టుడే న్యూస్‌ రౌండప్‌ | Today News Roundup | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Oct 3 2017 5:28 PM | Updated on Oct 3 2017 5:34 PM

Today News Roundup

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు డేరా సచ్చా సౌదా చీఫ్‌  గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని పంచకుల పోలీస్‌ కమిషనర్‌ మంగళవారమిక్కడ ధ్రువీకరించారు.

------------------------------------- రాష్ట్రీయం ------------------------------------------

అభిమానిపై మళ్లీ చేయిచేసుకున్న బాలకృష్ణ
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  మరోసారి తన ఆగ్రహాన్ని చూపించారు. అభిమానిపై మళ్లీ చేయి చేసుకున్నారు. 

‘చంద్రబాబు ఖాతాలో రూ. 15లక్షల కోట్లు’
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సమన్లు
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏడుగురికి నాంపల్లి కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. 

------------------------------------- జాతీయం-----------------------------------------

ఎట్టకేలకు హనీప్రీత్‌ అరెస్ట్‌
ఎట్టకేలకు డేరా సచ్చా సౌదా చీఫ్‌  గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఫేస్‌బుక్‌లో కూడా సెన్సార్‌ చేస్తారా?
 కేంద్రంలోని భారతీయ జనతా ప్రభుత్వాన్నిగానీ, దాని అనుబంధ హిందూ సంస్థలనుగాని ‘ఫేస్‌బుక్‌’ లాంటి సోషల్‌ మీడియాలో విమర్శించడానికి వీల్లేదు.

మొహర్రం వేడుకల్లో పాక్ నినాదాలు
మొహర్రం పర్వదినం సందర్భంగా బిహార్‌లోని బెట్టయ్య ప్రాంతంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన 21 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

------------------------------------- అంతర్జాతీయం------------------------------------

2017 నోబెల్‌ గ్రహీతలు వీరే...
ఫిజిక్స్‌లో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది (2017) ముగ్గురు అమెరికన్లను వరించింది. 

ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఉగ్రవాదని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మతం కన్నా మానవత్వం గొప్పదని ..
మతం కన్నా మానవత్వం గొప్పదని నిరూపించింది ఓ సౌదీ మహిళ. 

------------------------------------- బిజినెస్‌--------------------------------------------

కొత్త రూ.100 నోట్లూ వచ్చేస్తున్నాయ్‌..
పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కొత్త కొత్త నోట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది.

ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌: రోజుకు 4జీబీ డేటా
టెలికాం మార్కెట్‌లో ఆఫర్ల యుద్ధం వెల్లువెత్తుతోంది. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీలు అదనపు డేటా ఆఫర్లు, కొత్త రీఛార్జ్‌ ప్లాన్లతో హోర్రెత్తికిస్తున్నాయి. 

------------------------------------- సినిమా --------------------------------------------

సూపర్ స్టార్ సినిమా వాయిదా పడిందా..?
స్పైడర్ రిజల్ట్ అభిమానులతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా షాక్ ఇచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. 

త్వరలో నాగ్, నానీల మల్టీ స్టారర్
ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే సీనియర్ హీరో నాగార్జున త్వరలో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది.

------------------------------------- క్రీడలు --------------------------------------------

'భారత్ పై మా క్రికెటర్లు భయపడ్డారు'
టీమిండియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో తమ క్రికెటర్లు బెదిరిపోయిన కారణంగా దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా తాత్కాలిక చీఫ్ కోచ్ డేవిడ్ సాకర్ స్పష్టం చేశాడు.

'మిస్టరీ గర్ల్' పై పాండ్యా క్లారిటీ
గత కొంతకాలంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా-ఒక మిస్టరీ గర్ల్ మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వార్తలకు ఎట్టకేలకు పాండ్యా ఫుల్ స్టాప్ పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement