కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి | Mla Gudem Mahipal Reddy Made Sensational Comments | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Jan 18 2026 8:19 PM | Updated on Jan 18 2026 8:26 PM

Mla Gudem Mahipal Reddy Made Sensational Comments

సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్‌లో ఉండటం వల్ల ఎలాంటి లాభం లేదంటూ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పటాన్ చెరు జీఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో తన అనుచరులతో  ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ వ్యాఖ్యానించారు.

మూడు సార్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉంది. పటాన్ చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటిల్లోని 104 కౌన్సిలర్లను గెలిపించేందుకు విభాగాల వారిగా పని చేద్దామని మహిపాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement