ఒక్క క్లిక్‌తో నేటి ప్రధాన వార్తలు | Today News Roundup 11Th July 2018 | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో నేటి ప్రధాన వార్తలు

Jul 11 2018 6:27 PM | Updated on Jul 11 2018 6:45 PM

Today News Roundup 11Th July 2018 - Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : కేంద్రంలో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత దేశంలో ప్రజాస్వామ్య ప్రమాణాలు దారుణంగా పడిపోతూ వచ్చాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. భారత్‌ ఉదార ప్రజాస్వామ్య సూచికలో 2010 నుంచి అతి స్వల్ప పతనం కనిపించగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి భారీ పతనం ప్రారంభమైందని అధ్యయన నివేదిక పేర్కొంది. ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య సూచికలో ప్రస్తుతం భారత స్థానం 81 అని నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో శ్రీలంక, నేపాల్‌కన్నా వెనకబడి పోవడం గమనార్హం

భారత్‌లో ప్రజాస్వామ్యం పతనం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత దేశంలో ప్రజాస్వామ్య ప్రమాణాలు దారుణంగా పడిపోతూ వచ్చాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది.

తాజ్‌మహల్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : తాజ్‌మహల్‌ సంరక్షణపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది

సెక్షన్‌ 497 కొనసాగించాలని కేంద్రం అఫిడవిట్‌
సాక్షి, వెబ్‌ డెస్క్‌ : వివాహేతర సంబంధాల్లో పురుషుడితో సమానంగా స్త్రీని కూడా శిక్షించాలన్న వాదనను కేంద్రం వ్యతిరేకించింది

రైతులను వంచించిన కాంగ్రెస్‌
చండీగఢ్‌ : కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో గత 70 ఏళ్లుగా ప్రజలను వంచించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

ఫేస్‌బుక్‌కు షాక్‌ : యూకే భారీ జరిమానా
ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌తో సతమతమవుతోంది.

చంద్రబాబు, లోకేష్‌ల అవినీతికి భయపడే..
సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌ చేస్తున్న అవినీతి వల్లే రాష్ట్రానికి ఏ పరిశ్రమలు రావడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు.

టీజీ వ్యాఖ్యలపై ఎస్వీ మోహన్‌ రెడ్డి కౌంటర్‌!
సాక్షి, కర్నూలు : మంత్రి నారా లోకేష్‌ను హిప్నటైజ్‌ చేశారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలపై కర్నూలు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కౌంటరిచ్చారు.

నిజాంను తలపిస్తున్న కేసీఆర్‌ : మురళీధర రావు
సాక్షి, హైదరాబాద్‌ : స్వామి పరిపూర్ణానందను తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.

వారంలో జనగామకు వస్తా..
లింగాలఘణపురం: వారం రోజుల్లో జనగామకు వస్తా..చీఫ్‌ ఇంజనీర్, ఇంజనీర్లతో వచ్చి కలెక్టర్‌ను కూర్చోబెట్టి తొవ్వ తీస్తా.

విశాఖపట్నం-కౌలాలంపూర్ టిక్కెట్‌ రూ.‌3,399!
న్యూఢిల్లీ : మలేషియాకు చెందిన బడ్జెట్‌ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

‘300 మ్యాచ్‌లు ఆడాను.. నేను పిచ్చోడినా’
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మైదానంలో ఎంతో కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తుంటారు.

అమ్మమ్మ అయిన యంగ్‌ హీరోయిన్‌
జూలి 2’తో బాలీవుడ్‌లో సెటిల్‌ అవుదామనుకున్న హీరోయిన్‌ లక్ష్మీరాయ్‌కు నిరాశే ఎదురయ్యింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement