
స్పైడర్ రిజల్ట్ అభిమానులతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా షాక్ ఇచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిన ఈ సినిమా కోలీవుడ్ జనాలను ఆకట్టుకున్న తెలుగు ప్రేక్షకులను మాత్రం నిరాశపరిచింది. దీంతో మహేష్ తన తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాను ప్రారంభించిన మహేష్, ముందుగా ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాడు. అయితే స్పైడర్ రిజల్ట్ తేడా కొట్టేయటంతో ఇప్పుడా ఆలోచన విరమించుకున్నాడట. కంటెంట్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న మహేష్ సినిమాను 2018 వేసవికి విడుదల చేయాలని నిర్ణయించాడట. మహేష్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.