టుడే న్యూస్ రౌండప్ | today news roundup | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ రౌండప్

Jul 27 2017 5:18 PM | Updated on Sep 5 2017 5:01 PM

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు నగారా మోగింది.

హైదరాబాద్‌: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నగారా మోగింది.  ఎన్నికల కమిషన్‌  గురువారం నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్‌ ను విడుదల చేసింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనపై అసత్య కథనాలు రాశారంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జాతీయ వార్తల్లో నిన్న రాజీనామా చేసి వార్తల్లో నిలిచిన నితీస్‌ కుమార్‌ బీజేపీ మద్దతుతో ప్రమాణ స్వీకారం చేశారు.  నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి మీకోసం..


<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన మల్లాది విష్ణు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

చంద్రబాబుది దుర్మార్గం.. మనది సన్మార్గం: వైఎస్‌ జగన్‌

ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వినిపించే గొంతు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది అవుతుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.

మోగిన నంద్యాల ఉప ఎన్నిక నగారా

దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నగారా మోగింది.

ఆంధ్రజ్యోతిపై ఎమ్మెల్యే ఆర్కే పరువునష్టం దావా
ఆంధ్రజ్యోతి దినపత్రికపై మంగళగిరి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం పరువునష్టం దావా వేశారు.

ఏయ్‌ ఖాకీ పో వెనక్కి.. అంటూ వర్ల రామయ్య..
ఏయ్‌ ఖాకీ .. పో వెనక్కి, సభా వేదికపై నీ కేంపని అంటూ మాజీ పోలీసు అధికారి, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘సీఎం తప్పు మీద తప్పు చేస్తున్నారు’
ఆగస్ట్‌ 3వ తేదీ నుంచి మళ్లీ పాదయాత్ర చేస్తానని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

బిహార్‌ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌!
మహాకూటమితో నితీశ్‌ కుమార్‌ సంబంధాలు తెంచుకోవడం పట్ల జేడీ(యూ) అధినేత శరద్‌ యాదవ్‌ అసంతృప్తిగా ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

వామ్మో! పాములంటూ ప్రజల బెంబేలు
ఇళ్లలో, ఆఫీసుల్లో, పార్కుల్లో, చివరకు కారు ఇంజన్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న పాములను చూసి ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

వార్తావ్యాఖ్య : నితీశ్‌కుమార్‌ కటీఫ్‌ రాజకీయం
నితీశ్‌ కుమార్‌ రూటే సపరేటు. బిహార్‌ రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తున్న జనతాదళ్‌ (యు) నేత తనదైన ముద్రతో మరో అద్భుత విన్యాసం చేశారు.

త్వరలో కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ
త్వరలోనే కేంద్ర మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా నితీశ్‌ ప్రమాణ స్వీకారం
బిహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

కన్నీరుమున్నీరవుతున్న హిజ్రాలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేక నినాదాలతో అమెరికా వినువీధులు గర్జించాయి.

పట్టు సడలిస్తున్న చైనా!
డోకాలమ్‌ విషయంలో పట్టువిడుపుల దిశగా చైనా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగం వదిలేసిన యువరాజు
రాచరిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా పైలట్‌ ఉద్యోగాన్ని వదులుకున్నారు బ్రిటన్‌ యువరాజు విలియమ్‌.

భయపెట్టిన సబ్‌మెరైన్‌ ఇదే..
ప్రపంచంలోనే అతిపెద్ద సబ్‌మెరైన్‌ 'ప్రిన్స్‌ ఆఫ్‌ మాస్కో' తీరానికి వచ్చింది.

<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>>

రూమర్లకు చెక్‌.. బ్యాంకు సీఈవోగా మళ్లీ ఆమె
ప్రైవేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంకు సీఈవోగా శిఖా శర్మ నిష్క్రమించబోతున్నారనే ఊహాగానాలకు చెక్‌ పడింది. మరో మూడేళ్ల పాటు బ్యాంకు సీఈవోగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా శిఖా శర్మనే నియమిస్తూ యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం తీసుకుంది.

ఉవ్వెత్తున ఎగిసి.. చివరికి ఫ్లాట్‌
రికార్డు స్థాయిలో ఎగిసిన స్టాక్‌ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌ చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి.

శాంసంగ్‌ లాభాలు హై జంప్‌
దక్షిణ కొరియా టెక్నాలజీ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ క్యూ2లో 73శాతం వృద్ధితో భారీ లాభాలను నమోదు చేసింది.

రోజుకు వందకోట్లు
మెసేజింగ్‌ దిగ్గజ యాప్‌ వాట్సాప్‌ మరో మైల్‌ స్టోన్‌ను దాటేసింది.

దలాల్‌ స్ట్రీట్‌లో కొత్త రికార్డుల వర్షం
దలాల్‌స్ట్రీట్‌లో కొత్త రికార్డుల వర్షం కురుస్తోంది

<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>>

అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు!
ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‑లో తనేమిటో నిరూపించుకున్న భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా..

'అతని వల్లే మా క్రికెట్ నాశనమైంది'
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన వకార్ యూనిస్ పై ఆ దేశానికే చెందిన మరో క్రికెటర్ కమ్రాన్ అక్మాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

మిథాలీ గ్యాంగ్ క్యాష్ ప్రైజ్ పెంపు!
మహిళల వన్డే ప్రపంచకప్‑లో ఫైనల్ కు చేరి రన్నరప్ గా నిలిచిన మిథాలీ రాజ్ గ్యాంగ్ ను మరింత ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అడుగులు వేస్తుంది.

అబ్బాయిలతో ఆడటమే నా దూకుడుకు కారణం
అబ్బాయిలతో క్రికెట్‌ ఆడటమే దూకుడుగా ఆడేలా చేసిందని భారత మహిళా క్రికెటర్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అభిప్రాయపడింది.

శిఖర్‌ధావన్‌ మరో అరుదైన రికార్డు
భారత డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>>

బుల్లితెరపై బిగ్ బాస్ హవా

స్టార్ హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తుంద

స్పైడర్ టీజర్‑కు కొత్త డేట్..!
బ్రహ్మోత్సోవం సినిమా ఫెయిల్యూర్‑తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు..

మహానగరంలో మరో మాయగాడు..!
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు.

షారుక్‌తో రొమాన్స్‌ ఈజీ: నటి
బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌తో ఆన్‌ స్క్రీన్‌ రోమాన్స్‌ చేయడం సులభం అని బాలీవుడ్‌ నటి అనుష్కా శర్మఅభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement