ఒక్క క్లిక్‌తో నేటి ముఖ్యాంశాలు | Today News Roundup 25th June 2018 | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో నేటి ముఖ్యాంశాలు

Jun 25 2018 5:36 PM | Updated on Jun 25 2018 6:19 PM

Today News Roundup 25th June 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చేనెల (జూలై) 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 18 రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం, అధికార బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి.


జులై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చేనెల (జూలై) 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి
 

సుష్మా స్వరాజ్‌కు కాంగ్రెస్‌ బాసట
న్యూఢిల్లీ : విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కాంగ్రెస్‌ పార్టీ బాసటగా నిలిచింది.
 

కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు షాక్‌
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీలో కే్ంద్ర ప్రభుత్వానికి షాక్‌ తగిలింది.
 

మిస్సైళ్ల వర్షం.. గడగడలాడిన రియాద్‌
రియాద్‌: మిస్సైల్స్‌ దాడులతో ఆదివారం అర్థరాత్రి సౌదీ అరేబియా గడగడలాడిపోయింది
 

ఉప ఎన్నికలు వచ్చే అవకాశం: విజయసాయి రెడ్డి
సాక్షి, శ్రీకాకుళం :  ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశముందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు
 

ఆటో యూనియన్లకు వైఎస్‌ జగన్‌ భరోసా!
సాక్షి, మామిడికుదురు : ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
 

కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరించిన ఉత్తమ్‌
సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విసిరిన సవాల్‌ను కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్వీకరించారు.
 

29న గద్వాల్‌కు కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 29న జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు
 

పార్లమెంటరీ ప్యానల్‌ ముందుకు పీఎస్‌బీల సారథులు
న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్యానల్‌ ముందు 11 ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) అధినేతలు ఈ మంగళవారం హాజరు కాబోతున్నారు
 

ఈ రోజు టీమిండియాకు వెరీ వెరీ స్పెషల్‌
లండన్‌: జూన్‌ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. సరిగ్గా 35 ఏళ్ల క్రితం టీమిండియా తొలి వన్డే వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది
 

అంచనాలను పెంచేసిన గోల్డ్‌ ట్రైలర్‌
1948 లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ హకీలో గోల్డ్‌ పతాకం సాధించటం అన్న నేపథ్యంతో(కల్పిత గాథ) రీమా ఖగ్టీ డైరెక్షన్‌లో  తెరకెక్కిన చిత్రమే ‘గోల్డ్’‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement