుడ్ నటికి పితృవియోగం ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తండ్రి రామ్ ముఖర్జీ (84) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో రామ్ ముఖర్జీ... ------------------------------------------- క్రీడలు -------------------------------------------- కోహ్లి కుమ్మేశాడు! ముంబై:న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 281 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వారిద్దరిపై వేటుకి కారణమిదే: కోహ్లి ముంబై: గత మూడు సిరీస్ లుగా భారత జట్టు ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను పక్కకుపెట్టడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిసారి... నేటి వన్డే ప్రత్యేకతలు.. సాక్షి, ముంబై: వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా .. న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు సిద్దమైంది. ఈ దూకుడును ఇలానే కొనసాగించాలని కోహ్లి సేన... ------------------------------------------- బిజినెస్ -------------------------------------------- ఫ్లాష్ బ్యాక్ : నా సమయం ముగిసింది! సాక్షి, న్యూఢిల్లీ : 148 సంవత్సరాల చరిత్ర. కానీ, చైర్మన్లుగా పని చేసింది ఆరుగురు మాత్రమే. ఇది టాటా గ్రూప్ సంస్థ సంబంధించిన అరుదైన ఘనత. -
టుడే న్యూస్ రౌండప్..
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర దుమారం రేపిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమ కులాన్ని అవమానపర్చేలా ఉన్న పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలంటూ ఆర్యవైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది. ------------------------------------------- రాష్ట్రీయం -------------------------------------------- కంచ ఐలయ్య పుస్తకంపై సుప్రీంకోర్టు తీర్పు తీవ్ర దుమారం రేపిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘నిరుద్యోగ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే’ ఏపీని ఆత్మహత్యల ప్రదేశ్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు ధ్వజమెత్తారు. నేతలతో చెట్టాపట్టాలు.. డ్యూటీలోనే ఇలా ! దగదర్తి ఎస్సై శ్రీనివాస్ విజయ్ ఆగడాలు శృతిమించుతున్నాయి. టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ఇతరులను వేధిస్తున్నారు. కర్నూలు జిల్లా విషాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి కర్నూలు జిల్లాలో విద్యుద్ఘాతానికి గురై నలుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ------------------------------------------- జాతీయం -------------------------------------------- బెంగళూరులో జలకన్య.. వాహనదారుల విస్మయం నిత్య రద్దీగా ఉండే బెంగళూరు నగర రోడ్లపై ఇప్పుడొక వింత వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రోహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు! దేశంలోని రోహింగ్యా ముస్లింలను పంపించే విషయమై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై.. శబరిమల ఆలయ కేసును రాజ్యంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు ఇచ్చింది. ------------------------------------------- అంతర్జాతీయం -------------------------------------------- నన్ను కూడా రేప్ చేశాడు : నోరు విప్పిన మరో నటి మూవీ మొఘల్గా ప్రసిద్ధుడైన నిర్మాత హార్వే వెయిన్స్టన్ లైంగిక వేధింపుల వ్యవహారం హాలీవుడ్ను తీవ్రంగా కుదిపేస్తోంది. ఓడ మునక.. భారతీయుల గల్లంతు జపాన్ తీరంలో సరుకు రవాణా నౌక మునిగిన ఘటనలో పది మంది భారతీయులు కనిపించకుండాపోయారు. ------------------------------------------- బిజినెస్ -------------------------------------------- స్నాప్డీల్ అన్బాక్స్ దివాలి సేల్ ప్రారంభం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ల కంటే ముందస్తుగానే స్నాప్డీల్ తన సేల్ను ప్రారంభించేసింది. అమ్మకానికి యమున ఎక్స్ప్రెస్వే దేశంలోనే అతిపెద్ద రియల్-ఎస్టేట్ డెవలపర్ జేపీ, ఢిల్లీలోని తన ముఖ్యమైన హైవేని అమ్మేస్తుంది. ------------------------------------------- సినిమా -------------------------------------------- మూవీ రివ్యూ: ‘రాజు గారి గది 2' రాజు గారి గది సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్న ఓంకార్, మూడో సినిమా కోసం మరోసారి హర్రర్ సబ్జెక్ట్ నే ఎంచుకున్నాడు. అమ్మో సమంత కల్లోకి రావొద్దు... అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల్ని తొలి సినిమాతోనే మాయ చేసిన సమంత నిన్న మొన్నటి వరకూ చాలామంది డ్రీమ్గాళ్. ------------------------------------------- క్రీడలు -------------------------------------------- కట్నం కోసం భార్యను వేధిస్తున్న క్రికెటర్ బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ సన్నీ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఖాన్ బాయ్.. హైదరాబాద్ మ్యాచ్కు రా.. బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ను నేడు (శుక్రవారం) హైదరాబాద్ వేదికగా జరిగే భారత్-ఆస్ట్రేలియా అమీతుమీ టీ20 మ్యాచ్కు హాజరవ్వాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోరారు. -
టుడే న్యూస్ రౌండప్..
సాక్షి, హైదరాబాద్ : ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరమని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలులో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రం ఆవిర్భావం నుంచి లక్షా 43వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. దాని ఫలితమే నిరుద్యోగుల ఆత్మహత్యలు. నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దు. అందరం కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. జీవితం చాలా విలువైంది. మంచి రోజులు వస్తాయి.’ అని వైఎస్ జగన్ ట్విట్ చేశారు. --------------------------------------- రాష్ట్రీయం ------------------------------------------ నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరం: వైఎస్ జగన్ ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రియల్టర్ అరుణారెడ్డిపై పీడీ యాక్ట్ వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి... తిరిగి వాటిని చెల్లించకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్న మహిళా రియల్టర్ అరుణా రెడ్డి (47)పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. వైఎస్ఆర్ సీపీలో చేరిన దంతులూరి దిలీప్కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కాంగ్రెస్ నేతలు దంతులూరి దిలీప్ కుమార్తో పాటు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో గురువారం వైఎస్ఆర్ సీపీలో చేరారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ ....వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్ చేనేతల రుణమాఫీ డిమాండ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్తో ధర్మవరంలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫేక్ డాక్టర్.. ఫేట్ మారిందిలా..! దొంగ బాబాల మాదిరే నకిలీ డాక్టర్లు కూడా పుట్టుకొస్తున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే.. డబ్బు సంపాదించడం.. వీరి ప్రభావం అమాయక ప్రజల మీద చాలా ఎక్కువ. ---------------------------------------- జాతీయం ------------------------------------------ ముఖ్యమంత్రి కారే దొంగతనం దేశ రాజధానిలో ఒక కారు చోరీకి గురైంది. దొంగతనానికి గురైంది అషామాషీ కారు కాదండోయ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారునే గురువారం దుండగులు దొచుకెళ్లారు. ఎమ్మెల్యే పేరిట మహిళలకు మెసేజ్లు.. అరెస్ట్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయటం.. సెలబ్రిటీలను ఇబ్బందుల పాలు చేయటం... తరచూ చూస్తున్నదే. నవంబర్ 9న హిమాచల్లో పోలింగ్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ గురువారం ప్రకటించింది. వచ్చే నెల 9న ఒకే దశలో పోలింగ్ జరుగుతుందని. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 18న జరుగుతందని తెలిపింది. దీపావళికి ఏదైనా జరిగిందో.. పోలీసులకు యోగి వార్నింగ్ తమ రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నడుంకట్టారు. ఇందుకోసం పోలీసులకు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. షాకింగ్ తీర్పు.. మరి ఆరుషిని చంపిందెవరు? ఆరుషి హత్య కేసులో అనూహ్య మలుపు.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులతో కింది స్థాయి కోర్టులో దోషులుగా పేర్కొన్న ఆమె తల్లిదండ్రులను గురువారం అలహాబాద్ కోర్టు ఎవరూ ఊహించని విధంగా నిర్దోషులుగా ప్రకటించింది. భారత్ను ఉత్తర కొరియా కూడా దాటేసింది.. ప్రపంచ దేశాల్లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందని చెప్పుకుంటున్నా దారిద్ర్యం మాత్రం భారత్ ప్రతిష్టను ప్రతిసారి మసకబారుస్తూనే ఉంది. అమిత్ షా కొడుకు 'అవినీతి'.. ఆరెస్సెస్ వైఖరి ఇదే! బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు జయ్ షాపై అవినీతి ఆరోపణలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. మోదీ ఇమేజ్ గట్టెక్కిస్తుందా..? చుట్టూ చీకటి..దారంతా ముళ్లు..అయినా ఆశలన్నీ ఆ నేతపైనే..భారమంతా అధినేత భుజాలపైనే. ముంచుకొచ్చిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అటు తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే మోదీ బ్రాండ్పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. ---------------------------------------- అంతర్జాతీయం ---------------------------------------- ఇమ్రాన్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఛైర్మన్, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్కు కోర్టు ధిక్కరణ నేరం కింద పాక్ ఎన్నికల కమిషన్ గురువారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. మంచు కప్పేసిన ప్రేమ ఎన్నో పర్వతాలను అధిరోహించి తన పేరును చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్న సుప్రసిద్ధ పర్వతారోహకుడు హేడెన్ కెన్నడీ(27) బలవన్మరణానికి పాల్పడ్డారు. మీరు జోక్యం చేసుకోవద్దు చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ను భారత్ దృష్టికోణం నుంచి చూడొద్దని అమెరికాను పాకిస్తాన్ అభ్యర్థించింది. సీపీఈసీ ప్రాజెక్ట్ కేవలం ఆర్థికాభివృద్ధి, మెరుగైన రవాణా సేవలకు ఉద్దేశించినదని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి ఇశాన్ ఇక్బాల్ అమెరికాకు వెల్లడించారు. ---------------------------------------- బిజినెస్ ------------------------------------------ మెగా డీల్: టెలికాం దిగ్గజం చేతికి టాటా టెలి మరికొన్ని రోజుల్లో మూత పడబోతున్న టాటా టెలిసర్వీసుల వైర్లెస్ వ్యాపారాలను ఎవరు కొనబోతున్నారు? నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఎవరి చేతిలోకి వెళ్లబోతుంది? అంటే టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వీటిని సొంతం చేసుకోబోతుందని తెలిసింది. మళ్లీ డిస్కౌంట్ల పండుగ: ఒకేసారి అమెజాన్, ఫ్లిప్కార్ట్ మళ్లీ డిస్కౌంట్ల ఉత్సవం ప్రారంభం కాబోతుంది. ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండూ ఒకేసారి తన సేల్ ఆఫర్లకు తెరతీయబోతున్నాయి. ---------------------------------------- సినిమా ------------------------------------------ బిజీ అవుతోన్న అర్జున్ రెడ్డి హీరోయిన్ అర్జున్ రెడ్డి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ షాలిని పాండే. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. రూపాయి కూడా ముందు తీసుకోను : ఆమిర్ భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆమిర్ ఖాన్ దంగల్ రికార్డ్ సృష్టించింది. ---------------------------------------- క్రీడలు ------------------------------------------ అదే నా ఆఖరి మ్యాచ్: నెహ్రా టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. నవంబర్ 1న సొంత మైదానమైన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో న్యూజ్ల్యాండ్ తో జరిగే మ్యాచ్ తన ఆఖరి మ్యాచ్ అని చెప్పారు. టాప్ ర్యాంకుపై ఆసక్తికర పోరు! ఇటీవల ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ ను 4-1తో కైవసం చేసుకున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ర్యాంకింగ్స్ లో కూడా టాప్ కు చేరిన సంగతి తెలిసిందే. -
టుడే న్యూస్ రౌండప్..
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం ముగిసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఈ భేటీలో నవంబర్ 2వ తేదీ నుంచి తలపెట్టిన పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. ---------------------------------------- రాష్ట్రీయం ------------------------------------------ తెలంగాణను సాధించే ఆత్మశక్తినిచ్చింది ఈ జన్మభూమే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 6నెలలు, 3వేల కి.మీ: వైఎస్ జగన్ పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం ముగిసింది. ఐటీ కంపెనీలు కష్టమే విశాఖపట్నంలో సోషల్ ఎకో సిస్టం లేదు.. డైరెక్ట్ ఫ్లైట్లు లేవు.. అంతర్జాతీయ ప్రమాణాలున్న స్కూళ్లూ లేవు.. మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్,మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ---------------------------------------- జాతీయం ------------------------------------------ సౌదీలో నరకం అనుభవిస్తున్నా.. కాపాడండి! సౌదీ అరేబియాలో బానిసగా మారి అష్టకష్టాలు పడుతున్న ఓ పంజాబీ మహిళ కన్నీరుమున్నీరవుతూ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారిపోయింది. 23మంది మృతి: ఆ తొక్కిసలాటకు కారణం ఇదేనట! 23 మంది మృతికి కారణమైన ముంబై ఎల్ఫిన్స్టోన్ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనకు కారణం .. అసలు నిజం ఒప్పుకున్న హనీప్రీత్.. వివాదాస్పద దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ఎట్టకేలకు అసలు నిజం ఒప్పుకున్నారు. ---------------------------------------- అంతర్జాతీయం ---------------------------------------- నా ఇష్టంతోనే చేశాను..! ’డవ్‘ సోప్ తాజాగా విడుదల చేసిన అడ్వర్టయిజ్మెంట్పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. భారత్పై అణుబాంబులు ఎక్కుపెడుతున్న పాక్..! పాకిస్తాన్ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు రిపోర్టులు వస్తున్నాయి. రేప్ చేయించి.. తల నరికి.. రక్తం తాగారు.. నడివీధిలో అందరూ చూస్తుండగా మహిళను జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి.. ---------------------------------------- బిజినెస్ ------------------------------------------ రూ.1,399కే ఎయిర్టెల్ 4జీ స్మార్ట్ఫోన్ రిలయన్స్ జియోకు కౌంటర్గా దానికంటే తక్కువ ధరకే ఎయిర్టెల్ తన కొత్త 4జీ స్మార్ట్ఫోన్ను ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలి సేల్: బంపర్ ఆఫర్లు ఫ్లిప్కార్ట్ మరోసారి పండుగ ఉత్సవాన్ని ప్రారంభించబోతుంది. ---------------------------------------- సినిమా ------------------------------------------ అజ్ఞాతంలో నటుడు సంతానం ప్రముఖ నటుడు సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. పవన్ చిన్నకొడుకుపై వర్మ కామెంట్ ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేది కవితకనర్హం అంటారు శ్రీశ్రీ. ---------------------------------------- క్రీడలు ------------------------------------------ తమ్ముడూ.. నువ్వంటే పిచ్చి.. టీమిండియా యువ కెరటం.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 24వ ఏట అడుగుపెట్టాడు. బాలీవుడ్ హీరోకు కోహ్లి ఛాలెంజ్.. క్రికెటర్స్, బాలీవుడ్ హీరోలు కలిసి అక్టోబర్ 15న మైదానంలో సందడి చేయనున్నారు. -
టుడే న్యూస్ రౌండప్..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంను అసలు తయారుచేసిందే నేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చెప్పారు. రాజకీయ జీవితంలో వేలు, లక్షల మంది కార్యకర్తలను తయారుచేశానని, అందులో ఒకడు కోదండరామని గుర్తుచేశారు. శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం మీడియాతో మాట్లాడారు. ---------------------------------------- రాష్ట్రీయం --------------------------------------- నేను దొరనా? మాది మైనారిటీ కులం సింగరేణి సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ టీజీబీకేఎస్ భారీ విజయాన్ని సాధించడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. కోదండరాంను తయారుచేసిందే నేను : కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంను అసలు తయారుచేసిందే నేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చెప్పారు. హైదరాబాద్లో విదేశీ కాల్ గర్ల్స్ హైదరాబాద్ లో విదేశీయుల సెక్స్ రాకెట్ వెలుగు చూసింది. పోర్న్ వైబ్ సైట్లపై నిఘా పెట్టిన పోలీసులకు గుట్టుగా సాగుతున్న విదేశీయుల వ్యభిచార ముఠా పట్టుబడింది. టీడీపీ నేతలపై పవన్ కల్యాణ్ ట్వీట్ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్రమంగా అధికార టీడీపీతో దూరం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ------------------------------------- జాతీయం ----------------------------------- గాంధీ హత్య.. నాలుగో బుల్లెట్ ఎక్కడిది? జాతి పిత మహాత్మా గాంధీజీ హత్యకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు నేడు(శుక్రవారం) విచారణ చేపట్టనుంది. ఏమీ చేయకుంటే మోదీ ఎలా అవుతారు.. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సాహసోపేత నిర్ణయాల తర్వాత ప్రజల్లో తిరిగి విశ్వాసం నింపేందుకు ప్రధాని మోదీ శ్రమిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. -------------------------------------- అంతర్జాతీయం --------------------------------- రొమాంటిక్ హిట్లర్.. అడాల్ఫ్ హిట్లర్.. చరిత్ర మరువని నరహంతకుడు. రెండో ప్రపంచముద్ధం మొదలు.. యూదులు అత్యంత పాశవికంగా హింసించి చంపిన నియంత. చందమామ గురించి కొత్త విషయం చందమామ గురించి నాసా సరికొత్త విషయాన్ని వెల్లడించింది. మూడు నుంచి నాలుగు బిలియన్ల సంవత్సరాలకు పూర్వం చంద్రుడిపై వాతావరణం ఉండేదని చెప్పింది. --------------------------------------- బిజినెస్ ----------------------------------------- మోదీకి వరల్డ్ బ్యాంక్ చల్లటి కబురు! డిమానిటైజేషన్, జీఎస్టీ అమలుతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి వరల్డ్ బ్యాంక్ చల్లటి వార్త చెప్పింది. గుడ్న్యూస్ : ఏఐతో భారీగా ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భారీ మొత్తంలో ఉద్యోగాల ఊడతాయంటూ పలు రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. ------------------------------------ సినిమా ----------------------------------------- మరి కొద్ది గంటల్లో నా కోడలు..! అక్కినేని వారింట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇప్పటికే మెహందీ ఫంక్షన్ లో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతో పాటు సమంత ఫ్యామిలీ కూడా ఉత్సాహంగా పాల్గొంటోంది. ప్రభాస్ నిజంగా డార్లింగే.. బాహుబలితో జాతీయ స్టార్గా మారిపోయిన ప్రభాస్పై ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది. ----------------------------------- క్రీడలు --------------------------------------------- 'అదే అర్జున్ టెండూల్కర్ ఎంపికకు కారణం' మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబయి అండర్ 19 జట్టులో ఆడేందుకు రంగం సిద్ధమైంది. అమ్మకు ప్రేమతో ఫుట్బాల్ ప్లేయర్ తలపై.. మరి కొద్ది గంటల్లో ఫిఫా అండర్–17 ఫుట్బాల్ ప్రపంచకప్ ఫ్రారంభంకానుంది. -
టుడే న్యూస్రౌండప్
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు. కేరళలో గురువారం జనరక్ష యాత్రలో పాల్గొనాల్సిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తన కార్యక్రమాన్ని రద్దు చేసకుని మరీ ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. ------------------------------------------- రాష్ట్రీయం ----------------------------------------------- కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎన్జీటీ స్టే తెలంగాణ సర్కార్కు జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత టీజే సుధాకర్బాబు వైఎస్ఆర్సీపీలో చేరారు. నల్లమల వీరుడు ఈ బాలుడు ప్రకృతి ఓ అద్భుతం.. అందులోకి అడుగుపెట్టాలేగానీ మనసు గాల్లో తేలుతుంది. ఎంతపెద్దవాళ్లయినా పసిపిల్లల మాదిరిగా మారిపోతారు.. అసలు బాలయ్యకు ఏమైంది..! నూటొక్క సినిమాల హీరో.. తెలుగువారి అభిమాన నటుడు అన్నగారి కొడుకు. ------------------------------------------- జాతీయం ----------------------------------------------- వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ప్రకాశ్ రాజ్ ఎప్పుడైనా, ఎక్కడైనా నిజమే మాట్లాడతానని సినీనటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. హాల్ టికెట్పై గణేషుడి ఫోటో, సంతకం ఇలాంటి పొరపాట్లు దొర్లటం సహజమే కావొచ్చు. కానీ, విద్యావ్యవస్థపై విమర్శలు వినిపించే బిహార్లోనే ఈ ఘటన చోటు చేసుకోవటమే ఇక్కడ విశేషం. అర్ధరాత్రి మంగళూరులో దారుణం.. మంగళూరులో మంగళవారం దారుణం జరిగింది. ------------------------------------------- అంతర్జాతీయం ----------------------------------------------- ఈ ఉద్యోగాలు చాల వేగంగా కనుమరుగు.. అమెరికాలో రాబోయే దశబ్ద కాలంలో 12 రకాల ఉద్యోగాలు చాల వేగంగా కనుమరగవతున్నట్లు ఆ దేశ లేబర్ స్టాటస్టిక్స్ బ్యూరో అధికారులు తెలిపారు. సాహితీ దిగ్గజానికి నోబెల్ గౌరవం సాహితీ దిగ్గజం కజౌ ఇషిగురో(62)ను సాహిత్య నోబెల్- 2017 వరించింది. ------------------------------------------- బిజినెస్ ----------------------------------------------- ఫ్లిప్కార్ట్ ఫెస్టివ్ ధమాకా: బ్లాక్బస్టర్ డీల్స్ అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభించిన అనంతరం దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కూడా 'ఫెస్టివ్ ధమాకా డేస్' సేల్కు తెరతీసింది. సొమ్ము మనది... జల్సా మాల్యాది బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణాలకు ఎగనామం పెట్టి.. లండన్ పారిపోయిన విజయ్ మాల్యా అక్కడ కూడా ఖరీదైన జీవితాన్ని గడిపేస్తున్నాడు. ------------------------------------------- సినిమా ----------------------------------------------- వైరల్ : సమంత, నాగచైతన్యల పెళ్లి శుభలేఖ ప్రస్తుతం దక్షిణాది ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా గమనిస్తున్న ఈవెంట్.. సమంత, నాగచైతన్యల పెళ్లి వేడుక. దీపిక నాకు దూరం అవుతుందేమో? బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్-కంగనా రనౌత్ల మధ్య మాటల తుటాలు మళ్లీ మొదలు కావటంతో.. పాత వివాదం తెరపైకి వచ్చింది. ------------------------------------------- క్రీడలు ----------------------------------------------- సచిన్ ఆడినప్పుడు.. నెహ్రాకు ఏంటి..? 40 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ ఆడినపుడు.. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా విషయంలో వచ్చిన సమస్య ఏమిటని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించారు. క్రికెట్ చరిత్రలో తొలిసారి..! ఇక నుంచి మహిళా క్రికెట్ అంపైర్లు మైదానంలో కనిపించబోతున్నారా? -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పంచకుల పోలీస్ కమిషనర్ మంగళవారమిక్కడ ధ్రువీకరించారు. ------------------------------------- రాష్ట్రీయం ------------------------------------------ అభిమానిపై మళ్లీ చేయిచేసుకున్న బాలకృష్ణ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన ఆగ్రహాన్ని చూపించారు. అభిమానిపై మళ్లీ చేయి చేసుకున్నారు. ‘చంద్రబాబు ఖాతాలో రూ. 15లక్షల కోట్లు’ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సమన్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏడుగురికి నాంపల్లి కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ------------------------------------- జాతీయం----------------------------------------- ఎట్టకేలకు హనీప్రీత్ అరెస్ట్ ఎట్టకేలకు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్బుక్లో కూడా సెన్సార్ చేస్తారా? కేంద్రంలోని భారతీయ జనతా ప్రభుత్వాన్నిగానీ, దాని అనుబంధ హిందూ సంస్థలనుగాని ‘ఫేస్బుక్’ లాంటి సోషల్ మీడియాలో విమర్శించడానికి వీల్లేదు. మొహర్రం వేడుకల్లో పాక్ నినాదాలు మొహర్రం పర్వదినం సందర్భంగా బిహార్లోని బెట్టయ్య ప్రాంతంలో పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేసిన 21 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ------------------------------------- అంతర్జాతీయం------------------------------------ 2017 నోబెల్ గ్రహీతలు వీరే... ఫిజిక్స్లో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది (2017) ముగ్గురు అమెరికన్లను వరించింది. ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఉగ్రవాదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతం కన్నా మానవత్వం గొప్పదని .. మతం కన్నా మానవత్వం గొప్పదని నిరూపించింది ఓ సౌదీ మహిళ. ------------------------------------- బిజినెస్-------------------------------------------- కొత్త రూ.100 నోట్లూ వచ్చేస్తున్నాయ్.. పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త కొత్త నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ఎయిర్టెల్ కొత్త ప్లాన్: రోజుకు 4జీబీ డేటా టెలికాం మార్కెట్లో ఆఫర్ల యుద్ధం వెల్లువెత్తుతోంది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు అదనపు డేటా ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్లతో హోర్రెత్తికిస్తున్నాయి. ------------------------------------- సినిమా -------------------------------------------- సూపర్ స్టార్ సినిమా వాయిదా పడిందా..? స్పైడర్ రిజల్ట్ అభిమానులతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా షాక్ ఇచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో నాగ్, నానీల మల్టీ స్టారర్ ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే సీనియర్ హీరో నాగార్జున త్వరలో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. ------------------------------------- క్రీడలు -------------------------------------------- 'భారత్ పై మా క్రికెటర్లు భయపడ్డారు' టీమిండియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో తమ క్రికెటర్లు బెదిరిపోయిన కారణంగా దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా తాత్కాలిక చీఫ్ కోచ్ డేవిడ్ సాకర్ స్పష్టం చేశాడు. 'మిస్టరీ గర్ల్' పై పాండ్యా క్లారిటీ గత కొంతకాలంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా-ఒక మిస్టరీ గర్ల్ మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వార్తలకు ఎట్టకేలకు పాండ్యా ఫుల్ స్టాప్ పెట్టాడు. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరబాద్: లాస్ వేగాస్ భారీ నరమేధమే చోటు చేసుకుంది. తాజాగా అందిన సమాచారం సాయుధుడి కాల్పుల్లో దాదాపు 50మంది మృత్యువాత పడినట్లు సమాచారం. వందలాదిమంది గాయాలపాలయ్యారని, వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -------------------- రాష్ట్రీయం --------------------- వచ్చే ఏడాది నుంచే ఎకరాకు రూ.8వేలు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో అఖిల భారత కురుమల సంఘం ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. 175 స్థానాల్లో పోటీ చేస్తాం.. గాంధీ జయంతి రోజున జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భాగ్యనగరంలో భారీ వర్షం.. భాగ్య నగరం మరోసారి భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. ‘వైఎస్సార్ కుటుంబం’లో 70 లక్షల కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల కుటుంబాలు వైఎస్సార్ కుటుంబంలో సభ్యత్వం తీసుకున్నాయని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు పి. రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. -------------------- జాతీయం --------------------- వెయ్యిమంది గాంధీలు వచ్చినా ఇండియా క్లీన్ కాదు : మోదీ వెయ్యిమంది మహాత్మాగాంధీలు వచ్చినా స్వచ్ఛభారత్ లక్ష్యం సాధ్యం కాదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. చావుబతుకుల మధ్య కూడా ఇదేం బుద్ధి దసరా పండుగ వేళ విషాదం నింపిన ముంబయి ఎల్ఫిన్స్టోన్ రోడ్డులోని రైల్వే స్టేషన్ పాదచారుల వంతెనపై ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు ఒక వైరల్ వీడియో ఓ కొత్త నేర విచారణ ప్రారంభించడానికి కారణం అయింది. నేనూ లైంగిక వేధింపులకు గురయ్యాను ‘నేను కూడా ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురైనవ్యక్తినే.. నేనేంటి భారతదేశంలో ప్రతి మహిళ ఏదో ఒక సంమయంలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంద’ని బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ పేర్కొన్నారు. ------------------- అంతర్జాతీయం -------------------- నరమేధం.. 50మంది రక్తపు మడుగులో లాస్ వేగాస్ భారీ నరమేధమే చోటు చేసుకుంది. తాజాగా అందిన సమాచారం సాయుధుడి కాల్పుల్లో దాదాపు 50మంది మృత్యువాత పడినట్లు సమాచారం. వైద్యరంగంలో ముగ్గురుకి నోబెల్ ఈ ఏడాది నోబెల్ అవార్డులు ప్రకటన మొదలైంది. తొలుత వైద్యరంగానికి నోబెల్ ప్రకటించారు. -------------------- బిజినెస్ --------------------- క్షమించండి: ఫేస్బుక్ సీఈవో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. ప్రజలను విడదీసేలా తమ పనితీరు ఉంటే మన్నించాలని వేడుకున్నారు. వాయిస్ కాల్స్పై జియో షాక్ జియో సిమ్ ఉంటే చాలు.. ఎన్ని నిమిషాలైనా, ఎన్ని గంటలైనా అలా ఎన్ని రోజులైనా అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. -------------------- సినిమా ---------------------- 'స్పైడర్లో ఆ సన్నివేశాలు తొలగించాలి' ఇటీవల విడుదలైన స్పైడర్ చిత్రంలో శ్మశానంలో పని చేసే కాటికాపర్లను కించపరుస్తూ ఉన్న సన్నివేశాలను తొలగించాలని రాష్ట్ర కాపర్ల సంఘం అధ్యక్షులు శీలం సత్యనారాయణ డిమాండ్ చేశారు. బిగ్బాస్లో బర్త్డే చేసుకోవడం బాధాకరం: నటి ఎవరైనా బంధుమిత్రుల నడుమ ఆనందంగా పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటారు. -------------------- క్రికెట్ ----------------------- యువీ ఎక్కడ.. ఫ్యాన్స్ ఫైర్ ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్కు వెటరన్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను ఎంపిక చేయకపోవడంపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 'సచిన్ వికెట్ శబ్దం అత్యంత ఇష్టం' భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బౌల్డ్ అయ్యే క్రమంలో వచ్చే ఆ శబ్దం అంటే తనకు అత్యంత ఇష్టమని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పష్టం చేశాడు. -
న్యూస్ రౌండప్
జమ్మూకశ్మీర్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ బేస్ క్యాంప్ను కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె..సైనికులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయం ఆమె పెయింటింగ్ను ఆక్స్ఫోర్డ్ తీసేసింది ఏమైందో ఏమో: భారత్కు హ్యాండిచ్చిన ట్రంప్ బుల్లెట్ ట్రైన్స్ : కాలంతో పరుగు జాతీయం వ్యూహాత్మక ప్రాంతాల్లో రక్షణమంత్రి పర్యటన ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఆర్ఎస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అమరావతి ఎక్స్ప్రెస్ బోగి పైకప్పు ఊడింది.. క్రీడలు ధోని ముఖం చాటేశాడు..! విరాట్ సేన గెలిస్తేనే.. 'ఆ క్రికెటర్ లేకపోతే కష్టమే' బిజినెస్ మీ ఫేసే.. మీ పాస్వర్డ్ మొబీక్విక్కు భారీ టోకరా షాకింగ్: ఐఫోన్ 8, 8 ప్లస్లో బ్యాటరీ సమస్య? సినిమాలు దసరా బరిలో విజేత ఎవరు..? ఎన్టీఆర్ కు చరణ్ ట్రీట్ పవన్, త్రివిక్రమ్.. మరో డేట్ -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్ : ఓ యువతిపై అత్యాచారయత్నం చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బాధిత యువతి ప్రేమికుడే.. తన స్నేహితుడిని ఆమెపైకి ఉసిగొల్పి.. అత్యాచారయత్నం చేయించాడు. -------------------------- రాష్ట్రీయం ------------------------------- వైఎస్సార్సీపీలోకి మరో ఇద్దరు నేతలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు నాయకులు వైఎస్సార్సీపీలోకి వచ్చారు. ‘అమ్మాయిలను అమ్మేసే ముఠా అరెస్ట్’ పేద ముస్లిం కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మైనర్ బాలికలను అరబ్ షేక్లు దుబామ్ తరలిస్తున్నారని సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. పైశాచికం: కనిగిరిలో కిరాతక ఘటన ఓ యువతిపై అత్యాచారయత్నం చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బ్యాంకుకు టోకరా వేసిన మంత్రిగారి బంధువు సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులే పాలక వర్గంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (టౌన్ బ్యాంకు)లో రూ.2 కోట్ల భారీ కుంభకోణం బట్టబయలైంది. ------------------------------- జాతీయం ----------------------------- గుర్మీత్ను నేను పెళ్లి చేసుకుంటానేమోనని..! వివాదాస్పద బాబా, రేప్ కేసులో శిక్ష పడిన గుర్మీత్ రాంరహీం సింగ్ జీవితకథ ఆధారంగా 'అబ్ హోగా ఇన్సాఫ్' పేరిట సినిమా తెరకెక్కించేందుకు హాట్ భామ రాఖీ సావంత్ సిద్ధమవుతోంది. వరుణ్ గాంధీకి సొంత పార్టీ నుంచే చురకలు రోహింగ్యా శరణార్థులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి సొంత పార్టీ నుంచే ఎదురుదెబ్బ తగిలింది. 'నాకో టాయిలెట్, అంబులెన్స్ ఇవ్వండి' నర్మదా నది తీరం చుట్టూ దాదాపు ఆరు నెలలపాటు ప్రయాణించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ------------------------------- అంతర్జాతీయం -------------------------- డయానా వెర్రిది.. అయినా ఆమెతో.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరు జారారు. ఆయన అధికారంలోకి రాకముందు ఓ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ రాణి ప్రిన్స్ డయానాపై అసభ్యంగా మాట్లాడారు. పెళ్లి ఫొటో ఫేస్బుక్లో పెట్టి భార్యను చంపి.. అన్యోయంగా, అప్యాయంగా ఉంటున్న ఓ జంట జీవితం అనూహ్య మలుపు తిరిగి తీరని విషాదమైంది. పాక్ ఇంటెలిజెన్స్ అధికారి సంచలన వ్యాఖ్యలు తాము ఉగ్రవాదాన్ని అణిచివేస్తున్నామంటూ పాకిస్థాన్ ప్రధాని ఐక్యరాజ్యసమితిలో పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చినా అవన్నీ కల్లబొల్లి మాటలేఅని తేటతెల్లమైంది. ------------------------------- బిజినెస్ --------------------------------- ఫేషియల్ క్రీమ్స్పై దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్! ప్రముఖ బ్రాండ్స్కు సంబంధించిన ఫేషియల్ క్రీమ్స్పై షాకింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు 8 శాతం జంప్ రోజువారీ ధరల సమీక్ష ప్రారంభించినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ------------------------------- సినిమా --------------------------------- సితార అల్లరిని కంట్రోల్ చేయలేం : మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్పైడర్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. హరికేన్ బాధితులకు జెన్నీఫర్ సాయం ఇర్మా, మారియా హరికేన్ లతో కుదేలైన అమెరికా వాసులను ఆదుకునేందుకు హాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ------------------------------- క్రీడలు ---------------------------------- ఐసీసీ కొత్త రూల్స్.. క్రికెట్ లో కీలక మార్పులు అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల్లో మార్పులు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. భారత్ను ఓడించాలంటే 100 శాతం ఆడాల్సిందే.. ఉపఖండ పిచ్లపై టీమిండియాను ఓడించాలంటే 100 శాతం ఆడాల్సిందేనని ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డారు. -
టుడే న్యూస్ రౌండప్
హైదరాబాద్: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నగారా మోగింది. ఎన్నికల కమిషన్ గురువారం నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై అసత్య కథనాలు రాశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ వార్తల్లో నిన్న రాజీనామా చేసి వార్తల్లో నిలిచిన నితీస్ కుమార్ బీజేపీ మద్దతుతో ప్రమాణ స్వీకారం చేశారు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి మీకోసం.. <<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>> వైఎస్ఆర్ సీపీలో చేరిన మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబుది దుర్మార్గం.. మనది సన్మార్గం: వైఎస్ జగన్ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వినిపించే గొంతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. మోగిన నంద్యాల ఉప ఎన్నిక నగారా దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నగారా మోగింది. ఆంధ్రజ్యోతిపై ఎమ్మెల్యే ఆర్కే పరువునష్టం దావా ఆంధ్రజ్యోతి దినపత్రికపై మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం పరువునష్టం దావా వేశారు. ఏయ్ ఖాకీ పో వెనక్కి.. అంటూ వర్ల రామయ్య.. ఏయ్ ఖాకీ .. పో వెనక్కి, సభా వేదికపై నీ కేంపని అంటూ మాజీ పోలీసు అధికారి, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం తప్పు మీద తప్పు చేస్తున్నారు’ ఆగస్ట్ 3వ తేదీ నుంచి మళ్లీ పాదయాత్ర చేస్తానని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. <<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>> బిహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్! మహాకూటమితో నితీశ్ కుమార్ సంబంధాలు తెంచుకోవడం పట్ల జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. వామ్మో! పాములంటూ ప్రజల బెంబేలు ఇళ్లలో, ఆఫీసుల్లో, పార్కుల్లో, చివరకు కారు ఇంజన్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న పాములను చూసి ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. వార్తావ్యాఖ్య : నితీశ్కుమార్ కటీఫ్ రాజకీయం నితీశ్ కుమార్ రూటే సపరేటు. బిహార్ రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తున్న జనతాదళ్ (యు) నేత తనదైన ముద్రతో మరో అద్భుత విన్యాసం చేశారు. త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే కేంద్ర మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణ స్వీకారం బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. <<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>> కన్నీరుమున్నీరవుతున్న హిజ్రాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు వ్యతిరేక నినాదాలతో అమెరికా వినువీధులు గర్జించాయి. పట్టు సడలిస్తున్న చైనా! డోకాలమ్ విషయంలో పట్టువిడుపుల దిశగా చైనా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగం వదిలేసిన యువరాజు రాచరిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా పైలట్ ఉద్యోగాన్ని వదులుకున్నారు బ్రిటన్ యువరాజు విలియమ్. భయపెట్టిన సబ్మెరైన్ ఇదే.. ప్రపంచంలోనే అతిపెద్ద సబ్మెరైన్ 'ప్రిన్స్ ఆఫ్ మాస్కో' తీరానికి వచ్చింది. <<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్>>>>>>>>>>>>>>>>>>>>>>> రూమర్లకు చెక్.. బ్యాంకు సీఈవోగా మళ్లీ ఆమె ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు సీఈవోగా శిఖా శర్మ నిష్క్రమించబోతున్నారనే ఊహాగానాలకు చెక్ పడింది. మరో మూడేళ్ల పాటు బ్యాంకు సీఈవోగా, మేనేజింగ్ డైరెక్టర్గా శిఖా శర్మనే నియమిస్తూ యాక్సిస్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఉవ్వెత్తున ఎగిసి.. చివరికి ఫ్లాట్ రికార్డు స్థాయిలో ఎగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ చివరికి ఫ్లాట్గా ముగిశాయి. శాంసంగ్ లాభాలు హై జంప్ దక్షిణ కొరియా టెక్నాలజీ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ క్యూ2లో 73శాతం వృద్ధితో భారీ లాభాలను నమోదు చేసింది. రోజుకు వందకోట్లు మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్ మరో మైల్ స్టోన్ను దాటేసింది. దలాల్ స్ట్రీట్లో కొత్త రికార్డుల వర్షం దలాల్స్ట్రీట్లో కొత్త రికార్డుల వర్షం కురుస్తోంది <<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>> అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు! ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‑లో తనేమిటో నిరూపించుకున్న భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. 'అతని వల్లే మా క్రికెట్ నాశనమైంది' పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన వకార్ యూనిస్ పై ఆ దేశానికే చెందిన మరో క్రికెటర్ కమ్రాన్ అక్మాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. మిథాలీ గ్యాంగ్ క్యాష్ ప్రైజ్ పెంపు! మహిళల వన్డే ప్రపంచకప్‑లో ఫైనల్ కు చేరి రన్నరప్ గా నిలిచిన మిథాలీ రాజ్ గ్యాంగ్ ను మరింత ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అడుగులు వేస్తుంది. అబ్బాయిలతో ఆడటమే నా దూకుడుకు కారణం అబ్బాయిలతో క్రికెట్ ఆడటమే దూకుడుగా ఆడేలా చేసిందని భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. శిఖర్ధావన్ మరో అరుదైన రికార్డు భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. <<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>> బుల్లితెరపై బిగ్ బాస్ హవా స్టార్ హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తుంద స్పైడర్ టీజర్‑కు కొత్త డేట్..! బ్రహ్మోత్సోవం సినిమా ఫెయిల్యూర్‑తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు.. మహానగరంలో మరో మాయగాడు..! మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు. షారుక్తో రొమాన్స్ ఈజీ: నటి బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్తో ఆన్ స్క్రీన్ రోమాన్స్ చేయడం సులభం అని బాలీవుడ్ నటి అనుష్కా శర్మఅభిప్రాయపడింది. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో సోమవారం కీలక చర్చ జరిగింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్కు ప్రాజెక్ట్ అథారిటీ ఆమోదం ఉందా అని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇక టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం ఇంకా తగ్గలేదు. దీనిపై నటి ఛార్మీ స్సందించారు. కొన్ని చానళ్లు రేటింగ్లు పెంచుకునేందుకు తనపై తప్పుడు వార్తలు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు భారత్ చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోసారి తన నోటి దురుసును చూపించింది. మాటల దాడిని పెంచింది. <<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>> పోలవరంపై రాజ్యసభలో కీలక చర్చ పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో సోమవారం కీలక చర్చ జరిగింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్కు ప్రాజెక్ట్ అథారిటీ ఆమోదం ఉందా అని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. శాంపిల్స్ ఎలా తీసుకుంటారు?: ఛార్మీ కొన్ని చానళ్లు రేటింగ్లు పెంచుకునేందుకు తనపై తప్పుడు వార్తలు ఇస్తున్నాయని హీరోయిన్ ఛార్మీ పేర్కొన్నారు. ముద్రగడ ఏమైనా విద్రోహ శక్తా?: బొత్స చంద్రబాబు నాయుడు పాలన చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా? లేక ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రోడ్డుపై బ్యాగు.. భారీగా డబ్బు విజయవాడ బీసెంట్ రోడ్డులో సంఘవి జ్యూలరీ షాపు వద్ద గల్లంతైన నగదు బ్యాగ్ కేసును సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. కెల్విన్ లాయర్ సంచలన వ్యాఖ్యలు సిట్ విచారణ పద్ధతి ప్రకారం జరగడం లేదని, దర్యాప్తు దారుణంగా సాగుతోందని కెల్విన్ తరపు న్యాయవాది ఆరోపించారు. <<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>> 'మీ ముందున్న నాకు ప్రాణం పోసింది ఆయనే..' కీడుచేసిన వాళ్లను మరిచినా పెద్దగా నష్టం లేదు ఎందుకంటే ఆ మరుపు ఔన్నత్యాన్ని చాటుతుంది. పర్వతాన్ని కదిలిస్తారేమో.. మమ్మల్ని కష్టం: చైనా చైనా మరోసారి తన నోటి దురుసును చూపించింది. మాటల దాడిని పెంచింది. భారత్ తమ గురించి తక్కువ అంచనా వేసుకోవద్దని, భ్రమల్లో ఉండొద్దంటూ చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వు కియాన్ సోమవారం హెచ్చరించారు. <<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>> బీసీసీఐ సరిగా హ్యాండిల్ చేయలేదు! టీమిండియా కోచ్ గా పని చేసి అవమానకర రీతిలో తన పదవికి గుడ్ బై చెప్పిన అనిల్ కుంబ్లేకు తగినంత గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేదని సీనియర్ ఆటగాడు గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఓడినా.. ప్రశంసలు ముంచెత్తాయి.. మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడినా మిథాలీ సేన పై ప్రశంసల జల్లు కురిస్తోంది. టోర్నీకి ముందు క్వాలిఫైయర్ మ్యాచ్ల నుంచి ఫైనల్ చేరిన భారత మహిళల పోరాట పటిమకు సగటు భారత అభిమాని ముగ్ధుడయ్యాడు. సీఎస్కే కోసం నా నిరీక్షణ ముగిసింది: ధోని ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ది సుస్థిర ప్రస్థానం. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లపాటు జట్టు నిషేధానికి గురైంది. ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు ఒకే ఓవర్ లో ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ రాస్ వైట్లే. <<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>> వారిని తలకిందులుగా వేలాడదీస్తా: సీఎం వార్నింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్రాజ్సింగ్ చౌహన్ తాజాగా కలెక్టర్లకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. మాయావతితో తేజస్వీ మంతనాలేమిటీ? బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతిని ఇటీవల కలుసుకొని గంటన్నర సేపు చర్చలు జరిపారు. బీజేపీపై కత్తిగట్టిన మాయావతి రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ పార్టీపై కత్తిగట్టారు. దళితులకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. నటికి పెళ్లి హామీ.. మోసం.. ప్రైవేట్ ఫొటోలు ఓ సినీ నటితో సన్నిహితంగా ఉండి ఆమె ప్రైవేట్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మోసం చేసిన ఆరోపణలు కూడా అతడిపై నమోదు చేశారు. <<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్>>>>>>>>>>>>>>>>>>>>>> టీసీఎస్ను కాపాడండి, ఉద్యోగుల ఆందోళన లక్నోలోని టీసీఎస్ ఆఫీసు మూసివేతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. లక్నో ఆఫీసు మూతను వ్యతిరేకిస్తూ ఆ కంపెనీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాలేజి విద్యార్థులకు వైఫై ఫ్రీ: జియో రిలయన్స్ జియో మరో కొత్త సంచలనానికి తెరలేపనుందా? తాజా రిపోర్టులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. కోల్గేట్ కష్టాలు ఊళ్లలో ఎక్కువ మంది వినియోగించే టూత్పేస్ట్ ఏంటంటే ఠక్కున వచ్చే సమాధానం కోల్గేట్. ఎన్నో సంవత్సరాల నుంచి భారత్లోని మారుమూల గ్రామల్లో సైతం టూత్పేస్ట్ అంటే కోల్గేట్ అనే పేరు పాతుకుపోయింది. అలాంటిది తొలిసారి ఈ కంపెనీ కష్టాలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. గ్రాండ్ గాడ్జెట్ డేస్: ఫ్లిప్కార్ట్ మరో సేల్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఒక సేల్ అనంతరం మరో సేల్ నిర్వహిస్తూనే ఉంది. తాజాగా గ్రాండ్ గాడ్జెట్ డేస్ను ఫ్లిప్కార్ట్ ప్రారంభించింది. 10వేల మైలురాయికి కాస్తంత దూరమే.. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయిల్లో ముగిశాయి. 51.15 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ అత్యంత కీలకమైన మైలురాయి 10వేలకు చేరువలో 9,966 వద్ద క్లోజైంది. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి: రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్.. యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్పై ఘన విజయం సాధించారు. కోవింద్కు 65.65, మీరాకుమార్కు 34.34 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక రామ్నాథ్కు వచ్చిన ఓట్ల విలువ 7,02, 644 కాగా, మీరాకుమార్కు వచ్చిన ఓట్లు విలువ 3,67, 314. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్నాథ్ కోవింద్ ఘన విజయం రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లే జరిగింది. రామ్నాథ్ కోవింద్కే పట్టం కట్టారు. జగన్ ప్రకటనతో సర్కారులో చలనం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల పార్టీ ప్లీనరీలో చేసిన నవరత్నాలు ప్రకటన దెబ్బతో వణుకు పుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. సీఆర్డీఏ అధికారులకు షాక్ సీఆర్డీఏ అధికారులకు పెనుమాక రైతులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ‘డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ వారసుడి ఫ్రెండ్స్’ డ్రగ్స్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. <<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>> టీ తాగుతుండగా దాడి.. 27కత్తిపోట్లు మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండుమంది కత్తులతో వీర విహారం చేశారు. 'చైనా గొడవలో ప్రపంచమంతా భారత్తోనే' చైనా విషయంలో ప్రపంచంలోని దేశాలన్నీ కూడా భారత్తోనే ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. 'ఇంత జరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నారు?' వర్షాకాల పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీపై ఉమ్మడి దాడి మొదలుపెట్టాయి. <<<<<<<<<<<<<< అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>> ‘రక్తం’లో స్నానం చేసే పుతిన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, 64 ఏళ్ల వయస్సులో కూడా బలిష్టంగా కనిపించడానికి కారణం రోజు వ్యాయామం చేయడం ఒక్కటే కారణం కాదట. వెనక్కి వెళ్లండి లేదా చచ్చిపోతారు: చైనా వెనక్కివెళ్లండి. లేదా బంధీలుగా పట్టుబడండి. లేదంటే చనిపోతారు' ఇవి భారత్కు చైనా మాజీ రాయబారి ఇచ్చిన మూడు ఆప్షన్స్... మగాడుగా మారాలంటే.. అబ్బాయి.. మగాడుగా మారాలంటే నెల రోజుల పాటు అడవిలో వనవాసం చేయాలి. దీన్ని వారు బౌకౌట్ అని పిలుస్తారు <<<<<<<<<<<<<< క్రీడలు >>>>>>>>>>>>>>>>> అశ్విన్.. నీ తెలివి ఇంతేనా.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై ఉన్న రెండేళ్ల నిషేధం ముగియడంతో 2018 ఐపీఎల్లో తిరిగి ఆడబోతున్నాయి. ధోని, గేల్, వార్నర్.. బ్యాట్లు మార్చాల్సిందే! టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి కొత్త చిక్కొచ్చి పడింది. <<<<<<<<<<<<<< బిజినెస్ >>>>>>>>>>>>>>>>> కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంకు బంపర్ఆఫర్ దేశీయ అతిపెద్ద ప్రైవేట్రంగ బ్యాంకు ఐసీఐసీఐ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏటీఎంల ద్వారా లేదా ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ల ద్వారా ఇన్స్టాంట్ పర్సనల్ లోన్స్(తక్షణ వ్యక్తిగత రుణాలు) ఇచ్చే సౌకర్యాన్ని ఐసీఐసీఐ బ్యాంకు గురువారం ప్రారంభించింది పైలెట్లకు జెట్ఎయిర్వేస్సంచలన ప్రతిపాదన దేశీయ రెండో అతిపెద్ద ఎయిర్లైన్సంస్థ జెట్ఎయిర్వేస్ఉద్యోగులకు పెద్ద ప్రమాదమే ముంచుకొచ్చింది. 30-35 శాతం వేతనాలను తగ్గించుకోవాలని లేదంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లాలని ఈ ఎయిర్లైన్స్జూనియర్ర్యాంకింగ్పైలెట్లను ఆదేశిస్తోంది. రూ.2000 నోట్ల సరఫరాను తగ్గించేసింది ప్రస్తుతం రూ.2000 కరెన్సీ నోట్ల సరఫరాను రిజర్వు బ్యాంకు ఆఫ్ఇండియా తగ్గించినట్టు తెలుస్తోంది. కొన్ని వారాల నుంచి 2000 రూపాయి నోట్ల సరఫరా పడిపోయినట్టు ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టులో తేలింది. ఈ ఉద్యోగులకు శుభవార్త: వేతనాల పెంపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సిపిఎస్ఇ) ఉద్యోగులకు శుభవార్త. 3వ పే కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని క్యాబినెట్ నిర్ణయించింది. <<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>> వాళ్ల పెళ్లి తరువాతే.. నా పెళ్లి : రానా టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో రానా ఒకడు. ఇప్పటికే ముప్పై ఏళ్లు దాటి మూడేళ్లు గడుస్తున్నా పూరీకి మద్ధతుగా మెగాహీరో బుధవారం సిట్ విచారణ తరువాత సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ పెట్టిన మెసేజ్ కు భారీ స్పందన వస్తుంది. 300 మంది లండన్ డ్యాన్సర్స్తో ఆట, పాట..! అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తొలి సినిమాతో పరవాలేదనిపించినా.. మాస్.. ఊర మాస్.. రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం 1985కి సంబంధించిన లుక్స్, మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నాయి.