sensational comments
-
ఓరి నీ శ్రీనుగా.. ఒకసారి నా ముందుకు రా! నన్ను తిరుపతి నుంచి తరుముతావా?!
-
రఘురామ ఒక ఉగ్రవాది.. ఆయన విన్యాసాలు ఒకసారి చూడండి.. జడ శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు
-
దీదీ అంతలా మారిపోతారనుకోలేదు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. టీఎంసీలో భారీ చీలిక, తన గత ప్రభుత్వ అవినీతి ఆరోపణలపై సువేందు సర్కార్ దర్యాప్తు, మరోవైపు మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ విచారణతో ఆమె రాజకీయంగా ఒత్తిడిలో ఉన్నారు. దీనికి తోడు ఇన్నాళ్లు వెన్నంటే ఉన్న సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా దూరమవుతున్న పరిస్థితి కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే దీదీతో రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న శతాబ్ది రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని మరింత కుదిపేస్తున్నాయి. ఎన్నికల తర్వాత బెంగాల్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దారుణ ఓటమి తర్వాత.. మమతా బెనర్జీ పార్టీ చీలిక సంకేతాలతో తీవ్ర గందరగోళం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరిందని.. పార్టీ నుంచి వేరుపడిన ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. “దీదీ ఇంతకు ముందులా లేనేలేరు’’ అంటూ టీఎంసీ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శతాబ్ది రాయ్.. 2009 నుంచి మమతా బెనర్జీతో అనుబంధం ఉంది. అయితే టీఎంసీలో మునుపటి పరిస్థితులు లేవని అంటున్నారామె. “దీదీ మారిపోయారు. ఎంతలా అంటే.. మేమెవరం ఆమె తీరును జీర్ణించుకోలేనంతలా. గత కొన్నేళ్లలో పార్టీ నిర్ణయాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎంపీలైనప్పటికీ మా పరిస్థితి దారుణంగా ఉండేది. పార్టీ లోపల మా గొంతుక వినిపించే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు సమస్యలను చెప్పినా.. నాయకత్వం స్పందించేది కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించాలని ప్రస్తావించిన వినిపించుకోలేదు. పైగా నిర్ణయాల్లోనూ కొందరికే ప్రాధాన్యం ఉండేది. ఆ విషయంలో మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేవారు.. .. దీదీతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. కానీ, ఆమె ఇప్పుడు పాత దీదీ కాదు. కానీ ప్రజల కోసం పని చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం(తిరుగుబాటు) తీసుకున్నాను” అని శతాబ్ధిరాయ్ తెలిపారు. అలాగే.. పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అవినీతి పేరుకుపోయింది. అది చూసి నేనెంతో నిరాశకు లోనయ్యా. వ్యక్తిగతంగా నాకు స్వచ్ఛమైన ఇమేజ్ ఉంది. అందుకే బయటకు వచ్చేశా.. అని అన్నారామె.శతాబ్ది రాయ్(56) ప్రముఖ బెంగాలీ సినీ నటి. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ ఆమె గుర్తింపు పొందారు. 2009లొ టీఎంసీ తరఫున లోక్సభ ఎన్నికల్లో బీర్బూమ్ నుంచి పోటీ చేసిన నెగ్గారు. అప్పటి నుంచి వరుసగా ఆమెనే ఎన్నికవుతూ వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు లోక్సభలో డిప్యూటీ నేతగా ఆమె ఉన్నారు. మమతా బెనర్జీతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న నేతగా ఆమెను పరిగణిస్తారు. అందుకే ఆమె చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.తృణమూల్ కాంగ్రెస్లోని అటు చీలిక ఎమ్మెల్యేల వర్గం తిరుగుబాటుకు కారణమైంది. ఆ వెంటనే ఇటు పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు ఇటీవల పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు రావడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఈ పరిణామాల మధ్య దాదాపు డజను మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశమై ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రెబల్ వర్గం సంఖ్య 20కి చేరిందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. -
విజయ్ ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా?
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వంపై డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వం మూడు నెలలు కూడా కొనసాగడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 60 ఏళ్ల కాలంలో ఏర్పడిన ఏకైక డీఎంకేయేతర, అన్నాడీఎంకేయేతర ప్రభుత్వం విజయ్ జోసెఫ్ సారథ్యంలో మేలో ఏర్పడటం తెల్సిందే. ఆదివారం చెన్నైలో వీసీకే ఎమ్మెల్యే పనైయూర్ బాబు డీఎంకేలో చేరిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగించారు. ‘‘ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటిదో నేను చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, మరో ఆరు నెలల వరకు ఎలాంటి విమర్శలు చేయబోనని చెప్పా. ప్రస్తుత పరిస్థితులను చూసి మాట్లాడక తప్పడం లేదు. ఈ ప్రభుత్వం ఎన్ని నెలలు ఉంటుందనికాదు, కనీసం మూడు నెలలయినా మనుగడ సాగిస్తుందా అన్నదే అసలు ప్రశ్న’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి కొత్తగా వచ్చే వారు తాము వచ్చిన పార్టీని విమర్శించవద్దని కోరారు. -
జగనే మీ కన్నానయం.. నువ్వు రెండు సంవత్సరాలకే రాష్ట్రాన్ని నాశనం చేసావ్..
-
కావ్య మారన్ కు అతనంటే ఇష్టం.. అందుకే నన్ను ఆడించలేదు.. బాంబు పేల్చిన లివింగ్ స్టోన్
-
సీబీఎస్ఈలో జేబు దొంగలు.. జాగ్రత్త!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తున్న ఆన్సర్ షీట్ స్కానింగ్, రీవ్యాల్యుయేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విద్యార్థుల సమాధాన పత్రాలను స్కానింగ్ చేయడంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవడానికి కూడా విద్యార్థుల నుంచే డబ్బు వసూలు చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు.ఈ సందర్భంగా ఎక్స్లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జేబుదొంగలతో జాగ్రత్త.. ఇప్పుడు వాళ్లు CBSEలోనే కూర్చున్నారు. బోర్డు తప్పు వల్ల మీ మార్కులు తప్పుగా నమోదైతే మీకు ఏమి దక్కుతుంది? ఒక బిల్లు మాత్రమే. డిజిటల్ స్కాన్డ్ కాపీకి ఒక్కో సబ్జెక్టుకు రూ.100, రీ-టోటలింగ్కు రూ.100, రీ-ఎవాల్యుయేషన్కు ఒక్కో ప్రశ్నకు రూ.25 చెల్లించాలి” అంటూ మండిపడ్డారు.जेबकतरों से सावधान - आज वो CBSE के अंदर बैठे हैं। CBSE की गलती से नंबर ग़लत आए तो आपको क्या मिलता है?एक bill:Digital scan copy: ₹100/विषयRe-totalling: ₹100/paperRe-evaluation: ₹25/सवालअपनी ही answer sheet की सही जाँच के लिए एक बच्चे को ₹2000 तक भरने पड़ सकते हैं।… pic.twitter.com/H0WS1xF6Zf— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2026సీబీఎస్ఈ పరీక్షల ఆన్సర్ షీట్ల స్కానింగ్, డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. విద్యార్థుల మార్కులు తప్పుగా అప్లోడ్ అవుతున్నాయని, వాటిని సరిచేయాలంటే మళ్లీ డబ్బు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. ఒక విద్యార్థి తన సమాధాన పత్రం సరిగ్గా మూల్యాంకనం అయ్యిందో లేదో నిర్ధారించుకోవడానికి సుమారు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.CBSE’s May 2025 tender required answer sheets to be scanned with automatic robotic scanners, spines preserved, at a minimum of 300 DPI.The tender re-issued in August quietly removed all of it. “Scanners” became generic. Resolution dropped to 200 DPI.Now we know what that… https://t.co/XXdorOi3oq— Rahul Gandhi (@RahulGandhi) May 31, 2026“తప్పు సీబీఎస్ఈది.. శిక్ష విద్యార్థికి.. లాభం ప్రభుత్వానికి” అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా చూస్తే తప్పులు సరిదిద్దబడవని, మరింత పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో ఎక్కువ నష్టం చవిచూస్తున్నది పిల్లలేనని, వారి సమయం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లు మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. దీనివల్ల పేజీలు మిస్ కావడం, బ్లర్ కాపీలు రావడం, సమాధాన పత్రాలు పూర్తిగా అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.ఎవరీ సార్ధక్ సిద్ధాంత్..ఈ వివాదానికి సంబంధించి రాహుల్ గాంధీ షేర్ చేసిన పోస్ట్లో ఉన్న అంశాలను బయటపెట్టిన వ్యక్తి జార్ఖండ్కు చెందిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్. సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో అందుబాటులో ఉన్న టెండర్ పత్రాలను పరిశీలించిన ఆ 17 ఏళ్ల కుర్రాడు.. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) కాంట్రాక్ట్ నిబంధనలను మూడు దశల్లో సడలించినట్లు ఆధారాలతో వెల్లడించాడు. ఈ మార్పులు ప్రత్యేకంగా హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాడు.సార్థక్ సిద్ధాంత్ తన వెబ్సైట్లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 2025 మేలో విడుదల చేసిన టెండర్లో ఆన్సర్ షీట్లను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లతో, కనీసం 300 DPI నాణ్యతతో స్కాన్ చేయాలని పేర్కొన్నారు. అయితే అదే టెండర్ను ఆగస్టులో మళ్లీ విడుదల చేసినప్పుడు ఆ నిబంధనలను సడలించి, స్కానర్ల ప్రస్తావనను సాధారణీకరించడంతో పాటు రిజల్యూషన్ను 200 DPIకు తగ్గించినట్లు వెల్లడించారు. అనంతరం ఆన్సర్ షీట్లను మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు బయటపడిందని, దీనివల్లే బ్లర్ కాపీలు, మిస్సింగ్ పేజీలు, స్కాన్ కాని సమాధాన పత్రాల సమస్యలు వచ్చాయని ఆరోపించారు.ఇక రాహుల్ గాంధీ కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థపై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో ఈ సంస్థ మరో పేరుతో వివాదాల్లో చిక్కుకుందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సమాధాన పత్రాల గందరగోళానికి సంబంధించిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నామని సీబీఎస్ఈ చెబుతోంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్లకు చెందిన నిపుణులతో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వ్యవస్థను సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.మొత్తంగా, లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన ఈ వివాదం దేశవ్యాప్తంగా విద్యా మూల్యాంకన వ్యవస్థ పారదర్శకత, సాంకేతిక ప్రమాణాలు, రీవ్యాల్యుయేషన్ ఫీజులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. -
నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్
-
తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!
-
ఎవడబ్బ సొమ్మని ఇల్లు కట్టుకున్నావ్..? అది రైతుల భూమి!
-
మాధవ్ రెడ్డి గుర్తున్నాడా? బాబు హత్య రాజకీయాల చిట్టా బయటపెట్టిన లక్ష్మీ పార్వతి
-
అమరావతిలో తేడా జరుగుతుందని పవన్ కళ్యాణ్ గమనించారు.. అందుకే జై ఆంధ్ర అంటున్నాడు
-
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు..!
-
APSRTC చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ నిర్వహణ విషయంలో ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ తప్పనిసరి అని అంటున్నారాయన. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..విద్యుత్ బస్సులు కొనుగోలు, నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఆర్టీసీలోని పదివేల ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకురావాల్సి ఉంది. పదివేల విద్యుత్ బస్సులు కొనాలంటే 17 వేల కోట్లు కావాలి. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీపై ఆర్ధిక భారం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అంత ఖర్చు చేసి బస్సులు కొనే పరిస్థితిలో ఆర్టీసీ ఇప్పుడు లేదు అని అన్నారు. ‘‘కొత్త బస్సులు కొనలేం. విద్యుత్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా నడపడమే మేలు. మొత్తం 1050 ఎలక్ట్రికల్ బస్సులకు ప్రపోజల్స్ పెట్టాం. 750 ఎలక్ట్రికల్ బస్సులకు టెండర్లు పూర్తయ్యాయి. రెండు మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. ప్రతీ రోజు కాలం చెల్లిన బస్సులు స్క్రాప్ కు వెళుతుంటాయి. కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి’’ అని కొనకళ్ల నారాయణ అన్నారు. -
ఎన్టీఆర్ ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే.. ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు
-
నన్ను చంపడానికి ప్లాన్ చేశారు..! రాచమల్లు షాకింగ్ కామెంట్స్
-
దళపతి విజయ్ పై కుట్రలు.. పోసాని సంచలన వ్యాఖ్యలు
-
విజయ్ కు సీబీఐ నోటీసు? కాంగ్రెస్ దయాకర్ సంచలన కామెంట్స్
-
విజయం మనదే: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు చూసి ఆందోళన చెందవద్దని ఆమె టీఎంసీ శ్రేణులను ఆమె కోరారు. నిజమైన ఫలితాలు వచ్చేదాకా అంతా ఎదురు చూడాలని.. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ శ్రేణులకు ఆమె పిలుపు ఇచ్చారు. ‘‘మనం ఇంకా ఓడిపోయినట్లు కాదు. కౌంటింగ్ కేంద్రం నుంచి టీఎంసీ నేతలు వెళ్లిపోకూడదు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్లు దొంగలించింది. ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలే వచ్చాయి. పలు చోట్ల కౌంటింగ్ నిలిపివేశారు. 70 నియోజకవర్గాల కౌంటింగ్పై ఈసీ నుంచే అప్డేట్ లేదు. టీఎంసీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి. పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దు. మనం ఇంకా ఓడిపోయినట్లు కాదు. చివరి కాదా వేచి చూడండి. తుది ఫలితాలు మనవైపే ఉంటాయి. అసలైన విజయం మనదే’’ అని అన్నారామె.ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బెంగాల్లో 191 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజారిటీ (147) దాటేసి అధికార కైవసం దిశగా అడుగులేస్తోంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. మమతా బెనర్జీపై ప్రజలకు ఉన్న కోపం ఈ ఫలితాలతో స్పష్టమైందని బీజేపీ అంటోంది. ఇక ఫలితాల్లో.. టీఎంసీ 97 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా.. సీపీఎం, కాంగ్రెస్లు చెరో 1 స్థానంలో లీడ్లో కొనసాగుతున్నాయి. -
2024 ఎన్నికల్లో ఈవీఎం ట్యాపరింగ్ చేశారు.. దమ్ముంటే ఎవరైనా రండి.. నేను చర్చకు సిద్ధం
-
పార్టీ మట్టి కొట్టుకుపోవడం ఖాయం.. స్థానిక ఎన్నికల్లో TDP భూస్థాపితమే
-
తలలో మెదడు ఉన్నోడు ఎవడైనా.. పూడి శ్రీహరి అరెస్ట్ పై పొన్నవోలు సంచలన కామెంట్స్
-
నేనే రాజునైతే సీన్ వేరేలా ఉంటుంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి డెమోక్రట్లు అత్యంత ప్రమాదకరమని.. తనపై జరిగిన హత్యాయత్నానికి ఒకరకంగా వాళ్లే కారణమని ఆరోపించారు. ఈ క్రమంలో మీడియాపైనా ఆయన చిందులు తొక్కారు. ‘‘నేరాల విషయంలో మీడియా, డెమోక్రట్లు ఒకేలా ఉన్నాయి. నేను మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నా. నో కింగ్స్ ఆందోళనలో పాల్గొన్న వ్యక్తే నాపై హత్యాయత్నం చేశాడు. నేరస్తుడు వైడ్ అవేక్స్ అనే టీంలో సభ్యుడిగా ఉన్నాడు. నో కింగ్స్ నిరసనలకు కొందరు కుట్రదారులు ఫండింగ్ చేశారు. రాజుల్లేరు.. నేను రాజును కాదు. నేనే గనుక రాజును అయితే సీన్ వేరేలా ఉండేది’’ అని అన్నారాయన. సీబీఎస్ ‘60 నిమిషాలు’ కార్యక్రమంలో జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం గురించి స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షులపై హత్యాయత్నం కొత్తేం కాదు. అది ఎప్పుడూ జరిగేదే. గతంలో గతంలో అబ్రహం లింకన్, మెక్ కిన్లే, కెనెడీలపైనా జరిగాయి. డెమోక్రట్ల విషపూరిత ప్రసంగాల వల్లే ఇలా జరుగుతోంది. వాళ్లు అమెరికాకు అత్యంత ప్రమాదకరం’’ అని అన్నారాయన. అదే సమయంలో కాల్పులకు దిగిన నిందితుడు కోలో టోమస్ ఎలెన్ చేసిన సంచలన ఆరోపణలను సీబీఎస్ ప్రతినిధి నోరా ఓడోనెల్ ప్రస్తావించారు. అయితే.. ‘‘నేను రేపిస్ట్ను కాదు’’ అంటూ ట్రంప్ ఆమెపై ఆయన ఫైర్ అయ్యారు. -
24 గంటల్లో 2 హత్యలు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చిత్తూరు జిల్లా: ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత చూపుతున్నారంటూ జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు చేశారు. గెలిపించేటప్పుడు కావాలి కానీ.. అధికారంలో ఉండకూడదా? అంటూ ప్రశ్నించారు. మేము బానిసలుగా ఉండాలా? ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు. కొందరిలో ఎస్సీలంటే చులకన భావం ఉందన్న థామస్.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి.. కానీ ఎస్సీ ఎమ్మెల్యేలకు అధికారంలో ఉండకూడదు.. తొక్కేయాలా? ఇదెక్కడి న్యాయం. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎస్సీలు కాళ్లు పట్టాలి.. వారు బానిసలుగా ఉండాలి అన్న భావన కరెక్ట్ కాదు’’ అంటూ థామస్ వ్యాఖ్యానించారు. -
ఢిల్లీకి వస్తా.. బీజేపీని తరిమి కొడతా
సాక్షి, ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తర్వాతి లక్ష్యం జాతీయ రాజకీయాలేనని ప్రకటించారామె. అయితే అది అధికారం కోసం కాదని.. కేవలం బీజేపీ పతనం కోసమేనని వ్యాఖ్యానించారు.కోల్కతాలో జరిగిన ఎన్నికల సభలో ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్ విజయం తర్వాతే ఢిల్లీకి వస్తా.. బీజేపీని తరిమి కొడతా అంటూ మాట్లాడారామె. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తోంది. నేను బెంగాల్లో పుట్టాను.. ఇక్కడే చస్తాను. కానీ, బెంగాల్లో గెలిచాక ఢిల్లీకి తప్పకుండా వెళ్తాను. నాకు కావాల్సింది అధికారం కాదు. బీజేపీ పతనం. ఢిల్లీలోనూ వాళ్లను ఇదే తరహాలో ఎదుర్కొంటాను. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడతానని’’ అని దీదీ వ్యాఖ్యానించారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఈసారి మరింత ఉత్కంఠభరితంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపిస్తుండగా.. బీజేపీ మాత్రం ఆమె ప్రభుత్వంపై అవినీతి, దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఓటర్ల స్పందన కూడా విశేషంగా ఉంది. గురువారం జరిగిన తొలి దఫా పోలింగ్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. సుమారు 92 శాతం టర్నౌట్ నమోదైంది. చివరిసారిగా 2011లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా.. ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. ఆ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ దారుణ పరాజయం పాలైంది.తాజా భారీ ఓటింగ్ను ప్రధాని నరేంద్ర మోదీ ‘‘మార్పు కోసం ప్రజల సంకల్పం’’గా అభివర్ణించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఇది తమ విజయానికే సంకేతామని మమతా బెనర్జీ అంటున్నారు. రెండో విడత పోలింగ్ 2026 ఏప్రిల్ 29న జరగనుంది. ఈ విడతలో మిగిలిన 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
మీ పార్టీలో చేరుతా.. జీవితాంతం మీ పార్టీకి సేవ చేస్తా!
-
నెక్స్ట్ అరెస్టు మీరే.. రెడీగా ఉండండి.. యాంకర్ కు షాక్ ఇచ్చిన KS ప్రసాద్
-
ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
89 బూతులలో ఓట్లే పడలేదు.. EVMల మాయ గెలుపే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
నీ అన్న చావు కోసం ఎదురు చూశావు.. అచ్చెన్నపై తిలక్ సంచలన కామెంట్స్
-
ABN ఆఫీస్ లో అరాచకాలు అంతా ఇంతా కాదు.. ముందుంది ముసళ్ల పండగ
-
మేము టిఫిన్ చేస్తుంటే ఆ CI వచ్చి.. నా గొంతు పట్టుకుని.. తాటిపర్తి సంచలన నిజాలు
-
నువ్వేంతా.. నీ బ్రతుకెంతా.. గౌడి గేది లాగా పెరిగావ్.. సంస్కారం లేదంట్రా..
-
కమ్మ రాజధాని.! బాబు సైలెంట్..
-
నన్ను ఆ ఎమ్మెల్యే టార్గెట్ చేశారు.. టీడీపీ మహిళా సంచలన కామెంట్స్
-
యుద్ధం వేళ.. ఒబామాపై ట్రంప్ సంచలన కామెంట్స్
-
సినిమాల్లో హీరోలు తాగితే తప్పు లేదా?: అనిరుధ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినిమా వాళ్ళు చేస్తే ఒప్పు, రాజకీయ నాయకులం చెప్తే తప్పా? అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన సీఎల్పీ మీడియా హాల్లో మాట్లాడుతూ.. హీరోలకంటే రాజకీయ నాయకులకు ప్రైవసీ లేకుండా పోయింది.. సినిమాల్లో హీరోలు తాగితే తప్పులేదా?’’ అంటూ మండిపడ్డారు.‘‘ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ తాగుతాడు. ధూల్పేటలో గుడుంబా దొరుకుంటుందని సినిమాలో చూపెట్టాడు. బాలకృష్ణ సినిమాలో మామా ఏక్ పెగ్ లా అనే పాటలో నటించాడు. మందుబాబులం అనే పాట పాడుకుంటూ డ్యాన్స్ చేశారు. రాజకీయ నాయకులం కల్తీసారా తాగకండి అంటే బద్నాం చేస్తారా.. ఎక్కువ డ్రగ్స్ వాడేది సినీ ఇండస్ట్రీ లోనే’’ అని అనిరుధ్రెడ్డి ఆరోపణలు గుప్పించారు.‘‘సినీ యాక్టర్స్ అందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు. సినిమా వాళ్లపైనే రూమర్స్ ఎక్కువ ఉన్నాయి. మా రాజకీయ నాయకులపై ఎక్కువగా రూమర్స్ లేవు. అందరూ సినిమా యాక్టర్స్ 90 రోజుల కోకసారి పాలికర్ టెస్ట్ చేయించుకోవాలి. నేను కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నా.. నా కొడుకు నన్ను డ్రగ్స్ గురించి అడిగాడు. ఇప్ప సారా ఇండియన్ లిక్కర్. ఇప్పసారాను బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు. ఇప్పసారాకు 3000 ఏండ్ల చరిత్ర ఉంది. నేను సారాకి వ్యతిరేకం. తాగమంటున్నాడని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.కల్తీ సారా కంటే ఇప్పసారా చాలా మంచిది. రాలిపోయిన ఇప్ప పూల నుండి సారా చేస్తారు. ఇప్ప సారా వల్ల లాభాలపై అనేక అధ్యయనాలు జరిగాయి. ఆదివాసీలు లిక్కర్ చేస్తే తప్పా?. కార్పొరేట్ కంపెనీలు లిక్కర్ చేస్తే కరెక్టా?. ప్రకృతి నుండి వచ్చే ప్రతిదీ మంచిది. ఇండియా నుండి తీసుకుపోతున్న ఇప్ప పువ్వుతో విదేశాల్లో సారా చేసి వేలల్లో సంపాదిస్తున్నారు. ఆదివాసీలు ఉన్నారు కాబట్టే అడవులు ఉన్నాయి’’ అని అనిరుధ్రెడ్డి పేర్కొన్నారు. -
పగలంతా TDP.. రాత్రయితే మాత్రం.. టీడీపీ నేతలపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదు
-
YS కుటుంబాన్ని కొట్టేందుకు.. నాపై 5 CBI కేసులు పెట్టిన కాంగ్రెస్
-
అందుకే లాగిపెట్టి చెంప చెల్లు మని.. వైఎస్ సునీతపై KS ప్రసాద్ షాకింగ్ నిజాలు
-
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘మంత్రి పదవి ఉన్నా.. లేకున్నా.. ఒక్కటే.. నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదు. అధి ష్టానం హామీ ఇచ్చింది. ఇస్తుందో లేదో తెలియదు. వారికి ఉండే సమీకరణాలు ఏమిటో?’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పదవి లేకున్నా తనకు ప్రజల్లో తగిన గౌరవం ఉందన్నారు. మంగళవారం శాసనసభ లాబీల్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. మంత్రి పదవి ఇవ్వడం వల్ల తనకు వచ్చే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని, అది పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు తాము ఇద్దరం సోదరులమని తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్య మకారుల సేవలు అవసరమన్నారు. సీఎం రేవంత్రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బంది లేద ని, తాను సోమవారం సీఎంతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయని, ఆయన ఎదురుపడితే పలకరించుకున్నామే తప్ప ఎలాంటి భేటీ జరగలేదన్నారు. పదేళ్లపాటు తానే సీఎం అని రేవంత్రెడ్డి అంటేనే తాను అభ్యంతరం చెప్పానని, అలా అనడం శాసనసభ్యులను అవమానించడమే అవుతుందని మాత్రమే తాను గతంలో వ్యాఖ్యానించానని చెప్పారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడంతోనే వారి పతనం ప్రారంభమైందని తాను కేటీఆర్తో అన్నట్లు చెప్పారు. కాగా భోజన సమయంలో రెండుగంటలపాటు కేటీఆర్తో భేటీలో సాధారణ విషయాలే మాట్లాడుకున్నామని, ఎలాంటి రాజకీయ ప్రాధా న్యత లేదని, ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూ నాయక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నా రని రాజగోపాల్రెడ్డి తెలిపారు. -
ఆస్తి కోసం బ్లాక్ మెయిల్.. కొండా రాఘవ సంచలన వ్యాఖ్యలు
-
పాలు పితుకుతున్నావా..? గాడిదలు కాస్తున్నావా..?
-
జగన్, భారతీలు వివేకాను చంపారని మీ పిల్లలపై ఒట్టేసి చేప్తావా..?
-
ఇరాన్ పై గెలుస్తాం.. నెతన్యాహు కీలక ప్రకటన
-
ఇరాన్ యుద్ధం.. బ్యాంకులో నుంచి మీ డబ్బు డ్రా చేసుకోండి...
-
వారు సజీవంగా లేరు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్ తమకు సరెండర్ కాబోతుందన్న ట్రంప్.. తమ దాడులకు ఇరాన్ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్ అన్నారు.మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని నెతన్యాహు అన్నారు. -
మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
-
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
-
నా భూమిని ఎలా తీసుకుంటారో నేను చూస్తా.. అమరావతి రైతు కౌంటర్
-
నాకు ప్రాణహాని ఉంది.. కొలికపూడి సంచలన వ్యాఖ్యలు
-
BR నాయుడు వీడియో లీక్ వెనుక.. ఆ మీడియా అధినేత?
-
నేను ఎమ్మెల్యే అవుతా...! కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
-
ట్రంప్ సంచలనం! ఇరాన్ ను తుడిచి పెట్టేసాం.. యుద్ధం ముగిసినట్టేనా ?
-
నన్ను చంపేందుకు యత్నాలు.. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
-
జస్ట్ అలా పడి ఎముకలు విరిగితే..? కస్టడీ ఆరోపణలపై సునీల్ కౌంటర్
-
ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని నీకు.. డిప్యూటీ సీఎం పదవి ఎందుకు?
