టుడే న్యూస్‌ రౌండప్‌ | Today News Roundup | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Oct 2 2017 6:00 PM | Updated on Oct 2 2017 6:21 PM

Today News Roundup

సాక్షి, హైదరబాద్‌: లాస్‌ వేగాస్‌ భారీ నరమేధమే చోటు చేసుకుంది. తాజాగా అందిన సమాచారం సాయుధుడి కాల్పుల్లో దాదాపు 50మంది మృత్యువాత పడినట్లు సమాచారం. వందలాదిమంది గాయాలపాలయ్యారని, వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

-------------------- రాష్ట్రీయం ---------------------

వచ్చే ఏడాది నుంచే ఎకరాకు రూ.8వేలు
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావుతో అఖిల భారత కురుమల సంఘం ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు.

175 స్థానాల్లో పోటీ చేస్తాం..
గాంధీ జయంతి రోజున జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

భాగ్యనగరంలో భారీ వర్షం..
భాగ్య నగరం మరోసారి భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. 

‘వైఎస్సార్‌ కుటుంబం’లో 70 లక్షల కుటుంబాలు
రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల కుటుంబాలు వైఎస్సార్‌ కుటుంబంలో సభ్యత్వం తీసుకున్నాయని వైఎస్సార్‌ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిశీలకులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

-------------------- జాతీయం ---------------------

వెయ్యిమంది గాంధీలు వచ్చినా ఇండియా క్లీన్‌ కాదు : మోదీ
వెయ్యిమంది మహాత్మాగాంధీలు వచ్చినా స్వచ్ఛభారత్‌ లక్ష్యం సాధ్యం కాదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 

చావుబతుకుల మధ్య కూడా ఇదేం బుద్ధి
దసరా పండుగ వేళ విషాదం నింపిన ముంబయి ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డులోని రైల్వే స్టేషన్‌ పాదచారుల వంతెనపై ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు ఒక వైరల్‌ వీడియో ఓ కొత్త నేర విచారణ ప్రారంభించడానికి కారణం అయింది.

నేనూ లైంగిక వేధింపులకు గురయ్యాను
‘నేను కూడా ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురైనవ్యక్తినే.. నేనేంటి భారతదేశంలో ప్రతి మహిళ ఏదో ఒక సంమయంలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంద’ని బీజేపీ ఎంపీ పూనమ్‌ మహాజన్‌ పేర్కొన్నారు. 

------------------- అంతర్జాతీయం --------------------

నరమేధం.. 50మంది రక్తపు మడుగులో
లాస్‌ వేగాస్‌ భారీ నరమేధమే చోటు చేసుకుంది. తాజాగా అందిన సమాచారం సాయుధుడి కాల్పుల్లో దాదాపు 50మంది మృత్యువాత పడినట్లు సమాచారం.

వైద్యరంగంలో ముగ్గురుకి నోబెల్‌
ఈ ఏడాది నోబెల్‌ అవార్డులు ప్రకటన మొదలైంది. తొలుత వైద్యరంగానికి నోబెల్‌ ప్రకటించారు. 

-------------------- బిజినెస్‌ ---------------------

క్షమించండి: ఫేస్‌బుక్‌ సీఈవో
ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పారు. ప్రజలను విడదీసేలా తమ పనితీరు ఉంటే మన్నించాలని వేడుకున్నారు.

వాయిస్‌ కాల్స్‌పై జియో షాక్‌
జియో సిమ్‌ ఉంటే చాలు.. ఎన్ని నిమిషాలైనా, ఎన్ని గంటలైనా అలా ఎన్ని రోజులైనా అపరిమితంగా మాట్లాడుకోవచ్చు.

-------------------- సినిమా ----------------------

'స్పైడర్‌లో ఆ సన్నివేశాలు తొలగించాలి'
ఇటీవల విడుదలైన స్పైడర్‌ చిత్రంలో శ్మశానంలో పని చేసే కాటికాపర్లను కించపరుస్తూ ఉన్న సన్నివేశాలను తొలగించాలని రాష్ట్ర కాపర్ల సంఘం అధ్యక్షులు శీలం సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

బిగ్‌బాస్‌లో బర్త్‌డే చేసుకోవడం బాధాకరం: నటి
ఎవరైనా బంధుమిత్రుల నడుమ ఆనందంగా పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటారు.

-------------------- క్రికెట్‌ -----------------------

యువీ ఎక్కడ.. ఫ్యాన్స్‌ ఫైర్‌
ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్‌కు వెటరన్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

'సచిన్ వికెట్ శబ్దం అత్యంత ఇష్టం'
భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బౌల్డ్ అయ్యే క్రమంలో వచ్చే ఆ శబ్దం అంటే తనకు అత్యంత ఇష్టమని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పష్టం చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement