School teacher
-
సెలవు లేదన్న హెడ్మాస్టర్.. లెక్కల టీచర్ ఏం చేశారంటే?
భువనేశ్వర్: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు తిరస్కరించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సెలవివ్వడం కుదరదంటూ తెగేసి చెప్పారు. పాపం ఆ ఉపాధ్యాయుడు విధిలేక చేతికి ఐవీ డిప్ సెలైన్ పెట్టుకునే విధులకు హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం విషమించడం చూసి తోటి వారే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. బొలంగీర్ ప్రభుత్వ పాఠశాలలో విజయలక్ష్మి ప్రధాన్ హెడ్మాస్టర్ కాగా, ప్రకాశ్ భోయి గణితం టీచర్. ఇటీవల తన తాత అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన అనంతరం ప్రకాశ్ ఆరోగ్యం దెబ్బతింది. విధులకు హాజరు కాలేనందున, సెలవు ఇప్పించమంటూ ఆయన ప్రధానోపాధ్యాయినికి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి, మ్యాథ్స్ టీచర్ అవసరం ఎంతో ఉంటుందని చెబుతూ ఆమె ఆ వినతిని తిరస్కరించారు.అయితే, ఎన్ని సార్లు కోరినా హెడ్మాస్టర్ వినిపించుకోకపోవడంతో ప్రకాశ్ భోయి చేతికి సెలైన్ పెట్టుకునే విధులకు వచ్చారు. ఆయన పరిస్థితి చూసి తోటి టీచర్లే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పటన్గఢ్ బ్లాక్ విద్యాధికారి(బీఈవో) ప్రసాద్ మాఝి స్పందించారు. కాజువల్ లీవ్ కోసం ప్రకాశ్ భోయి పంపించిన దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ ప్రధాన్ ఎందుకు తిరస్కరించారనే విషయమై విచారణ చేపట్టామన్నారు. ఆమెదే తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. #ମିଳିଲାନି_ଛୁଟି #ସାଲାଇନ୍_ଧରି_ସ୍କୁଲରେ_ଶିକ୍ଷକଦେହ ଖରାପ ସତ୍ତ୍ବେ ମିଳିଲାନି ଛୁଟି। ମାନିଲେନି ପ୍ରିନ୍ସିପାଲ୍, ଶିକ୍ଷକ ହେଲେ ଗୁରୁତର। ସାଲାଇନ୍ ଲଗାଇ ସ୍କୁଲ ଦୁଆରେ ଛାଡ଼ିଲେ ପରିବାର। ଦେଖନ୍ତୁ ଏ ଦୃଶ୍ୟକୁ, ସ୍କୁଲ ଦୁଆରେ ଛିଡ଼ା ହୋଇଛନ୍ତି ଶିକ୍ଷକ। #Teacher #Leave #Saline #Controversy #Balangir #OTV pic.twitter.com/tlnV7Sxlvj— ଓଟିଭି (@otvkhabar) March 8, 2025 -
పుదుచ్చేరిలో తీవ్ర ఉద్రిక్తత.. స్కూల్ సీల్ చేసిన కలెక్టర్
కడలూరు: పుదుచ్చేరిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. బాలికపై ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనలకు దిగారు. పుదుచ్చేరి-కడలూరు రోడ్డుపైకి నిరసనకారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.వివరాల ప్రకారం.. తలవకుప్పంలో ఓ బాలికను ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో బాధితురాలు స్కూల్కు వెళ్లేందుకు భయంతో వణికిపోయింది. దీంతో, కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం భారీ సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకున్నారు. టీచర్ను చితకబాదారు. పాఠశాలలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అనంతరం, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.#JUSTIN ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் பொதுமக்கள் தர்ம அடி கொடுத்து போலீசில் ஒப்படைத்தனர்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/3viBaLMA2j— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025అంతటితో ఆగకుండా.. పుదుచ్చేరి-కడలూరు రోడ్డును నిరసనకారులు బ్లాక్ చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో, పోలీసుల తీరుపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు నిరసనలను మరింత ఉధృతం చేశారు. పాఠశాల యాజమాన్యం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో దాదాపు నాలుగు గంటల ట్రాఫిక్ స్థంభించిపోయింది. అర్ధరాత్రి వరకు రోడ్లపైనే నిరసనలు తెలిపారు. #JUSTIN புதுச்சேரியில் ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை பள்ளியை அடித்து நொறுக்கிய போராட்டக்காரர்கள்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/yMVcvBXOKP— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025ఈ నేపథ్యంలో పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్ సెల్వం, కలెక్టర్ కులోత్తుంగన్, సీనియర్ పోలీసు అధికారులు నిరసనకారులతో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా పాఠశాలను సీల్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం, రాత్రి జారీ చేసిన ఉత్తర్వులో పాఠశాలలో శనివారం జరగాల్సిన పబ్లిక్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.புதுச்சேரியில் தவளக்குப்பம் அருகே, தனியார் பள்ளியில் மாணவிக்கு பாலியல் தொல்லை.மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் மீது வழக்கு பதியவில்லை என பெற்றோர் குற்றச்சாட்டு. @LGov_Puducherry pic.twitter.com/Zx9FHqQVqJ— Dhivya Marunthiah (@DhivCM) February 14, 2025 -
స్కూలుకు ఆలస్యంగా వచ్చాడని కొట్టినందుకు.. హెడ్మాస్టర్ను కాల్చి చంపాడు!
ఛతర్పూర్: స్కూలుకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థి(17)ని దండించడమే ఆ హెడ్ మాస్టర్ పాలిట శాపమైంది. పగబట్టిన విద్యార్థి బాత్రూంలోకి వెళ్తున్న హెడ్ మాస్టర్ను వెంబడించి వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపాడు. హెడ్ మాస్టర్ ద్విచక్ర వాహనంపై పరారైన అతడిని పోలీసులు పట్టుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ధమోరా ప్రభుత్వ హయ్యార్ సెకండరీ స్కూల్లో చోటుచేసుకుంది. ధిలాపూర్ గ్రామంలోని ధమోరా స్కూల్లో చదువుకునే ఓ విద్యార్థి తరచూ ఆలస్యంగా క్లాసులకు వస్తుంటాడు. శుక్రవారం కూడా ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయుడు సురేంద్ర కుమార్ సక్సేనా(55) నిందితుడిని, మరో విద్యార్థిని కొట్టారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్కూల్ ఆవరణలోని బాత్ రూంకి వెళ్తుండగా సక్సేనాను నిందితుడు అనుసరించాడు. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీని సక్సేనా తలకు గురిపెట్టి కాల్చాడు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు సక్సేనాకు చెందిన ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. తుపాకీ శబ్దం విని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కి పడ్డారు. ఉపాధ్యాయులు వచ్చి చూడగా సక్సేనా రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యూపీ సరిహద్దులకు సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. హత్యకు వాడిన తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తరచూ స్కూలుకు ఆలస్యంగా వస్తుంటాడని, సరిగ్గా చదువుకునేవాడు కాదని, ఉపాధ్యాయుల మాటలను లక్ష్య పెట్టే వాడు కాదని దర్యాప్తులో తేలింది. ‘అతనొక్కడే కాల్పులు జరిపాడు. అతడొక్కడే నిందితుడనేది స్పష్టమైంది. మరో విద్యార్థి అఘాయిత్యాన్ని ఆపేందుకు మాత్రమే బాత్రూం వద్దకు వచ్చాడు. అనంతరం అతడు ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత అతడు భయంతో ఎటో వెళ్లిపోయాడు. నిందితుడిచ్చిన సమాచారం మేరకు తుపాకీ సమకూర్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నాం’అని ఎస్పీ ఆగమ్ జైన్ చెప్పారు. -
ఇంట్లో చెబితే చంపేస్తానని చిన్నారికి టీచర్ బెదిరింపులు
-
టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్
టక్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎడమ చెవిపై గట్టిగా కొట్టడంతో కర్ణభేరి పగిలింది. దాంతో ఆ చెవి శాశ్వతంగా వినికిడి సామర్థ్యం కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజీతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో టీచర్పై పిల్లాడి తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. నిర్లక్ష్యంగా సమాధానమిచి్చన టీచర్ను తల్లిదండ్రులు పోలీసుల ఎదుట చితక్కొట్టారు. కంప్యూటర్ సబ్జెక్ట్ బోధించే సందేశ్ బోసాలే సెప్టెంబర్ 27న ఆరో తరగతి గదిలో ఓ విద్యార్థి టక్ చేసుకోకపోవడం గమనించి కోపంతో కొట్టాడు. మెడ పట్టి క్లాసు నుంచి గెంటేశాడు. దెబ్బలకు బాలుని ముక్కు, ఎడమ చెవి నుంచి రక్తం కారింది. ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఎడమ చెవి కర్ణభేరి పగిలిందని వైద్యుడు చెప్పాడు. కుటుంబసభ్యులు స్కూలు యాజమాన్యాన్ని నిలదీసినా తమకు సంబంధం లేదన్నారు. దాంతో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన సలహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి ఇరు వర్గాలను స్కూలుకు పిలిపించారు. అప్పటికే కోపంతో ఉన్న కుటుంబసభ్యులు, నవనిర్మాణ్ సేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే టీచర్ను చితకబాదారు. महाराष्ट्र के पुणे में पहले टीचर ने छात्र को पीटा, फिर मनसे और छात्र के परिजनों ने टीचर को पीटा! केस दर्ज छात्र का शर्ट इन नहीं था pic.twitter.com/NZ5fwgTX8R— Avinash Tiwari (@TaviJournalist) October 6, 2024 -
యల్లనూరులో కీచక టీచర్
యల్లనూరు: తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్నో ఆశలతో పాఠశాలలకు పంపుతుంటారు. అలాంటి పిల్లలకు విద్యాబుద్ధులు నేరి్పంచి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్ కట్టుతప్పాడు. అభం శుభం తెలియని విద్యార్థినులను వేధిస్తూ పైశాచికానందం పొందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబంధించిన వివరాలిలా.. మండలంలోని చిలమకూరు మోడల్ స్కూల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా భాస్కర్నాయక్ పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఇతను 8వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాకకూడని చోట తాకుతూ వికృతానందం పొందుతున్నాడు. ఈ క్రమంలో విషయాన్ని పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆగ్రహం చెందిన వారు.. వారం క్రితం పాఠశాలకు చేరుకుని ఎంఈఓ చంద్రశేఖర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహేష్ను నిలదీశారు. అయితే, విషయం బయటకు తెలియకుండా తల్లిదండ్రులకు వారు నచ్చజెప్పారు. స్థానిక అధికారుల ఫిర్యాదు మేరకు భాస్కర్నాయక్పై డీఈఓ వరలక్ష్మి, మోడల్ స్కూల్ ఏడీ నాగరాజు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి విధులకు రావొద్దని ఆదేశించారు. వేరే చోటుకు బదిలీ చేసుకోవాలని తెలియజేసినట్లు సమాచారం. అయితే, భాస్కర్నాయక్ను విధుల నుంచి తొలగించాలని విద్యారి్థనుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ మహేష్ను సంప్రదించగా, వారం రోజుల క్రితం ఘటన జరిగినట్లు తెలిపారు. అప్పటి నుంచి భాస్కర్ నాయక్ను విధులకు రానివ్వలేదని చెప్పారు. -
టీచర్ల ‘సర్దుబాటు’పై కొత్త మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ‘పని సర్దుబాటు’ బదిలీలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్దుబాటు ప్రక్రియను సోమవారం నుంచి ఈనెల 14వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవీ మార్గదర్శకాలు.. » ఒకే సబ్జెక్టుకు సంబంధించి అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లు (ఎస్ఏ), ఎస్జీటీలను సర్దుబాటు చేయాలి. మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఇతర సబ్జెక్టుల ప్రకారం, వారి మెథడాలజీల మేరకు సర్దుబాటు చేయాలి » అర్హత గల మిగులు ఎస్జీటీలు, సంబంధిత డిగ్రీ, బీఈడీ మెథడాలజీని ప్రామాణికంగా తీసుకుని ప్రీ హైస్కూల్, హైసూ్కల్స్లో సర్దుబాటు చేస్తారు » ఒక స్కూల్లో ఒకటికంటే ఎక్కువ మంది ఎస్ఏ (పీడీ) లేదా పీఈటీ ఉన్నవారిని గుర్తించి అదనపు సిబ్బందిని లేని స్కూళ్లకు పంపిస్తారు » ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు సర్దుబాటులో ప్రాధాన్యం ఇస్తారు » యూపీ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ 98 కంటే తక్కువ ఉంటే 3 నుంచి 8 తరగతులు, 1 – 2 తరగతులను విడివిడిగా వర్గీకరించి టీచర్లను సర్దుబాటు చేస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో పాత నిబంధనల ప్రకారమే సద్దుబాటు చేస్తారు. » కొత్తగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించినట్లయితే వారిని అవరోహణ క్రమంలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు » ఎస్ఏ (పీడీ), పీఈటీలను ఈ సేవలు లేని స్కూళ్లకు పంపిస్తారు రెండు దశల్లో సర్దుబాటు కొత్త నిబంధనల ప్రకారం రెండు దశల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ఉంటుంది. మొదటి దశలో మండలంలోని ఒకే మేనేజ్మెంట్ కింద ఉన్న స్కూళ్లకు, ఇంటర్ సబ్జెక్టుకు సంబంధించి అదే మండలానికి, మండల పరిధిలోని అర్హత కలిగిన అదే మండల పరిధిలోని స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు. ఇంకా మిగులు ఉపాధ్యాయులు ఉంటే ఇంటర్ మేనేజ్మెంట్ కింద రెండో దశలో డివిజన్ స్థాయిలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒకే సబ్జెక్టు ఉన్నవారికి అదే డివిజన్లో, డివిజన్లోని ఇంటర్ సబ్జెక్ట్, ఎస్జీటీలను డివిజన్ పరిధిలో స్కూళ్లకు సర్దుబాటు చేస్తారు. కేడర్ సీనియారిటీలో అత్యంత జూనియర్ను మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తిస్తారు. ఎక్కడ సబ్జెక్టు టీచర్, ఎస్జీటీలు లేరో ఆ స్కూల్కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.పాత నిబంధనలే కొత్తగాపాఠశాల విద్యా శాఖ ఆదివారం ప్రకటించిన మార్గదర్శకాల్లో ‘కేడర్ సీనియారిటీ’ మినహా మిగిలినవన్నీ పాతవే. తొలుత ఈనెల 9న ఒకసారి మార్గదర్శకాలు విడుదల చేయగా, ఉపాధ్యాయవర్గాలు పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తాయి. పలు సూచనలు చేశాయి. దీంతో మార్గదర్శకాల్లో మార్పులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం సర్దుబాటు ప్రక్రియ చేపట్టనుండగా ఆదివారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో అన్నీ పాతవే ఉన్నాయి. వాటినే కొత్తగా ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని, మరెందుకు చర్చలకు పిలిచారని ప్రశి్నస్తున్నాయి. -
కాసరగోడులో లవ్ జిహాద్?
యశవంతపుర: మంగళూరు వద్ద కేరళ సరిహద్దుల్లో కాసరగోడులోని ప్రైవేట్ స్కూలులో టీచర్ అయిన నేహా, యువకుడు తన్వీర్ మిర్థాద్లు ప్రేమించుకుని కొన్ని రోజుల కిందట వెళ్లిపోయారు. ఇప్పుడు స్థానిక పోలీసుల ముందు హాజరయ్యారు. నేహ ఇష్ట ప్రకారం ప్రేమించి అతనితో వెళ్లిపోయినట్లు చెప్పింది. తాము 25న రిజిస్టర్ పెళ్లి చేసుకున్నట్లు పత్రాలను చూపించారు. ఇది లవ్ జిహాద్ అని, ఒక వర్గం అమ్మాయిలను టార్గెట్ చేశారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. తమ కూతురిని తమతో పంపాలని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. కానీ ఆమె ప్రియునితోనే ఉంటానని స్పష్టంచేసింది. -
ML Ashwini: ఆరు భాషలు నిలబెట్టాయి
భాష విజయానికి సాధనం. రాజకీయాల్లో భాషతో ఆకర్షించేవారు వేగంగా పైమెట్టు మీదకు చేరుతారు. అయితే ఆ రంగంలో బహుభాషలతో ఆకట్టుకునే మహిళలు తక్కువ. కాని సామాన్య టీచరైన ఎం.ఎల్.అశ్విని తనకు వచ్చిన ఆరు భాషల వల్ల జన సామాన్యంలో చొచ్చుకుపోతూ బిజెపి అధినాయకత్వాన్ని మెప్పించింది. కేరళలో మహామహులు పోటీపడిన కాసర్గోడ్ పార్లమెంట్ స్థానానికి పార్టీ ఆమెను నిలబెట్టింది. అశ్విని పరిచయం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బిజెపి విడుదల చేసిన కేరళ అభ్యర్థుల్లో కాసరగోడ్ అభ్యర్థి పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అభ్యర్థి పూర్వాశ్రమంలో ఒక మామూలు స్కూల్ టీచర్. ఆ తర్వాత ఆమె ఉంటున్న ఊరు మంజేశ్వరకు కేవలం బ్లాక్ పంచాయతీ మెంబర్. పార్టీలో కేవలం మహిళా మోర్చా జాతీయస్థాయి సభ్యురాలు. అయినా సరే ఆమెకే పార్టీ అధిష్టానం సీటు ఇచ్చింది. దానికి కారణం ఆమెకు తెలిసిన ఆరు భాషలు. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్. ఆమె పేరు ఎం.ఎల్.అశ్విని. భాషతో గెలిచింది కాసరగోడ మంగుళూరుకు దగ్గరగా ఉంటుంది. కన్నడిగులు కూడా ఇక్కడ ఉంటారు. బెంగళూరులో పుట్టి పెరిగిన ఎం.ఎల్.అశ్విని కాసరగోడకు కోడలుగా వచ్చింది. ‘బెంగళూరు మెట్రోపాలిటిన్ సిటీ. అన్నిభాషల వారూ ఉంటారు. నాకు భాషలు నేర్చుకోవడం ఇష్టం. చిన్నప్పుడే ఇంగ్లిష్ మీద పట్టు వచ్చింది. కన్నడ నా మాతృభాష. నా చుట్టుపక్కల తుళు కుటుంబాలు ఉండేవి. వారి నుంచి తుళు నేర్చుకున్నాను. తమిళం కూడా బెంగళూరులోనే నేర్చుకున్నాను. కాసరగోడ వచ్చాక మలయాళం చాలా సులువుగా నేర్చుకున్నాను. హిందీ బాగా తెలుసు. ఇలా ఆరు భాషల్లో నేను అనర్గళంగా మాట్లాడగలను’ అంటుందామె. ఇంట్లో కూడా ఆమె తన భాషలను సాధన చేస్తానని చెప్పింది. ‘నేను నా భర్తతో తుళులో మాట్లాడతాను. నా భర్త, కొడుకు మలయాళంలో మాట్లాడుకుంటారు. మా అమ్మాయి నేను కన్నడంలో మాట్లాడుకుంటాం. ఇలా అన్ని భాషలు మా ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి’ అంటుందామె. ఇన్ని భాషలు రావడం ఆమెకు మేలు చేసింది. ఢిల్లీ వెళ్లాక జాతీయ పార్టీలో ఢిల్లీలో కేంద్ర స్థానంలో ఉంటాయి. స్కూలు టీచర్ ఉద్యోగం మానేసి బి.జె.పిలో చేరాక ఆమెకు మహిళా మోర్చాలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పార్టీ స్థానం ఇచ్చింది. అంతే కాదు ఢిల్లీ కేంద్రంగా దాదాపు 10 రాష్ట్రాలలో మహిళా మోర్చా సభ్యులతో కార్యకలాపాలు బలపరచడానికి ఆమెకు బాధ్యత అప్పగించింది. ‘ఢిల్లీలో జాతీయ స్థాయి నాయకులు హిందీలోకాని, ఇంగ్లిష్లో కాని మాట్లాడటం సౌకర్యంగా భావిస్తారు. కేరళ నుంచి వచ్చిన నాయకులు మలయాళం లేదా తమిళం వంటి భాషలు అనర్గళంగా మాట్లాడతారుకాని ఇంగ్లిష్, హిందీ పూర్తిగా రావు. నాకు రావడం లాభించింది’ అంటుంది అశ్విని. మహిళా మోర్చా తరఫున జమ్ము కశ్మీర్తో మొదలు ఉత్తరప్రదేశ్, అస్సాం వరకు ఆమె పని చేసినప్పుడు దిగువ శ్రేణి కార్యకర్తలతో వాళ్లకు తెలిసిన భాషల్లో మాట్లాడుతూ సులువుగా కలిసిపోవడం పార్టీ గమనించింది. కాసరగోడ్లో ఉన్న కన్నడ, మలయాళ, తమిళ భాషీయులతో ఆమె భాషలతో చొచ్చుకుపోవడం పార్టీ దృష్టికి వచ్చింది. అందుకే జిల్లా అధ్యక్షుడు రావిష్ తంత్రి, జాతీయ ప్రతినిధీ సీనియర్ నేత అయిన పి.కె.కృష్ణదాస్ను కాదని పార్టీ అశ్వినికి సీటు ఇచ్చింది. భాష గొప్ప సాధనం: ‘విజయానికి భాష గొప్ప సాధనం’ అంటుంది అశ్విని. ‘రాజకీయాలలో ప్రజలకు తెలిసిన భాషలో మంచి ఉపన్యాసం ఇవ్వగలిగిన వారికి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. నేను ఏ భాషలో అయినా మంచి ఉపన్యాసం ఇవ్వగలను. అందుకే నాకు ఈ అవకాశం దక్కింది. భాషలు ఎన్ని తెలిస్తే అంత మంచిది’ అందామె. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాసరగోడ్లో బి.జె.పి మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఏమవుతుందో చూద్దాం. -
స్కూల్లో ఏఐ పంతులమ్మ పాఠాలు!
ఏఐ టెక్నాలజీ ఉద్యోగులు అవసరం లేకుండా కంపెనీని నిర్వహించే గలిగే సామార్థ్యాన్ని అందిస్తుంది. దీన్ని చూసే యువతలో భయాలు మొదలయ్యాయి. అసలే ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే..ఇక ఈ టెక్నాలజీ వస్తే అంతే పరిస్థితి అని బెంబేలెత్తిపోతున్నారు. అసలు భవిష్యత్తులో ఉద్యోగాలు అనేది ప్రశ్నార్థకమో అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేంత వరకు సాధ్యమనేది క్లారిటీ లేదు గానీ చాలా రంగాల్లోకి ఈ ఏఐ టెక్నాలజీనే తీసుకొచ్చేలా ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడూ టీచర్ అవసరం లేకుండానే క్లాస్లో పాఠాలు చెప్పే ఏఐ పంతులమ్మను తీసుకొచ్చింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్ల్యాబ్స్. ఎలా పాఠాలు చెప్పిందంటే.. కేరళలో తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్ని ప్రవేశ పెట్టింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్ల్యాబ్స్. అక్కడ ఏఐ టెక్నాలజీతో కూడిన టీచరమ్మ ఎలా పాఠాలు చెబుతుందో పరీక్షించారు. చక్కటి చీరకట్టులో ఈ ఏఐ పంతులమ్మ సుమారు మూడు వేల మందికి విద్యార్థులకు చకచక పాఠాలు బోధించటం, సందేహాలు నివృత్తి చేయడం వంటివి చేసింది. ఈ ఏఐ టీచరమ్మ పేరు ఐరిస్ . ఇది మొత్తం మూడు భాషల్లో మాట్లాడగలదు. దీని నాలెడ్జ్ బేస్లో ఇతర ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కంటే మెరుగైన అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇది చాట్ జీపీటీ వంటి ప్రోగ్రామ్ల ద్వారా కూడా పనిచేయగలదు. ఈ ఐరిస్ పంతులమ్మ అచ్చం స్త్రీ స్వరంలోనే మాట్లాడుతుంది. ఒక టీచర్ ఎలా పాఠాలు చెబుతుందో అలా అర్థవంతంగా చెప్పగలదు. విద్యార్థుల ప్రశ్నలకు ఉపాధ్యాయుడు ఎలా విడమరిచి వివరించి చెబుతాడో అలానే అన్నింటికి సమాధానాలు ఇచ్చింది ఏఐ ఐరిస్. ఈ మేరకు మేకర్స్ ల్యాబ్ సీఈవో హరిసాగర్ మాట్లాడుతూ.."విద్యార్థులు తమ ల్యాబ్ ద్వారా అనేక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు. రోబిటిక్స్ వంటి రంగాల్లో అనుభవాన్ని పొందారు కూడా. అలాగే విద్యార్థుల నుంచి ఈ ఏఐ టీచరమ్మ పట్ల సానుకూల స్పందన వచ్చింది. ఎక్కువ మంది క్లాస్ రూంలో ఈ ఏఐ టీచర్ ఉండే బాగుంటుంది అని తమ అభిప్రాయన్ని వెలిబుచ్చడం విశేషం". అని అన్నారు. (చదవండి: జస్ట్ రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు, ఈ విద్యార్థి చాలా స్పెషల్!) -
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదు..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచి్చనా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జన్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్గా.. అమెరికాలోని అయోవా స్టేట్లో రిపబ్లికన్ పారీ్టకి మూడు సార్లు చైర్మన్గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
రెడీ టు బడి
డిజిటల్ స్టార్ కావడం అనేది అదృష్టం కాదు. అవకాశం.ఆ అవకాశం చేతికి అందాలంటే ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనేది బాగా తెలిసి ఉండాలి.చాలామందిలో ఈ అవగాహన లోపించి ‘ఆరంభ శూరత్వం’ ప్రదర్శిస్తున్నారు.‘ఇది మనకు వర్కవుట్ అయ్యేలా లేదు’ అని రథాన్ని వెనక్కి మళ్లిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలని కలలు కనే యువతరం కోసం ‘స్పియర్క్రాఫ్ట్ అకాడమీ’లాంటి నయా స్కూల్స్ వస్తున్నాయి. ‘కంటెంట్ కోచ్’లాంటి నయా గురువులు వస్తున్నారు.కెమెరా యాంగిల్స్ నుంచి ‘ఏ టైమ్లో వీడియోను రోస్ట్ చేయాలి?’ ‘బ్రాండ్లతో ఎలా కొలాబరేట్ కావాలి... లాంటి సమస్త విషయాలను నేర్చుకుంటున్నారు... దిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కడలికి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలనేది కోరిక. పబ్లిక్ స్పీకింగ్, బ్లాగింగ్పై పట్టు సాధించడానికి షార్ట్ కమ్యూనికేషన్ కోర్సులో చేరింది. డిజిటల్ స్టార్డమ్ ప్రభావంతో, తాము కూడా ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్ కోసం బడి బాట పడుతున్న అనేకానేక మందిలో కడలి ఒకరు. 2022తో పోల్చితే మన దేశంలో 2024లో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య బాగా పెరిగిందని చెబుతోంది ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఫర్మ్ జెమ్ఫో. ‘ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే చాలు, ఆడియో అండ్ వీడియో కాప్చరింగ్ తెలిసి ఉంటే చాలు కంటెంట్ క్రియేటర్గా రాణించవచ్చు అని అనుకోవడానికి లేదు. నేర్చుకోవడానికి చాలా ఉంది’ అంటున్నాడు కంటెంట్ కోచ్, బ్రాండ్ కన్సల్టంట్ మనీష్ ΄ాండే. మనీష్లాంటి కంటెంట్ కోచ్ల ద్వారా సాంకేతిక విషయాలపై నైపుణ్యంతో ΄ాటు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఎలాంటి వీడియోలు ఆదరణ పోందుతున్నాయో తెలుసుకుంటున్నారు ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లు. డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్లూయెన్సర్లు కావాలనుకునేవారి కోసం ‘స్పియర్క్రాఫ్ట్ అకాడమీ’ పేరుతో ఫస్ట్ స్కూలు ఏర్పాటయింది. ‘కంటెంట్ను ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఎడిట్ చేయాలి? పర్సనల్ గ్రూమింగ్, వార్డ్రోబ్ మేనేజ్మెంట్, బాడీ లాంగ్వేజ్...ఇలా వెరైటీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాం. మంచి స్పందన ఉంది’ అని చెబుతున్నారు ‘స్పియర్క్రాఫ్ట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌమ్యబాత్రసేన్ గు΄్తా.మరోవైపు మైక్రో అండ్ నానో న్ఫ్లూయెన్సర్లు కంటెంట్ కోచ్లకు బిగ్గెస్ట్ క్లయింట్స్గా ఉన్నారు. కన్సల్టేషన్ కోసం తన దగ్గరకు వస్తున్న వారిలో చిన్న వ్యా΄ారాలు చేస్తున్నవారు, నెయిల్ ఆర్టిస్ట్లు, స్కిన్కేర్ క్రియేటర్లు... ఇలా అన్ని రకాల వారు ఉన్నారని హైదరాబాద్కు చెందిన కంటెంట్ కోచ్ ఇషిక పన్సారీ చెబుతోంది. ‘ఆరు నెలల వ్యవధిలో 600 మందికి శిక్షణ ఇచ్చాను’ అని చెబుతుంది ఇషిక. సెషన్లో భాగంగా కంటెంట్ ఐడియాలు ఇస్తుంది. ‘బార్టర్ డీల్స్ నుంచి బ్రాండ్ కొలాబ్రేషన్స్, యాడ్–జెనరేటెడ్ రెవెన్యూ వరకు కంటెంట్ క్రియేషన్ స్పేస్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయిన్పటికీ ‘డబ్బు’ అనేది చివరి అంశం. డబ్బు సం΄ాదించడానికి ఓపిక, స్థిరత్వం ఉండాలి’ అంటాడు కంటెంట్ కోచ్ మనీష్ ΄పాండే. ఇరవై రెండు సంవత్సరాల దామినీ చౌదురీ ఫుడ్, ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఇన్ఫ్లూయెన్సర్గా రాణించాలనుకుంటుంది. ‘ఇటీవలే పర్సనల్ స్టైలింగ్, ఇమేజ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాను. నాకు 7,000 ఫాలోవర్స్ ఉన్నారు’ అంటున్న దామిని శిక్షణ ద్వారా ఓవరాల్ ప్రెజెంటేషన్, అ్ర΄ోచ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంది. ‘ఆడియెన్స్తో కనెక్ట్ అయ్యే స్పార్క్ అనేది ఏ కొద్దిమందికో పరిమితమైనది కాదు’ అంటున్న కంటెంట్ కోచ్లు బ్రాండ్తో ఎలా కొలాబరేట్ కావాలి. ఎలా నెగోషియేట్ చేయాలి, కంటెంట్ను ఎలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి, బెటర్ కెమెరా యాంగిల్ ఎలా ఉపయోగించాలి... మొదలైన టెక్నికల్ యాస్పెక్ట్స్ను సులభంగా తెలియజేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ కోర్సుల కోసం చాలామంది స్కిల్స్ షేర్, ఉడెమీలాంటి ఆన్లైన్ లెర్నింగ్ ΄్లాట్ఫామ్లపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వీడియో రోస్ట్ చేయడానికి రోజులో మంచి టైమ్ ఏమిటి? ఎలాంటి పరికరాలు కావాలి? ఎలాంటి లైటింగ్ బాగా ఉపయోగపడుతుంది... లాంటి విషయాలను నేర్చుకుంటున్నారు. కొండంత అండ... మన దేశంలోని టాప్ డిజిటల్ స్టార్స్లో 27 సంవత్సరాల బృంద శర్మ ఒకరు. డిజిటల్ స్టార్ కావాలని, అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కొండలు, గుట్టలు అంటే ఆమెకు ఇష్టం. వాటిని వెదుక్కుంటూ వెళ్లడం అంటే ఇష్టం. దుబాయ్లో చేసే 9–5 ఉద్యోగం కంటే కొండల గుండెల చప్పుడు వినడం అంటేనే ఆమెకు ఇష్టం. ఎన్నో దేశాలలో ఎన్నో పర్వతాలకు సంబంధించిన ఆసక్తికరమైన చరిత్రను ఇన్స్టాగ్రామ్ వేదికగా లోకంతో పంచుకునేది. ఆ తరువాత ట్రావెలింగ్కు సంబంధించిన వీడియోలతో ఫుల్–టైమ్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ప్రకృతిపై ప్రేమ, ప్రయాణం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అన్నట్లుగా ఉండేది బృంద. అయితే అనునయ్సూద్ అనే ఫ్రెండ్ సలహాతో ఇన్స్టాగ్రామ్ మిషన్ ్ర΄ారంభించింది. తన వీడియోలను వైరల్ చేయాలని, కావాలనీ... బృంద ఎప్పుడూ అనుకోలేదు. అయితే కంటెంట్లో ఉన్న సత్తాతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. బృందశర్మను డిజిటల్ స్టార్ను చేశాయి. ప్రేక్షక లోకమే ΄పాఠశాల సీఏ పరీక్షలు పూర్తయిన తరువాత ఫైనాన్స్ర్΄÷ఫెషన్లోకి వచ్చింది ట్వింకిల్ జైన్. ఫైనాల్సియల్ లిటరసీని దృష్టిలో పెట్టుకొని 2021 నుంచి సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ‘బిజినెస్ అండ్ ఫైనాన్స్కు సంబంధించిన వీడియోలు ఎవరు చూస్తారు?’ అని అనుకొని ఉంటే 26 సంవత్సరాల వయసులోనే టాప్ డిజిటల్ స్టార్స్ జాబితాలో ట్వింకిల్ పేరు ఉండేది కాదు. తెలిసో తెలియకో జటిలమైన విషయాలను మరింత జటిలంగా చెబుతూ శ్రోతలను భయభ్రాంతులకు గురి చేస్తారు కొందరు. మరి కొందరు మాత్రం ఎంత జటిలమైన విషయాన్ని అయినా ‘ఓస్ ఇంతేనా’ అన్నట్లుగా సులభంగా అర్థమయ్యేలా చెబుతారు. ట్వింకిల్ జైన్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ప్రేక్షక లోకమే ఆమె ΄ాఠశాల. వారి నుంచే విలువైన ΄ాఠాలను నేర్చుకుంది. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణం.. కారణం ఇదే..!
గద్వాల క్రైం: కుటుంబ సమస్యలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని న్యూ హౌసింగ్బోర్డులో నివాసం ఉంటున్న విజయ్మోహన్రెడ్డి(53) మోమిన్మొహల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఇంట్లో సమస్యలు తీవ్రం కావడంతో బుధవారం ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి మండలంలోని పూడురూ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో చెట్టుకు చీరతో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానిక రైతులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఆనంద్ చేరుకుని పరిశీలించగా మృతుడి గుర్తింపుకార్డు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్య కొన్నేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. రెండో భార్య స్వాతికి 6ఏళ్ల కూతురు ఉంది. కుమారుడు హేమంత్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరికల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయలైన ఘటన గురువారం ఎలిగండ్ల వంతెన వంద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ మండలం గున్ముక్లకు చెందిన మంగలి శివశంకర్(42) మరికల్లో ఓ హేర్కంటింగ్ షాప్లో పని చేస్తున్నాడు. పనులు ముగించుకుఇన సాయంత్రం 7 గంటలకు గున్ముక్లకు స్కూటీపై తిరుగు ప్రయాణం అవుతుండగా మరికల్ చౌరస్తాలో ఎమ్మోనోనిపల్లికి చెందిన నవీన్ లిప్ట్ అడిగి స్కూటీ ఎక్కాడు. ఎలిగండ్ల స్టేజీ సమీపంలోని జాతీయ రహదారి వంతెన మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్ స్కూటీని ఢీకొనడంతో శివశంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. నవీన్కు తీవ్రగాయలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపారు. -
షాకింగ్: బర్త్ డే రోజు.. విద్యార్థితో బలవంతంగా వాంతిని తినిపించిన టీచర్
పాఠశాలలో విద్యార్థులకు మంచి ప్రవర్తన నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు అమానుషంగా ప్రవర్తించింది. చిన్నారులకు చదువు చెప్పించి, వారిని ఉన్నత స్థాయికి చేర్చేందుకు తోడ్పడాల్సిన టీచరే హద్దుమీరి ప్రవర్తించింది. పుట్టిన రోజు నాడే ఓ విద్యార్థితో అతడి వాంతిని తినిపించింది. ఈ షాకింగ్ ఘటన చైనాలోని లయోనింగ్ ప్రావిన్స్లో సెప్టెంబర్ 15న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలువాన్ కిండర్ గార్టెన్ పాఠశాలలో ఆరేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నారు. సెప్టెంబర్ 15న తన పుట్టిన రోజు కావడంతో కొత్త దుస్తులు ధరించి స్కూల్కు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత.. టీచర్ అతడికి బలవంతంగా గుమ్మడికాయ ముక్కలు తినిపించారు. అప్పటికే బాలుడు ఎక్కువ తినడంతో వెంటనే వాంతులు చేసుకున్నాడు. దీంతో టీచర్ అతడిని వాంతిని తినాలని ఆదేశించింది. ఇంటికి చేరుకున్న బాలుడు తనకు జరిగిన విషయాన్ని నానమ్మకు చెప్పాడు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లారు. నర్సరీ టీచర్ ప్రవర్తనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, బాలుడికి బలవంతంగా తినిపించడంతోనే వాంతింగ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. ఇక బాధిత బాలుడి తల్లిదండ్రులు పాఠశౄల యాజమాన్యం క్షమాపణలు కోరింది. అదే విధంగా సదరు టీచర్ను విధుల నుంచి బహిష్కరించింది. -
యూనిఫామ్ వేసుకొని పాఠాలు చెప్పే పంతులమ్మ.. ఫుల్ అటెండెన్స్
రాయ్పూర్లో ఒక టీచర్ పిల్లల్ని వినూత్నంగా ఆకట్టుకుంటోంది. వారానికి ఒకసారి వారిలాగే యూనిఫామ్ ధరించి స్కూల్కు వస్తోంది. ‘నేనూ మీలో ఒకదాన్నే’ అనే భావన కలిగించడమే కాదు... టీచర్ అంటే కొట్టే తిట్టే మనిషి కాదనే భరోసా ఇస్తోంది. దీంతో పిల్లలు ఫుల్లుగా స్కూల్కు అటెండ్ అవుతున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆమె చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అందరి ప్రశంసలు పొదుతోంది. రాయ్పూర్ (చత్తిస్గఢ్)లోని గోకుల్రామ్ వర్మ ప్రైమరీ స్కూల్ అనే ప్రభుత్వబడిలో వారమంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. శనివారం ఇంకా ఉత్సాహంగా ఉంటారు. దానికి కారణం ఆ రోజు ఆ స్కూల్ టీచర్ జాహ్నవి యదు వారిలాగే తయారయ్యి వారిలాగే యూనిఫామ్ వేసుకుని వస్తుంది. ఆ రోజు కుర్చీలో కూచోదు. వారి మధ్య కూచుని పాఠాలు, కబుర్లు చెబుతుంది. వారితో సంభాషిస్తుంది. అందుకే పిల్లలందరికీ జాహ్నవి యదు టీచర్ అంటే ఇష్టం. కొత్త ఆలోచన గోకుల్ రామ్ వర్మ ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5 వరకూ చదివే 350 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఆ చుట్టుపక్కల బస్తీవాసుల పిల్లలు. వారి తల్లిదండ్రులకు పెద్దగా చదువు లేదు. పిల్లలకు క్రమశిక్షణ అంటే తెలియదు. స్కూల్కు రోజూ రావడం ఇష్టం ఉండదు. యూనిఫామ్ వేసుకోరు. గత సంవత్సరం ఇదే బడిలో టీచర్గా చేరిన 30 ఏళ్ల జాహ్నవి యదు ఇదంతా గమనించింది. వారితో తిప్పలు పడింది. దారిలో పెట్టలేక సతమతమయ్యింది. ఈ సంవత్సరం అంటే 2023 జూన్లో స్కూల్ రీ ఓపెన్ అయినప్పుడు జాహ్నవి యదు కొత్త ఆలోచన చేసింది. హఠాత్తుగా ఒకరోజు వారిలాగా యూనిఫామ్ వేసుకుని వచ్చింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. గుమిగూడారు. నవ్వారు. ఆనందించారు. ‘ఎందుకు టీచర్ ఇలా వేసుకొచ్చావ్’ అనంటే ‘స్కూల్కి మీరు ఇలాగే రావాలి. అందుకని వేసుకొచ్చా. మనందరం ఒక టీమ్. మనందరం సూపర్గా చదువుకోవాలి’ అని వారిని ‘మనం’ చేశాక వాళ్లు సంతోషించారు. టీచర్లా యూనిఫామ్ వేసుకురావాలని వారికీ అనిపించింది. టీచర్ కోసం రోజూ స్కూల్కి రావాలని కూడా. అన్నీ ప్రశంసలే జాహ్నవి యదు వారానికి ఒకరోజు అంటే ప్రతి శనివారం స్కూల్ యూనిఫామ్లో రావడం రాయ్పూర్ అంతా పెద్ద వార్త అయ్యింది. జాహ్నవి యదు చర్య వల్ల పిల్లలు బెరుకు లేకుండా తమ మనసుల్లో ఉన్నది చెప్పుకుంటున్నారని స్కూల్ అనేది టీచర్లు చావబాదే స్థలం కాదని తెలుసుకుని క్లాసులకు హాజరవుతున్నారని ఊరు మొత్తం తెలిసింది. అందరూ జాహ్నవి యదును అభినందిస్తున్నారు. ‘టీచర్లూ పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం’ అని జాహ్నవి యదు చెప్పింది. అయితే ఇలాంటి బట్టల్లో రావడానికి ఆమె కొంచెం ఆలోచించింది– అత్తామామలు ఏమంటారోనని. కాని వారు అంగీకరించి దూసుకుపో కోడలు పిల్లా అని ఉత్సాహపరిచారు. దాంతో జాహ్నవి యదు పిల్లలతో ఆడిపాడుతున్నట్టుగా కనిపిస్తూ వారికి పాఠాలు చెబుతూ దారిలో పెడుతోంది. ఫేవరెట్ టీచర్ కొందరు టీచర్లు తమ కెరీర్ మొత్తం ఏ క్లాస్కీ ఫేవరెట్ టీచర్ కాకుండానే రిటైర్ అయిపోతారు. కొందరు టీచర్లు ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలకు ఫేవరెట్ టీచర్ అవుతారు. పిల్లలతో బంధం వేసుకోవడం టీచర్కు చాలా ముఖ్యం. అందులో ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ మొత్తానికి ఫేవరెట్ టీచర్ అయిన జాహ్నవి యదుని చూసి తాము కూడా పిల్లల కోసం ఏదైనా చేద్దామా అనుకుంటున్నారు మిగిలిన టీచర్లు. అది చాలదూ? టీచర్లూ, పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం. – జాహ్నవి యదు -
యూపీ స్కూల్ టీచర్
లక్నో: నిరుపేద యువతులు, మహిళల్లో రుతుస్రావంలో పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి ఉత్తరప్రదేశ్లో ఒక స్కూలు టీచర్ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తన సొంత డబ్బులతో ‘‘ప్యాడ్ బ్యాంక్’’ను ఏర్పాటు చేసి గ్రామంలో అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. బరేలి జిల్లా బొరియా బ్యాంకులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న రాఖీ గంగ్వార్ తమ ఊళ్లో యుక్త వయసుకి వచి్చన అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో ఇంకా పాతకాలం పద్ధతుల్లో బట్టలనే వాడడం పట్ల ఆవేదనతో ఉండేవారు. వారిలో శానిటరీ ప్యాడ్స్పై అవగాహన పెంచడానికి స్కూల్లోనే ప్యాడ్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. తన సొంత డబ్బుతో ప్యాడ్స్ కొని ఆ బ్యాంకులో ఉంచుతున్నారు. అవి వాడడానికి ముందుకొచి్చన వారికి ఉచితంగా ఇస్తూ ఎలా వాడాలో నేరి్పస్తూ వారిలో అవగాహన పెంచుతున్నారు. మే 15న మదర్స్ డే సందర్భంగా ఈ బ్యాంక్ ప్రారంభించారు. మొదట్లో శానిటరీ ప్యాడ్స్ వాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో పరిశుభ్రత గురించి వివరంగా చెప్పాక ఒక్కొక్కరు వచ్చి ప్యాడ్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. అలా ప్రస్తుతం ప్రతీ నెలా 150 వరకు మహిళలు ప్యాడ్ బ్యాంక్కి వస్తున్నారని రాఖీ గంగ్వార్ వివరించారు. -
ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు
కథలాపూర్ (వేములవాడ): వందమంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దుస్థితి ఇది. ఇక్కడి ఐదు తరగతుల్లో 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఒక్క ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయిని అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. దీంతో వల్లంపెల్లి పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ను డిప్యుటేషన్పై నియమించారు. ఉపాధ్యాయులను నియమించాలని ఎనిమిదేళ్లుగా జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన కరువైందని ఎస్ఎంసీ చైర్మన్ కొక్కుల శంకర్, సర్పంచ్ సింగిరెడ్డి నరేశ్రెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి: ఆధునిక హంగులతో.. పర్యాటక కేంద్రాల అభివృద్ధి -
ప్రేమ పెళ్లి.. భర్తకు షాకిచ్చిన స్కూల్ టీచర్ భార్య, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్తో
అన్నానగర్ (తమిళనాడు): ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో స్కూల్ టీచర్ పరారైంది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుచ్చి జిల్లా కోంబైపూదూర్ గ్రామానికి చెందిన పుష్పరాజ్ రెండేళ్ల క్రితం నిత్య అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేదు. నిత్య కోంబైపూదూరులోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో నవీన్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండు రోజులక్రితం నిత్య అదృశ్యమైంది. ఆమె భర్త పుష్పరాజ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (ఆర్టీసీ బస్సులో మహిళకు వేధింపులు) -
పాక్లో కాల్పుల్లో 8 మంది టీచర్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 8 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. అప్పర్ కుర్రమ్ జిల్లా పరాచినార్లోని ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయుడు మహ్మద్ షరీఫ్ను గుర్తు తెలియని సాయుధుడు కాల్చి చంపాడు. ఆయన సున్నీ మెంగల్ తెగకు చెందిన వాడు. దీంతో మెంగల్ వర్గీయులు ఆగ్రహంతో ప్రభుత్వ తెరి మెంగల్ హైస్కూల్లోకి చొరబడి ప్రత్యర్థి తోరి షియా తెగకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులను చంపేశారు. ఈ ఘటన స్థానిక తెగల మధ్య ఉద్రిక్తతలు రాజేసే అవకాశముందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. -
నిద్ర భంగం చేశారని విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు
సాక్షి, హైదరాబాద్: తన నిద్ర భంగం చేశారని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి విద్యార్థులను స్కేలుతో చితకబాదాడు. వివరాలిలా ఉన్నాయి.. వెంకటేష్ రేణుకల కుమారుడు ఆశీష్కుమార్ మడ్ఫోర్ట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో రవికుమార్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిద్రిస్తున్నాడు. విరామం అనంతరం విద్యార్థులు తరగతి గదికి రాగా శబ్ధం రావడంతో నిద్ర భంగమైందని కోపోద్రిక్తుడైన రవికుమార్ స్కేల్తో పలువురు విద్యార్థులతో పాటు తన టేబుల్ దగ్గర ఉన్న ఆశీష్కుమార్ పిక్కలు, మోకాలి కింది భాగంలో కొట్టాడు. ఈ విషయం సదరు విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పలేదు. శుక్రవారం స్నానం చేయించే సమయంలో తల్లి నల్లగా కమిలినట్లు ఉండటం గమనించి ఆరా తీయగా ఉపాధ్యాయుడు కొట్టినట్లు తెలిపాడు. పాఠశాలకు వెళ్లి నిలదీయగా తాను కొట్టలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మిగతా విద్యార్థులు సైతం తమని కూడా కొట్టాడని చెప్పడంతో శుక్రవారం కార్ఖాన పీఎస్లో రవికుమార్పై ఫిర్యాదు చేశారు. -
హెడ్ మాస్టర్ బాగోతం.. హాస్టల్ విద్యార్థినులను ప్రత్యేక క్లాస్ల పేరుతో పిలిచి..
యశవంతపుర(కర్ణాటక): హాస్టల్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఓ ముఖ్యోపాధ్యాయుడికి హాసన జిల్లా అరకలగూడు పోలీసులు బేడీలు వేశారు. అరకులగూడు వసతి పాఠశాలలో 35 మంది విద్యార్థినులు వసతి పొందుతుండగా ముఖ్యోపాధ్యాయుడు శివకుమార్ ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థినులను పిలిపించి లైంగికంగా వేధించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ప్రిన్సిపాల్ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈయన మొత్తం 15 మందిని లైంగికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ‘మీ కుమారుడు మా స్కూల్లో అవసరం లేదు.. ఇంటికి తీసుకుపోండి’ -
టీచర్ క్రూరత్వం.. విద్యార్థిని స్కూల్ బాల్కనీలోంచి తోసేసి హత్య!
బెంగళూరు: కర్ణాటకలోని గడక్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు క్రూరంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని చితకబాది.. పాఠశాల భవనం మొదటి అంతస్తులోని బాల్కనీలోంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలైన ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన హగ్లీ గ్రామంలోని ఆదర్శ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. కుటుంబ గొడవలే కారణం.. ఆదర్శ్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు భరత్ అనే విద్యార్థి. అదే పాఠశాలలో పని చేస్తున్న ముత్తప్ప అనే ఉపాధ్యాయుడు.. భరత్ను చితకబాది బాల్కనీలోంచి బయటకు తోసేశాడని గడక్ జిల్లా సీనియర్ పోలీసు అధికారి శివప్రకాశ్ దేవరాజ్ తెలిపారు. ఈ దారుణం వెనుక కుటుంబ కలహాలు ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. బాధితుడు భరత్ తల్లి, అదే పాఠశాలలో టీచర్గా పని చేస్తున్న గీతా బార్కర్ను సైతం ముత్తప్ప తీవ్రంగా కొట్టినట్లు చెప్పారు. ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా చేస్తున్న నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి: పాతబస్తీలో దారుణం.. లలిత్ బాగ్ కార్పొరేటర్ అల్లుడి హత్య -
పాఠాలు చెప్పాలి కానీ ఇవేం పనులు.. కీచక టీచర్కు బడితపూజ..
సాక్షి, నిజామాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు టీచర్లు తమ స్థానం మరిచిపోయి విద్యార్థినిలను వేధింపులకు గురిచేస్తున్నారు. పాఠాలు నేర్పించే క్రమంలో కామకాంక్షను వారిపై ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో కటకటాల్లోకి వెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మాడ్రన్ఎయిడెడ్ పాఠశాలలో రమణ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, పాఠాలు చెప్పే క్రమంలో రమణ.. విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో, ఆవేదనకు గురైన విద్యార్థినిలు ఈ విషయాన్ని ఇంటి వెళ్లి తమ పేరెంట్స్కు చెప్పారు. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు రమణకు దేహశుద్ధి చేశారు. టీచర్ రమణకు విద్యార్థులు, టీచర్స్ చితకబాదారు. ఈ ఘటనపై విద్యార్థులు పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమణకు పోలీసులు తీసుకువెళ్తున్న క్రమంలో కూడా రమణను విద్యార్థులు పేరెంట్స్ తీవ్రంగా కొట్టారు. అనంతరం, చిరిగిన చొక్కాతోనే రమణను పోలీసులు స్టేషన్కు తరలించారు. -
విమానంలో అద్భుతమైన ఘట్టం...30 ఏళ్ల తర్వాత....
విద్యార్థి జీవితంలో టీచర్లు చాల కీలకమైన పాత్ర పోషిస్తారు. వారు బోధనతో మన జీవితాలపై చెరగని ముద్ర వేస్తారు. మనం ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మన చిన్ననాటి ఉపాధ్యాయులను కలవడం అత్యంత అరుదు. అదీగాక బిజీ లైఫ్, పలు పనుల ఒత్తిడితో కలిసే అవకాశం రాకపోవచ్చు. అనుకోకుండా మన చిన్ననాటి స్కూల్ టీచర్ ఎదురుపడితే ఎవ్వరైనా మాటల్లో చెప్పలేనంత ఆనందం తోపాటు ఒక విధమైన భావోద్వేగానికి గురవుతాం. అచ్చం అలానే ఇక్కడొక ఫ్లైట్ అటెండెంట్ ఆ విధమైన గొప్ప అనుభూతిని పొందింది. వివరాల్లోకెళ్తే...కెనడాలోని జెట్ సీఎస్ఏ విమానంలో లోరీ అనే ఒక ఫ్లైట్ అటెండెంట్ తన చిన్ననాటి ఉపాధ్యాయురాలిని చూస్తుంది. దీంతో పట్టరాని ఆనందంతో విమానంలోని మైక్రోఫోన్తో ప్రయాణికులను చూస్తూ మాట్లాడుతుంది. ఈ మేరకు ఫ్లైట్ అటెండెంట్ భావోద్వేగంగా మాట్లాడుతూ...."ఈ విమానంలో నా చిన్ననాటి ఉపాధ్యాయురాలు ఉంది. ఆమెను 1990 తర్వాత చూసిందే లేదు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఆమెను ఇప్పుడే చూడటం. ఆమె నన్ను షేక్స్పియర్ని ప్రేమించేలా చేసింది. పియానో వాయించేలా చేసింది. అంతేకాదు పియానాలో మాస్టర్స్ చేశాను. ఒక వ్యాసం కూడా రాయగలను. ధన్యవాదాలు ఓకానెల్ అంటూ తన గురువు పేరుని చెబుతుంది." అంతేగాదు చిన్నపిల్లలా ఆనందంతో పరుగెత్తుకుంటూ తన టీచర్ వద్దకు వెళ్తుంది. ఈ ఘటన అనుహ్యంగా ఇంటర్నేషనల్ టీచర్స్ డే రోజున జరగడం విశేషం. ఈ క్రమంలో సదరు ఎయిర్వేస్ కూడా ఇది చాల అద్భుతమైన క్షణం, టీచర్స్ డే రోజునే దీన్ని మాతో పంచుకున్నందుకు లోరీకి ఆమె టీచర్కి ధన్యావాదాలు అని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు కియోనా థ్రాషెర్ పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Keona Thrasher (@vancouver_kthrasher) (చదవండి: మిరాకిల్ అంటే ఇదే...మీద నుంచి కారు వెళ్లిపోయింది ఐనా...) -
ముంబై: స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కొని టీచర్ మృతి
ముంబై: స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కొని 26 ఏళ్ల మహిళా టీచర్ మృతి చెందింది. ఈ విషాద ఘటన మహరాష్ట్ర రాజధాని ముంబై నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నార్త్ ముంబై శివారు ప్రాంతమైన మలాడ్లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్లో జెనెల్ ఫెర్నాండేజ్ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆరో అంతస్తులో క్లాస్ పూర్తి చేసుకున్న జెనెల్.. రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్కు వెళ్లేందుకు లిఫ్ట్ కోసం వేచి ఉంది. లిఫ్ట్లోకి ఎక్కి రెండో ఫ్లోర్ బటన్ నొక్కింది. అయితే లిఫ్ట్ పపైకి వెళ్లడం గమనించిన జెనెల్ అప్పటికీ లిఫ్ట్ తలపులు మూసుకోకపోవడంతో వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. బయటకు వస్తుండగా ఆమె బ్యాగ్ లిఫ్ట్లో చిక్కుకుంది. బ్యాగ్ను తీసుకునేందుకు టీచర్ ప్రయత్నించగా.. లిఫ్ట్లో ఆమె తల ఇరుక్కుపోయింది. లిఫ్ట్ డోర్స్ మధ్యలో చిక్కుకొని జెనెల్ తల నుజ్జునుజ్జైంది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన టీచర్ కేకలు విన్న పాఠశాల అధికారులు, సహోద్యోగులు ఆమెకు సాయం చేసేందుకు పరుగెత్తుకొచ్చారు. సుమారు 20 నిమిషాలు కష్టపడి లిఫ్ట్లో ఇరుక్కుపోయిన యువతిని బయటకు తీశారు. వెంటనే ఆమెను గోరేగావ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనపై మృతురాలి భర్తకు సమాచారం అందించారు పోలీసులు. ఫెర్నాండెజ్ ఈ ఏడాది జూన్లోనే ప్రైమరీ విభాగంలో అసిస్టెంట్ టీచర్గా చేరింది. మృతురాలి బంధువుల్లో ఒకరు కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చదవండి: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు -
పాఠాలు బోధించే బడిలోనే ప్రాణాలు విడిచింది..
సాక్షి, హన్మకొండ: పాఠాలు బోధించే బడిలోనే ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచింది. రోజూ మాదిరిగానే పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు అలసటగా ఉందని, ఒళ్లు చెమటలు పట్టేస్తున్నాయని, చేతులు లాగుతున్నాయంటూ రెస్ట్ రూంలోకి వెళ్లింది. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగానే విగతజీవిగా మారిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందిందని తెలపడటంతో పాఠశాల శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాద ఘటన మంగళవారం హనుమకొండలోని యాదవనగర్లోని సిద్దార్థ హైస్కూల్లో చోటుచేసుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ సంపత్ ఇల్లందుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన చెరుకుపెల్లి ఉషశ్రీ (45) సుమారు 12 సంవత్సరాలుగా సిద్దార్థ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. రెండు రోజులుగా ఆరోగ్యం సహకరించడం లేదంటూనే మంగళవారం విధులకు హాజరైంది. మధ్యాహ్నం 1గంట సమయంలో ఒళ్లు అలసటగా ఉందని, చేతులు లాగుతున్నాయంటూ తరగతిలో నుంచి బయటకు వచ్చింది. అంతలోనే సహచర సిబ్బంది ఏమైందని తెలుసుకునేలోగా స్పృహ కోల్పోయింది. హుటాహుటిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు పాఠాలు బోధించిన టీచర్ ఇకలేరని తెలుసుకున్న విద్యార్థులు రోదనలు మిన్నంటాయి. చదవండి: (Engineering: ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు) -
ప్రభుత్వ ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. యూకేజీ విద్యార్థిపై లైంగిక దాడి
సాక్షి, చెన్నై: భార్య పేరుతో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తూ నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని గంగసూడామణి గ్రామంలో ప్రైవేటు పాఠశాల నడుస్తుంది. ఇక్కడ యూకేజీ చదువుతున్న ఒక విద్యార్థినికి గత కొద్ది రోజులుగా ఆరోగ్యం సక్రమంగా లేక పోవడంతో తల్లిదండ్రులు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై తిరువణ్ణామలై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో పాఠశాల కరస్పాండెంట్ ప్రభావతి భర్త ఉలయంబట్టు ప్రభుత్వ పాఠశాల టీచర్ కామరాజ్ తరచూ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కార్తికేయన్, అడిషనల్ ఎస్పీ రమేష్, విద్యా శాఖ సీఈఓ దయాళన్ ప్రైవేటు పాఠశాలకు నేరుగా వెళ్లి విచారణ చేపట్టారు. ఆ సమయంలో కామరాజ్ తిరుచందూరులోని ఆలయానికి వెళ్లినట్లు తెలియడంతో ఎస్పీ కార్తికేయన్ ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రభావతిని శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ మురగేష్ పాఠశాల టీచర్ కామరాజ్ను సస్పెండ్ చేశారు. చదవండి: హతవిధీ!..పదేళ్ల తర్వాత విధులకు..గుండెపోటుతో -
హయత్ నగర్లో దారుణం.. టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్లో 8వ తరగతి విద్యార్థిని అక్షయ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూల్లో అక్షయ అనే విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. గురువారం స్కూల్లో హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించింది. అంతేగాక క్లాస్లో అల్లరి చేయడం గమనించిన టీచర్ అక్షయను తరగతి గది బయట మోకాళ్లపై నిల్చోబెట్టింది. దీంతో తోటి విద్యార్థుల ముందు అవమానం జరిగిందని మనస్తాపం చెందిన విద్యార్థిని.. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని అత్మ హత్య చేసుకుంది. అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు విగతా జీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే టీచర్ మందలించడం వల్లే అక్షయ చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. విద్యార్థిని మరణానికి స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాప బంధువులు ఆగ్రహంతో స్కూల్పై రాళ్ల దాడి చేయడంతో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
స్టూడెంట్తో మేడమ్ మసాజ్.. వేటు
లక్నో: పాఠాలు నేర్పే గురువులు తమను వదిలి వెళ్తుంటే.. పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటూ అడ్డుకునే దృశ్యాలను చాలానే చూశాం.. చూస్తున్నాం. అదే సమయంలో ఆ వృత్తికి కళంకం తెస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. తరగతి గదిలో అదీ.. పిల్లలందరి ముందే ఓ టీచర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. స్టూడెంట్స్లోని ఓ పిల్లాడితో చేతులను మసాజ్ చేయించుకుంది. హాయిగా కుర్చీలో రిలాక్స్ అవుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో.. సదరు టీచర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తర ప్రదేశ్ హర్దోయ్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఉర్మిలా సింగ్ ఆ స్కూల్లో అసిస్టెంట్ టీచర్గా పని చేస్తోంది. వీడియో వైరల్ అయిన వెంటనే ఆమెపై వేటు వేస్తూ జిల్లా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వీడియో తనదాకా వచ్చిందని, ఆమెపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కానీ, ఆమె వ్యవహరించిన తీరుపై తగిన చర్యలు ఉంటాయని చెప్పారు హర్దోయ్ విద్యాధికారి బీపీ సింగ్. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆమెను స్కూల్ నుంచి తొలగిస్తేనే.. తమ పిల్లలను బడికి పంపుతామంటూ ధర్నా చేపట్టారు అక్కడ. Teacher having bicep Massage by students, Viral video from Hardoi UP govt school. pic.twitter.com/MF8lEQPvEZ — Grading News (@GradingNews) July 27, 2022 ఇదీ చూడండి: ‘సార్.. ప్లీజ్ మమ్మల్ని విడిచి వెళ్లొద్దు’ -
Photo Feature: వెనుక ‘బడి’..
జగదేవ్పూర్ (గజ్వేల్): ఆ గ్రామ ప్రభుత్వ బడిలో విద్యార్థులున్నారు.. కానీ చదు వు చెప్పేందుకు ఉపాధ్యాయుడు లేరు. ఇదీ సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండ లం నిర్మల్నగర్ పాఠశాల పరిస్థితి. ఆ పాఠశాలలో 30 మందికి పైగా పిల్లలున్నా రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేరు. దీంతో డిప్యుటేషన్పై ఒక ఉపాధ్యాయుడిని ని యమించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ శ్యామలరాజు, గ్రామస్తుల సహకారంతో రెండేళ్లుగా ఇద్దరు విద్యావలంటీర్లను ఏర్పాటు చేసి పాఠాలు చెప్పించారు. పాఠశా లలు పునఃప్రారంభమయ్యాక డిప్యుటేషన్ ఉపాధ్యాయుడు మొదటి రోజు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత నుంచి రాకపోవడంతో కొందరు పిల్లలు పక్క గ్రామంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరారు. మరికొందరు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. దీనిపై ఎంఈవోను వివరణ కోరగా రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేక ఇబ్బందిగా ఉందని, విద్యావలంటీర్ను ఏర్పాటు చేసి పాఠశాలను నడిపిస్తామని చెప్పారు. -
Viral Video: వావ్ అమేజింగ్.. విద్యార్థినితో స్టెప్పులేసిన టీచర్!
టీచర్లంటే స్ట్రిక్ట్గా ఉంటారు. పిల్లలకు చదువు చెప్పడం.. హోం వర్క్ చేయకుంటే దండించడం వారి విధి. టీచర్ ముందు విద్యార్ధులందరూ డిసిప్లెన్గా ఉండాలి. ఈ విషయాలే మనకు బాగా గుర్తొస్తాయి. కానీ ఢిల్లీలోని ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఓహో టీచర్లు పిల్లలతో ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా తప్పదు. ఇంతకీ విషయంలోకి వెళితే.. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినితో కలిసి ఓ మహిళా ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే డ్యాన్స్ చేసింది. పిల్లలందరిలో ఓ విద్యార్థి ముందుకు వచ్చి హర్యాన్వీ పాటకు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఇంతలో పక్కనే ఉన్న టీచర్ మను గులాటీ.. విద్యార్థినితో కలిసి కొన్ని స్టెప్పులు వేశారు. విద్యార్థినిని అనుకరిస్తూ చాలా అందంగా డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడంతో క్లాస్లోని మిగతా స్టూడెంట్స్ చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేశారు. చదవండి👉బాయ్ఫ్రెండ్పై కోపం.. ఆమె చేసిన పనికి షాక్లో లవర్ Students love to be teachers. They love role reversal. "मैम आप भी करो। मैं सिखाऊंगी।" English lang teaching followed by some Haryanvi music- A glimpse of the fag end of our school day.☺️💕#MyStudentsMyPride #DelhiGovtSchool pic.twitter.com/JY4v7glUnr — Manu Gulati (@ManuGulati11) April 25, 2022 దీనిని స్వయంగా టీచర్ ట్విటర్లో షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘వావ్ అమేజింగ్. అద్భుతంగా డ్యాన్స్ చేశారు. టీచర్లు విద్యార్థులతో ఇలా కలివిడిగా ఉంటూ బోధించడం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి టీచర్లు ఉంటే బాగుంటుంది. అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి👉 సెలవు కావాలని వైరల్ లేఖ -
సారూ... పిల్లలతో పని చేయిస్తే ఎలా?
కేవీపల్లె(అన్నమయ్య జిల్లా): ‘సారూ.. మేము పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే.. మీరు పని చేయిస్తే ఎలా?’ అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదులకు తాళం వేశారు. ఈ సంఘటన మారేళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆవరణలో స్టేజీ నిర్మించాలని ప్రధానోపాధ్యాయులు గంగాధరం, ఉపాధ్యాయులు భావించారు. బుధవారం విద్యార్థులతో గుణాతం తవ్వకం పని చేపించారు. గురువారం నిర్మాణానికి అవసరమయ్యే కట్రాళ్ల కోసం వారిని ఓ బండకు పంపించి ట్రాక్టర్కు లోడు చేయించారు. సిమెంట్ బస్తాలను ఆటోకు లోడు చేయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం చెంది పాఠశాల వద్దకు వచ్చారు. స్థానిక సర్పంచ్ మధుసూదన్రెడ్డి సహకారంతో శుక్రవారం తరగతి గదులకు తాళాలు వేశారు. తమ బిడ్డలతో పనులు చేయించిన వారిపై చర్యలు తీసుకునే వరకు తాళాలు తీయరాదని డిమాండ్ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు చెట్ల కింద తరగతులు నిర్వహించారు. దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఉపాధ్యాయులను నిలదీశారు. గురువారం హెచ్ఎం గంగాధరం లేకపోయినా, ఆయన ఆదేశాల మేరకే పిల్లలతో పని చేయించామని ఇన్చార్జి హెచ్ఎం వెంకటసుబ్బయ్య తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు సర్ది చెప్పి తాళాలు తెరిపించారు. అనంతరం విద్యార్థులకు ఆలస్యంగా సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించారు. జరిగిన సంఘటనపై ఎంఈవో రెడ్డిబాషాను వివరణ కోరగా విచారణ జరిపి డీఈవోకు నివేదిక పంపిస్తామని తెలిపారు. పిల్లలచే పని చేయించడం అన్యాయం మా పిల్లలతో పని చేయించడం అన్యాయం. మేము కష్టపడి పిల్లలను బాగా చదివించుకోవాలని పాఠశాలకు పంపిస్తున్నాం. అయితే ఎర్రటి ఎండలో బండపైకి పంపించి కట్రాళ్లు ట్రాక్టర్కు లోడు చేయించడం ఎంత వరకు సమంజసం. పాఠశాల పేరెంట్స్ కమిటీకి ఉపాధ్యాయుల జవాబుదారీతనం లేదు. – రమణయ్య, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ -
స్కూల్లో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత.. 101 సార్లు పొడిచి..
బ్రస్సెల్స్: చిన్నప్పుడు స్కూల్లో అవమానించిందని ఓ వ్యక్తి టీచర్పై కక్ష్య పెంచుకున్నాడు. ఏడేళ్ల వయసులో జరిగిన అవమానానికి దాదాపు 30 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు. గుంటెర్ ఉవెంట్స్ అనే 37 ఏళ్ల వ్యక్తి 2020లో టీచర్ను హత్య చేశాడు. ఏకంగా 101 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘోర ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బెల్జియం పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. కాగా 2020లో ఆంట్వెర్ప్ సమీపంలో మారియా వెర్లిండెన్ అనే 59 ఏళ్ల టీచర్ను హత్య చేశారు. 101 సార్లు పొడిచి చంపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు బెల్జియం పోలీసులు దాదాపు 100 మంది అనుమానితుల డీఎన్ఏలను పరీక్షించారు. అయినా కేసును చేధించలేకపోయారు. అయితే మహిళ మృతదేహం పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్పై ఉన్న నగదు అలాగే ఉండటంతో ఆమెను డబ్బుల కోసం హత్య చేయలేదనే నిర్ధారణకు వచ్చారు. చదవండి: భార్యను వదిలేసి స్వాతి టీచర్తో నాయ్యవాది.. చిత్ర హింసలు.. కాదు కిడ్నాప్! అయితే హత్య జరిగిన 16 నెలల తర్వాత, ఉవెంట్స్ టీచర్ను హత్య చేసిన విషయం తన స్నేహితుడి దగ్గర చర్చించాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఉవెంట్స్ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో లభించిన క్లూతో నిందితుడి డీఎన్ఏను పరీక్షించగా అతనే నేరం చేసినట్లు తేలింది. అంతేగాక నిందితుడు హతురాలి పూర్వ విద్యార్ధి అని తేలింది. తనను అవమానించినందుకే టీచర్ను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. 1990లో తన ఏడేళ్ల వయస్సులో పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో టీచర్ మారియా వెర్లిండెన్ తన గురించి చేసిన వ్యాఖ్యలను ఇప్పటి వరకు మరిచిపోలేదని చెప్పాడు. చదవండి: ఎవరినీ లెక్కచేయని పుతిన్.. బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు.. రష్యా అభ్యంతరం -
కదిరి: గవర్నమెంట్ టీచర్ హత్య.. పార్థీ గ్యాంగ్ పనేనా?
అనంతపురం క్రైం/ కదిరి: కదిరి ఎన్జీఓ కాలనీలో మంగళవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే రెండిళ్లలో చోరీకి తెగబడ్డారు. నగల అపహరణతో ఆగకుండా ఉషారాణి (47) అనే టీచర్ను హతమార్చి..పక్కింట్లో ఉండే టీస్టాల్ రమణ భార్య శివమ్మనూ తీవ్రంగా గాయపరిచారు. అది కూడా జనసంచారం మొదలయ్యే ఉదయం 5.15 నుంచి 5.40 గంటల మధ్య ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది. ఈ తరహా దొంగతనాలు జిల్లా, అంతర్ జిల్లాల దొంగలు చేసే అవకాశం లేదని, మధ్యప్రదేశ్కు చెందిన కరుడుగట్టిన ‘పార్థీ గ్యాంగ్’ పని అయ్యిండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడానికి పోలీసు శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప 10 నుంచి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి..పోలీసులకు తగిన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో వేలిముద్రలు, ఇతరత్రా ఆధారాలు సేకరించారు. ఈ తరహా కేసుల ఛేదింపులో అనుభవం కల్గిన పోలీసు అధికారులు, సీసీఎస్ కానిస్టేబుళ్లను ప్రత్యేక బృందాల్లో నియమించారు. ఈ బృందాలు ఇప్పటికే పని మొదలుపెట్టాయి. కదిరి సమీపంలోని టోల్గేట్తో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెక్పోస్టులు, ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాటిలో అనుమానితుల ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెప్పారు. కదిరి ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరైనా వచ్చారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలైన పులివెందుల, మదనపల్లి, హిందూపురం తదితర ప్రాంతాలకూ బృందాలను పంపి, ఆ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు పరిశీలించేందుకు చర్యలు చేట్టారు. పార్థీ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నందున మధ్యప్రదేశ్కూ ఓ బృందాన్ని పంపుతున్నట్లు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగానే ఛేదిస్తామని చెప్పారు. లాడ్జీల్లో తనిఖీలు ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవరైనా వచ్చి బస చేశారా అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు కదిరి పట్టణంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 15 లాడ్జీల్లో తనిఖీలు చేయడంతో పాటు సీసీ ఫుటేజీ కూడా పరిశీలించారు. అలాగే పాత నేరస్తులపై నిఘా వేశారు. శోకసంద్రంలో చీకిరేవులపల్లి అమడగూరు : దొంగల చేతిలో ప్రభుత్వ టీచర్ ఉషారాణి హత్యకు గురికావడంతో మండలంలోని చీకిరేవులపల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన శంకర్రెడ్డి, ఉషారాణి దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. శంకర్రెడ్డి ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ హైసూ్కల్లో బయోలాజికల్ సైన్స్ టీచర్ కాగా.. ఉషారాణి ఓడీచెరువు జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రణీత్రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుండగా... చిన్నకుమారుడు దీక్షిత్రెడ్డి విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్నారు. ఉషారాణి మృతదేహాన్ని కదిరి నుంచి చీకిరేవులపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు బంధువులు, తోటి ఉపాధ్యాయులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆమె మృతదేహంపై పడి కుమారులు, భర్త రోదించిన తీరు పలువురిని కలచివేసింది. ఎంపీపీ గజ్జల ప్రసాద్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కడగుట్ట కవితతో పాటు మండల వైఎస్సార్సీపీ నాయకులు హతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు కదిరి ప్రభుత్వాస్పత్రిలో ఉషారాణి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి పరిశీలించి..కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
రైలు కింద పడి టీచర్ మృతి.. విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం
మెదక్: భర్త మృతిని తట్టుకోలేక భార్య రెండు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల కొత్త కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు రామారావు(40) కుటుంబం నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సమస్యల కారణంగా సికింద్రాబాద్లో రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసున్నాడు. విషయం తెలుసుకున్న భార్య చిన్నఅమ్ములు అద్దెకు ఉండే రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించగా కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరికి ఇద్దరు పిల్లలు దివ్యాన్షు(6), పూజిత (1)ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు ఉపాధ్యాయుడు మృతి చెందగా అతడి భార్య చిన్న అమ్ములు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలియని వారి పసిపిల్లలు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూడసాగారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. రామారావు విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, ఆకులపేట గ్రామానికి చెందిన నివాసిగా తెలిసింది. అలుముకున్న విషాదం శివ్వంపేట(నర్సాపూర్): మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మృతితో విషాదఛాయ లు అలుముకున్నాయి. చిన్నగొట్టిముక్ల పంచాయతీ కొత్త కాలనీలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పదేళ్ల క్రితం ఉపాధ్యాయుడిగా నియామకమై మొదటి పోస్టింగ్ మండలంలోని తిమ్మాపూర్ ప్రైమరీ స్కూల్, తర్వాత కొత్త కాలనీలోని పీఎస్ పాఠశాలల్లో విధులు నిర్వహించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ బుచ్చనాయక్ తోటి ఉపాధ్యాయులు ఘటన స్థలానికి చేరుకొని నివాళులర్పించారు. -
TS Schools:ఈ ఏడాదీ విద్యావలంటీర్లు లేనట్టే..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల మంది కొత్తగా చేరారు. అయితే ఉపాధ్యాయుల కేటాయింపులో ఈ లెక్కను కొలమానంగా తీసుకోలేమని పాఠశాల విద్యాశాఖ నిక్కచ్చిగా చెబుతోంది. విద్యార్థుల పెరుగుదలపై ఆ శాఖ ఇటీవల ప్రభుత్వానికి ఓ నివేదిక అంద జేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని నివేదికలో పేర్కొంది. తెలంగాణవ్యాప్తంగా 42,575 స్కూళ్లుం టే, ఇందులో 30,001 ప్రభుత్వ, 702 ప్రభుత్వ ఎయిడెడ్, 11,688 ప్రైవేటు, 184 ఇతర యాజ మాన్యాల స్కూళ్లున్నాయి. వాస్తవానికి గతేడాది ప్రభుత్వ స్కూళ్లలో 28,37,635 మంది విద్యార్థులు ఉండగా, ఈ సంవత్సరం 22,26,329 మంది హాజరవుతున్నట్టు తెలిసింది. మిగిలిన ఆరు లక్షల మంది విద్యార్థులు ఇంకా పాఠశాలలకు, వసతి గృహాలకు రావాల్సి ఉంది. ప్రస్తుతం పాఠశాలకు వస్తున్న వారిలో కొత్తగా చేరిన వారి సంఖ్య దాదాపు 2.5 లక్షలు. వీళ్లంతా ప్రైవేటు స్కూళ్ల నుంచే వచ్చి నట్టు అధికారులు చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో వసతులు, విద్యా ప్రమాణాలు పెరగడం వల్లే విద్యార్థులు ఆకర్షితులయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులనూ పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనీసం విద్యా వలంటీర్లనైనా నియమించాలనే డిమాండ్ తెరమీదకొచ్చింది. వాళ్లుంటారా..? ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. కరోనా వల్ల అక్టోబర్ చివరి వరకూ ప్రైవేటు స్కూళ్లలో ప్రత్యక్ష తరగతులు సరిగా జరగలేదు. స్కూళ్లు తెరిచినా ఊళ్లకెళ్లిన పేద, మధ్య తరగతి వర్గాలు తిరిగి పట్టణాలకు రాలేదు. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఫీజులు కట్టేందుకు వెనకాడుతున్నాయి. ఈ కారణాల వల్ల ఎక్కువ మంది అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించారు. దీనివల్లే సర్కారీ స్కూళ్లలో చేరికలు పెరిగాయని అంటు న్నారు. ప్రతీ ఏడాది మాదిరే ఈసారీ కొంతమంది ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటుకు వెళ్లారని అధికా రులు తెలిపారు. కొత్తగా చేరిన విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలోనూ తమ వద్దే ఉంటారన్న నమ్మకం ఏమిటనే సందేహం విద్యాశాఖ వ్యక్తం చేస్తోంది. అందువల్లనే హేతుబద్ధీకరణ ప్రక్రియను వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ఏడాదంతా ఇంతేనా? రేషనలైజేషన్కు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ గత ఆగస్టులోనే విడుదల చేసింది. వాస్తవ సంఖ్య తెలిస్తేనే ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల హేతుబద్ధీకరణ సాధ్యమంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిపైనా స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా 1 నుంచి 5 తరగతుల విషయంలో ఉపాధ్యాయుల కొరతను తీర్చేలా మార్గదర్శకాల్లో పేర్కొంది. పెరిగిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఈ తరగతుల మధ్యే ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు రేషనలైజేషన్ సాధ్యం కాదని చెప్పింది. దీన్నిబట్టి విద్యా వలంటీర్ల నియామకం కూడా సరైంది కాదంది. ఈ ఏడాది మొత్తం స్థానిక సర్దుబాటు ద్వారానే ఉపాధ్యాయుల సేవలు వాడుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీన్నిబట్టి ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు ఉపాధ్యాయుల సర్దుబాటే తప్ప, ఎలాంటి మార్పునకు అవకాశం లేదని విద్యాశాఖ తన నివేదికలో స్పష్టంచేసింది. -
పాఠం చెప్పమంటే పాట పాడుతున్న మాష్టారూ..!