-
ఒక నిష్ట దరిద్రుడివి.. పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్
-
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
తాను ఎంతకాలం ఉంటానో తెలియదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఫ్లోరిడాలోని ఆయన నివాసం దగ్గర సాయుధ చొరబాటుదారుడిని భద్రతా దళాలు కాల్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు ట్రంప్పై హత్యాయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో టంప్ ఆందోళన వ్యక్తం చేశారు. "నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలియదు. నా కోసం చాలా మంది తుపాకులతో కాపు కాస్తున్నారు’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో తనపై జరిగిన రెండు హత్యాయత్నాల నుంచి ప్రాణాలతో బయటపడిన ట్రంప్, తాజా ఘటనపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.‘‘మీరు ఈ పిచ్చి షూటర్ల గురించి చదివే ఉంటారు.. కానీ వారు ప్రభావశీలురైన అధ్యక్షులను మాత్రమే టార్గెట్ చేస్తారు. తక్కువ ప్రభావం ఉన్న అధ్యక్షుల జోలికి వారు వెళ్లరు’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. గతంలో హత్యకు గురైన అబ్రహం లింకన్, జాన్ ఎఫ్.కెన్నెడీలను గుర్తుచేస్తూ.. వారు చాలా ప్రభావశీలురన్నారు. ఆ గొప్ప నాయకులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా తాను కొంచెం తక్కువ ప్రభావశీలిగా ఉండాలనుకుంటున్నానేమోనన్న ట్రంప్.. కాస్త తగ్గించుకుందామా?.. కొన్నాళ్లపాటు ఒక సాధారణ అధ్యక్షుడిలా ఉంటానంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.గత శనివారం అర్ధరాత్రి.. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలోకి ఓ దుండగుడు చొరబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన భద్రతా దళాలు అతడిని కాల్చివేశాయి. ఈ ఘటన సమయంలో ట్రంప్ దంపతులు వైట్హౌస్లోనే ఉన్నట్లు సమాచారం. ఫ్లోరిడా పామ్ బీచ్లో ఉన్న ‘మార్ ఎ లాగో’ ఎస్టేట్కు ట్రంప్ వీకెండ్లో వస్తుంటారు. ఎస్టేట్ నార్త్ గేట్ నుంచి ప్రవేశించిన ఓ దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. అతడి చేతిలో ఆయుధంతో పాటు ఇంధనం క్యాన్ ఉన్నట్లు కూడా గుర్తించారు. అడ్డుకున్నభద్రతా దళాలపై నిందితుడు షాట్గన్ను ఎక్కుపెట్టాడు. దీంతో అధికారులు వెంటనే అతడిని మట్టుబెట్టారు. -
కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు
-
దీని వెనుక చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు హస్తం
-
అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ కుట్ర.. ఆధారాలతో బయటపెట్టిన రోహిత్ పవార్
-
అజిత్ పవార్ ప్రమాదం వెనుక టీడీపీ!
-
సిగ్గుందా లోకేష్, చంద్రబాబు.. రేపిష్టికి పూలతో ఆహ్వానం పలుకుతారా.. ?
-
నా టార్గెట్ సీఎం సీటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
క్యాష్, లోకేష్, సూట్ కేసు.. అప్పిరెడ్డి సంచలన కామెంట్స్
-
2023లో కేసు.. ఇప్పుడు పీటీ వారెంట్
-
జైల్లో అంబటిని కలిసిన తరువాత ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
-
జగిత్యాలలో అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
-
బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన లేదు
-
కమ్యూనిజం నుంచి విముక్తి పొందాలి
రాయ్పూర్: కమ్యూనిస్ట్ సిద్ధాంతంపై హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సిద్ధాంతం వినాశకరమైందంటూ మండిపడ్డారు. కమ్యూనిజం ఉన్న చోట అభివృద్ధి మచ్చుకైనా కనిపించదన్నారు. అందుకే, ఆ భావజాలం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలని కోరారు. వామపక్ష తీవ్రవాదంపై ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో కమ్యూనిస్ట్ భావజాలం మనజాలదు. పశ్చిమబెంగాల్, త్రిపురల్లో కమ్యూనిస్టుల పాలన ముగిసింది. కేరళలో వారి ప్రభుత్వం చివరి ఊపిరి పీలుస్తోంది’’ అన్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగానో, అభివృద్ధి లోపంగానో చూడరాదని షా చెప్పారు. ‘‘ఇది సిద్ధాంతపరమైన సవాలు. వామపక్ష తీవ్రవాదం పెరగకమునుపు బస్తర్ ప్రాంతంలో శాంతి భద్రతలు పరిస్థితి యూపీ, బిహార్ కంటే మెరుగ్గా ఉండేవి. మరో పదేళ్లలో బస్తర్ దేశంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారనుంది’’ అన్నారు.మార్చి ఆఖరుకు అంతం‘‘దేశంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం 90 శాతం మేర తగ్గిపోయింది. మార్చి చివరికల్లా దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాం’’ అని అమిత్ షా నొక్కి చెప్పారు. ‘‘ఛత్తీస్గఢ్లో వందల సంఖ్యలో నక్సలైట్లు హతమయ్యారు. వేలాది మంది లొంగిపోయారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి. లొంగిపోయిన వారిని ప్రభుత్వం రెడ్ కార్పెట్తో ఆహ్వానిస్తుంది’’ అన్నారు. ప్రభుత్వం ఒక్క తూటా కూడా కాల్చాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. -
అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు
-
వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
నేను ట్రాప్ చేయాలనుకుంటే.. నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు
-
75 ఏళ్ల వయస్సులో.. పంది కొవ్వు వాసన చూశావా! మనిషి పుట్టుక పుట్టినోడు ఎవ్వడూ..
-
అసలు మనిషి జన్మేనా.. చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్
-
కుక్కలు ఓకే.. భర్తలను భార్యలు
-
కాంగ్రెస్లో చేరి తప్పు చేశా: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్లో ఉండటం వల్ల ఎలాంటి లాభం లేదంటూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పటాన్ చెరు జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో తన అనుచరులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ వ్యాఖ్యానించారు.మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉంది. పటాన్ చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటిల్లోని 104 కౌన్సిలర్లను గెలిపించేందుకు విభాగాల వారిగా పని చేద్దామని మహిపాల్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే హాట్ కామెంట్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
TDP నేతల చేతిలో చంపబడ్డ మంద సాల్మన్ కొడుకుల సంచలన వ్యాఖ్యలు
-
ABN రాధాకృష్ణ తప్పుడు రాతలపై భట్టి సీరియస్..
-
సరిహద్దులు చెరపొద్దు.. శాంతిని చంపొద్దు!
వాటికన్ సిటీ: ప్రపంచ దేశాల విదేశాంగ విధానంపై పోప్ లియో–14 సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వ¿ౌమ దేశాలపై బలప్రయోగం చేస్తూ.. తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకునే దేశాల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ చట్టాలను, ప్రపంచ శాంతిని కొన్ని దేశాలు ‘పూర్తిగా తుంగలో తొక్కుతున్నాయని’ఆయన ధ్వజమెత్తారు. యుద్ధం ‘ఫ్యాషన్’అయిపోయింది.. ‘ప్రస్తుతం యుద్ధం చేయడం మళ్లీ ఒక ఫ్యాషన్గా మారిపోయింది. దేశాల మధ్య యుద్ధ కాంక్ష విపరీతంగా పెరుగుతోంది’.. అని పోప్ ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ దేశాల రాయబారులతో జరిగిన వార్షిక సమావేశంలో ఆయన ఈ ప్రసంగం చేశారు. వెనిజువెలాలో నికోలస్ మదురోను గద్దె దించడానికి అమెరికా జరిపిన సైనిక చర్య, ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో పోప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బలప్రయోగ దౌత్యంపై ఆందోళన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే సంప్రదాయ దౌత్యం పోయి, ఇప్పుడు బలప్రయోగం లేదా మిత్రదేశాల కూటములతో బెదిరించే ‘బల ప్రయోగ దౌత్యం’రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు. ఆయుధాల ద్వారా శాంతిని స్థాపించాలనుకోవడం భ్రమ అని, ఇది కేవలం సొంత ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చేసే ప్రయత్నమేనని పోప్ స్పష్టం చేశారు. ఇది ప్రపంచ శాంతికి పునాది అయిన చట్టబద్ధమైన పాలనను తీవ్రంగా దెబ్బ తీస్తుందని హెచ్చరించారు.శాంతియుత పరిష్కారం కనుగొనాలి వెనిజువెలాలో.. ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శాంతియుత రాజకీయ పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, శాశ్వత పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజం వెనకడుగు వేయకూడదని కోరారు. ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి ‘ద్వి–దేశ పరిష్కారం’ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. పాలస్తీనియన్లకు తమ సొంత గడ్డపై జీవించే హక్కు ఉందని నొక్కి చెప్పారు. కేవలం విదేశాంగ విధానమే కాకుండా గర్భస్రావం, సరోగసీకి వ్యతిరేకంగా క్యాథలిక్ చర్చి వాణిని వినిపిస్తూనే.. ఐక్యరాజ్యసమితి వంటి బహుళపక్ష వేదికలు బలహీనపడుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా వాటికన్ దౌత్యపరమైన ప్రసంగాలు ఇటాలియన్ లేదా ఫ్రెంచ్ భాషల్లో సాగుతాయి. అయితే, ఈసారి పోప్ లియో తన ప్రసంగంలోని అధిక భాగాన్ని ఆంగ్లంలో కొనసాగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. -
ఫార్చ్యూన్ 500కి భూమి ఫ్రీగా ఇవ్వడానికి నువ్వెవడివి కోన్ కిస్కా గొట్టం గాడివి
-
డ్రైవర్ రాయుడు హత్యపై చంద్రబాబు సంచలన వీడియో
-
తండ్రి కంటే డేంజర్.. సిగ్గు శరం ఉందా కిరణ్..
-
సంతోష పడకు.. అన్ని ఆధారాలు ఉన్నాయ్.. కేసులు మూసేసినా.. నీ ఆట కట్టిస్తాం
-
జగన్ పంచ్.. నీ పనైపోయింది.. ఆశలు పెట్టుకోకు
-
బానిసలుగా ఉండమన్నారు ఒప్పుకోలేదని మాపై కక్షతో.. స్రవంతి సంచలన నిజాలు
-
కాంగ్రెస్ నుంచి కౌర్ సస్పెన్షన్
చండీగఢ్: పంజాబ్లో రూ.500 కోట్లు ఇచ్చిన వారికి ముఖ్యమంత్రి కుర్చీ దక్కుతుందంటూ సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపిన రాష్ట కాంగ్రెస్ నేత నవ్ జోత్ కౌర్ను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రజా వారియర్ సోమవారం ప్రకటించారు. అయితే, ఆలోపే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై కౌర్ మరో బాంబు పేల్చారు. తారన్ తరన్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి కర్ణబీర్ సింగ్ బుర్జ్ ఇద్దరు పార్టీ నేతలకు రూ.10 కోట్లు ఇచ్చారని సస్పెన్షన్కు ముందు ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలను బుర్జ్ వెంటనే ఖండించారు. సస్పెన్షన్ అనంతరం కౌర్ మాట్లాడుతూ పీసీసీ చీఫ్ వారియర్ పై నిప్పులు చెరిగారు. ఆయనకు కోర్టు పట్ల, ప్రజల పట్ల నిబద్ధత, నైతికత, బాధ్యత వంటివి ఏ కోశానా లేవంటూ దుయ్యబట్టారు. సీఎం కుర్చీకి సంబంధించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. ‘‘నా భర్త (పీసీసీ మాజీ చీఫ్, రాష్ట్ర మాజీ మంత్రి నవ్ జోత్ సింగ్ సిద్ధూ) ఏ ఇతర పార్టీ నుంచైనా సీఎం అభ్యర్థి అవుతారా అన్న మీడియా ప్రశ్నకు, అందుకు ఆఫర్ చేసేందుకు కావాల్సిన డబ్బులు మా దగ్గర లేవని మాత్రమే నేనన్నా’’ అని ఆమె ఎక్స్ పోస్టులో చెప్పుకొచ్చారు. నిజం చెప్పినందుకు కౌర్ పై కాంగ్రెస్ పార్టీ ఫత్వా జారీ చేసిందని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. -
ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
చంద్రబాబుకు కొత్త పేరు పెట్టి ఏకిపారేసిన నాగార్జున యాదవ్
-
సిట్ విచారణపై జోగి రమేష్ కొడుకు సంచలన కామెంట్స్
-
నా ఫోన్ లాక్కొని రోజంతా.. విచారణ పేరుతో వేధిస్తున్నారు
-
మంత్రి సంధ్యారాణి పీఏ బాధితురాలి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: మంత్రి సంధ్యారాణి పీఏ బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మంత్రి పీఏ సతీష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫిర్యాదు చేస్తే పోలీసులు నన్ను 24 గంటల పాటు విచారించారు. నా ఫోన్, ఇంటి దగ్గర ఉన్న పిల్లల ఫోన్లు లాక్కున్నారు’’ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పీఏ సతీష్, మంత్రి కొడుకు ఫోన్లు ఎందుకు తీసుకోలేదు’’ అంటూ ఆమె ప్రశ్నించింది.నిందితులను కనీసం విచారణ చేయకుండా బాధితరాలినే విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆమె వాపోయింది. ‘‘నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహాయకులను కూడా అనుమతించలేదు. ఆసుపత్రిలో పోలీసులు ఎవరితో మాట్లాడనివ్వలేదు. ఇంటి దగ్గర పిల్లల పరిస్థితి ఏంటని ఆందోళన చెందా. ఈ కేసు దర్యాప్తులో మంత్రి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలి’’ అని బాధితురాలు డిమాండ్ చేసింది.సతీష్ను అరెస్ట్ చేయాలి: మాజీ మంత్రి పుష్పశ్రీవాణిమంత్రి సంధ్యారాణి పీఏ సతీష్పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. సతీష్పై కేసు నమోదు చేయకుండా నిందితుడికి మంత్రి సంధ్యారాణి కొమ్ము కాయడం అన్యాయం. మంత్రి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది...కేసును తారుమారు చేయకుండా నిష్పక్ష పాతంగా పోలీసులు విచారణ చేపట్టాలి. పోలీసులు విచారణ పూర్తి కాకుండా వాయిస్, వాట్సాప్ చాటింగ్ మార్ఫింగ్ అని మంత్రి ఎలా చెప్తారు. సీఎంవో నుంచి పీఏను తొలగించాలని ఆదేశాలు వచ్చిన తరువాతే పీఏను తొలగించడం నిజం కాదా?’’ అంటూ పుష్పశ్రీవాణి మండిపడ్డారు. -
YSRCPకి రాజీనామా చేయడానికి గల కారణం.. ఎప్పటికీ జగనన్న భక్తులమే
-
నా ప్రాణాలు పోయినా.. నిన్ను మాత్రం.. కోటంరెడ్డికి నెల్లూరు మేయర్ భర్త ఛాలెంజ్
-
కోటంరెడ్డి మనుషులు వచ్చి.. నెల్లూరు మేయర్ సంచలన కామెంట్స్
-
షాడో సీఎం ఫ్లైట్ ఖర్చు ఎంతంటే..? కారుమూరి వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
భారత్ లో సింధ్ విలీనం..!? పాకకు బిగ్ షాక్..
-
అరె ఓ TV5 సాంబ...
-
అతడు మాస్టర్ మైండ్.. ఐబొమ్మ రవి గురించి సజ్జనార్ సంచలన నిజాలు
-
బీచ్లో భార్యాభర్తలు రెండు పెగ్గులేసుకునే కల్చర్ రావాలి
ఎంవీపీ కాలనీ: రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నెరెడ్కో నిర్వహించిన ‘వైజాగ్ ప్రోపర్టీ ఫెస్ట్–2025’లో సంచలన వ్యాఖ్యలు చేశారు. జూదాన్ని ప్రోత్సహించకుండా పర్యాటకం ఎలా అభివృద్ధి చెందుతుందని సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీ తాగడానికి పర్యాటకులెవరైనా విశాఖ బీచ్కు వస్తారా? అంటూ ప్రశ్నించారు. విశాఖ బీచ్లో భార్యాభర్తలు రెండు పెగ్గులేసుకునే కల్చర్ ఉండాలని, భర్త బీచ్లో కూర్చుని రెండు పెగ్గులేసుకుంటే భార్య ఐస్క్రీం తింటూ ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. అవేం లేకుండా ప్రభుత్వం పర్యాటకులను విశాఖ రమ్మంటే ఎందుకొస్తారని ప్ర«శ్నించారు. క్యాసినో, పబ్కల్చర్ విశాఖలో అభివృద్ధి కావాలంటే లిబరల్గా ఉండాలన్నారు. ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ పెడితే పర్యాటకం ఎప్పటికీ అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు. విశాఖలో ఇవేం లేకపోవడంతోనే ఏపీ, తెలంగాణ పర్యాటకులు గోవా, శ్రీలంక వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారన్నారు. ఇటీవల గోవా గవర్నర్ను కలవడానికి వెళ్లినప్పుడు అక్కడి కల్చర్ తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. రిస్ట్రిక్షన్స్ లేని గోవా తరహా పర్యాటక సంస్కృతిని విశాఖలో తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు. ఈ దిశగా కృషి చేయాలని వేదికపై ఉన్న ఎంపీ శ్రీభరత్, మంత్రి అనగాని సత్యప్రసాద్కు సూచించారు. విశాఖలో కొంత కాలంగా రియల్ ఎస్టేట్ దోపిడీ పెరిగిపోయిందన్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లే అవుట్లు పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నాయన్నారు. వాటి సమాచారం ప్రభుత్వం దగ్గర లేకపోతే తాను ఇస్తానన్నారు. -
న్యాయ నియామకాల్లో సంస్కరణలు తేవాలి
న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థపై సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో నియామకాలపై ప్రభుత్వాలకు పూర్తిస్థాయి నియంత్రణ ఉన్నప్పటికీ ఉత్తమైన జడ్జీలు కొందరైనా నియమితులయ్యే వారని తెలిపారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత వ్యవస్థను తరిచి చూసుకుని, లోపాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. న్యాయ నియామకాల్లో పారదర్శకత తప్పని సరి చేయాలన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్ రాజ్యాంగంపై ఏర్పాటు చేసిన ఉపన్యాస కార్యక్రమం ‘కర్తవ్యమ్’లో ఆయన మాట్లాడారు. న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులు, కొలీజియం వ్యవస్థ ఎదిగిన తీరును వివరించారు. ప్రభుత్వానికి న్యాయమూర్తుల నియామకంపై అధికారం లేకుండా చేయాలని పోరాడిన న్యాయ వ్యవస్థలో తానూ భాగస్వామిగా ఉన్నట్లు చెప్పారు. కానీ అది తాత్కాలిక పరిష్కారం మాత్రమేనన్నారు. వెనక్కి తిరిగి చూస్తే, తాము చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తునన్నారు. న్యాయ సంస్కరణలు, సివిల్ సర్వీస్ స్వతంత్రతను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్లమెంట్, ఎన్నికల కమిషన్లను సమాన వ్యవస్థలుగా గౌరవించాలన్నారు. ఈసీ అధికారులకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేయడం, పరుష వ్యాఖ్యలు చేయడం తనకు బాధ కలిగించిందని సాల్వే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అలా అగౌరవపర్చడం సరికాదని సాల్వే అభిప్రాయపడ్డారు. -
అది ప్రమాదం కాదు.. కూటమి హత్యే..!
-
‘ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారు’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన విషయాలు బయటపెట్టారు. కేశినేని చిన్నికి సంబంధించిన ఆధారాలను కొలికపూడి బయటపెట్టారు. రూ.5 కోట్లు తీసుకుని తనకు తిరువూరు టికెట్ ఇచ్చారన్న కొలికపూడి.. సంచలన ఆధారాలను బయటపెట్టారు.2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని నన్ను ఐదు కోట్లు అడిగాన్న కొలికపూడి.. తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్ఫర్ చేశారో ఆయన బయటపెట్టారు. ‘‘2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫ్రిబవరి 8న మరో రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫిబ్రవరి 14న రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. కేశినేని చిన్ని పీఏ మోహన్కు రూ. 50 లక్షలు.. గొల్లపూడిలో నా మిత్రుల ద్వారా రూ.3.5 కోట్లు ఇచ్చా.. ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం’’ అంటూ కొలికపూడి సంచలన పోస్టు పెట్టారు. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.మరోవైపు.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ‘‘తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు. నాపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువూరు వరకూ రావాల్సిన అవసరం లేదు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లాయి’’ అని చిన్ని వ్యాఖ్యానించారు. -
తాడోపేడో తేల్చుకుంటా.. కేశినేని చిన్నిపై కొలికపూడి ఫైర్
-
నీ రాక్షసానందం కోసం ఎంతకు దిగజారిపోయావు బాబు..
-
కాంగ్రెస్పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ అక్కడే కొట్టబోతుంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్లో కొట్టబోతుందన్న కేటీఆర్.. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్లో కొడతాం. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగస్థితిలో ఉన్నాడు. దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి’’ అంటూ సవాల్ విసిరారు. ‘‘రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ సీఎం కాబోతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం’’ అంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. -
కల్తీ మద్యం పై గోరంట్ల సంచలన వ్యాఖ్యలు
-
కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు
-
బాబుపై చురకలు.. జగన్ పై పరోక్ష ప్రశంసలు
-
చంద్రబాబు సర్కార్ పై రోజా ఫైర్
-
ఛీ.. తు.. సిగ్గు, శరం లేని సీఎం..! ఇంకెంత మంది తాళి తెంచుతావ్..!
-
రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావ్.. బాబుపై వెంకయ్య ఫైర్
-
బీఆర్ నాయుడు ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది
-
లిక్కర్ స్కామ్ అంతా అబద్ధమే.. ఆధారాలతో బయటపెట్టిన YSRCP MLA
-
TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక ప్రకటన
-
Big Question: టీడీపీ ఫైర్ బ్రాండ్.. చెప్పిన సంచలన నిజం
-
ప్లాన్తోనే ఎంజీబీఎస్ బస్టాండ్ను ముంచేశారు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: వచ్చే ఎన్నికల్లో రేవంత్రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయరంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గ ప్రజలు రేవంత్పై రగిలిపోతున్నారన్నారు. కేటీఆర్ సమక్షంలో కొడంగల్కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు.. బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ను బొంద పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశమన్నారు.‘‘కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ గెలవాలి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు పథకాన్ని రేవంత్ బంద్ చేస్తాడు. రేవంత్ రెడ్డి గురించి అందరి కంటే ఎక్కువ కొడంగల్ ప్రజలకే తెలుసు. రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ భూములను.. తొండలు గుడ్లు పెట్టని భూములంటూ రేవంత్ అవమానించాడు. కొడంగల్ రేవంత్రెడ్డి జాగీరా.. కొడంగల్కు రేవంత్రెడ్డి చక్రవర్తి కాదు. కొడంగల్ ప్రజల ఆగ్రహంలో వచ్చే ఎన్నికల్లో రేవంత్, కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుంది...తెలంగాణకు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. కొడంగల్కు తిరుపతిరెడ్డి ముఖ్యమంత్రి. వార్డు మెంబర్ కూడా కాని తిరుపతి రెడ్డికి.. కలెక్టర్, ఎస్పీ వంగి వంగి దండాలు పెడుతున్నారు. అన్నదమ్ములు జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రేవంత్, తిరుపతి రెడ్డిలు రిబ్బన్ కట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారమే ఎంబీబీఎస్ బస్టాండ్ను ముంచాడు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను భయపెట్టేందుకే ఒకేసారి 15గేట్లు తెరిచారు. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఎంబీబీఎస్ బస్టాండ్ మునిగింది. కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
నవమి నాటికి తేలకపోతే.. సజీవ సమాధి
సాక్షి, యాదాద్రి: మాజీ డీఎస్పీ దోమకొండ నళిని శుక్రవారం ఫేస్బుక్లో మరో ప్రకటన పోస్టు చేశారు. ఇది తన మరణ వాంగ్మూలంగా ఆమె పేర్కొన్నారు. నవమి నాటికి తన సరీ్వస్ సమస్యలు సీఎం రేవంత్రెడ్డి తేల్చకపోతే సజీవ సమాధి అవుతానన్నారు. ‘చాలామంది అభిమానులు నా జబ్బును ట్రీట్ చేస్తామని నన్ను సంప్రదిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో అత్యంత ప్రమాదకరమైంది. అలోపతిలో దీనికి స్టెరాయిడ్స్ వాడతారు. ఎక్కువ కాలం ఇవి వాడితే కాళ్లు, చేతులు వంకర్లుపోతాయి. అందుకే నేను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదం, పంచకర్మ, యోగ, యజ్ఞం వంటి వాటిని ఎంచుకున్నాను. కాబట్టే ఎనిమిదేళ్లయినా అంగవైకల్యం రాకుండా కాపాడుకున్నాను. నాకు ఈ వ్యాధి తీవ్రస్థాయిలో రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. రాష్ట్రపతి మెడల్ లక్ష్యంగా డైనమిక్ ఆఫీసర్గా పనిచేసిన నన్ను సస్పెండ్ చేయడం, వెంటాడి వేటాడటం నా అన్ని సమస్యలకు మూల కారణం. 21నెలల క్రితం నేనిచి్చన రిపోర్ట్పై ఇంకా చర్య తీసుకోకుండా సీఎం రేవంత్రెడ్డి నిర్లిప్తంగా ఉన్నారు. ఇది నన్ను మరింత ఒత్తిగికి గురిచేస్తోంది. ఇదే నా చావుకు దారి తీస్తుందేమో! ఏ ఆఫీసర్నైనా సస్పెండ్ చేస్తే 6 నెలల్లోపు ఎంక్వైరీ పూర్తి చేయాలి. అలా చేయకపోతే 7వ నెల నుంచి పూర్తి జీతం ఇవ్వాలి. ఈ పనిని ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ కూడా నా విషయం పట్టించుకోలేదు. నవమి నాటికి నా విషయం ఎటూ తేలకపోతే సజీవ సమాధి అవుతాను’అని తన పోస్టులో పేర్కొన్నారు. -
AI-171 విమాన ప్రమాదం ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
సూపర్ సిక్స్ అంటే పేదవాళ్ళును ఏడిపించటమేనా..!
