కర్నూలు నగరంలోని రాంబొట్ల దేవాలయ సమీపం కుమ్మరిగేరి నాగులకట్ట వద్ద రావిచెట్టుకు కన్ను రూపంలో ఏర్పడిన ఆకృతి విశేషంగా ఆకర్శిస్తోంది.
ఈ చెట్టుకు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. రావిచెట్టును దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తూ ప్రజలు నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు.
ఈ నేపథ్యంలో చెట్టుకున్న ఓ కొమ్మకు మనిషిని పోలిన విధంగా కన్ను ఆకారం ఏర్పడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్థానిక చిన్నారులు దీన్ని గమనించి కాలనీవాసులకు చెప్పడంతో వారి ద్వారా విషయం నగరమంతటా పాకుతోంది.
నగర ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి రావిచెట్టును దర్శించుకుంటున్నారు. కాల మహిమ అని పలువురు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరికొందరు ఈ దృశ్యాన్ని తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఫొటోలు– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