యడ్లపాడు(గుంటూరు): ఆ మాష్టారూ ఎక్కడ ఉన్నా..విద్యార్థులు స్కూల్కు డుమ్మా కొట్టారు. ఎందుకంటే ఆ బడిలో పుస్తకాలు తెరిచి పాఠాలు చెప్పరు..కాని అక్కడి పిల్లలకు ఆ పుస్తకాల్లోని పాఠాలన్నీ కంఠోపాఠం అవుతాయి. ప్రాథమిక విద్యాబోధనను కొందరు పిల్లల వేలుపట్టి రాయించి నేర్పిస్తారు. మరికొందరు బట్టీ పట్టిస్తారు. ఇంకొందరు బొమ్మలతో బోధన చేస్తారు. ఆయన వీటన్నింటికీ భిన్నం. అదేమని ప్రశ్నిస్తే..పాఠం ఎలా బోధించామన్నది కాదు వాటిని ఎంత శ్రద్ధగా విని పిల్లలు గుర్తుంచుకున్నరన్నదే ప్రధానమంటారు. బడి అంటే భయం..పాఠం రాలేదనే టెన్షన్ లేకుండా చెప్పడమే తన లక్ష్యం అంటారు. పాఠం పాటయితే.. ఆయన తరగతి గదికి పాఠ్యపుస్తకం బదులుగా పాటల పుస్తకం తీసుకువస్తారు. అతని చేతిలో చాక్పీస్కు మారుగా స్మాల్మైక్ ఉంటుంది. పాఠాలు చెప్పాల్సిన గొంతునుంచి ట్రాక్మ్యూజిక్ సౌండ్తో కమ్మని పాటలు వినిపిస్తాయి. ఆయన గురించి వింటుంటే ఆశ్చర్యంగా ఉందికదూ.. ఆయన స్వరబోధనే అక్కడ సమ్థింగ్ స్పెషల్ అన్నమాట. ఈ వినూత్న బోధకుడు గుంటూరు జిల్లాకు చెందిన పరావస్తు హనుమాసూరి. ఆలోచన అలా అంకురించింది... ఆధ్యాత్మిక మార్గంలో నడిచే మాస్టారు క్రమం తప్పకుండా గుడికి వెళ్లడం అలవాటు. గుళ్లో ఓ సాయంత్రాన ఏర్పాటైన కార్యక్రమంలో భజన బృందం రాకపోవడంతో భక్తులు నిరాశ చెందారు. పరిస్థితిని అర్థం చేసుకుని జేబులోని సెల్ఫోన్ తీసి ట్రాక్మ్యూజిక్ ఆన్చేసి తనకు వచ్చిన భక్తిగీతాలను ఆలపించారు. ట్రాక్మ్యూజిక్తో పాడిన ఆయన పాటలకు అర్చకుడితో పాటు భక్తులంతా ఫిదా అయ్యారు. పెద్దవాళ్లనే ఆకర్షించిన ట్రాక్మ్యూజిక్ విధానం గుడితో పాటు బడిలోనూ అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచన అంకురించింది. పాటలతో పాఠాలబోధన ప్రస్థానం ఇక్కడి నుంచే... సూరి మాష్టారు పాటల ద్వారా పాఠాలను బోధించే స్వర ప్రస్థానాన్ని యడ్లపాడు మండలం నుంచే ప్రారంభించారు. కొండవీడు హెచ్డబ్ల్యూ స్కూల్కు బదిలీపై వచ్చిన ఆయనకు అధికారులు హెచ్ఎంగా బాధ్యతలు ఇచ్చారు. కాలనీ వాసుల్లో అత్యధికశాతం నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు కావడంతో పట్టించుకునే వారులేక పిల్లలు బడికి రావడం కష్టమైంది. పరిస్థితిని అర్థం చేసుకుని పిల్లల్ని బడిబాట పట్టించాలనే ఆలోచన, అవ్వేషణలోనే గుడిపాట బడికి చేరింది. మైండ్ట్యూనింగ్ ఇదుగో ఇలా.. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను వివిధ సినిమా పాటలుగా మార్చుచేసి గానం చేస్తారు. స్కూల్ ప్రారంభ దశలో పేరడీ పాటలు పాడి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా ఆకర్షిస్తారు. తర్వాత పాఠాలను వాడుక భాషలో బాగా అర్ధమయ్యేలా చిన్నచిన్న పదాలుగా తర్జుమా చేసి పాడేస్తారు. రోజు పాఠశాలకు వస్తూ తన సెల్ఫోన్లో ఏదోఒక సినిమా పాటకు సంబంధించిన మ్యూజిక్ట్రాన్ను ఎంచుకుని రావడం, ఆరోజు చెప్పాల్సిన పాఠాన్ని ఆ ట్రాక్లో పాడటం, పిల్లలచే పదేపదే పాడించడంతో విద్యార్థులకు కంఠోపాఠం అవుతాయి. దీంతో పాఠం శాశ్వతంగా గుర్తుండమే కాదు, తరచు అందరితో కలిసి పాడటంతో స్టేజీఫియర్ కూడా పోతుంది. అన్నింటికి మించి పిల్లల్లో ఉత్సుకత, ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిపాఠం పదమై, చిన్నగొంతులో స్వరమై వారి పెదాలపై లయబద్ధంగా నాట్యం చేస్తుంది. 500లకు పైగా పేరడీ పాటలు... మాట గుండెల్లో దూసుకెళ్లే తూటా అయితే.. ఆ గుండెగాయాన్ని మాయం చేసే పాట అమృతమే కదా. సూరి మాష్టారూ విద్యార్థులకు పాఠ్యాంశాలపై రూపొందించిన పాటలు బోర్ కొట్టకుండా ఉండేందుకు ప్రత్యేక పేరడీ పాటల్ని రాసి పాడించి నవ్విస్తారు. భక్తి, దేశభక్తి, అభ్యుదయం, మానవీయం కోణాల్లోనూ పాటల్ని నేర్పించి వారిని మంచి క్రమశిక్షణతో దేశభక్తిని పెంపొందించేలా కృషి చేస్తున్నారు. సినీ గీతాలను మార్పు చేసి తనకు అనుగుణంగాఇప్పటికీ 500పైగా పాటలు రచించారు. ప్రముఖ కవి పరావస్తు చిన్నయసూరి వంశీయుడే.. నీతి చంద్రిక, బాలవ్యాకరణం, మిత్రలాభం వంటి రచించిన ప్రముఖ కవి పరవస్తు చిన్నయసూరి వంశీయులు హనుమసూరి కావడం విశేషం. మద్రాసులోనిపెరంబుదుర్ స్వస్థలం కాగా వీరి తాతగారు జీయర్సూరి శతాబ్ధాకాలం కిందట బతుకుదెరువు కోసం ఆంధ్రరాష్ట్రానికి కుటుంబంతో సహా వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతుకు నలుగురి సంతానంలో సూరి చివరిసంతానం. పెద్దవారు ముగ్గురు కుమార్తెలే. మొదట రెంటచింతల మండలంలోని తుమ్మురుకోటలో ఉన్న వీరి కుటుంబం, ఉద్యోగ నిమిత్తం ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండల కేంద్రానికి మారారు. ఏంఏ బీఈడీ పూర్తిచేసిన సూరి ప్రస్తుతం ఇదే మండలంలోని డోకిపర్రు గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. అలా సేవలు చేస్తున్నారు.. నాన్వెజ్తో వచ్చే ఇబ్బందులు–ఆకుకూరలతో చేకూరే ఆరోగ్యం, స్నేహం విలువ, భారతీయ సంప్రదాయాలు, తల్లిదండ్రులు, గురువులను పూజించడం, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు అవసరమైన క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం వంటి అనేక కోణాల్లో సూరి పేరడీ రచనలు చేశారు. ఆయన రాసిన ప్రతిపాట సినీబాణీ అయినా..సమాజ హితాన్ని కోరే భావం అందులో దాగుంటుంది. తన పాటలు బడి,గుడిలోనే కాదు బంధుమిత్రుల శుభకార్యాలలోనూ పాడుతుంటారు. తన పేరడీ పాటలకు మెచ్చి వారిచ్చే కానుకలు, నగదును అనాధ, వృద్ధాశ్రమాలకు ఇవ్వడం సూరి సేవాగుణానికి నిదర్శనం. అదే తృప్తి..పరవస్తు హనుమాసూరి, ఎస్జీటీ చిన్ననాటి నుంచి సాహీత్యం అంటే ఇష్టం. బహుశ కవి వంశీయులు కావడమే కావొచ్చు. పేరడీ అంటే ఇష్టపడని వారుండరు. కాని అది రాయడం ఒకింత కష్టమే. సాహిత్యంలో విభిన్నం ఉండాలని, అవి భావితరాలకు, సమాజానికి ఉపయోగపడేలా ఉండలన్నదే ఆకాంక్ష. -
టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్ తొలగింపు
Teacher Expresses Joy Over Pakistan Win Against India Gets Expelled: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియాపై పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాకు చెందిన నఫీసా అత్తారి అనే ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు.. పాక్ క్రికెట్ జట్టు విజయం అనంతరం సంబురాలు చేసుకుని ఉద్యోగాన్ని కోల్పోయింది. స్థానికంగా ఉండే నీర్జా మోదీ అనే స్కూల్లో పనిచేసే నఫీసా.. పాక్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తన వాట్సాప్లో స్టేటస్ పెట్టింది. ఇందులో 'మేం గెలిచాం' అంటూ పాక్ ఆటగాళ్ల ఫోటోలు ఉంచింది. ఇది గమనించిన విద్యార్ధుల తల్లిదండ్రుల్లోని ఒకరు మీరు పాక్కు మద్దతిస్తున్నారా అని నఫీసాను ప్రశ్నించగా.. ఆమె అవునని సమాధానం చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన సదరు తల్లిదండ్రులు..నఫీసా వాట్సాప్ స్టేటస్ స్క్రీన్షాట్లను సోషల్మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో పాఠశాల యాజమాన్యం నఫీసాను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ మేరకు టెర్మినేషన్ లెటరును జారీ చేసింది. ఇది కూడా వైరల్ కావడంతో సర్వత్రా దీనిపై చర్చ నడుస్తుంది. చదవండి: T20 WC 2021: పాక్ విజయంపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మధ్యాహ్న భోజనంలో బల్లి కలకలం
సీతానగరం (పార్వతీపురం): మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా సాంబారులో బల్లి కనిపించడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదన్న వైద్యుల వివరణతో ఊపిరిపీల్చుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని గెంబలివారివీధి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా సాంబారులో చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే హెచ్ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, భోజన నిర్వాహకులు విద్యార్థులను భోజనం చేయనివ్వకుండా నిలువరించారు. ముందు జాగ్రత్తగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 27 మంది విద్యార్థులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యసేవలు అందించారు. ఆస్పత్రిలో 2 గంటల సేపు వైద్యుల సంరక్షణలో ఉంచారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించడంతో ఉపాధ్యాయులు, విద్యారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎన్వీ రమణ, ఆర్ఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ వీరబాబు పాఠశాలకు చేరుకుని వాకబు చేశారు. ఆస్పత్రి నుంచి పాఠశాలకు చేరుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటలకు టమాటా రైస్ వడ్డించారు. ఈ ఘటనపై తహసీల్దార్ మాట్లాడుతూ సాంబారులో బల్లిపడడం వాస్తవమేనని, ఉపాధ్యాయులు, నిర్వాహకులు అప్రమత్తం కావడంతో చిన్నారులకు ప్రమాదం తప్పిందన్నారు. -
కోవిడ్ సాగు: షుగర్ క్వీన్.. తియ్యటి పంట
సీమా రథీశ్ లెక్కల టీచర్. కేరళలోని కసర్గోడ్ జిల్లా, ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం. గత ఏడాది నుంచి కోవిడ్ స్కూళ్ల టైమ్టేబుల్ను, క్యాలెండర్లను తలకిందులు చేసింది. సీమ ఉద్యోగ జీవితం కూడా కొద్దిపాటి ఒడిదొడుకులకు లోనయింది. ఉద్యోగాలు లేని కారణంగా కొందరు, ఆన్లైన్లో ఇంటినుంచి పని చేయడం అనే వెసులుబాటు వల్ల కొందరు పట్టణాలు, నగరాల నుంచి గ్రామాల బాట పట్టారు. సీమ కూడా భర్తతోపాటు తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లి ఊరికే కాలక్షేపం చేయలేదామె. గత ఏడాది నవంబరులో పుచ్చకాయ మొక్కలు నాటింది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసింది. ఈ ఎండాకాలం నాటికి ఐదు టన్నుల తియ్యటి కాయలు కాశాయి. కాయలు కేజీ పాతిక లెక్కన అమ్మింది. అమ్మో! ఇంత ధరా!! అని నోరెళ్లబెట్టిన వాళ్లకు ‘ఇది షుగర్క్వీన్ వెరైటీ పుచ్చకాయ. సేంద్రియ ఎరువులతో పండించాను. తియ్యదనంలో తేడా ఉంటే అప్పుడు అడగండి. మరో కాయ కోసం రాకుండా ఉండగలరేమో చూడండి’ సున్నితంగా సవాల్ విసిరింది సీమ. ఆమె అన్న మాట నిజమే అయింది. కాయలన్నీ మంచి ధరకు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ నెలాఖరుకు ఖర్చులు పోను రెండు లక్షలు మిగిలాయి. పంట పండింది! ‘‘లాక్డౌన్ తర్వాత నేను, మా వారు మా సొంతూరు మీన్గోత్కు వెళ్లాం. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న ఉన్నప్పుడు పదిహేను ఎకరాలు సాగుచేసేవాడు. ఇప్పుడు మా అన్న, అమ్మ మా కుటుంబ వ్యవసాయం చూసుకుంటున్నారు. లాక్డౌన్లో మా ఉద్యోగాల్లో ఎదురైన ఒడిదొడుకులు గమనించిన మా అన్నయ్య ‘వ్యవసాయం ఇప్పుడు లాభసాటిగానే ఉంటోంది. ప్రయత్నించకూడదూ’ అని సలహా ఇచ్చాడు. సాగు చేయకుండా ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో కలుపుతీసి, రాళ్లు ఏరివేసి, మంచి ఎరువు వేసి సాగుకు అనువుగా మట్టిని గుల్లబరిచాం. నషీద్ అనే స్నేహితుడి సూచన ప్రకారం షుగర్ క్వీన్ రకం పుచ్చమొక్కలు నాటాం. మొత్తం ఐదు లక్షలు ఖర్చయింది. ఖర్చులు పోగా తొలి పంట ఆదాయం రెండు లక్షలు. ఇప్పుడు బెండకాయ, మిర్చి, ఉల్లిపాయ పంటలు వేస్తున్నాను. కోవిడ్ పూర్తిగా తగ్గిపోయి పూర్తిస్థాయిలో మా ఉద్యోగాలు గాడిన పడినా సరే... ఉద్యోగం చేస్తూనే వ్యవసాయాన్ని కొనసాగిస్తాను. కోవిడ్ చాలా నేర్పించింది. నేను వ్యవసాయం చేయగలనని నాకు తెలియచేసింది’’ అంటోంది సీమ. చదవండి: Oxygen Train: లోకో పైలట్ శిరీషకు ప్రధాని ప్రశంస -
తరగతి గదిలో టీచర్పై హత్యాయత్నం
ఇరగవరం: ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న మహిళపై ఆమె భర్త హత్యాయత్నం చేసిన ఘటన ఇరగవరం మండలం కాకిలేరు గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై జానా సతీష్ కథనం ప్రకారం నారాయణపురం గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మికి జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన కడలి రామ దుర్గాప్రసాద్కు 2016లో పెళ్లయింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలంగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. ఉపాధ్యాయురాలైన నాగలక్ష్మికి గతనెల 16న కాకిలేరు శివారు సింగోడియన్ పేటలోని ఎంపీపీ పాఠశాలకు బదిలీ అయింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె భర్త రామదుర్గా ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటాచార్యులు వద్దకు వచ్చి నాగలక్ష్మి టీచర్ను కలవాలని అడిగాడు. ఆమె క్లాస్రూమ్లో ఉందని చెప్పడంతో క్లాస్ రూమ్కు వెళ్లి విద్యార్థులు చూస్తుండగానే జుట్టు పట్టుకుని నేల్ కట్టర్లోని చాకుతో వీపుపై, పక్కటెముకలపై దాడి చేశాడు. విద్యార్థులు గట్టిగా అరవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అక్కడకు చేరుకుని వెంటనే ఎంఈఓ ఎస్.శ్రీనివాసరావు ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో నాగలక్ష్మిని పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించిన తరువాత తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రామ దుర్గాప్రసాద్పై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో వరకట్నం వేధింపుల కేసు ఉందని, ప్రస్తుత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
వన్సైడ్ లవ్.. టీచర్పై కాల్పులు
లక్నో : తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో స్కూల్ టీచర్పై కాల్పులు జరిపాడో యువకుడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 22 ఏళ్ల నీతు యాదవ్ షేర్పట్టిలోని ఓ స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తోంది. గురువారం మధ్యాహ్నం స్కూలు ముగిసిన తర్వాత ఇంటికి బయలు దేరింది. సుల్తాన్పూర్ఘౌరీకి చెందిన అంకుల్ యాదవ్ బైక్పై ఆమెను వెంబడించాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెను అడ్డగించటంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అంకుల్ ఆమెపై పిస్టల్తో కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితురాలిని దగ్గరిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ( సైకో ఫ్రెండ్.. ఇద్దరిని కాల్చిపడేసిన పీజీ విద్యార్థి ) ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారణాసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతోనే అంకుల్ ఈ దారుణానికి తెగబడ్డట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇద్దరూ 12 వ తరగతి వరకు ఒకే చోట చదువుకున్నారని తెలిసింది. -
ప్రియురాలు ఆగ్రహించింది..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం(కారేపల్లి): పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఇప్పుడు మాట తప్పి మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన తన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన మండల పరిధిలోని భాగ్యనగర్తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన కుంజా హేమలత ప్రస్తుతం పినపాక మండలం ఐలాపురం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తోంది. చదవండి: (స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై) ఇకారేపల్లి మండలం భాగ్యనగర్తండా గ్రామానికి చెందిన గుగులోతు అశోక్ గుండాల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. వీరిద్దరూ భద్రాచలంలోని ఐటీడీఏ బీఈడీ కళాశాలలో చదువుకున్నారు. ఆ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని తనను లొంగదీసుకున్న అశోక్ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని, కుటుంబ సభ్యులతో హేమలత ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. చదవండి: (నెల రోజుల్లో వివాహం.. అర్ధరాత్రి దారుణహత్య) -
2,894 మంది టీచర్లు, సిబ్బందికి కరోనా..
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని 2,894 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో 2,212 మంది టీచర్లు ఉండగా, 682 ఉపాధ్యాయేతర సిబ్బంది ఉన్నారు. తొమ్మిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు 2,27,775 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. వీరిలో 1,51,539 మంది టీచర్లకు కరోనా పరీక్షలు పూర్తికాగా, 2,212 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరోవైపు 92,343 మంది ఉపాధ్యాయేతర సిబ్బంది ఉండగా, వీరిలో 56,034 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 682 మందికి కరోనా వచ్చినట్లు తెలిసింది. డిసెంబర్ ఆఖరి వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రం కానున్న నేపథ్యంలో కరోనా మళ్లీ పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో అందరు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల బడి బాట రాష్ట్రంలోని ఏడు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ప్రారంభమైన పాఠశాలకు విశేష ఆదరణ లభిస్తుండటంతో మరిన్ని పాఠశాలలను ప్రారంభించారు. అలాగే పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత పది రోజుల్లో విద్యార్థుల హాజరు శాతం దాదాపు రెట్టింపు అయిందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 8 జిల్లాల్లో 90 శాతానికిపైగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కరోనా ఉన్నాకూడా తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పలువురికి కరోనా సోకుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 25,866 పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. చదవండి: (21వ శతాబ్దపు పౌరులకు టీచర్ను!) వీటిలో 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్లలో చదివే విద్యార్థుల సంఖ్య 59,27,456గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు నవంబర్ 23వ తేదీ నుంచి 35 శాతం అనగా 9,127 పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోగా కేవలం 2,99,193 మంది విద్యార్థులు హాజరయ్యా రు. ప్రస్తుతం ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్కూళ్లు, కాలేజీలకు వస్తున్న విద్యార్థు ల సంఖ్య పెరుగుతుండటంతో తాజాగా మరో రెండు వేలకుపైగా పాఠశాలలు ప్రారం భమయ్యాయి. దీంతో డిసెంబర్ 3వ తేదీ వర కు అందిన వివరాల మేరకు రాష్ట్రంలో మొ త్తం 11,296 పాఠశాలలు తెరుచుకున్నాయి. అదేవిధంగా పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కూడా దాదాపు రెట్టింపు అయిం దని చెప్పవచ్చు. ప్రారంభంలో కేవలం 2,99,133 మంది విద్యార్థుల హాజరుకాగా ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగిన 4,88,222కు చేరిందని విద్యా శాఖ పేర్కొంది. చదవండి: (న్యూ ఇయర్ జోష్కు బ్రేక్) ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికి పైగా.. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికిపైగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. గడ్చిరోలి, ఉస్మానాబాద్, సాతారా, లాతూర్, షోలాపూర్, చంద్రాపూర్, ధులే, నాందేడ్ జిల్లాల్లో 90 శాతానికిపైగా పాఠశాలలు తెరుచుకున్నాయి. మరోవైపు అకోలా, యావత్మాల్, జాల్నా, ఔరంగాబాద్, నందుర్బార్, రత్నగిరి, సింధుదుర్గా, వర్దా జిల్లాల్లో 60 శాతానికిపైగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. స్కూళ్లు ప్రారంభంకాని జిల్లాల్లో కూడా అక్కడి పరిస్థితులను అనుగుణంగా తొందర్లోనే ప్రారంభిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. -
స్కూలు టీచర్కు భారీ బహుమతి.. ఎందుకంటే?