-
TVK: విజయ్ సంచలన వ్యాఖ్యలు
కోలీవుడ్ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎల్టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించారాయన. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలో ప్రభాకరన్ మాస్టర్ మైండ్ అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా విజయ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రచార యాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శనివారం నాగపట్టణంలో జరిగిన టీవీకే ప్రచార సభలో విజయ్ భావోద్వేగంగా ప్రసంగించారు. ‘‘ఈళం తమిళులు మన సంతతి వాళ్లు. వాళ్లు శ్రీలంకలో ఉన్నా.. ప్రపంచంలో ఏమూల ఉన్నా సరే.. తమ నాయకుడ్ని కోల్పోయిన బాధలో ఉండి ఉంటారు. ఆయన(ప్రభాకరన్ను ఉద్దేశించి..) వాళ్లకు తల్లి లాంటి ప్రేమను పంచారు. శ్రీలంక తమిళుల కోసం మనం గొంతెత్తడం మన బాధ్యత’’ అని ప్రసంగించారు.నాగపట్టణం శ్రీలంక సమీపంలో ఉండడం.. ఈళం తమిళుల సమస్య కారణంగా మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితం కావడం వల్ల విజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో మత్స్యకారుల సమస్యలపైనా ఆయన మాట్లాడారు. ‘‘మేం డీఎంకేలా ప్రభుత్వంలా సుదీర్ఘమైన లేఖలు రాసి.. ఆపై మౌనంగా ఉండిపోం. మత్య్సకారుల సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. ఇది టీవీకే ప్రధాన అజెండా కూడా అని అన్నారు. మత్య్సకారుల జీవితాలు ఎంత ముఖ్యమో.. ఈలమ్ తమిళుల జీవితాలు కూడా మాకు అంతే ముఖ్యం అని అన్నారాయన. అయితే శ్రీలంక తమిళులకు విజయ్ మద్దతు ప్రకటించడం ఇదేం తొలిసారి కాదు. శ్రీలంక అంతర్యుద్ధ (2008 చివరి నుంచి 2009 మే వరకు) సమయంలో ఉత్తర శ్రీలంకలోని ముల్లివాయ్క్కాల్ ప్రాంతంలో సైన్యం చేతిలో తమిళులు ఊచకోతకు గురికావడం తీవ్ర దుమారం రేపింది. దీనికి నిరసగా చెన్నైలో జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమంలో విజయ్ పాల్గొని శ్రీలంక తమిళులకు సంఘీభావం ప్రకటించారు. అయితే ఆ సమయంలో శ్రీలంక తమిళులకు మద్దతు ఇవ్వడం అంటే ఎల్టీటీఈకి మద్దతు ఇచ్చినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. కానీ.. గతంలో కరుణానిధి సహా తమిళనాడుకు చెందిన ఏ రాజకీయ నేత కూడా నేరుగా ప్రభాకరన్పై ఈ స్థాయిలో ప్రశంసలు గుప్పించిన దాఖలాలు లేవు. ప్రభాకరన్ను తాను ఉగ్రవాదిగా చూడడని.. అయితే ఈళం తమిళుల కోసం ఎల్టీటీఈ లక్ష్యాలు గొప్పవే అయినా.. ఆచరించే పద్దతులు సరికావంటూ కరుణానిధి బహిరంగంగానే చెబుతుండేవారు. అలాంటి విజయ్ ఇప్పుడు బహిరంగంగా ప్రభాకరన్పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్షన్విజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ స్పందిస్తూ.. ప్రభాకరన్ LTTE అధినేతగా, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి అనే విషయం గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తిని పొగడటం భారత ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయడమే. పైగా ఎల్టీటీఈపై భారత ప్రభుత్వ నిషేధం ఉంది. అలాంటప్పుడు ఆ గ్రూప్ అధినేతను పొగడడం చట్టపరంగా, నైతికంగా అనుచితం అని మాణికం ఠాగూర్ అన్నారు.ఎల్టీటీఈ ప్రస్థానంLTTE (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం) అనేది 1976లో స్థాపితమైన ఒక సాయుధ సంస్థ. శ్రీలంకలో స్వతంత్ర తమిళ ఈళం ప్రాంతం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసింది. ఫలితంగా ఆ సంస్థకు, సైన్యానికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో వేలాది శరణార్థులుగా భారత్కు వచ్చారు. అయితే.. ఆ సమయంలో భారత ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (IPKF) పేరిట సైన్యాన్ని శ్రీలంకకు పంపించారు. మూడేళ్లపాటు అది ఆ సాయుధ సంస్థతో యుద్ధం చేసి 1990లో భారత్కు తిరిగి వచ్చేసింది. అయితే.. ఈ చర్యను ద్రోహంగా భావించిన ఎల్టీటీఐ ప్రతీకారం కోసం ఎదురు చూసింది. 1991లో శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన రాజీవ్ గాంధీ.. మానవ బాంబు జరిపిన ఆత్మాహుతి దాడిలో మరణించారు. ఈ ఘటన తర్వాత అప్పటి భారత ప్రభుత్వం ఎల్టీటీఈని నిషేధించింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు LTTE అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరియు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మన్ కలిసి కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. రాజీవ్ గాంధీని తామే హతమార్చినట్లు ఎల్టీటీఈ ఏనాడూ అధికారికంగా ఒప్పుకోలేదు. అలాగని ఖండించనూ లేదు. చివరకు 2009లో శ్రీలంక సైన్యం చేతిలో ఎల్టీటీఈ ఓడిపోవడమే కాకుండా.. ఆ గ్రూప్ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ హతమయ్యారు. అప్పటితో LTTE అంతరించిపోయింది. -
చేతకాని దద్దమ్మలు.. ప్రజలే మిమ్మల్ని ఈడ్చి ఈడ్చి కొడతారు
-
నన్ను చంపాలని చూస్తున్నారు..! రండి నా పవర్ ఏంటో చూపిస్తా..
-
మీలాంటి దుష్ట శక్తులనుండి ప్రజలను కాపాడాలని ఆ అప్పన్న స్వామిని వేడుకుంటున్నా
-
ఓట్ల దొంగలకు ఈసీ అండ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల దొంగలకు యథేచ్ఛగా సహకరిస్తోందని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరులను కాపాడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూ నీ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. గురువా రం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఓట్ల చోరీని బహిర్గతం చేస్తూ తెరపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఓటర్ల జాబితా నుంచి తమ పేర్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసినట్లుగా ఎన్నికల సంఘం చెబుతున్న వ్యక్తులు సైతం వేదికపైకి వచ్చారు. నిజానికి వారు ఎలాంటి దరఖాస్తు చేయలేదు. వారి పేరిట ఇంకెవరో దరఖాస్తు చేశారు. ఓట్ల చోరీపై తాను బయటపెట్టిన నిజాలు హైడ్రోజన్ బాంబు కాదని రాహుల్ వెల్లడించారు. త్వరలో నిజాలు బయటపెడతానని, బాంబు పేలుస్తానని అన్నారు. రాహుల్ ఏం మాట్లాడారంటే... ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్తో... ‘‘కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6,018 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్కు బలం ఉన్న పోలింగ్ బూత్లను లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడే ఓట్లను తొలగించేందుకు కుట్రలు సాగించారు. ఓట్లు అత్యధికంగా తొలగింపునకు గురైన టాప్–10 బూత్లు కాంగ్రెస్కు బలం ఉన్నవే. 2018లో ఈ పదింటిలో ఎనిమిది బూత్లను కాంగ్రెస్ గెలుచుకుంది. మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ సాయంతో 6,850 మంది ఓటర్లను మోసపూరితంగా చేర్చారు. ఇదే సాఫ్ట్వేర్ను హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్లోనూ ఉపయోగించారు. దానిపై మావద్ద ఆధారాలున్నాయి. సీఐడీకి ఆధారాలివ్వడానికి భయమెందుకు? కర్ణాటకలో ఓట్ల చోరీపై ఫిర్యాదు చేశాం. దీనిపై రాష్ట్ర సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ఆధారాలు ఇవ్వాలని అధికారులు 18 నెలల్లో ఎన్నికల సంఘానికి 18 లేఖలు రాస్తే ఇప్పటికీ స్పందించలేదు. ఎన్నికల సంఘం ఆధారాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఆధారాలిస్తే ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నది ఎవరో తెలిసిపోతుంది కాబట్టి భయపడుతున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇప్పటికైనా నోరువిప్పాలి. ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించాలి. సీఐడీ దర్యాప్తును అడ్డుకొనే ప్రయత్నం చేయొద్దు. సీఐడీకి వారం రోజుల్లోగా ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాజ్యాంగాన్ని హత్య చేయడానికి ఎన్నికల సంఘం సహకరిస్తున్నట్లేనని భావిస్తాం. ఓట్ల దొంగతనాన్ని ఇకనైనా ఆపాలని కోరుతున్నాం. వ్యతిరేకుల ఓట్లే టార్గెట్ మన దేశంలో ఎన్నికలను ఎలా రిగ్గింగ్ చేస్తున్నారో కొన్ని రోజులుగా యువతకు తెలియజేస్తున్నా. అందులో ఈరోజు మరో మైలురాయి. ఓట్ల తొలగింపు అనేది అనుకోకుండా జరుగుతున్నది కాదు. దేశవ్యాప్తంగా వ్యతిరేకుల ఓట్లను ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేస్తున్నారు. మైనార్టీలు, దళితుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారు. ఇందుకోసం సాఫ్ట్వేర్ను వాడుకోవడంతోపాటు తప్పుడు దర ఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను వాడుకుంటున్నారు. ప్రతిపక్షాలకు బలం ఉన్న ప్రాంతాల్లో లక్షలాది ఓట్లు గల్లంతవుతున్నాయి. ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తును పూరించడం సాఫ్ట్వేర్తో సెకండ్లలోనే పూర్తయిపోతోంది. తెల్లవారుజామునే ఇది జరుగుతోంది. మరోవైపు నకిలీ వ్యక్తులు అసలైన ఓటర్ల ముసుగులో రంగ ప్రవేశం చేస్తున్నారు. తమ ఓట్లు తొలగించాలంటూ తప్పుడు పత్రాలతో దరఖాస్తులు సమరి్పస్తున్నారు. ఓట్ల చోరీపై మా దగ్గర 100 శాతం కచ్చితమైన ఆధారాలున్నాయి. నేను నా దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రేమిస్తున్నా. వాటిని కాపాడుకోవడానికి పోరాటం సాగిస్తా’’ అని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలు వాటి విధులు సరిగ్గా నిర్వర్తించడం లేదు. అందుకే న్యాయ వ్యవస్థ సహా ఇతర విభాగాలు జోక్యం చేసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరులను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేవారిని కాపాడుతున్నారు. నేను ప్రతిపక్ష నేతను. ఈ విషయం మామూలుగా చెప్పడం లేదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కొందరు హైజాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి. నేను నిజాన్ని మాత్రమే చూపించగలను. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఖూనీ అవుతున్నాయని ప్రజలు అర్థం చేసుకున్నరోజు వాటిని కాపాడుకోవడానికి వారే నడుం బిగిస్తారు. అందుకు నేను పునాది వేస్తున్నా. ఈ ఉద్యమం కొనసాగుతుంది. -
అంబేద్కర్ రాజ్యాంగం దిండు కింద పెట్టి.. లోకేష్ రాజ్యాంగం నడుపుతున్నారు
-
నీ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడదు
-
బాబు మెడికల్ మాఫియా.. అమ్మేయడానికి మీరెవరు? బాబుపై మార్గాని సీరియస్
-
జూ ఎన్టీఆర్ అంటే లోకేష్ కి అందుకే భయం..!
-
రామన్నను ఓడించడానికి హరీష్ కుట్రలు
-
ఆ ఆరడుగుల బుల్లెట్టే నాకు గాయం చేసింది: కవిత
వ్యక్తిగత లబ్ది కోరుకునే కొందరు పార్టీ నుంచి తనను బయటపడేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బుధవారం జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘హరీష్రావు, సంతోష్రావు ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ కాదు. ప్రతీ సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. ఆయన బీజేపీతోనూ టచ్లో ఉన్నారు. హరీషన్నపై మొదటిరోజు మీడియాలో ఆరోపణలు వస్తాయి. రెండో రోజు నుంచి హరీష్రావు పేరు కనిపించదు. రేవంత్ రెడ్డి గురించి కూడా ఏనాడూ హరీష్రావు గురించి మాట్లాడలేదు. మ్యాచ్ఫిక్సింగ్ జరగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?. రేవంత్రెెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.హరీష్రావు మొదటి నుంచి బీఆర్ఎస్ లేరు. పార్టీ మనకెందుకు మామా అని కేసీఆర్కు చెప్పి.. వ్యాపారం చేసే ఆలోచన కూడా చేశారు. పార్టీ పెట్టిన తర్వాత 8, 9 నెలలకే చేరారు. పార్టీకి వెన్నుపోటు పొడుదాం అని గతంలోనూ ఆయన అనుకున్నారు. కేటీఆర్ను బతిమాలి పార్టీలో కొనసాగారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ మేకర్. ఆయనే సమస్య సృష్టించి.. ఆయనే మాఫీ చేసినట్లు నటిస్తారు. ఎలాగైనా కల్వకుంట్ల ఫ్యామిలీలో చిచ్చుపెట్టి పార్టీని సొంతం చేసుకోవాలనే కుట్రలు చేస్తున్నారు. హరీష్రావును నమ్ముకుని మైనంపల్లి, ఈటల, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు.. ఇలా ఎందరో పార్టీని వీడారు. 2018 ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతి డబ్బులనే 25 మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండ్గా పంచారు. ఆయన ఫండింగ్ వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను(కేటీఆర్ను ఉద్దేశించి.) ఓడించడానికి హరీష్ కుట్ర చేశారు. సిరిసిల్లకు రూ.60 లక్షలు పంపించారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై అర్ధరాత్రి దాకా చర్చ జరిగింది. ‘‘ఓ హరీష్రావు ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఓ పొగడ్తలు గుప్పిస్తున్నారు. కానీ, ఆ ఆరడుగుల బుల్లెట్టు నాకు గాయం చేసింది. తర్వాత మీ వంతే. రామన్న.. మళ్లీ రేపు మీపై కూడా కుట్ర జరగొచ్చు’’ అని అన్నారామె. సంతోష్రావు అనే వ్యక్తి చెప్పులో రాయి.. చెవిలో జోరీగా టైప్ అని అభివర్ణించారు. సంతోష్కు ధనదాహం చాలా ఎక్కువ. హరిత హరం పేరిట సినిమా హీరోలతో ఫోజులిప్పించి.. అడవులను కొట్టేయాలని చూశారు. రామన్న నియోజకవర్గం నేరెళ్లలో ఇసుక మాఫియా దళితులను చిత్రహింసలు పెట్టింది. చేయించింది అంతా సంతోష్రావు.. పేరు మాత్రం కేటీఆర్కు. పోచంపల్లి శ్రీనివాస్ వేల కోట్ల వ్యాపారం ఎలా చేస్తున్నారు?. సంతోష్రావు క్లాస్మేట్ కావడమే అందుకు కారణం. సంతోష్రావు వల్లే మాకు సంబంధించిన టీవీ, పేపర్లలోనూ నన్ను చూపించడం లేదు. సంతోష్, హరీష్ గ్యాంగులు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయి. హరీషన్న, సంతోషన్నలు మేకవన్నె పులులు. వాళ్లను పక్కనపెడితే పార్టీ బతుకుతుంది’’ అని కవిత అన్నారు. -
సస్పెండైన కవిత నిజంగానే కొత్త పార్టీ పెడతారా?
-
చింతమనేని నిన్ను చంపమన్నాడని.. వికెట్స్,బ్యాట్స్ పట్టుకొని..
-
రష్యాతో కాదు.. భారత్ ఉండాల్సింది మాతోనే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..మరోసారి భారత్పై నోరు పారేసుకున్నారు. భారత్-రష్యా సంబంధాలపై తాజాగా విమర్శలు గుప్పించారు. భారత్ ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కాదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తియాంజిన్ (Tianjin) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా ఈ భేటీని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ.. పీటర్ నవారో తీవ్ర విమర్శలు చేశారు.వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో నవారో మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీ.. పుతిన్, షీ జిన్పింగ్లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ, భారత్ కలిసి ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కానేకాదు అని అన్నారు.అమెరికా విధించిన టారిఫ్లపై భారత్ స్పందించిన తీరు.. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు కొనసాగించడాన్ని నవారో తీవ్రంగా విమర్శించారు. భారత్ ముడి చమురు కొనుగోలు ద్వారా పుతిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది అని మరోసారి ఆరోపించారు. భారత్ను సుంకాల మహరాజుగా అభివర్ణించిన ఆయన.. రష్యా చమురు కొనుగోలు విషయంలో వాస్తవాల్ని దాచిపెడుతోందని అన్నారు. తాజాగా.. భారత్లో కుల వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఓ వర్గం సాధారణ ప్రజల ఖర్చుతో లాభపడుతోంది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఇండియన్ రిఫైనరీలు రష్యా రాయితీ ధరకు ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, ఇది "క్రెమ్లిన్ లాండ్రోమాట్"లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెమ్లిన్ లాండ్రోమాట్ ఆరోపణకు అర్థం ఏంటంటే.. భారత రిఫైనరీలు రష్యా డబ్బును "శుభ్రం" చేసి, ప్రపంచ మార్కెట్లో తిరిగి ప్రవేశపెడుతున్నాయి అని. తద్వారా రష్యా చమురు అమ్మకాలు కొనసాగుతాయని, పుతిన్కు ఆర్థిక లాభం కలుగుతుందని, ఇది ప్రత్యక్షంగా రష్యా యుద్ధ వ్యయానికి నిధులు సమకూర్చే మార్గంగా మారుతుందని ఆయన అభిప్రాయం.అయితే.. భారత్ మాత్రం తన చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై ధర పరిమితి విధించాయి. ఈ నేపథ్యంలో భారత్ రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. మిగతా దేశాల్లాగే జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని, దేశీయ మార్కెట్ను స్థిరంగా ఉంచేందుకు ఇది అవసరమని భారత్ అంటోంది. ఈ క్రమంలోనే అమెరికా విధించిన 50 శాతం సుంకాలను అన్యాయమని భారత్ అభిప్రాయపడుతోంది. -
విడాకులపై క్లారిటీ ఇచ్చిన గౌతమీ.. టాలీవుడ్ హీరోపై భార్య సంచలన ఆరోపణలు..!
-
పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు.. లైవ్ లో బొమ్మేసి ఏకిపారేసిన పేర్ని నాని
-
నోటికి అన్నమే కదా తింటున్నావ్.. పవన్ పై జాడ శ్రావణ్ సంచలన వ్యాఖ్యలు
-
నేను గెలవడం బిగ్ బాస్ టీం కి ఇష్టమే లేదు.. కౌశల్ సంచలన కామెంట్లు
-
అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్
-
వంగవీటి రంగా హత్యపై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి మోహన రంగాను ప్రభుత్వంతోనే చంపించారని అన్నారాయన. ఆరుగోలనులో సోమవారం రంగా విగ్రహ ఆవిష్కరణ సభలో బొలిశెట్టి మాట్లాడుతూ.. తనకు ప్రాణ రక్షణ కల్పించండి అని రంగా నిరాహార దీక్ష చేశారు. అలాంటి సమయంలో కొంత మంది నాయకులు ప్రభుత్వంతోనే ఆయన్ని చంపించారు అని అన్నారు. బొలిశెట్టి వ్యాఖ్యలతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం ఆ కామెంట్లపై చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. రంగా హత్య సమయంలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. విజయవాడలో నిరహార దీక్షలో ఉన్న రంగాను 1988 డిసెంబర్ 26న కొందరు దుండగులు స్వామిమాలలో వచ్చి హత్య చేశారు. ఈ ఘటన తర్వాత విజయవాడలో తీవ్ర అల్లర్లు చెలరేగగా.. 40 రోజులపాటు కర్ఫ్యూ కొనసాగింది. ఆయన హత్య రాజకీయ, కుల, సామాజిక నేపథ్యంతోనే జరిగిందనే చర్చా ఇప్పటికీ నడుస్తోంది. -
రాయలేని భాషలో జూ ఎన్టీఆర్ ను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే
-
బాబు నీకు ఇదే ఆఖరి ఎలక్షన్..!
-
మీ ట్రాప్ లో పడం బాబు.. రీపోలింగ్ పై అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
-
ఓటు వేయకుండానే వేలు మీద ఇంకు వేసి పంపారు.. పులివెందుల ఓటర్లు సంచలన నిజాలు
-
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఒళ్లుబలుపు వ్యాఖ్యలు
-
నాకు ఏమైనా జరిగితే లోకేశ్ దే బాధ్యత: S.V సతీష్ రెడ్డి
-
మాటలు తగ్గించి.. పని చెయ్.. రేవంత్ పై షాకింగ్ కామెంట్స్


