సాక్షి, చిత్తూరు జిల్లా: ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత చూపుతున్నారంటూ జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు చేశారు. గెలిపించేటప్పుడు కావాలి కానీ.. అధికారంలో ఉండకూడదా? అంటూ ప్రశ్నించారు. మేము బానిసలుగా ఉండాలా? ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు. కొందరిలో ఎస్సీలంటే చులకన భావం ఉందన్న థామస్.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి.. కానీ ఎస్సీ ఎమ్మెల్యేలకు అధికారంలో ఉండకూడదు.. తొక్కేయాలా? ఇదెక్కడి న్యాయం. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎస్సీలు కాళ్లు పట్టాలి.. వారు బానిసలుగా ఉండాలి అన్న భావన కరెక్ట్ కాదు’’ అంటూ థామస్ వ్యాఖ్యానించారు.