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్సిన్హ్ డిసేల్ (32) చరిత్ర సృష్టించారు. భారతదేశంలో క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ విప్లవానికి పునాదివేయడంతోపాటు, బాలికా విద్య ప్రోత్సాహానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఒక మిలియన్ డాలర్ల వార్షిక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 కు విజేతగా ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 10మంది ఫైనలిస్టులతో పోటీపడి మరీ డిసేల్ ఈ ఘనతను సాదించారు. అంతేకాదు తన ప్రైజ్ మనీని తోటిపోటీదారులతో కలిసి పంచుకుంటానని ప్రకటించి విశేషంగా నిలిచారు. వృత్తిపరంగా వారు చేసిన అసాధారణమైన కృషికి మద్దతుగా తన బహుమతిలో 50 శాతం నగదును టాప్-10 ఫైనలిస్టులతో పంచుకుంటానని ఆయన ప్రకటించారు. అంటే మిగతా తొమ్మిదిమంది ఫైనలిస్టులు ఒక్కొక్కరూ 55 వేల డాలర్లు చొప్పున అందుకుంటారు. బహుమతి డబ్బును పంచుకున్న మొదటి విజేతగా చరిత్ర సృష్టించారని ప్రముఖ దాత, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ అన్నారు. తద్వారా పంచుకోవడం, ఇవ్వడంలోని ప్రాముఖ్యతను ప్రపంచానికి బోధించారని ప్రశంసించారు. రంజిత్లాంటి ఉపాధ్యాయులు క్లైమేట్ చేంజ్ను నిలువరించడంతో పాటు, శాంతియుతమైన, ధర్మబద్ధమైన సమాజాలను నిర్మిస్తారని, అసమానతలను తొలగించి ఆర్థికవృద్ధితో ముందుకు నడిపిస్తారని యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) సహాయ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా జియాన్నిని కొనియాడారు. తద్వారా మన భవిష్యత్తును కాపాడుతారని పేర్కొన్నారు. మరోవైపు కరోనా మహమ్మారి విద్యను, విద్యార్థులను బాగా ప్రభావితం చేసింది. కానీ ఈ కష్ట సమయంలో ప్రతి విద్యార్థి వారి జన్మహక్కు అయిన నాణ్యమైన విద్యను పొందేలా తమ వంతు కృషి చేస్తున్నారని డిసేల్ అన్నారు. డిసేల్ కృషి 2009 లో సోలాపూర్లోని పరితేవాడిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డిసెల్ వచ్చినప్పుడు అదొక శిధిలమైన భవనం. స్టోర్ రూంగా, పశువుల కొట్టంగా దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేది. ఈ పరిస్థితిని ఛాలెంజింగ్గా తీసుకున్న డిసెల్ పాఠశాల సంస్కరణకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు బాలికలను పాఠశాలకు రప్పించాలని ధ్యేయంగా పెట్టుకన్నారు. అలాగే గ్రామంలో బాల్య వివాహాలను అడ్డుకోవడంపై దృష్టి పెట్టారు. ఆయన కృషి ఫలితంగా 100శాతం బాలికలు హాజరుకావడం మాత్రమే కాదు, గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా నిలువరించగలిగిన ఘనతను దక్కించుకున్నారు. విద్యార్థులకు స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడటం, తరగతి పాఠ్యపుస్తకాలను విద్యార్థుల మాతృభాషలోకి అనువదించడమే కాకుండా, ఆడియో పాఠాలను అందించేందుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్లను తీసుకొచ్చారు. వీటితోపాటు వీడియో ఉపన్యాసాలు, కథలు, ఎసైన్మెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేశారు. దీంతో మహారాష్ట్రలో క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టిన తొలి పాఠశాలగా డిసేల్ ఆధ్వర్యంలోని స్కూలు నిలిచింది. డిసేల్ ప్రతిపాదిత పైలట్ పథకం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడతామని రాష్ట్ర మంత్రిత్వ శాఖ 2017 లో ప్రకటించింది. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టి) పాఠ్యపుస్తకాలు క్యూఆర్ కోడ్తో రూపొందించాలని 2018లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచ దేశాల యువకుల మధ్య శాంతిని పెంపొందించేందుకుకూడా డిసేల్ విశేష కృషి చేశారు."లెట్స్ క్రాస్ ది బోర్డర్స్" ప్రాజెక్ట్ పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో భారతదేశం, పాకిస్తాన్, పాలస్తీనా ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, యుఎస్ , ఉత్తర కొరియాకు చెందిన అనేకమంది యువకులను భాగస్వామ్యం చేశారు. ఇప్పటివరకు, ఎనిమిది దేశాల 19,000 మంది విద్యార్థులనుఇందులో చేరడం విశేషం. అంతేకాకుండా, మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ద్వారా వీకెండ్స్లో విద్యార్థులను వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్కు తీసుకెళతారు. మరీ ముఖ్యంగా తన ఇంటిలో నిర్మించిన సైన్స్ ల్యాబ్ ద్వారా శాస్త్రీయ ప్రయోగాలతో విద్యార్థులను ఆకట్టుకుంటూ మరింత పాపులర్ అయ్యారు. కాగా 2014 లో వర్కీ ఫౌండేషన్ ఏర్పాటైంది. ఉపాధ్యాయు వృత్తిలో విశేష కృషి చేసిన అసాధారణమైన టీచర్లను గౌరవిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక బహుమతిని ప్రకటిస్తుంది. 140 కి పైగా దేశాల నుండి 12వేల మందికి పైగా దరఖాస్తు చేయగా తుది విజేతగా డిసేల్ ఎంపికయ్యారు. నైజీరియాకు చెందిన ఒలాసుంకన్మి ఒపీఫా, యూకేకు చెందిన జామీ ఫ్రాస్ట్, ఇటలీ నుండి కార్లో మజ్జోన్, దక్షిణాఫ్రికా నుండి మోఖుడు సింథియా మచాబా, అమెరికాకుచెందిన లేహ్ జుయెల్కే, యున్ జియాంగ్, దక్షిణ కొరియాకు చెందిన హ్యూన్, మలేషియాకు చెందిన శామ్యూల్ యెషయా, వియత్నాం నుండి హన్హ్ ఫాంగ్ , బ్రెజిల్ నుండి డోని ఇమాన్యులా బెర్టాన్ టాప్ 10లో నిలిచారు. గ్లోబల్ టీచర్ ప్రైజ్ మనీని 10 సంవత్సరాలలో సమాన వాయిదాలలో చెల్లిస్తుంది -
264 మంది టీచర్లకు కరోనా
సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు చేస్తున్న పరీక్షలలో కేవలం మూడు ప్రాంతాల్లోనే 264 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దాటుతుందోనని విద్యాశాఖ అప్రమత్తమైంది. దీంతో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయా లేదా మళ్లీ ఈ విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే విషయంపై కొంత అయోమయం నెలకొంది. అయితే రాష్ట్ర ఉన్నత విద్యా, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ప్రాజక్తా తాన్పురే మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు విద్యార్థులను పంపించడం తప్పనిసరేం కాదని వెల్లడించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను నవంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేయడం ప్రారంభమైంది. అయితే ఈ పరీక్షల్లో 264 మంది టీచర్లకు కరోనా పాజిటివ్గా తేలింది. ముఖ్యంగా షోలాపూర్ గ్రామీణ ప్రాంతంలో 178 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. నాసిక్ జిల్లాలో 45 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాగ్పూర్ జిల్లాలో 41 మందికి కరోనా సోకింది. ఇలా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో వందలాది మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్లు వెల్లడవడంతో విద్యాశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. దీంతో ఇప్పటికే ముంబై, థానేలతోపాటు అనేక ప్రాంతాల్లో పాఠశాలలను మరి కొన్ని రోజులు మూసి ఉంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా పాఠశాలలను ఇప్పుడే తెరవద్దని ఈ సంవత్సరం మొత్తం ఆన్లైన్లోనే విద్యాబోధన కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలతోపాటు పలువురు విద్యా«ర్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. (భారత్లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందా? ) నాసిక్లో జనవరిలోనే పాఠశాలలు నాసిక్ జిల్లాలో 2021 జనవరి 4వ తేదీ వరకు పాఠశాలలు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జిల్లా ఇన్చార్జీ మంత్రి ఛగన్ భుజ్బల్ అధ్యక్షతన నాసిక్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయులకు చేసిన కోవిడ్ పరీక్షల్లో నాసిక్లో ఎనిమిది మందికి, గ్రామీణ ప్రాంతంలో 37 మందికి పాజిటివ్గా తేలింది. మరోవైపు ప్రస్తుతం జిల్లాలో 2,556 మంది కరోనా రోగులున్నారు. ఇలాంటి నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జనవరి 4వ తేదీ వరకు పాఠశాలలు మూసి ఉంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లకు రావడం తప్పనిసరి కాదు: విద్యాశాఖ సహాయ మంత్రి ప్రాజక్తా తాన్పురే నవంబర్ 23వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు రావడం తప్పనిసరికాదని రాష్ట్ర ఉన్నత విద్యా, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ప్రాజక్తా తాన్పురే తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు తెరవడం కూడా తప్పనిసరేమి కాదని, విద్యార్థులకు ఆన్లైన్లో విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు నవంబర్ 23వ తేదీ నుంచి తెరవనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీపావళి పండుగ అనంతరం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో ముంబై, నవీముంబై, థానే, పుణేలతోపాటు పలు ప్రాంతాల్లో పాఠశాలలు డిసెంబర్ నెల వరకు తెరవబోమని ప్రకటించాయి. (కరోనా టీకాపై భారత్ ఆశలు.. తేల్చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్) మరోవైపు విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ పాఠశాలలు తెరువాలా..? వద్దా..? అనే విషయంపై స్థానిక పాలక సంస్థలదే తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు పాఠశాలలు తెరవకముందే ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించుకోవడం అనివార్యం చేసింది. దీంతో పరీక్షలు చేసుకున్న వందలాది మంది ఉపాధ్యాయులకు, సిబ్బందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది. ఇలాంటి నేపథ్యంలో పాఠశాలలకు తమ పిల్లలను పంపే విషయంపై అనేక మంది నిరాకరిస్తుండగా మరి కొందరు అయోమయంలో ఉన్నారు. దీంతో విద్యాశాఖ సహాయక మంత్రి ప్రాజక్తా తాన్పురే పిల్లలను పాఠశాలలకు పంపించడం తప్పనిసరేమి కాదన్నారు. దీంతో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులల్లో కొంత అయోమయం తగ్గి ఊరట లభించింది. నాగ్పూర్లోనూ బంద్ నాగ్పూర్లోనూ డిసెంబర్ 13వ తేదీ వరకు పాఠశాలలు మూసి ఉంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడుతారని నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిప్రాయపడ్డారు. దీంతో పాఠశాలలు మూసే ఉంచాలని కమిషనర్ నిర్ణయం తీ సుకున్నారు. ఈ మేరకు ఆదివారం సం బంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశా రు. ఇప్పటి వరకు ముంబైతోపాటు థానే, పుణే ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పన్వేల్ మున్సిపల్ కార్పొరేషన్, నవీముంబై, భివండీతోపాటు రెండు మున్సిపాలిటీల్లో డిసెంబర్ తర్వాతే పాఠశాలలు తెరవాలని ఆయా స్థానిక పాలక సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. -
ట్రావెలింగ్ టీచర్
భారతదేశం నుంచి బహుశా ఆమె ఒక్కర్తే ఈ బిరుదుకు అర్హురాలు. త్రివేండ్రంకు చెందిన మన్నా అబ్రహం కువైట్లో టీచరుగా పని చేస్తూ అమెరికాకు వెళ్లి 2004లో ప్రపంచంలో అతి పెద్దదైన రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్లో ‘ట్రావెలింగ్ టీచర్’గా చేరారు. సొంత విలాసవంతమైన ట్రైన్ కలిగిన ఆ సర్కస్ అమెరికా అంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుంటుంది. ఆ రైలులో కేటాయించిన ఒక గదిలో ఉంటూ 8 ఏళ్లు మన్నా అబ్రహం సర్కస్ పిల్లలకు పాఠాలు చెప్పారు. చెన్నైలో స్థిరపడిన మన్నా ఇటీవల తన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో రాయడంతో అందరూ ఆమెను వెతుకుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన టీచర్ పరిచయం ఇది. కాలు కుదురుగా ఉండని లక్షణం మన్నాకు లాభించింది. ఆమె ఎలాగైతే లోకాన్ని చుడుతూ ఉండాలని కోరుకున్నారో అలాగే చుట్టే అవకాశం దొరికింది. ఒక భారతీయ మహిళ అమెరికాలో ప్రఖ్యాత సర్కస్ కంపెనీలో 8 ఏళ్ల పాటు ఉండి, వారితో పాటు తిరుగుతూ, వారి పిల్లలకు పాఠాలు చెప్పడం సామాన్యమైన విషయం కాదు. పెద్ద ఘనత. ఆ ఘనతను సాధించిన వ్యక్తి మన్నా అబ్రహం. ఇటీవల ఆమె తన అనుభవాలను ఒక సోషల్ మీడియా గ్రూప్లో పంచుకోవడంతో అవి వైరల్ అయ్యాయి. అందరూ ఆ అనుభవాల కోసం చెవి ఒగ్గుతున్నారు. పేపర్ ప్రకటన చూసి త్రివేండ్రంకు చెందిన మన్నా అబ్రహం మొదట చెన్నైలో ఆ తర్వాత కువైట్లో టీచర్ గా పని చేశారు. అయితే అక్కడ కూడా ఉండలేకపోవడంతో 2001లో అమెరికా వెళ్లారు. అక్కడ పాఠాలు చెబుతూ ఉండగా ఒక ప్రకటన ఆమె దృష్టికి వచ్చింది. ‘ఒక సర్కస్ కంపెనీకి ట్రావెలింగ్ టీచర్ కావాలి’ అని ఉంది అందులో. అయితే తర్వాత తెలిసింది ఆ సర్కస్ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్దదైన రింగ్లింగ్ బ్రదర్స్ కంపెనీ అని. ‘మొత్తం మీద సర్కస్లో పని అని అప్లై చేశాను’ అని గుర్తు చేసుకున్నారు మన్నా అబ్రహం. అమెరికన్ విద్యా చట్టాల ప్రకారం సంచార ఉపాధిలో ఉండే బృందాల పిల్లలకు కూడా తప్పనిసరిగా విద్య అందాలి. అందువల్ల సర్కస్లో ఉండే పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ కావాలి. అలా మన్నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ‘నేను చేరింది 2004లో. అప్పుడు నా వయసు 41. నేను పాఠాలు చెప్పాల్సింది సర్కస్లో పని చేసే కళాకారుల పిల్లలు లేదా సర్కస్లో ప్రదర్శనలు ఇచ్చే పిల్లలు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం అన్ని క్లాసులకు అన్ని సబ్జెక్ట్లు చెప్పమన్నారు. ఒప్పుకున్నాను’ అన్నారామె. రైలు జీవితం రింగ్లింగ్ బ్రదర్స్ చాలా భారీ సర్కస్. చాలా డబ్బున్న సర్కస్. అందులో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో పాటు రకరకాల పనులు చేసే వందల కొద్ది కళాకారులు ఉండేవారు. వారిని, జంతువులను, సామగ్రిని ఒక చోట నుంచి మరో చోటకు తరలించడానికి సర్కస్ కంపెనీ సొంతంగా ఒక విలాసవంతమైన రైలును కొనుక్కుంది. ‘దాని పొడవు ఒక మైలు ఉండేది’ అన్నారు మన్నా నవ్వుతూ. సర్కస్ యజమాని, మేనేజర్లు, కళాకారులు అందరూ దాదాపు అందులోనే జీవితం గడిపేవారు. ‘నాకు ఒక చిన్న గది రైలులోనే ఇచ్చారు. అందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్. కిచెన్ ఉండేవి. నేను భారతీయ వంటకాలు చేసుకు తినేదాన్ని. వాటి కోసం వివిధ దేశాల కళాకారులు నా రూమ్కు వచ్చేవారు’ అంటారు మన్నా. 27 దేశాల జాతీయలు ‘సర్కస్ అంటే ప్రపంచ దేశాల వారు నివశించే ఒక సంత. రింగ్లింగ్ బ్రదర్స్లో 27 దేశాల జాతీయులు ఉండేవారు. చైనా, బ్రెజిల్, రష్యా, చిలీ, కంబోడియా... అయితే అందరు పిల్లలకు ఇంగ్లిష్ బోధన భాషగా అర్థమయ్యేది కాదు. నేను ఇతర సీనియర్ విద్యార్థుల చేత వారితో మాట్లాడించి వారికి కొద్దో గొప్పో నా పాఠాలు అర్థమయ్యేలా చేసేదాన్ని. రైలు ఎక్కడ ఆగితే అక్కడ నాకు కేటాయించిన స్థలంలో ఆరుబయట క్లాసులు నిర్వహించేదాన్ని. రైలు వెళుతున్నప్పుడు పాఠాలు ప్లాన్ చేసుకునేదాన్ని. పిల్లల పుస్తకాలు, పరీక్ష పేపర్లు అన్నీ నా అజమాయిషీలోనే ఉండేవి. ఆశ్చర్యం ఏమిటంటే విద్యాశాఖ అధికారులు మధ్య మధ్య ఇన్స్పెక్షన్కు ఊడిపడేవారు... క్లాసులు ఎలా జరుగుతున్నాయా అని’ అన్నారు మన్నా. 48 రాష్ట్రాలు అమెరికాలో పుట్టి పెరిగిన వారు కూడా తమ జీవిత కాలంలో అమెరికా అంతా చూడరు. కాని మన్నా అబ్రహమ్ అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో 48 రాష్ట్రాలు చుట్టేశారు. ‘మా రైలు వెళ్లని రాష్ట్రం లేదు’ అంటారామె. మంచు దిబ్బల మధ్య నుంచి, ఎడారి దారుల నుంచి రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్ రైలు ప్రయాణించింది. ‘మేము ఆగిన చోట ఉంచి తెలిసినవాళ్లో స్నేహితులో వచ్చి నాకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూపించేవారు.’ అన్నారామె. వీడ్కోలు వందేళ్ల క్రితం సర్కస్ మొదలైనప్పుడు దానికి ఉండే ప్రాభవం వందేళ్ల తర్వాత ఏ సర్కస్కూ లేదు. ఒక రకంగా మన్నా సర్కస్లపై చివరి ప్రభావం చూసినట్టు లెక్క. ఆమె రింగ్లింగ్స్లో 2004–2013 మధ్య పని చేశారు. ఆ తర్వాత ఇండియా వచ్చి చెన్నైలో స్థిరపడ్డారు. 2017లో ఆ సుదీర్ఘ చరిత్ర ఉన్న సర్కస్ మూతపడింది. ‘సర్కస్ ఒక వింత ప్రపంచం. అక్కడే పుట్టుకలు, చావులు, ప్రేమలు, గుండెకోతలు, కలయికలు, వీడ్కోళ్లు... ఎన్నో. అక్కడ ఉన్న 8 ఏళ్లు నేను ఎన్నో విలువైన అనుభవాలు మూటగట్టుకున్నాను. లోకం తిరగగా నాకు అర్థమయ్యింది ఏమిటంటే ప్రతి మనిషి బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని. సర్కస్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు అక్కడి ఏనుగుల గుంపు నన్ను కావలించుకొని సాగనంపాయి. అది మాత్రం మర్చిపోలేను’ అంటారామె. మన్నా అబ్రహమ్ తన అనుభవాలను గ్రంథస్తం చేస్తే అదొక విలువైన డాక్యుమెంటేషన్ అవుతుంది. ఆ పని చేస్తారని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
ఒళ్లంతా పచ్చబొట్లే.. ఇదేం పిచ్చిరా నాయనా
పారిస్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడి వేషధారణ ఎంత సక్రమంగా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. టీచర్ ఎంత పద్దతిగా ఉంటే విద్యార్థులు కూడా అంత బాగుంటారని ప్రతీ తల్లిదండ్రులు భావిస్తారు. కానీ ఇక్కడ ఒక టీచర్ మాత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా శరీరమంతా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. చివరికి కంట్లోని గుడ్డు పక్కన ఉన్న పొరను కూడా తొలిగించుకొని టాటూ వేయించుకున్నాడు.. అతని అవతారం చూసిన పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్కూల్ యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. (చదవండి : పార్లమెంట్లోని బార్లలో పొంగుతున్న బీర్లు) వివరాలు.. సిల్వైన్ అనే వ్యక్తి ఫ్రాన్స్ దేశంలోని పలైసేలోని డాక్టూర్ మోరే ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. తల నుంచి కాలు వరకు టాటూలు వేయించుకున్నాడు. 35 ఏండ్ల సిల్వైన్ ఆరు సంవత్సారాల వయసున్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దలకు బోధిస్తున్నాడు. దీంతో అతనిని ఫ్రెంచ్ కిండర్ గార్టెన్లో బోధించకుండా విధుల నుంచి తొలగించారు. 'త్వరలో నా ప్రొఫెషన్ను మళ్లీ కొనసాగిస్తా. పిల్లలకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. వారి తల్లిదండ్రులు కూడా నాతో బాగానే ఉంటారు. కాకాపోతే నన్ను దూరం నుంచి చూసి తప్పుగా అర్థం చేసుకున్నారంటూ' సిల్వైన్ చెప్పుకొచ్చాడు. కాగా సిల్వైన్కు 27 ఏండ్ల వయసు నుంచే టాటూల మీద ఇష్టం ఏర్పడింది. ఈ 8 సంవత్సరాల్లో అతని చెవులు, నాలుకతో సహా దాదాపు మొత్తం శరీరాన్ని సిరాతో కప్పేశాడు. (చదవండి : ఆర్మేనియా– అజర్బైజాన్ మధ్య ఘర్షణ) -
నిత్య పెళ్లి కొడుకు: స్పందించిన మొదటి భార్య
సాక్షి, విజయవాడ : విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్నాడు. కట్నం కోసం ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ క్రమశిక్షణ తప్పాడు. ఆగ్నిసాక్షిగా కట్టిన తాళిని ఎగతాళి చేస్తూ ముగ్గురు మెడలో మూడుముళ్లు వేశాడు. రెండో భార్య దిశ పోలీసులను ఆశ్రయించడంతో బడిపంతులు బాగోతం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అవనిగడ్డకు చెందిన శీలం సురేష్ చాట్రాయి మండలంలోని మర్రిబంధం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. 2011 లో శాంతిప్రియ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం తేలేదని ఆమెను వదిలేసి, మొదటి పెళ్లి గురించి చెప్పకుండా 2015 లో శైలజ అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. కట్నం కింద నాలుగులక్షల రూపాయలు, పది సవర్ల బంగారం తీసుకొన్నాడు. ఆడపిల్లకు జన్మనిచ్చిందని శైలజతో తెగతెంపులు చేసుకొని 2019 లో అనూష అనే ఉపాధ్యాయిని రహస్యంగా మూడో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి నిలదీసిన భార్య శైలజ ,అత్తలపై దాడి చేశాడు. సురేష్ నయవంచనపై జిల్లా విధ్యాశాఖాధికారితో పాటు దిశ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. సురేష్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు పెళ్లిళ్లకు సహకరించిన సురేష్ తల్లిదండ్రులు, అన్నయ్యపై చర్యలు తీసుకోవాలని విజయవాడ దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో మహిళ మోసపోకముందే సురేష్ను అరెస్ట్ చేయాలని రెండో భార్య శైలజ విజ్ఞప్తి చేశారు. న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. బాధిత భార్యలకు మహిళ సంఘాలు అండగా నిలిచాయి. సురేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. అదనపు కట్నం కోసం వేధించాడు : సురేష్ మొదటి భార్య నిత్య పెళ్లికొడుకు సురేష్ బాగోతంపై ఆయన మొదటి భార్య శాంతి ప్రియ స్పందించారు. తనలాగే మరో ఇద్దరిని కూడా మోసం చేశాడని తెలిసి బాధపడ్డానని తెలిపారు. సురేష్ పై చర్యలు తీసుకోకుంటే మరింతమందిని మోసం చేస్తారని పేర్కొన్నారు. తాను కేసు పెట్టినప్పుడే చర్యలు తీసుకుంటే మరో ఇద్దరు మహిళలకు అన్యాయం జరిగేది కాదని వాపోయారు. రూ.10లక్షలు కట్నంగా తీసుకొని ఇంకా కావాలని తనను వేధించారని ఆరోపించారు. పుట్టింట్లో ఘనంగా పుట్టిన రోజు జరుపుతానని చెప్పి వదిలేసి కనిపించకుండా వెళ్లాడని చెప్పారు. సురేష్కు పలుకుబడి ఉండటం వల్ల ఏ కేసులోనూ చిక్కకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయమని త్వరలోనే మహిళా కమిషన్ను కూడా కలుస్తానని శాంతిప్రియ పేర్కొన్నారు. -
నిత్య పెళ్లికొడుకుగా మారిన ఓ ప్రధానోపాధ్యాయుడు
-
బడికి రాకపోతే చర్యలే..!
నెల్లూరు (టౌన్): జిల్లాలోని పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉండాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. మరో మూడు రోజుల సమయమిస్తామని, ఆలోపు 100 శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలలకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే కావలి, గూడూరు, నెల్లూరు డివిజన్ల వారీగా పాఠశాలలకు రాని ఉపా«ధ్యాయుల వివరాలను ఆయా డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు సేకరించారు. జిల్లాలో రెండు వేల మందికిపైగా ఉపాధ్యాయులు పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. అయితే వీరిలో దాదాపు వెయ్యి మంది వరకు కంటైన్మెంట్ జోన్లలో ఉండటం, దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. వీరికి పాఠశాలల హాజరుకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. మరో వెయ్యి మందికి పైగా టీచర్లు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. వీరికి త్వరలో మెమోలు జారీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా శుక్రవారం మ«ధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్య పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్నారు. -
సార్ రేపటి నుంచి రారని చెప్పడంతో..
సాక్షి, ఆదిలాబాద్: విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడు వృత్తిలో భాగంగా వేరే ప్రాంతాలకు బదిలీ కావడం, లేదంటే ఉద్యోగ విరమణ పొందడం సహజం. అయితే, కేవలం మాష్టారుగానే కాకుండా.. పిల్లలతో ఓ స్నేహితుడిలా, మార్గదిర్దేశకుడిగా వ్యవహరించేవారు అరుదు. అలాంటి వారిలో బజార్ హత్నూర్ మండలం ప్రాతమిక పాఠశాల ఉపాధ్యాయుడు శంకర్ యాదవ్ ఒకరు. ఆయన నిన్న (ఫిబ్రవరి 29) పదవీ విరమణ పొందారు. శంకర్ సార్ రేపటి నుంచి పాఠశాలకు రారని తోటి ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పడంతో.. పిల్లలు ఆయనను చుట్టూచేరి వెళ్లొద్దంటూ భోరున ఏడ్చారు. విద్యార్థులు తనపట్ల చూపిన ప్రేమాభిమానాలకు ఉపాధ్యాయుడు శంకర్ యాదవ్ కన్నీరు పెట్టారు. (చదవండి: ఉచ్చుకు చిరుత బలి) -
క్లాస్రూమ్లో కర్కశత్వం..
సాక్షి, హైదరాబాద్ : నల్లకుంటలోని సెయింట్ ఆగస్టైన్ హైస్కూల్లో ఓ విద్యార్థిపై టీచర్ ప్రతాపం చూపించారు. 4వ తరగతి చదువుతున్న ఎన్.సాయి ప్రణీత్ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ తీవ్రంగా కొట్టారు. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో ప్లాస్టిక్ స్కేల్తో చేయి, వీపు భాగంలో కొట్టడంతో బాలుడి చర్మం ఎర్రగా కందిపోయింది. విద్యార్థి నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకోకుండా టీచర్ కర్కశంగా వ్యవహరించింది. అరగంట పాటు తమ బిడ్డను టీచర్ చితక్కొట్టిందని విద్యార్థి తల్లిదండ్రుల ఆరోపించారు. టీచర్ నిర్వాకంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. దిక్కున్నచోట చెప్పుకోండి అని బెదిరించారని వాపోయారు. ‘ప్రతి క్లాస్ రూమ్లో సీసీటీవీ ఉంది. ఆ రికార్డులను పరిశీలించి టీచర్పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. -
నట‘రాజకీయం’
సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : పట్టణంలోని ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని కీచకోపాధ్యాయుడు నటరాజ్పై చర్యలకు మున్సిపల్ ఉన్నతాధికారులు వెనుకాడుతున్నారు. తోటి మహిళా ఉపాధ్యాయినులను, విద్యార్థినులను లైంగికంగా వేధించగా.. అతనిపై గత ఏడాది డిసెంబర్ 9న పట్టణ పోలీసు స్టేషన్లో ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీతో పాటు లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీంతో కొన్నిరోజులు మెడికల్ లీవ్లో వెళ్లిపోయిన నటరాజ్.. ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన వ్యవహారంపై ‘సాక్షి’వరుస కథనాలు ప్రచురించగా.. స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. వెంటనే నటరాజ్ను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) కేవలం బదిలీతో సరిపెట్టారు. బుధవారం అతన్ని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులివ్వగా.. వెంటనే నటరాజ్ విధుల్లో చేరడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా విధుల్లోకి.. నటరాజ్కు అండగా నిలిచే క్రమంలో మున్సిపల్ ఆర్డీ అతన్ని పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలకు, అక్కడ హెచ్ఎంగా పనిచేస్తున్న మధుసూదనరాజును ప్రకాశం ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం నటరాజ్ తాను పనిచేస్తున్న ప్రకాశం ఉన్నత పాఠశాల బాధ్యతలు కొత్త హెచ్ఎంకు ఇచ్చి రిలీవ్ కావాల్సి ఉంది. ఇవేమీ పట్టించుకోని నటరాజ్ నేరుగా మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలకు వెళ్లి హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి మధుసూదన్రాజు బుధవారం సెలవుపై వెళ్లగా నటరాజ్ బుధవారం హడావుడిగా మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎంగా బాధ్యతలు తీసుకోవడం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. మధుసూదన్ రాజుకు ఇంత వరకు బదిలీ ఉత్తర్వులు కూడా అందలేదు. ఏకపక్షంగా బదిలీ మున్సిపల్ ఆర్డీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న మధుసూదనరాజు కుమారుడు మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో అనంతపురంలోని మానసిక వికలాంగుల పాఠశాలలో చేరి్పంచారు. ఇక్కడే నివాసం ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ సమయంలో కూడా మొదటి ప్రాధాన్యత మధుసూదన్రాజుకే ఇవ్వడంతో ఆయన రోజు అనంతపురం నుంచి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన్ను 800 మందికి పైగా విద్యార్థులున్న ప్రకాశం పాఠశాలకు బదిలీ చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ హెచ్ఎంగా బాధ్యతలు నిరి్వహించాలంటే తాడిపత్రిలోనే నివాసం ఉండాలి. తన కుమారుని పరిస్థితి కారణంగా తాడిపత్రిలో నివాసం ఉండలేని స్థితిలో ఉన్న ఆయన ప్రకాశం పాఠశాల హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది. నటరాజ్ మాకొద్దు నటరాజ్ వ్యవహారం తెలుసుకున్న మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు..ఉపాధ్యాయినులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లైంగిక దాడి కేసులో నిందితుడిని తమ పాఠశాలకు బదిలీ చేయడమేమిటని ప్రశి్నస్తున్నారు. కమిషనర్కు తెలియకుండా సరి్టఫికెట్ జారీ ఎస్సీ, ఎస్టీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన నటరాజ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. ఇందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగి పూచికత్తు అవసరం కాగా... పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున ఉపాధ్యాయుడు సూర్యనారాయణరెడ్డిని సంప్రదించి ఒప్పించాడు. అయితే పూచికత్తు ఇస్తున్న వ్యక్తి తన నెలసరి జీతం తెలిపే పత్రాలను అందజేయాల్సి ఉంది. ఆ సరి్టఫికేట్ను మామూలుగా డ్రాయింగ్ అధికారి(మున్సిపల్ కమిషనర్) ఇవ్వాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఆ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న రాధాకృష్ణ శాలరీ సరి్టఫికేట్ను మంజూరు చేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్డీ ఉత్తర్వుల మేరకే బదిలీ మున్సిపల్ ఆర్డీ ఆదేశాల మేరకు హెచ్ఎం నటరాజ్ను బదిలీ చేశాం. అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధుసూదన్రాజు ఇప్పటి వరకూ రిలీవ్ కాలేదు. – డి.చెన్నుడు, ఇన్చార్జి కమిషనర్, తాడిపత్రి కమిషనర్ అందుబాటులో లేక... శాలరీ సరి్టఫికెట్ మంజూరు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది సూచన మేరకు సర్టిఫికేట్ మంజూరు చేయాల్సి వచ్చింది. – రాధాకృష్ట, హెచ్ఎం, మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల -
వినూత్న ప్రయత్నం.. నెటిజన్లు ఫిదా
స్పానిష్ : బోధన అనేది ఒక గొప్ప కళ. ఒకరికి తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి సులభంగా తెలియజేసే ప్రక్రియనే బోధన. అయితే బోధించడం వేరు.. సులభంగా బోధించడం వేరు. టీచింగ్లో ప్రత్యేకత ఉంటేనే విద్యార్థులు ఆసక్తికరంగా పాఠాలు వింటారు.. అర్థం చేసుకుంటారు. అలా కాదని ఓ ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని మొత్తం పిల్లల ముందు ప్రదర్శించినా ఉపయోగం ఉండదు. ఓ ఉపాధ్యాయుడికి ఎంత మేర జ్ఙానం ఉందని ముఖ్యం కాదు.. ఆ జ్ఞానాన్ని ఏ మేరకు విద్యార్థులకు అందిచారనేదే ముఖ్యం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న ఓ ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు వెరైటీగా పాఠాలు చెప్పేందుకు సిద్దపడింది. దాని కోసం ప్రత్యేకమైన డ్రెస్ను వేసుకొని తరగతి గదిలోకి వెళ్తోంది. మరి ఆ టీచరమ్మ ఎవరు.. ఆ డ్రెస్ స్పెషల్ ఏంటీ తెలుసుకుందాం. స్పానిష్కి చెందిన వెరోనికా డ్యూక్(43) 15 ఏళ్ల నుంచి టీచర్గా పని చేస్తున్నారు. 3వ తరగతి విద్యార్ధులకు సైన్స్, ఇంగ్లీష్, ఆర్ట్, సోషల్ స్టడీస్, స్పానిష్ సబ్జెక్టులను బోదిస్తారు.ఆ టీచర్ అంటే ఆ విద్యార్ధులకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా వెరోనికా టీచర్ చెప్పే అనాటమీ క్లాస్ (శరీర నిర్మాణ శాస్త్రం) కోసం విద్యార్ధులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆమె చాలా ప్రాక్టికల్. ఆ పాఠం చెప్పేందుకు మానవ అంతర్గత అవయవాలను ప్రింట్ చేసిన సూట్ ధరించి క్లాస్కి వెళతారు. ఆమె ఇలా బోధించడం ఫన్నీగా ఉన్నా.. విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సూట్ ఐడియా ఎలా వచ్చిందంటే.. ఇంటర్నెట్ని సెర్చ్ చేస్తుండగా చటుక్కున ఓ యాడ్ చూసి.. దాని ప్రభావంతో ఇలా వెరైటీ బోధన చేస్తున్నానని చెబుతోంది వెరోనికా. పిల్లలకు సులభంగా పాఠాలు అర్థం కావాలంటే ఇలా బాడీ సూట్ ధరించడమే మేలని అంటోంది. పైగా వారికి ఇది తమాషాగా, వింతగా కూడా ఉంటుందని తెలిపింది. మానవ అంతర్గత అవయవాలపై చిన్నారులకు తక్కువ అవగాహను ఉంటుందని, ఇలా చేస్తే వారు సులువుగా అర్థం చేసుకుంటారని ఆమె చెబుతోంది. అనాటమీ సూట్ ధరించి పాఠాలు బోధిస్తున్న వెరోనికా ఫోటోలను ఆమె భర్త మైక్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన భార్యకు ఇలాంటి సరికొత్త ఐడియాకు తానెంతో గర్విస్తున్నాని మైక్ అన్నారు. కాగా, వెరోనికా ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఈ పోస్ట్కు స్పందన భారీగా వస్తోంది. వేల కొద్దీ రీట్వీట్లు, 67వేల లైక్లు వచ్చాయి. వెరోనికా ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు.. వ్యాకరణ అంశాల్లో నౌన్స్, అడ్జెక్టివ్స్, వెర్బ్స్ వంటివి దొర్లినప్పుడు సంబంధిత కార్డ్ బోర్డ్ క్రౌన్లను ధరించి పాఠాలు చెప్పేదట. ఈ సమాజంలో పిల్లలకు బోరింగ్గా, లేజీగా పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారనే అపోహలు తప్పని నిరూపించడానికే ఇలా ఫన్నీగా ప్రయోగాలు చేస్తున్నానని వెరోనికా చెబుతోంది. వృత్తి పట్ల వెరోనికాకు ఉన్న నిబద్ధత, విధేయతకు ఈ ప్రయోగమే నిదర్శనం. -
పోలీసుల అదుపులో కీచక టీచర్
ఏలూరు టౌన్: పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లోని వన్టౌన్ బావిశెట్టివారిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు ఐదవ తరగతి చదువుతున్నారు. ఉపా«ధ్యాయుడు కూరపాటి కిశోర్ వారి పట్ల మధ్యాహ్నం సమయంలో వేర్వేరుగా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. విషయాన్ని ఇద్దరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలపటంతో వారు సోమవారం స్థానిక వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులతో కలసి పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీచర్ కిశోర్ను అదుపులోకి తీసుకున్నారు. బాలికలు, తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించి రెండు పోక్సో కేసులు నమోదు చేశారు. -
బాలికపై మాష్టారు లైంగిక వేధింపులు
సాక్షి, పశ్చిమగోదావరి : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు కామాంధుడిగా మారాడు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. ఈ ఘటన జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్ళ జిల్లా పరిషత్ హైస్కూళ్లో వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే స్కూల్లో తెలుగు మాష్టారుగా పనిచేస్తున్న కొయ్య లక్ష్మణ్ రావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక బంధువులు, గ్రామస్తులు హైస్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
టీచర్పై సామూహిక అత్యాచారం
సిధి/దమోహ్/మోవ్: మధ్యప్రదేశ్లో ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిపై సామూహిక అత్యాచారం జరగగా, మరో చోట వేధింపులు తాళలేక ఓ టీనేజర్ ఆత్మహత్య చేసుకుంది. రెండు ఘటనలు గురువారం జరగ్గా ఆలస్యంగా వెలుగులో కొచ్చాయి. సిధిలో సాయంత్రం స్కూల్ ముగించుకొని తిరిగి వస్తున్న టీచర్పై నలుగురు స్థానికులు దగ్గర్లోని ఓ ఫాంహౌజ్కు ఎత్తుకెళ్లి గ్యాంగ్రేప్ చేశారు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఆమె ఇంటికెళ్లి వివరాలను తెలపడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు, దమోహ్లో 17 ఏళ్ల బాలిక గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక యువకులు కొందరు ఆమెను వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
సాక్షి, వరంగల్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు పిల్లలపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తప్పు చేస్తే దండించాల్సింది పోయి అతనే తప్పుగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. మట్టేవాడ ప్రభుత్వ పాఠశాలలో బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు పోశాల శ్రీనివాస్ చిన్నపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించాడు. ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ, పిల్లలపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ.. అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఓ బాలిక ఇంట్లో చెప్పగా ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చి కీచక ఉపాధ్యాయుడిని చితకబాదారు. అనంతరం అతన్ని విధుల నుంచి తొలగించాలని పాఠశాల ఎదుట బైఠాయించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
-
బడిలో అమ్మ భాష లేదు
గీతాంజలి సామాజిక కార్యకర్త, ఎంటర్ప్రెన్యూర్, విద్యావేత్త, ఒడిస్సీ నాట్యకారిణి, రష్యన్ బాలే నర్తకి. వీటితోపాటు కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించారామె. లధాక్లో విద్యా సంస్కరణ బాధ్యతను తలకెత్తుకున్నారు.దాంతోపాటు ఆమె దేశంలోని ప్రతి అమ్మాయికీ కరాటే నేర్పించాలని కంకణం కట్టుకున్నారు. ‘స్త్రీ సాధికారత సాధన అనేది ఒక కలగా మిగలకూడదు. ఆ కల సాకారం కావాలంటే స్త్రీ... తన మీద జరిగే దాడులను తనకు తానుగానే సమర్థంగా ఎదుర్కోగలగాలి’ అంటారు గీతాంజలి. ఫెయిలవుతున్నది పిల్లలు కాదు కశ్మీర్లోని లధాక్లో పిల్లల మీద... ‘బడికి రార’నే అపవాదు ఉండేది. నూటికి 95 మంది పిల్లలు మధ్యలోనే బడి మానేసేవాళ్లు. ఏడాదంతా బడికి వెళ్లిన పిల్లల్లో కూడా పై తరగతికి పాస్ అయ్యే వాళ్లకంటే ఫెయిల్ అయ్యే వాళ్లే ఎక్కువ. నిజానికి ఇక్కడ ఫెయిల్ అయింది పిల్లలు కాదు, ప్రభుత్వ విద్యావిధానం. ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో విద్యావిధానం లధాక్ వాసుల భాషకు, స్థానిక సంస్కృతికి పూర్తిగా భిన్నంగా ఉండడమే. దాంతో లధాక్లో విద్యాసంస్కరణకు, ప్రత్యామ్నాయ విద్యావిధానానికి బీజం పడింది. పిల్లలు స్థానిక సమస్యలను పరిష్కరించడంలో భాగస్వాములయ్యారు. మంచు స్థూపాలను కడుతున్నారు, కృత్రిమమైన హిమానీనదాలను సృష్టిస్తున్నారు. పిల్లలు ఇష్టపడే ఇలాంటి కార్యకలాపాలే పిల్లల్ని స్కూలుకు దారి వెతుక్కుంటూ పరుగులు తీయించాయి. చిన్న పిల్లలు నీటి కొరతను తీర్చడంలో నిమగ్నమవుతుంటే, పెద్ద పిల్లలు సోలార్ హీటెడ్ మడ్ బిల్డింగ్స్ నిర్మాణంలో నిష్ణాతులవుతున్నారు. దాంతో ఓ యూనివర్సిటీ క్యాంపస్ ఎకో విలేజ్గా మారింది. గీతాంజలి కార్పొరేట్ రంగాన్ని వదిలి లధాక్ దారి పట్టింది ఇలాంటి విద్యాసంస్కరణ కోసమే. లాహోర్ టూ లధాక్ వయా పాండిచ్చేరి ఒరిస్సాలోని బాలాసోర్లో పుట్టిన గీతాంజలి మూలాలు లాహోర్లో ఉన్నాయి. దేశ విభజన సమయంలో గీతాంజలి తాతగారు లాహోర్ నుంచి పంజాబ్కి వచ్చి స్థిరపడ్డారు. ఆమె క్రిస్టియన్ మిషనరీ కాన్వెంట్, కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నారు. పదహారేళ్ల వయసులో పాండిచ్చేరి పర్యటన ఆమె దృక్పథాన్ని మార్చేసింది. పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమంలో భారతీయ ఆధ్యాత్మికత సారాన్ని ఒంటపట్టించుకున్నారు. తత్వం, వేదం, ఉపనిషత్తులను చదివారు. ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ తర్వాత భువనేశ్వర్లోని గ్జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబిఏ చేశారు. చదువు పూర్తయిన తర్వాత డెన్మార్క్లో మార్కెటింగ్ విభాగంలో పనిచేశారామె. ఉద్యోగ జీవితం నుంచి మెల్లగా ఎంటర్ప్రెన్యూర్గా మారారు గీతాంజలి. పుషన్ ప్రాజెక్ట్స్ పేరుతో ఇంజనీరింగ్ ఫర్మ్ స్థాపించారు. చెన్నై కేంద్రంగా హీలియోస్ పుస్తక ప్రచురణ సంస్థ కూడా ఆమె మానస పుత్రికే. పాండిచ్చేరిలో ఏయుఎమ్ హాస్పిటల్స్ను సమర్థంగా నిర్వహించారు. ఇన్నింటిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఆమె ఒక్కసారిగా వాటన్నింటికీ దూరంగా వెళ్లి పోయారు. ‘ఇప్పుడు లధాక్ పిల్లల కోసం మంచి భవిష్యత్తుని డిజైన్ చేస్తున్నానని, అందులో ఉన్న సంతృప్తి మరెందులోనూ ఉండబోద’’ని అంటున్నారామె తన నిర్ణయం పట్ల సంతోషంగా. అవసరాలే ఆలోచనలు గీతాంజలి ఇప్పుడు లధాక్లో ‘హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్’(హియల్) విద్యాసంస్థ సీఈవో. ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్తోపాటు ఆమె విద్యాసంస్థను నిర్వహిస్తున్నారు. లధాక్లోని పైయాంగ్ గ్రామంలో స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్లో విద్యావిధానాన్ని లధాక్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ‘‘మనదేశంలో మైదాన ప్రాంతంలో భవన నిర్మాణానికీ, లధాక్లో భవన నిర్మాణానికి ఒకటే ఫార్ములా పని చేయదు. మైదాన ప్రదేశాల్లో ఉన్న ఏ యూనివర్సిటీ కూడా భౌగోళిక సమతుల్యత లేని నేలలకు అనువైన నిర్మాణ విధానాన్ని కరికులమ్లో చేర్చుకోవడం లేదు. అందుకే భౌగోళిక స్థితికి అనుగుణంగా భవన నిర్మాణం చేయడంతోపాటు స్థానిక వనరులే పెట్టుబడిగా చేసుకుని ఉపాధి అవకాశాలను పెంచుకోవడానికి అనువైన కోర్సులను కూడా ప్రవేశ పెట్టాం’’ అన్నారు గీతాంజలి. అక్కడ ఇప్పుడు ఎకో రెస్పాన్సివ్ హోమ్స్ కడుతున్నారు. అంటే... లధాక్లోని విపరీతమైన చల్లదనం దృష్ట్యా ప్లస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకునేటట్లు ఇళ్లను నిర్మించడం అన్నమాట. వరదలు, కొండ చరియలు విరిగి పడకుండా నివారించే ఉపాయాలను కూడా సమ్మిళితం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ను పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు. ‘‘ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిషింగ్, హెల్త్కేర్ రంగాల్లో అనేక సంస్థల వ్యవస్థాపకురాలిగా, నిర్వహకురాలిగా ఇరవై ఏళ్ల కాలంలో పొందిన సంతోషంకంటే లధాక్లో చేస్తున్న సర్వీస్తో పొందుతున్న ఆనందమే ఎక్కువ’’ అన్నారామె. గీతాంజలి లధాక్ పిల్లలతో ఎంతగా కలిసిపోయారంటే... స్కూలుకి వెళ్లేటప్పుడు తరచుగా లధాక్ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. దీనివల్ల పిల్లలు తనను తమలో ఒకరిగా చూస్తారని చెప్పారామె. ‘‘పిల్లలు టీచర్ను, విద్యాసంస్థల నిర్వహకులను సొంత మనుషులుగా స్వీకరించడం చాలా అవసరం. అప్పుడే టీచర్ చెప్పిన మంచిని అనుసరిస్తారు, ఆ విద్యాసంస్థ నియమాలను గౌరవిస్తారు’’ అన్నారు గీతాంజలి. చెన్నై నేర్పిన పాఠాలు గీతాంజలి 2015లో చెన్నైలోని కేంబ్రిడ్జి స్కూల్ సీఈవోగా పనిచేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు స్కూలు బాధ్యతలు చూసేవారు. శని, ఆదివారాలు పాండిచ్చేరిలోని హాస్పిటల్ మేనేజ్మెంట్ వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ‘‘నేను స్కూల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన తొలి వారంలో ఆ స్కూల్లో పని చేస్తున్న గణితం, ఫిజిక్స్ టీచర్లు ఉద్యోగం మానేశారు. వాళ్లిచ్చిన నోటీస్ పీరియడ్ అప్పటికి అయిపోయింది, కానీ ఆ లోపు కొత్త టీచర్ల నియామకం జరగలేదు. దాంతో స్కూలు యాజమాన్యం ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిందిగా నన్ను కోరింది. కొత్తవాళ్లను రిక్రూట్ చేసుకునే వరకు పాఠాలు చెప్పకుండా పిల్లల్ని ఖాళీగా ఉంచకూడదు. పిల్లలు నేర్చుకోవాల్సిన సమయాన్ని వృథా చేయడం పెద్ద నేరం. అలాగని ఏదో ఒక టీచర్కి అడిషనల్ డ్యూటీ వేయడం కూడా అన్ని వేళలా సమర్థనీయం కాదు. అందుకే ఆ పాఠాలను బాగా చదువుకుని, ఒక స్టూడెంట్లాగ ప్రిపేరయ్యి టీచర్గా క్లాస్ రూమ్లో అడుగుపెట్టాను. చెన్నై స్కూల్లో పాఠాలు చెప్పినన్ని రోజులు మా అబ్బాయి ఆర్యన్తో పాటు నేను కూడా హోమ్ వర్క్ చేసేదాన్ని. నిజానికి అప్పుడు వేసిన ఆ అడుగే ఇప్పుడు నన్ను లధాక్కు చేర్చింది. స్కూలు నిర్వహణ నన్ను నేను నిరూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పాఠాలు చెప్పడం... అలా కాదు. ఏదో మానసిక సంతృప్తి, మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషాన్ని కలకాలం నిలుపుకోవాలనుకున్నాను. లధాక్లో పరిస్థితులు తెలిసిన తర్వాత నా చదువు, నా ఇష్టాలు, నైపుణ్యాలన్నింటినీ ఏకకాలంలో సద్వినియోగం చేసుకోవచ్చనిపించింది’’ అన్నారామె. బడిలో అమ్మ భాష లేదు లధాక్... పేరుకి మనదేశంలో భాగమే కానీ జీవనశైలి, సంస్కృతి టిబెట్కు దగ్గరగా ఉంటుంది. భాష వేరు, ఆహారం వేరు, ఆహార్యం వేరు. అక్కడి వాళ్లు లధాకీ భాష మాట్లాడతారు. ఈ నేపథ్యంలో ఇల్లు దాటి బడిలో కాలు పెట్టిన చిన్ని మెదళ్లను ఒక్కసారిగా అయోమయం ఆవరిస్తుంది. ఇంటి గుమ్మం వరకు మాట్లాడిన లధాకీ భాషకు తాళం పెట్టి రాష్ట్ర అధికార భాష ఉర్దూలో పెదవి విప్పాల్సిందే. అదే లధాక్ వాసుల జీవితాలను తరాలకు తరాలు వెనక్కు నెట్టేసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రెండు వేలు సంవత్సరం వరకు అక్కడ మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన వాళ్ల సంఖ్య ఐదు శాతానికి లోపే. అమ్మానాన్నల బహుమతి మా అమ్మానాన్నలు నాకు ‘నమ్మకం, స్వేచ్ఛ’ అనే రెండు బహుమతులనిచ్చారు. ఏ పిల్లలకైనా అంతకంటే పెద్ద వరాలు మరేవీ ఉండవు. ఉన్నది ఒక్కటే జీవితం, అందులోనే మన ఆలోచనలను, ఆశయాలను నెరవేర్చుకోవాలి. మనల్ని మనం ఎన్నో కోణాల్లో ఆవిష్కరించుకున్నప్పుడే మనలో కొత్త ఆలోచనలు పుడతాయి. అందుకు లియోనార్డో డా విన్సీనే పెద్ద ఉదాహరణ. ఆ చిత్రకారుడిలో... ఓ గణిత మేధావి, వృక్ష శాస్త్రజ్ఞుడు, ఇంకా గొప్ప తత్వవేత్త కూడా ఉన్నారు. ఒక మెదడులో ఇన్ని రకాల జ్ఞాన సంపద ఉన్నప్పుడు... అవన్నీ ఊరికే ఉండవు. అనుక్షణం ఒకదానితో ఒకటి ప్రేరేపితమవుతూనే ఉంటాయి. కొత్త ఆవిష్కరణలకు బీజం పడేది కూడా అలాంటప్పుడే. హియల్ (హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్) పుట్టుక కూడా అలాంటిదే. ఇందులో మేము అనుసరిస్తున్న విధానం ‘లెర్నింగ్ బై డూయింగ్’. పిల్లలు తామేం నేర్చుకోవాలో దానిని అక్షరాలలో చదువుతూ నేర్చుకోవడంతో సరిపెట్టరు. ఆ పని చేస్తూ నేర్చుకుంటారు. ఇలా చదువుకోవడం వల్ల వాళ్లు పెద్దయిన తర్వాత ఒకరి దగ్గర ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కాలం గడపరు, ఎంటర్ప్రెన్యూర్ మారి సొంతంగా సంస్థను స్థాపించి నిర్వహించుకోగలుగుతారు.– గీతాంజలి,హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్విద్యాసంస్థ సహస్థాపకురాలు శాంతి యోధులు గీతాంజలి హియల్లో అమ్మాయిలకు కరాటే క్లాసులు కూడా తీసుకుంటారు. తాను తయారు చేసిన కరాటే యోధులకు ‘పీస్ఫుల్ వారియర్స్’ అని పేరు పెట్టారు. ఆమె శిక్షణలో తొలి బృందం సర్టిఫికేట్లు అందుకున్నది. వీరి సహకారంతో లధాక్ రీజియన్లోని ప్రతి మహిళకూ కరాటే నేర్పించాలనేది గీతాంజలి ఆలోచన. ‘‘కరాటే ప్రాక్టీస్ అబ్బాయిలకంటే అమ్మాయిలకే ఎక్కువ అవసరం. రాబోయే పదేళ్లలో దేశంలోని విద్యార్థినులందరూ కరాటే బ్లాక్బెల్ట్ సాధించేటట్లు చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని కోరతాను. నలభై ఆరేళ్ల జీవితంలో అనేక ప్రయోగాలు చేశాను, అంతే స్థాయిలో విజయాలనూ సాధించాను. హియల్ విద్యాసంస్కరణ తర్వాత పీస్ వారియర్స్ను దేశమంతటా విస్తరించడం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతాను’’ అన్నారు గీతాంజలి. – వాకా మంజులారెడ్డి -
కీచక ఉపాధ్యాయుడు.. తరగతి గదిలో విద్యార్థినిలపై..
సాక్షి, భువనేశ్వర్ : విద్యా బుద్దులు నేర్పించి భవిష్యత్లో సమాజానికి ఆదర్శంగా నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే, తరగతి గదిలో ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడు బజారు మనిషిలా వ్యవహరిస్తే అలాంటి ఉపాధ్యాయులను ఏమనుకోవాలి. చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సరిగ్గా అదే జరిగింది. ఆ పాఠశాలలో గణితం బోధిస్తున్న ఎ.రాంబాబు అనే ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుతున్న విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని భయాందోళనలకు గురి చేసేవాడు. లైంగిక వేధింపులు భరించలేని పదో తరగతి విద్యార్థిని నేరుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందంటే ఆ ఉపాధ్యాయుడు కీచకపర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం గురువారం దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ దుమారానికి విద్యార్థిని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో తెరపడింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ అందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న ఎ.రాంబాబు విద్యార్థినిల పట్ల కొంత కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అభం శుభం తెలియని విద్యార్థినిల శరీరంపై చేతులు వేస్తూ వారిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాడు. చాలా కాలంగా ఈ తంతు నడుస్తున్నప్పటికీ ఎట్టకేలకు పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కుటుంబ సభ్యుల సహకారంతో శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఉపాధ్యాయుడు రాంబాబుపై 354(ఎ), 509, సెక్షన్ 8, 12 ఆఫ్ ఫోక్సో చట్టాలు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం బాధిత విద్యార్థిని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం కీచక ఉపాధ్యాయుడి భాగోతం బట్టబయిలయ్యింది. కేసు నమోదు చేసాం... బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణితం ఉపాధ్యాయుడు ఎ.రాంబాబుపై కేసు నమోదు చేసామని ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ తెలిపారు. తరగతి గదిలో తమ శరీరంపై చేతులు వేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో విద్యార్థిని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు 354(ఎ), 509, సెక్షన్ 8, సెక్షన్ 12 ఆఫ్ ఫోక్సో చట్టాలు క్రింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
టీచర్ పైశాచికం : చదవడంలేదని గొడ్డలితో..
కశ్మీర్ : సరిగ్గా చదవడంలేదని, చెప్పినట్లు వినడంలేదని విద్యార్థిని గొడ్డలితో బెదిరించాడు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు. మైనర్ బాలుడని చూడకుండా గొడ్డలి మెడభాగంపై పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. జమ్మూ-కశ్మీర్లోని కుప్వారా జిల్లాలోలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. ఓ పదేళ్ల విద్యార్థిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా.. టీచర్ పదునైన గొడ్డటిని మెడపై ఉంచి బెదిరిస్తున్నారు. ‘ నీ ప్రవర్తన మార్చుకోకుంటే గొడ్డలితో నరుకుతా’ అంటూ విద్యార్థిని బెదిరిస్తున్నాడు. బాలుడు భయంతో గట్టిగా ఏడుస్తున్నా కూడా అతన్ని వదిలిపెట్టలేదు. తరగతి గదిలోని మిగతా విద్యార్థుల వైపు చూస్తూ .. ‘మీరు కళ్లు మూసుకోండి.. నేను వీడిని గొడ్డలితో నరికి చంపుతా’ అని హెచ్చరించాడు. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనపై స్థానిక నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ పైశాచిక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతను గురువు కాదు నరరూప రాక్షసుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఈ వీడియో చూడగానికే భయంగా ఉంది. ఆ సమయంలో ఆ విద్యార్థి ఎంత భయానికి లోనైయ్యాడో ఉహించుకోలేం. నిందితులను గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని’ డిమాండ్ చేశారు. -
విద్యార్థిని గొడ్డలితో బెదిరించిన టీచర్
-
ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయుడిపై కేసు
కొండపాక(గజ్వేల్): ఓ ప్రైవేటు స్కూల్లో తోటి ఉపాధ్యాయురాలిని వేధించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదైన సంఘటన దుద్దెడలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ అంశంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. కేసుకు సంబంధించి ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మండల పరిధి.లోని దుద్డెడలో గల ఓ ప్రైవేటు పాఠశాలల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన పడిగే గణేష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలిని కొంత కాలంగా వేధింపులకు గురి చేస్తుండటంతో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసిక వేధనకు గురి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయమై పలుమార్లు హెచ్చరించినా గణేష్లో మార్పు రావడం లేదని తెలిపారు. దీంతో మహిళా ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్సై పరమేశ్వర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు గణేష్ పరారీలో ఉన్నాడని ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. -
పిల్లల ముందు ఉపాధ్యాయుల వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పారు. బాధ్యతలను విస్మరించి విద్యార్థులు చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి వారి ముందే బూతులు తిట్టుకున్నారు. ఈ ఘటన గండిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉపాధ్యాయురాలు మనోరమ, హెడ్ మాస్టర్ రాములు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో పాఠశాలలో పిల్లల ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకుండా బూతులు తిట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు సెల్ఫోన్ విసురుకున్నారు. ఆ తర్వాత మనోరమ హెడ్ మాస్టర్పై నార్సింగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గర్భిణి అని కూడా చూడకుండా..
సాక్షి, విజయవాడ : అనుమానం పెనుభూతంగా మారిన భర్త గర్భిణి అని కూడా చూడకుండా నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి కిరాతకంగా హతమార్చిన ఘటన కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలోని ఫకీర్గూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా కోడూరు గ్రామానికి చెందిన ముక్కా శైలజ (32) కు గుడివాడ సమీపంలోని జొన్నపాడు గ్రామానికి చెందిన నంబియార్ (35) తో వివాహమైంది. నగరంలోని ఫకీర్గూడెం రావిచెట్టు సెంటర్లో వారు నివాసం ఉంటున్నారు. భార్య బీఎస్సీ, బీఈడీ చదివి నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. ఎమ్సెస్సీ బీఈడీ చదివిన భర్త ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్నాడు. కొద్ది రోజులు సజావుగా సాగిన వారి సంసారంలోకి అనుమానం అనే భూతం భర్త మనస్సును ఆవరించింది. అప్పటి నుంచి ప్రతి రోజు భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకొని ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు. రోజు రోజుకు ప్రవర్తనపై అనుమానం పెరిగిపోయి, ఆమెను ఎలాగైనా మట్టుపెట్టాలని నిశ్చయించుకుని అందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం బాటిల్లో పెట్రోలు తీసుకువచ్చి ఇంట్లో భద్రపరిచాడు. రాత్రి భోజనాల అనంతరం బెడ్రూంలో నిద్రించిన సమయంలో అదను కోసం వేచి చూసిన భర్త తెల్లవారుజామున 4.45 గంటలకు ముందుగానే తెచ్చుకున్న పెట్రోలును నిద్రిస్తున్న భార్యపై పోసి నిప్పు అంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆమె గట్టిగా కేకలు పెడుతూ కాలిపోయింది. ఆమె మెలకువ వచ్చి అరుపులతో చుట్టుపక్కల వారు రావటంతో తనపై అనుమానం రాకుండా ఉండేందుకు భార్యను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు నటించాడు. ఈ క్రమంలో అతనికి స్పల్ప గాయాలు కూడా అయ్యాయి. దీంతో స్థానికులు మంటలను ఆర్పివేసి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. మృతురాలు మూడు నెలల గర్భవతి అని తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, బంధువుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్యాయత్నం చేసింది తానేనని అంగీకరించాడు. దీనిపై సీఐ పి.రామచంద్రరావు నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాపైన ఎస్ఐ దారుణ హత్య..!
రాయ్పూర్ : దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. అరన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో గల రేవలి గ్రామంలో ఆదివారం ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారు. వారిలో ఒకరు ఎస్ఐ కాగా, మరొకరు స్కూల్ టీచర్. దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవా వివరాల ప్రకారం.. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కశ్యప్ను సీఆర్పీఎఫ్ బెటాలియన్తో సమన్వయం చేస్తూ అరన్పూర్కు బదిలీ చేశారు. అక్కడే ఉన్న తన మిత్రుడు జైసింగ్ కురేటిని కలిసేందుకు కశ్యప్ వెళ్లాడు. సమాచారం అందుకున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆ గ్రామంలోకి చొరబడ్డారు. కశ్యప్, జైసింగ్లను కిడ్నాప్ చేశారు. వారి ఆచూకీ కోసం ఆ ప్రాంతమంతా కూంబింగ్ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. సున్నిత ప్రాంతమైన రేవలి, అరన్పూర్ గ్రామాలు రాయపూర్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కాగా, మావోయిస్టుల చేతిలో కిడ్నాపైన ఇద్దరిలో ఎస్ఐ లలిత్ కశ్యప్ను దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఐని హత్య చేసిన మావోయిస్టులు అతని మృతదేహం వద్ద ఓ లేఖను వదిలివెళ్లారు. స్కూల్ టీచర్ మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి : భారీ ఎన్కౌంటర్ : 8మంది మావోయిస్టులు మృతి) -
పెళ్లికి నిరాకరించడంతో తరగతి గదిలోనే టీచర్ హత్య
చెన్నై : పెళ్లికి నిరాకరించడంతో ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్ను తరగతి గదిలోనే ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. గాయత్రి మెట్రిక్యులేషన్ స్కూల్లో విద్యార్ధులకు గణితం బోధించేందుకు స్కూల్కు వచ్చిన ఎస్ రమ్య అనే 23 ఏళ్ల యువతిపై తరగతి గదిలోనే నిందితుడు రాజశేఖర్ దాడి చేశాడు. విద్యా సంస్థకు సమీపంలోనే బాధితురాలి ఇల్లు ఉండటంతో ఆమె ముందుగానే అక్కడికి చేరుకోగా అదును చూసి నిందితుడు ఆమెను కిరాతకంగా హత్య చేశాడని అధికారులు తెలిపారు. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకే ఆమెపై నిందితుడు దాడికి తెగబడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాలేజీలో చదువుకునే సమయం నుంచి నిందితుడికి ఆమె తెలుసని, ఆరు నెలల కిందట ఆమెను వివాహం చేసుకుంటానని బాధితురాలి తల్లితండ్రులను రాజశేఖర్ సంప్రదించగా వారు అందుకు నిరాకరించారని పోలీసులు వెల్లడించారు. పెళ్లికి నిరాకరించారనే ఆగ్రహంతో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. -
చిన్నారిపై ఉపాధ్యాయుడు అత్యాచారం
-
బాలిక ఉసురు తీసిన లేఖ..
ముంబై : మహారాష్ట్రలోని పందార్పూర్లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి రాసిన లవ్లెటర్తో మనస్థాపం చెందిన 15 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలికకు దుండగుడు రాసిన లేఖ క్లాస్ టీచర్ చేతికందడంతో ఆమె అందరి ఎదుట బాలికను మందలించింది. బాలిక తల్లితండ్రులను పిలిచి లేఖ విషయం వారికి చేరవేసింది. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన బాధిత విద్యార్ధిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి ఈ ఘటనపై స్పందిస్తూ తమకు స్కూల్ నుంచి ఫోన్ కాల్ రావడంతో తాను అక్కడికి వెళ్లగా తన కుమార్తె ఏడుస్తూ కనిపించిందన్నారు. తమ కుమార్తె చేతిలో ప్రేమలేఖ ఉందని టీచర్ చెప్పగా, తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, ఈ లేఖ ఎవరు రాశారో కూడా తనకు తెలియదని తమ బాలిక చెప్పిందన్నారు. అనంతరం ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందిన తమ కుమార్తె సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. బాలిక మరణించిన కొద్దిసేపటికే వాఖ్రి గ్రామస్ధులు పందార్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మరణానికి కారణమైన గుర్తుతెలియని ప్రేమికుడు ఎవరనేది నిగ్గుతేల్చనున్నారు. -
టీచర్పై ఇనుపరాడ్తో విద్యార్ధి దాడి..
సాక్షి, న్యూఢిల్లీ : పాఠశాలకు హాజరుకావడం లేదని,పుస్తకాలు తీసుకురావడం లేదని మందలించినందుకు టీచర్పై ఎనిమిదో తరగతి విద్యార్థి ఇనుప కడ్డీతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన టీచర్ ఎయిమ్స్లో చికిత్స పొందుతుండగా, నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. సాకేత్ ప్రాంతంలోని వీర్ చందర్ సింగ్ గర్హేల్ ప్రభుత్వ పాఠశాలలో గత కొద్ది రోజులుగా స్కూల్కు హాజరు కానందుకు ఎనిమిదో తరగతి విద్యార్ధిని ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ చౌధరి మందలించారు. విద్యార్థి బ్యాగ్ను పరిశీలించిన శ్యామ్ సుందర్కు అందులో ఇనుప రాడ్ కనిపించడంతో తీవ్రంగా మందలించి తన టేబుల్పై దాన్ని ఉంచారు. మరోసారి ఇనుప కడ్డీని విద్యార్థి తన బ్యాగ్లో వేసుకోవడంతో ఆగ్రహించిన టీచర్ దాన్ని తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించగా, విద్యార్థి ఇనుప రాడ్తో దాడికి తెగబడ్డాడు. విద్యార్థి దాడితో టీచర్ కన్ను, చెవు, తలపై గాయాలయ్యాయి. దాడి అనంతరం స్కూల్ ప్రహరీ గోడను దూకి నిందితుడు పారిపోయాడు. స్కూల్ ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విద్యార్థి దాడి చేసేందుకు సిద్ధమై స్కూల్కు వచ్చాడని వెల్లడించారు. -
విద్యార్థిని చితకబాదిన టీచర్..వీడియో వైరల్
-
పోస్టింగ్ అందుకోవలసిన వేళ.. పోలీస్ స్టేషన్కి
జైపూర్ : పోస్టింగ్ ఆర్డర్ అందుకోవలసిన సమయంలో ఆ ఉపాధ్యాయుడు అనూహ్యరీతిలో పోలీస్ విచారణ ఎదుర్కోబోతున్నాడు. వివరాల ప్రకారం... రాజస్తాన్ దౌసా జిల్లాకు చెందిన జగ్మోహన్ మీనా అనే వ్యక్తి అదే జిల్లాకు చెందిన దివానా గ్రామంలోని స్వామి వివేకానంద మోడల్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల (శనివారం) క్రితం అదే పాఠశాలలో చదువుతున్న ఒక పదోతరగతి విద్యార్థి మీద చేయి చేసుకున్నాడు. అయితే జగ్ మోహన్ విద్యార్థిని కొడుతుండగా తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హలచల్ చేస్తోంది. అంతేకాక విద్యార్థి తల్లిదండ్రులు ఆదివారం జగ్మోహన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సోమవారం (నేడు) పోస్టింగ్ ఆర్డర్ అందుకోవాల్సిన వ్యక్తి కాస్తా పోలీసు విచారణ ఎదుర్కోబోతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లాల్సోట్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర కుమార్ జగ్మోహన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ కారణాల వల్ల ఉపాధ్యాయుడు పిల్లవాడిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజేంద్ర కుమార్ తెలిపారు. జగ్మోహన్ విద్యార్థిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో విద్యాశాఖ అధికారులు అతని పోస్టింగ్ ఆర్డర్ని పెండింగ్లో పెట్టినట్లు తెలిపారు. విచారణ అనంతరం జగ్ మోహన్పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సొంత పిన్నిపైనే యాసిడ్ దాడి..
జీడిమెట్ల: స్కూల్ టీచర్పై యాసిడ్ దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని జీడిమెట్ల పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు బాధితురాలికి స్వయానా అక్క కుమారుడు కావడం గమనార్హం. ఇరు కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా ఆర్ధిక లావాదేవీల కారణంగా గొడవలు జరుగుతుండటమే ఇందుకు కారణంగా పోలీసులు పేర్కొన్నారు...వివరాల్లోకి వెళితే..స్కూల్ టీచర్గా పని చేస్తున్న సూర్యకుమారి తన అక్కకుమారుడైన వెంకటరామ సుబ్రమణ్యంను 12 ఏళ్ల పాటు తన ఇంట్లోనే ఉంచుకుని పెంచింది. అంతేగాక అక్క,చెల్లెళ్ల కుమార్తెలను ఒకే ఇంటికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా నిందితు డి సోదరి హేమలక్ష్మి, ఆమె భర్త అదిత్య మ«ధ్య గొడవలు జరుగుతున్నా యి. ఈ విషయంలో సూర్యకుమారి తమకు సహాయం చేయడం లేదని, ఆర్థికంగా ఆదుకోవడం లేదని వెంకటరామసుబ్రమణ్యం ఆమెపై కోపం పెంచుకున్నాడు. దీనిని మనస్సులో పెట్టుకున్న అతను గురువారం సా యంత్రం ఆమెపై బాత్రూంలో వాడే యాసిడ్ చల్లి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును చేధించిన సీఐ శంకర్ రెడ్డి, సిబ్బందిని బాలనగర్ ఏసీపీ అభినందించారు. -
స్కూల్ టీచర్ యాసిడ్ దాడి కేసులో పురోగతి
-
యాసిడ్ దాడి కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల యాసిడ్ దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కుటంబ కలహాల కారణంగానే యాసిడ్ దాడి జరిగినట్లు తేల్చారు. బాధితురాలి దగ్గరి బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 12 గంటల్లో యాసిడ్ దాడి కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. భాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. జీడిమెట్ల పరిధి చింతల్లో ఉన్న సిద్ధార్థ స్కూల్లో టీచర్గా పనిచేస్తోన్న సూర్యకుమారిపై గురువారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా యాసిడ్ దాడి జరిగింది. విషయం తెలిసిన వెంటనే బాధితురాలిని కూకట్పల్లిలోని రెమెడీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని త్వరితగతిన పట్టుకున్నారు. సూర్య కుమారి అక్క కుమారుడే ఈ దాడి చేసినట్లు సమాచారం. -
హైదరాబాద్: స్కూల్ టీచర్పై యాసిడ్ దాడి
-
స్కూల్ టీచర్పై యాసిడ్ దాడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జీడిమెట్ల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. చింతల్లో ఉన్న సంస్కార్స్కూల్ టీచర్పై ఆసిడ్ దాడి జరిగింది. స్కూల్నుంచి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగనట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని దుండగుడు స్కూల్ టీచర్ సూర్య కుమారి మొహంపై యాసిడ్ పోయగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కూకట్పల్లి రెమోడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
అయ్యా సారూ.. ఏందీ పాడు పని
పోతవరప్పాడు (ఆగిరిపల్లి) : పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్కు యత్నించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి ఎస్ఐ వి.ఏసేబు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సెక్యూరిటీ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కుమార్తె అదే పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది. ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న దాసరి గణేష్ బుధవారం బాలికకు మాయమాటలు చెప్పి బాలికను తీసుకుని అదృశ్యమయ్యాడు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఏసేబు ఉపాధ్యాయుడు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉపాధ్యాయుడు, మైనర్ బాలిక రాజమహేంద్రవరంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించి గణేష్ను అదుపులోకి తీసుకుని బాలికను కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. -
లైంగిక వేధింపుల కేసులో ఉపాధ్యాయుడి అరెస్ట్
షిమ్లా(హిమాచల్ ప్రదేశ్): ఎనిమిదో తరగతి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గానూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కల్లు జిల్లాలోని నిర్మానంద్ బ్లాక్లో జూలై 3న చోటుచేసుకుంది. రోజూ వేధింపులకు పాల్పడటంతో ఉపాధ్యాయుడి గురించి బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చిందని స్థానిక డీఎస్పీ రోహిత్ తెలిపారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టామని, కోర్టు నిందితుడికి జూలై 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో రిమాండ్ తరలించామని తెలిపారు. -
వెరైటి వరకట్నం..పెరుగుతూనే ఉంటుంది
భువనేశ్వర్ : ఆడపిల్ల వివాహం తల్లిదండ్రులకు ఎంతటి భారమో తెలిసిన సంగతే. కారణం ‘వరకట్నం’...నేటికి ఈ వరకట్న భూతానికి జడిసి సమాజంలో చాలా మంది ఆడపిల్లల్ని వద్దనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో భారీ వరకట్నాన్ని కోరి మరి అత్తింటి వారికి సంతోషాన్ని కల్గించాడు ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి. అందేంటి కట్నం అడిగితేనే ఎవరికైన కోపం వస్తుంది. అలాంటిది భారీ కట్నం అడిగినా సంతోషించడం ఎంటనుకుంటున్నారా...? అక్కడే ఉంది అసలు విషయం. ఈ పెళ్లి కొడుకు ‘పచ్చ నోట్ల’(నోట్ల రద్దు పుణ్యామాని ఇప్పుడు ఈ పచ్చనోట్లు కనిపించడం లేదు) కట్నం బదులు ‘పచ్చని మొక్కల’ను కోరాడు. హరిత కట్నం ఎవరికైనా హర్షమే కదా. ఈ పచ్చని వివాహ వివరాలు...ఒరిస్సా కేంద్రపర జిల్లా బలభద్రపూర్ గ్రామానికి చెందిన సరోజ్ కాంత్ బిస్వాల్(33) పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి మరో పంతులమ్మతో వివాహం కుదిరింది. బిస్వాల్కు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అందుకే తన వివాహానికి కట్నంగా 1000 మొక్కలను ఇవ్వాలని అడిగాడు. అవి కూడా పళ్ల మొక్కలనే కోరాడు. అందుకు బిస్వాల్కు కాబోయే మామ గారు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ నెల 22న బిస్వాల్ వివాహం కాలుష్యరహితంగా, పర్యావరణహితంగా పచ్చగా జరిగింది. వివాహానికి వచ్చిన బంధువులందరికి బిస్వాల్ మొక్కలు పంచి...ఆశీర్వాదాలు అందుకున్నాడు. -
పిల్లలు వద్దన్నా..వినకుండా వెళ్ళి...
కోరుట్ల/కథలాపూర్ : బడి పునఃప్రారంభమైన మొదటి రోజే గుండెపోటుతో ఓ ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటనతో విషాదం నెలకొంది. కథలాపూర్ మండలం దూలూరుకు చెందిన యాగండ్ల గంగాధర్(38) కోరుట్లలోని డాక్బంగ్లా ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. స్థానిక ఆదర్శనగర్లో నివసిస్తున్నారు. మొదటిరోజు శుక్రవారం ఉదయం 8 గంటలకే పాఠశాలకు వెళ్లారు. ప్రార్థన అనంతరం ఉపాధ్యాయులతో తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చించి తరగతిగదికి వెళ్లి పిల్లలతో కొంతసేపు గడిపారు. అనంతరం ఉద యం 11 గంటలకు విరామ సమయంలో కార్యాల యంలో ఉండగా చాతిలో నొప్పి వస్తుందంటూ కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రధానోపాధ్యాయు డు ప్రతాప్, మిగిలిన ఉపాధ్యాయులు గంగాధర్ను కారులో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. గంగాధర్ మృతితో ఉపాధ్యాయులు, విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. అనంతరం మృతదేహాన్ని గంగాధర్ ఇంటికి తరలించారు. గంగాధర్కు భార్య సునీత, కూతుళ్లు రిషిత, రోషిణి ఉన్నారు. గంగాధర్ 2002 డీఎస్సీలో ఎస్జీటీ ఉద్యోగంలో చేరారు. మండలంలోని గంభీర్పూర్, సిరికొండల్లో పనిచేశారు. కథలాపూర్ ఎంఈవో కార్యాలయంలో ఎమ్మార్పీగా పనిచేశారు. నాలుగేళ్ల క్రితం కోరుట్ల మండలానికి బదిలీపై వెళ్లారు. రెండు రోజులుగా చాతినొప్పి.. సెలవుల్లో భార్య పిల్లలతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లి వచ్చిన యాగండ్ల గంగాధర్ రెండు రోజులుగా చాతినొప్పితో బాధపడుతున్నాడు. సాధారణంగా అజీర్థితో వచ్చే సమస్యగా భావించిన గంగాధర్ స్థానిక ప్రైవేటు వైద్యులకు చూపించుకుని మందులు వాడా డు.నొప్పి తగ్గకపోవడంతో గురువారం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయింకుని మందులు వాడుతున్నాడు. గురువారం రాత్రి కొంత అస్వస్తతతో ఉన్నట్లుగా గమనించిన భార్య సునీత, పిల్లలు గంగాధర్ను బడికి వెళ్లవద్దని వారించారు. అయినప్పటికీ మొదటి రోజు కావడంతో తప్పక ండా విధులకు వెళ్లాలని పట్టుబట్టిన గంగాధర్ పాఠశాలలోనే గుండెనొప్పితో ప్రాణాలు వదిలాడు. ఇద్దరు కూతుళ్లే.. యాగండ్ల గంగాధర్కు భార్య సునీత, ఇద్దరు కూతుళ్లు రిషిత, రోషిణి ఉన్నారు. భార్య సునీత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం వరకు ఆరోగ్యంగా ఉన్న గంగాధర్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సకాలంలో అందని వైద్యం యాగండ్ల గంగాధర్ పాఠశాలలో చాతినొప్పితో కుప్పకూలగానే ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్, ఉపాధ్యాయులు కలిసి వెంటనే స్థానికంగా ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మరో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడా వైద్యుడు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ గంగాధర్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. సకాలంలో అందని వైద్యం కారణంగా గంగాధర్ ప్రాణాలు వదిలారు. గంగాధర్ మృతిపై ఎంఈవోలు గంగుల నరేశం, ఆనంద్రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
క్లాస్టీచర్ మీద క్రష్
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం హ్యాండ్సమ్ యాక్టర్. ఫీమేల్ ఫాలోయింగ్ కూడా చాలా ఉంది. చాలా మంది అమ్మాయిల క్రష్ ఈ హీరో. మరి మీకెప్పుడైనా ఎవరి మీదైనా క్రష్ ఏర్పడిందా? అని జాన్ అబ్రహాంని అడిగితే – ‘‘చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే తను అందంగా ఉండటంతో పాటు చాలా తెలివైనది. నా సెకండ్ క్లాస్ టైమ్లో తన మీద క్రష్ ఏర్పడింది. ‘మా క్లాస్ టీచర్ మిసెస్. ఆనంద్ అంటే నాకు చాలా ఇష్టం’ అని ఓ రోజు ధైర్యం చేసి మా నాన్నగారితో చెప్పేశాను. చిన్న వయసు కాబట్టి ఆయన ఏమీ అనలేదు’’ అని పేర్కొన్నారు జాన్ అబ్రహాం. -
బడిపంతులుకు బడితెపూజ
మల్కన్గిరి : స్థానిక సమితిలోని పెద్దకొండ గ్రామం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి గ్రామస్తులు శుక్రవారం బడితె పూజ చేశారు. వివరాలిలా ఉన్నాయి. 13సంవత్సరాలుగా గ్రామంలోని పాఠశాలలో నారాయణ మండంగి ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఆయన పాఠశాలకు ప్రతిరోజూ రారు. వచ్చినప్పుడు మద్యం తాగి రావడం, వంటిపై బనియన్తో మాత్రమే ఉండడం, మద్యం మత్తులో విద్యార్థులను తిట్టడం, కొట్టడం చేస్తుండే వాడు. పిల్లలు ఇంట్లో చెబితే తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. అలాగే ప్రధానోపాధ్యాయుడు శుక్రవారం కూడా ఓ విద్యార్థిని బాగా కొట్టడంతో గ్రామస్తులంతా కలిసి పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయుడిని కర్రతో చితక్కొట్టారు. అనంతరం మల్కన్గిరి డీఈఓ కార్యాలయానికి ఉపాధ్యాయుడిని తీసుకుని వెళ్లారు. డీఈఓ కార్యాయలంలో లేకపోవడంతో కలెక్టరేట్కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై కటెక్టర్ మనీష్ అగర్వాల్ మాట్లాడుతూ మందు ఆయన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లి మెడికల్ టెస్టులు చేయించాలని, తరువాత ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటానని గ్రామస్తులకు తెలిపారు. -
పదో తరగతి విద్యార్థినికి ప్రేమలేఖ
నిజామాబాదు,మద్నూర్(జుక్కల్): విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధించాడు. ప్రేమలేఖలు రాశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు.. మద్నూర్ మండలంలోని పెద్దఎక్లార గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు తుమ్వార్ విజయ్పై గురువారం గ్రామస్తులు దాడి చేశారు. పాఠశాలలోని పదో తరగతికి చెందిన విద్యార్థినికి ఉపాధ్యాయుడు ప్రేమలేఖ రాయడం, విషయం పెద్దవాళ్లకు తెలియడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయుడు విజయ్పై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. అమ్మాయిలకు విద్యాబుద్ధులు నేర్పిస్తావని పాఠశాలకు పంపిస్తే లైంగిక వేధింపులకు గురిచేస్తావా.. అంటూ గ్రామస్తులు ఆగ్రహంతో పాఠశాల ఆవరణలోనే విజయ్ను చితకబాదారు. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయుడు అతికష్టం మీద గ్రామస్తుల నుంచి విజయ్ను విడిపించి పాఠశాల కార్యాలయంలో కుర్చోబెట్టారు. అనంతరం గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై మహమ్మద్ సాజిద్, ఇన్చార్జి ఎంఈవో రాములు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడు విజయ్ గతంలో చాలాసార్లు ప్రేమ పేరుతో విద్యార్థినులను వేధించాడని, పలుమార్లు మందలించినా వినిపించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిని విధుల్లోంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ విషయమై ఎంఈవో డీఈవోతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించడంతో ఉపాధ్యాయుడు విజయ్ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో వెల్లడించారు. విజయ్ను పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా గ్రామస్తులు పోలీసు వాహనం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిని చితకబాదుతున్న గ్రామస్తులు, నిందితుడిని తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. కాగా ఉపాధ్యాయుడు విజయ్ను గతంలో చాలాసార్లు సముదాయించినా వినిపించుకోలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుషాల్ తెలిపారు. గతంలో ఇదే పాఠశాలలో మరో విద్యార్థినికి ప్రేమలేఖ రాశాడని గ్రామస్తులు తెలిపారు. విద్యార్థినులను బిచ్కుందలో సినిమాకు కూడా తీసుకెళ్లాడని వారు ఆరోపించారు. గతంలో మేనూర్ ఉన్నత పాఠశాలలో పనిచేసిన విజయ్ అక్కడా విద్యార్థినులను వేధించాడని తెలిసింది. అలాగే మద్నూర్కు చెందిన విజయ్ అతని ఇంటివద్ద గల ఓ మహిళను లైంగికంగా వేధించడంతో గ్రామపెద్దలు పంచాయతీ పెట్టి లోలోపల సమస్యను పరిష్కరించినట్లు కాలనీవాసులు తెలిపారు. కాగా విజయ్ పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండటం గమనార్హం. -
మాస్టారి వ్యథ
భీమవరం టౌన్:ఆయన ఎందరికో విద్యనేర్పిన మాస్టారు. నేడు వృద్ధాప్య పింఛను కోసం అందరి చుట్టూ తిరుగుతూ.. మలి జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. జీవనయాత్రలో తగిలిన ఎదురు దెబ్బలకు మతిచలించి, కంటిచూపు దెబ్బతిన్న ఆ మాస్టారుకు తోడు, నీడగా భార్య ఉన్నారు. కుటుంబ పోషణకు ప్రభుత్వం మంజూరు చేసే వెయ్యి రూపాయల పింఛను కోసం ఆ వృద్ధ దంపతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ నెలలో అయినా పింఛను వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసినఆ దంపతులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రజా సాధికారిత సర్వేలోనమోదు కాలేదంటూ ఆ మాస్టారుకు పెన్షన్ మంజూరు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ తెలుగు మాస్టారు గోడు ఇది. ఆ మాస్టారు పేరు తూరుభట్ల కృష్ణ. వయస్సు 68. నడుము వంగిపోయి.. మతిస్థిమితం సరిగా లేక.. కళ్లు కనిపించని స్థితిలో ఉన్న కృష్ణ మాస్టారును భార్య శ్యామల రిక్షాలో ఎక్కించుకుని సోమవారం భీమవరం మున్సిపాలిటీకి తీసుకువచ్చింది. ఈనెల కూడా పింఛను మంజూరు కాలేదని తెలిసి ఆమె నిశ్చేçష్టురాలయ్యారు. ఒక్క నిమిషం పాటు భర్త చేతిని వదిలి ఆమె మున్సిపల్ సిబ్బందిని వివరాలు కనుక్కుంటున్న సమయంలో.. ఆసరా కోల్పోయానేమోనని కంగారు పడుతూ ఓయ్ ఓయ్ అని పిలుస్తున్న భర్తను సమీపించి చేతిని ఆసరాగా ఇచ్చి ఏమీకాలేదులెండి అంటూ సముదాయిస్తున్న ఆమెను సాక్షి పలుకరించగా కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబ గోడును శ్యామల వెళ్లబోసుకున్నారు. ఆమె తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే... మతిస్థిమితం లేదు.. కళ్లు కనిపించవు తూరుభట్ల కృష్ణ 1949లో రాజమహేంద్రవరంలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్నారు. తెలుగుభాషపై మంచి పట్టు ఉంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో తెలుగు పాఠాలు బోధించేవారు. భీమవరానికి చెందిన తనకు ఆయనతో వివాహమైంది. మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. 1985లో పాలకోడేరు వచ్చి భారతీ కాన్వెంట్ను స్థాపించాం. 2004 వరకూ ఆ కాన్వెంట్ను నడిపాం. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెల వివాహ నిమిత్తం కాన్వెంట్ను అమ్మేశాం. ఒక కుమార్తెకు గోపాలపురం, మరో కుమార్తెకు రాజమహేంద్రవరంలో సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాం. భీమవరం ప్రాంతంలో పలు ప్రైవేటు కాన్వెంట్లలో ఆయన తెలుగు పాఠాలు బోధించేవారు. ఆ వచ్చిన జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. కొన్నేళ్ల క్రితం గోపాలపురం సంబంధం చేసిన కుమార్తె సమస్యలతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందింది. కుమార్తె మృతదేహాన్ని చూసిన కృష్ణ మాష్టారు షాక్కు గురై తలను గోడకేసి కొట్టుకోవడంతో నరాలు చిట్లి మతి చలించడంతో పాటు కంటిచూపు కోల్పోయారు. తోటివారి సాయంతో కుటుంబ పోషణ ఆ తర్వాత ఆయన వద్ద పనిచేసిన కొందరు ఉపాధ్యాయులు, పలు కాన్వెంట్లు,, విద్యా సంస్థల్లోని అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసిన సహాయంతో జీవనం గడుపుతున్నాం. మందులు, కుటుంబ పోషణకు ఎన్నో ఇబ్బందులు పడుతూ నెట్టుకువస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా ఆయనకు వృద్ధాప్య పింఛను వస్తుందని దరఖాస్తు చేసుకుంటున్నా రావడంలేదు. ఇటీవలే ఏలూరు వెళ్లి అధికారులను కలిసి గోడు చెప్పుకున్నాం. ఏప్రిల్ నెలలో వస్తుందని చెప్పడంతో ఇక్కడికి వచ్చాం. తీరా సర్వేలో నమోదు కా>లేదని అందువల్ల పింఛను రాదని చెబుతున్నారు. విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి సాక్షి తీసుకువెళ్లగా ప్రజా సాధికారిత సర్వేలో ఆ కుటుంబ వివరాలు నమోదు చేయించి పింఛనుకు దరఖాస్తు చేయిస్తే మంజూరు అవుతుందని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఏమన్నారంటే కృష్ణ మాస్టారు పింఛను వ్యవహారంపై సాక్షి మున్సిపల్ కమిషనర్ నాగనర్సింహారావును ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు. ఆయన గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పింఛను మంజూరు కాకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకుంటాను. ఆయన అర్హుడైనప్పటికీ మంజూరు సమయంలో దరఖాస్తుపై పొందుపరిచిన చిరునామాలో అందుబాటులో లేకపోతే నాట్ ట్రేస్డ్ అని ఉద్యోగులు పైకి నివేదిక పంపాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కృష్ణ మాస్టారుకు పింఛను మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. సాధికారిత సర్వేలో లేరని తెలిసింది. ఆ సర్వేలో కూడా ఆ కుటుంబం పేర్లు పొందుపరిస్తే త్వరితగతిన పింఛను మంజూరయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఆయనకు సొంతిల్లు లేకపోతే ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకంలో వచ్చేందుకు కృషి చేస్తాను. -
విద్యార్థుల జుట్టు కత్తిరించిన పాఠశాల యజమాన్యం
బెళగావి (సాక్షి,బెంగళూరు): అల్లరి చేస్తున్నారంటూ 20 మంది విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు జుట్టు కత్తిరించిన ఘటన సోమవారం బెళగావి తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కాకతి గ్రామంలో సెయింట్జాన్స్ పాఠశాల యజమాన్యం స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తూ క్రమశిక్షణ పాటించడం లేదనే కారణంతో 20 మంది పిల్లల జుట్టు కత్తరించింది. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న పిల్లల తల్లితండ్రులు పాఠశాలకు చేరుకొని యజమాన్యాన్ని నిలదీయగా పాఠశాల ముఖ్యోపాధ్యాయుడు పిల్లల తల్లితండ్రులను బెదిరించారు. అంతేకాకుండా దీనిపై ప్రశ్నించడానికి వెళ్లిన స్థానిక మీడియా ప్రతినిధులు కూడా పాఠశాల యజమాన్యం బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. -
సార్లే.. సారథులు..
సుజాతనగర్ : సమాజంలో తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం గురువులది.. విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేసేది వారి భాషణాలే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు సర్కార్ బడుల పరిరక్షణలోనూ మేము సైతం అంటున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొంటూ.. ఉపాధ్యాయ సంఘాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆయా సంఘాల్లో రాష్ట్రస్థాయిలో కీలక పదవుల్లో ఉంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకత్వ పటిమను నలుదిశలా చాటిచెబుతున్నారు. రాందాస్, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇల్లెందు మండలం చెన్నంగులగడ్డ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బానోత్ రాందాస్ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో రాందాస్ వీఆర్పురం, బయ్యారం, సింగరేణి, మండలాల్లో పనిచేశారు. 2016లో మహబూబ్నగర్లో జరిగిన టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. ‘‘ఇదివరకు ఉన్న అప్రెంటిస్ వ్యవస్థ రద్దు కోసం సుమారు 16 సంవత్సరాల పాటు మా సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేశాం. ఆ వ్యవస్థను రద్దు చేయించగలిగాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్టడుగు అన్ట్రెయిన్డ్ ఉపాధ్యాయుల రెగ్యులర్ కోసం పోరాడి సాధించాం. సీపీఎస్ రద్దు కోసం గత ఏడాది ఢిల్లీలోని పార్లమెంట్ ముందు 15 వేల మంది ఉపాధ్యాయులతో ధర్నా నిర్వహించాం. విజయం సాధించే వరకూ పోరాడుతూనే ఉంటాం.’’ అని రాందాస్ అన్నారు. లక్ష్మణ్నాయక్, టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు టేకులపల్లి మండలానికి చెందిన ఇస్లావత్ లక్ష్మణ్నాయక్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్(గతంలో ఈ యూనియన్ టీటీటీఎఫ్గా ఉండేది) రాష్ట్ర అధ్యక్షుడిగా 2013 నుంచి కొనసాగుతున్నారు. ‘‘ఏజెన్సీ పాఠశాలల్లో జీఓ నెం 3 ప్రకారం నూరు శాతం ఉద్యోగాలు గిరిజన ఉపాధ్యాయులతోనే భర్తీ చేయాలని పోరాడాం. సాధించాం. పీఆర్సీలో రావాల్సిన ఏహెచ్ఆర్ఏ అలవెన్సులు వచ్చేలా ఉద్యమించాం. ఏజెన్సీలో పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులను మైదాన ప్రాంతాలలోకి వెళ్లడానికి సహకరించాం. ముంపు ఉపాధ్యాయులను మన జిల్లాకు వచ్చేందుకు పోరాటం చేశాం. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు 342జీఓ ద్వారా ఉన్నత విద్య(ఎంఈడీ లేదా పీజీ) అవకాశం కల్పించాలని పోరాటాలు చేస్తున్నాం. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ (ఓపీఎస్) స్కీంనే కొనసాగించాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం.’’ అని లక్ష్మణ్ నాయక్ అన్నారు. సీహెచ్ రవి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్వంచకు చెందిన చావా రవి ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం 2014 జూన్ 2 నుంచి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్టంలో 2006 నుంచి ‘ఐక్య ఉపాధ్యాయ’అనే మాస పత్రికకు ప్రధాన సంపాదకుడిగా పనిచేశారు. 1997 నుంచి 2006 ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ అన్ట్రెయిన్డ్ ఉపాధ్యాయులను స్పెషల్ విద్యావలంటీర్లుగా గుర్తించి వారికి అన్ని వసతులు కల్పించడానికి పోరాటం చేసి విజయం సాధించాం. సీపీఎస్ వ్యతిరేక ఉద్యమంలో మా సంఘం కీలక భూమిక పోషిస్తోంది. నాణ్యమైన విద్యాభోదన అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.’’ అని రవి పేర్కొన్నారు. కేఎస్సీ చౌదరి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కొత్తగూడేనికి చెందిన కె.సురేష్ చంద్ర చౌదరి పాత కొత్తగూడెంలోని తెలంగాణ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ‘‘గిరిజన ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్ల విషయంలో పోరాటం చేసి సాధించాం. గతంలో ఉన్న హెచ్ఆర్ఏను 14.5 శాతానికి పెంచడానికి సుదీర్ఘంగా ఉద్యమించాం. మహిళా ఉపాధ్యాయులకు 5 అదనపు క్యాజువల్ లీవులకోసం పోరాడి సాధించుకున్నాం’’ అని చౌదరి అన్నారు. జయబాబు, ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు భద్రాచలం పట్టణానికి చెందిన కల్లూరి జయబాబు చర్ల మండలంలోని లెనిన్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్(ఏటీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సంఘానికి ఆయన 2012 నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ‘‘ఏజెన్సీలో ఏరియాలో నూరు శాతం ఉద్యోగాలు, పదోన్నతులు జీఓ నెం 03 ప్రకారం భర్తీ చేయాలని నిర్విరామంగా పోరాటాలు చేస్తున్నాం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులను మైదాన ప్రాంతానికి పంపడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. 2015 పీఆర్సీలో ఏజెన్సీ ప్రాంతంలో ఏహెచ్ఆర్ఏ జీఓ అమలు కోసం ఉద్యమించి విజయం సాధించాం.’’ అని జయబాబు వివరించారు. పూర్ణచందర్రావు, టీపీటీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇల్లెందు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన సాధినేని పూర్ణచందర్రావు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 1983 నుంచి పూర్ణచందర్రావు టీపీటీఎఫ్లో కొనసాగుతున్నారు. గతంలో ఏపీటీఫ్గా ఉన్నప్పుడు 1983 నుంచి 2007 దాకా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ‘‘ఐటీడీఏలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 1974 నుంచి 1986 దాకా స ర్వీస్ రెగ్యులైజేషన్ లేదు. ఆ సమస్యను ఐటీడీఏ పీఓ దృష్టి్టకి తీసుకెళ్లి రెగ్యులైజేషన్ సాధించాం.’’ అని పూర్ణచందర్రావు చెప్పారు. -
జంపన్న సహచరిణి సుల్తానాబాద్ హేమలతే!
పెద్దపల్లి: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సీనియర్ నేత జంపన్నకు ఉమ్మడి జిల్లాలోని పీపుల్స్వార్, మావోయిస్టు పార్టీ కార్యకలాపాలతో విడదీయరాని అనుబంధం ఉంది. 1994లో సుల్తానాబాద్కు చెందిన హేమలత అనే ప్రైవేటు పాఠశాల టీచర్ పీపుల్స్వార్ పార్టీలో చేరారు. ఆ సమయంలో జంపన్న మహదేవపూర్, ఏటూరు నాగారం ప్రాంతాలకు జిల్లా కమిటీ సభ్యునిగా ఉన్నారు. ఆ సమయంలో పెద్దపల్లి, మంథని దళాలకు శిక్షణ ఇచ్చేందుకు జంపన్న ఈ ప్రాంతంలో పర్యటించేవారు. జంపన్నకు సహచరిణిగా పని చేసిన హేమలత ఆయననే పార్టీ వివాహం చేసుకొని భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి ప్రాంత దళ కమాండర్గా పని చేశారు. 2001లో జరిగిన ఎన్కౌంటర్లో సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో స్వర్ణక్కతోపాటు 8 మంది హతమయ్యారు. సహచరిణి కోల్పోయిన జంపన్న ఆ తర్వాత పార్టీలో రెండో వివాహం చేసుకున్నారు. ఆమెతో కలిసి ప్రస్తుతం ప్రభుత్వానికి జంపన్న లొంగిపోయారు. -
పాఠశాలలో కొట్టుకున్న ఉపాధ్యాయులు
హన్వాడ(మహబూబ్నగర్): విద్యార్థులను సన్మార్గంలో నడిపించాలని ఉపాధ్యాయులు గాడి తప్పారు. బాధ్యతలను విస్మరించి విద్యార్థులు చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి వారి ముందే బాహాబాహీకి దిగిన వైనమిది. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నత పాఠశాలలో పనిచేసే హిందీ పండిట్ నాగేష్, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు చంద్యానాయక్, గణితం టీచర్ హన్మంతునాయక్, ఇంగ్లిష్ టీచర్ శ్రీనివాస్రెడ్డి పాఠశాలలోనే వ్యక్తిగతంగా భోజనం తయారు చేయించుకునేవారు. ఇందుకోసం సొంతంగా సరుకులు తెచ్చుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ స్టౌ కూడా సమకూర్చున్నారు. కొన్నాళ్లు ఇది బాగానే సాగిన బి య్యం, సరుకులు అయిపోవడంతో గొడవలు మొదల య్యాయి. ప్లేట్లు, ఇతర సామాగ్రిని తోటి వారికి తెలియ కుండా హిందీ పండిట్ నాగేష్ ఇంటికి తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన మిగతా ఉపాద్యాయులు నాగేష్ను నిలదీశారు. ఆ తర్వాత నాగేష్ మిగతా వారితో కలిసేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. ఇంతలో నాగేష్ వారు వం డుకునే ఎలక్ట్రిక్ స్టౌను పగలగొట్టాడు. విషయం తెలి యడంతో మిగతా ముగ్గురు ఆయనను ప్రశ్నించారు. ఈక్రమంలో మంగళవారం చంద్యానాయక్.. నాగేష్పై దాడి చేయడంతో గొడవ పెద్దదైంది. దీంతో మిగతా ఉపాధ్యాయులు సర్దిచెప్పారు. వ్యక్తిగత గొడవలే.. ఉపాధ్యాయులు నాగేష్, చంద్యానాయక్ ఒకే కాలనీలో ఉంటుండగా.. చంద్యానాయక్ తన ఇంటి నిర్మాణం కో సం బేస్మెంట్ రాయిని నాగేష్ నుంచి తీసుకున్నాడని హెచ్ఎం విజయరామరాజు తెలిపారు. దీనికి సంబంధిం చి డబ్బు విషయమై గొడవ జరగగా కొట్టుకున్నారని చె ప్పారు. ఎంఈఓ రాజునాయక్ మాట్లాడుతూ ఉపాధ్యా యులిద్దరూ వ్యక్తిగత గొడవతో కొట్టుకున్నారని తెలిపా రు. విషయాన్ని డీఈఓకు తెలియజేశామని చెప్పారు. -
హోంవర్క్ చేయలేదని..
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ మరిచాడు.. మనిషిననే విషయాన్ని మరిచి పశువులా ప్రవర్తించాడు.. పసి పిల్లలని కూడా చూడకుండా చితకబాదాడు. హోంవర్క్ చేయలేదని కోపంతో నలుగురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు ఇష్టమొచ్చినట్లు కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ స్థానిక మహాత్మా జ్యోతాబాపూలే ప్రభుత్వ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో హోంవర్క్ చేయలేదనే కారణంగా నలుగురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన ఐదు రోజుల క్రితం జరుగగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. తమ పిల్లలను ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడని తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సముద్రాల గ్రామానికి చెందిన భాస్కుల ప్రేమ్, జఫర్గడ్ మండలం íహిమ్మత్నగర్కు చెందిన అనుముల సాయికిరణ్, బి.నితిన్, సందీప్ స్థానిక ప్రభుత్వ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 7వతరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో పాఠశాలలలో హిందీ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న నవీన్ ఐదు రోజుల క్రితం పిల్లల హోంవర్క్లను పరిశీలించాడు. ప్రేమ్, సాయికిరణ్, నితిన్, సందీప్లు హోంవర్కు చేయకపోవడంతో ఆగ్రహంతో వారిని పీవీసీ ప్లాస్టిక్ పైప్తో చేతులు, కాళ్లు, తొడలపై కొట్టాడు. దాంతో విద్యార్థుల తొడలపై తీవ్రంగా వాతలు వచ్చాయి. అయితే ఉపాధ్యాయుడికి భయపడిన విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. కాగా పిల్లలను చూసి వెళ్దామని పాఠశాలకు వచ్చిన ప్రేమ్ తల్లిదండ్రులు యాదగిరి, రేణ, సాయికిరణ్ తండ్రి అనుముల సోమయ్య విద్యార్థుల తొడలపై ఉన్న వాతలు చూసి విషయం తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు సోమవారం సెలవులో ఉన్నాడు. పాఠశాలను సందర్శించిన డీటీ విద్యార్థులను టీచర్ కొట్టిన విషయమై తల్లిదండ్రులు ఆర్డీఓ రమేష్కు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ రాజు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఓను ఆదేశించారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి.. విచక్షణరహితంగా విద్యార్థులను పైప్తో చితకబాదిన ఉపాధ్యాయుడు నవీన్పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ విషయమై పాఠశాల ఎస్ఓ(స్పెషల్ ఆఫీసర్) మల్లయ్యతో వారు వాగ్వాదానికి దిగారు. పిల్లలు హోంవర్క్ చేయకుంటే నోటితో బెదిరించాలని, చదువులో వెనుకబడితే పేరెంట్స్ దృష్టికి తీసుకురావాలన్నారు. కానీ అలా కాకుండా పిల్లలను కొట్టే హక్కు అతడికి ఎవరు ఇచ్చారని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే సహించేది లేదన్నారు. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటాం విద్యార్థులను దండించవద్దని, నోటితో బెదిరించాలని ఉపాధ్యాయులకు పదేపదే సూచిస్తుంటా. ఏడో తరగతి విద్యార్థులను హిందీ ఉపాధ్యాయుడు నవీన్ దండించిన విషయం ఆదివారం తెలిసింది. ఈ విషయమై అతడిని ఫోన్లో మందలించాను. బంధువుల వివాహం ఉందని సోమవారం అతడు సెలవు పెట్టాడన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతడిపై తగిన చర్యలు తీసుకుంటా. – మల్లయ్య, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ -
స్కూల్ యూనిఫాం వేసుకురాలేదని
-
జీన్స్తో వచ్చిన విద్యార్థి తొడలు కోసిన టీచర్..
లక్నో: స్కూల్ యూనిఫాం వేసుకురాలేదని టీచర్లు ఓ విద్యార్థి తొడలు కోసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్, సికందర్ నగర సమీపంలోని కాన్పూర్లో చోటు చేసుకుంది. 11వ తరగతి చదువుతన్న విద్యార్థి రోజు మాదిరి స్కూల్ యునిఫాం కాకుండా జీన్స్ ధరించి శనివారం పాఠశాలకు వెళ్లాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్కూల్ మేనేజర్ ప్యాంట్ను కత్తిరించాలని టీచర్లకు సూచించాడు. దీంతో ఓ టీచర్ ఆ విద్యార్థి ప్యాంట్ను తొడలపై భాగం వరకు కత్తిరించే సమయంలో విద్యార్థి తొడలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తండ్రి స్కూల్ యాజమాన్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇంటికి పంపించి స్కూల్ యునిఫాం వేసుకురావలని సూచించకుండా.. ఇంత దాష్టికంగా ప్రవర్తించారని మండిపడ్డారు. -
ఆధార్ ఇవ్వలేదని బాలుడిపై దారుణం
పుణే : ఆధార్ వివరాలు ఇవ్వలేదని 10 ఏళ్ల విద్యార్థిని ఓ టీచర్ దారుణంగా కొట్టిన ఘటన చిన్చ్వాడ్ ప్రాంతంలో మోర్య శిక్షణ్ సంస్థాలో చోటుచేసుకుంది. గత కొన్ని వారాల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సర్జరీ అనంతరం ఆ బాలుడి జరిగిన ఘటనంతా వివరించడంతో, విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు చిన్చ్వాడ్ పోలీసు స్టేషన్లో టీచర్పై కేసు నమోదైంది. ఆధార్ వివరాలు ఇవ్వలేదని తమ కొడుకును టీచర్ ఎందుకు ఇంతలా కొట్టిందో తనకు అర్థం కావడం లేదని విద్యార్థి తల్లి సంగీత బెల్లె అన్నారు. తనకున్న జ్ఞానం ప్రకారం సర్క్యూలర్లు, ఇతర నోటిఫికేషన్లను తల్లిదండ్రులకు పంపించడానికి ఓ మొబైల్ అప్లికేషన్ను అందించాలని స్కూల్ యాజమాన్యం ప్లాన్ చేసిందని, దానికి ఆధార్ వివరాలు అవసరమని ఆమె పేర్కొన్నారు. కానీ ఆధార్ వివరాలు ఇవ్వనందుకే కొట్టాల్సినంత అవసరం లేదన్నారు. సర్జరీ నిమిత్తం అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 15 వరకు తమ కొడుకును ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. జరిగిన ఘటన చెప్పడానికి కూడా తాను చాలా భయపడ్డాడని, మోకాళ్లకు బాగా దెబ్బలు తగలడంతో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడని వివరించారు. సర్జరీ చేయించడానికి ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పుడు, జరిగిన ఘటనంతా వివరించాడని బెల్లె తెలిపారు. తమ కొడుకు ఆసుపత్రి నుంచి డిఛార్జ్ చేశాక, వీరు పోలీసు స్టేషన్ను ఆశ్రయించి, టీచర్పై ఫిర్యాదు చేశారు. ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరిచినందుకు గాను టీచర్పై సెక్షన్ 324 కింద, జువెలియన్ సెక్షన్ యాక్ట్ 2015లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఆదివారం స్కూల్కు సెలవు కావడంతో, సోమవారం స్కూల్ అథారిటీని సంప్రదించి, ఈ కేసుపై మరిన్ని వివరాలు రాబడతామనని చిన్చ్వాడ్ పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారు. -
స్కూల్ బస్ ఢీకొనిఉపాధ్యాయుడి మృతి
నగరంలోని ఓ ప్రయివేటు పాఠశాల. శుక్రవారం సాయంత్రం. పిల్లలు, ఉపాధ్యాయులు బయటకు వచ్చారు. స్కూల్ బస్సుల్లో ఎక్కుతున్నారు. అంతలోనే ప్రమాదం.. ఉపాధ్యాయుడికి త్రీవ గాయాలు.. ఆస్పత్రిలో మృతి. అసలేం జరిగింది..? ఖమ్మంఅర్బన్: నగరంలోని ప్రయివేట్ పాఠశాలలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాలు... ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన అతని పేరు గైని యల్లాగౌడ్(24). నగరంలోగల పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని, 5.00 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకని బస్టాండ్ వైపు వెళ్లే స్కూల్ బస్సు ఎక్కేందుకు మైదానంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. మైదానంలో రెండు బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఉన్నాయి. వాటి మధ్య నుంచి యల్లాగౌడ్ వెళుతున్నారు. అంతలోనే, ఒక బస్సు రివర్స్లో వెనక్కు వస్తోంది. అది యల్లాగౌడ్ను ఢీకొనడం, అలానే వెనక్కు నెట్టుకెళ్లడం, అక్కడే ఉన్న మరో బస్సును తగలడం.. క్షణాల్లోనే జరిగింది. ఆ రెండు బస్సుల మధ్యన యల్లాగౌడ్ నలిగిపోయారు. రొమ్ము, పొట్ట భాగంలో బలమైన గాయాలయ్యాయి. ఇంతలో మరో ఉపాధ్యాయుడు వచ్చి, యల్లాగౌడ్ను ఆటోలో సమీపంలోగల మమత ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడే శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. హైదరాబాద్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడి మృతికి సంతాపంగా పాఠశాలకు శుక్రవారం యాజమాన్యం సెలవు ప్రకటించింది. ‘బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం’ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో యల్లాగౌడ్ మృతిచెందాడంటూ అర్బన్ పోలీస్ స్టేషన్లో అతడి బాబాయి కృష్ణయ్య శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసును సీఐ నాగేంద్రాచారి దర్యాప్తు జరుపుతున్నారు. -
పసిమొగ్గలపై పైశాచికం
-
టీచర్ను 28 సార్లు పొడిచి.. చంపేశారు!
ఆమె అంటే ఎవరికి.. ఎందుకు కోపం వచ్చిందో తెలియదు గానీ, ఓ స్కూల్ టీచర్ను ఏకంగా 28 సార్లు కత్తితో పొడిచి పొడిచి మరీ చంపేశారు. హరియాణాలోని పంచకుల సెక్టార్-20లోని మార్కెట్ వద్దకు పిజా కొనుక్కోడానికి తన 15 ఏళ్ల కొడుకుతో కలిసి వెళ్లిన కొద్ది సేపటికే ఈ హత్య జరిగింది. మృతురాలు రీనాదేవి (39) స్కూల్ టీచర్. ఆమె చండీమందిర్ కంటోన్మెంటు ప్రాంతంలో గల శౌర్య ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చేస్తున్నారు. గురువారం రాత్రి 9.30 వరకు మార్కెట్లోని పిజా షాపు వద్దే ఉన్న ఆమె.. ఆ తర్వాత తన కారుతో సహా ఆమె అదృశ్యం అయ్యారు. అర్ధరాత్రి తర్వాత చండీమందిర్ - రామ్గఢ్ రోడ్డులోని భందెర్ ఘాటి వద్ద తన కారులోనే ఆమె దారుణంగా హత్యకు గురై కనిపించారు. ఆమె తన ఇద్దరు కొడుకులతో కలిసి సెక్టార్ 20 సమీపంలోని పీర్ ముచల్లా వద్ద ఓ ఫ్లాట్లో నివసిస్తున్నారు. ఆమె భర్త సందీప్ కుమార్ ఆర్మీలో చేసి రిటైరయ్యారు. ఆయన బడ్డి వద్ద గల ఓ ఫ్యాక్టరీకి సెక్యూరిటీ ఇన్చార్జి. వారాంతాల్లో కుటుంబం వద్దకు వస్తారు. పోలీస్ కంట్రోల్ రూం సిబ్బంది వ్యాన్లో పెట్రోలింగ్ చేస్తుండగా రీనాదేవి కారు కనిపించింది. అందులో ఆమె మృతదేహం రక్తపు మడుగులో ఉంది. ఆమెను ఏదో పదునైన ఆయుధంతో పొడిచారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమెకు మొత్తం 50 గాయాలు కాగా, వాటిలో 28 పొడిచిన గాయాలు. చాలావరకు గాయాలు ఆమెకు ఎడమవైపు కాగా, కుడివైపు చేతిమీద, తల మీద కూడా కొద్దిపాటి గాయాలయ్యాయి. గుండెలోను, ఊపిరితిత్తుల్లో కూడా కత్తిపోట్లు దిగడంతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆమె మరణించారని వైద్యులు తెలిపారు. అత్యాచారం మాత్రం జరగలేదని స్పష్టం చేశారు. కారులో రెండు సీసాల మద్యం, చాలా సిగరెట్ పీకలు, ఒక హెల్మెట్ ఉన్నాయి. దాన్నిబట్టి హత్యకు చాలాసేపటి ముందు నుంచి కారులో ఆమెతో పాటు వేరే ఎవరో ఉన్నట్లు అర్థమైంది. తన తల్లి మార్కెట్ నుంచి అదృశ్యం అయినా 15 ఏళ్ల కొడుకు ఎందుకు ఎవరికీ చెప్పలేదన్నది అర్థం కావట్లేదు. ఎవరో బాగా కోపం, కసితోనే ఆమెను అన్నిసార్లు పొడిచినట్లుందని పోస్టుమార్టం చేసిన వైద్యులు చెప్పారు. -
స్కూల్ టీచర్లకూ అదే సిలబస్..!
- ‘గురుకుల’ పోస్టుల సిలబస్నే వర్తింపజేసే అవకాశం - రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన అధికారుల కమిటీ సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ల పోస్టులకు ప్రకటించిన సిలబస్నే పాఠశాలల్లో త్వరలో భర్తీ చేయనున్న టీచర్ పోస్టులకూ వర్తింపజేసే అవకాశం కనిపిస్తోంది. గురుకులాల్లోని పోస్టులతో పాఠశాలల్లో ఉన్న సమాన స్థాయి పోస్టులకు గురుకుల పోస్టులకు పేర్కొన్న సిలబస్నే వర్తింపజేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యా శాఖ అధికారుల కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను కూడా అందజేసినట్లు సమా చారం. ఉదాహరణకు గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టుల తో పాఠశాలల్లో సమాన పోస్టు స్కూల్ అసిస్టెంట్. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టీజీటీలకు పేర్కొన్న సిలబస్నే అమలు చేసే అవకాశం ఉంది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కూడా దాదాపు అదే స్థాయిలో ఉండే పీఈటీ వంటి పోస్టులకు పేర్కొన్న సిలబస్ను వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీటికితోడు టెట్ వెయిటేజీ యథాతథంగా అమలు చేయనున్నారు. గత ఏడాది ఇంగ్లిష్ మీడియంను ఒకటో తరగతిలో ప్రారంభించిన ప్రభుత్వం ఈసారి రెండో తరగతిలో ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కూడా 150 మార్కులు ఉంటే ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్తోపాటు బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్లో 50 మార్కులకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. పేపర్లవారీ విధానాన్ని టీఎస్పీఎస్సీ ఖరారు చేయనుంది. టీఎస్పీఎస్సీ గురుకులాల తరహాలో పరీక్షా విధానం ఖరారు చేసినా, మరేవిధంగా చేసినా, క్లాస్ రూమ్ డెమో ఉండాలని విద్యాశాఖ అధికారుల కమిటీ తమ నివేదికలో సిఫారసు చేసిన ట్లు తెలిసింది. క్లాస్ రూమ్ డెమో నిర్వహణ సాధ్యం కాదనే గురుకుల పోస్టుల్లో పెట్టలేదు. ప్రభుత్వ పాఠశాలల టీచర్ పోస్టుల భర్తీ క్రమంలో క్లాస్ రూమ్ డెమో నిర్వహణ సాధ్యమా? అన్నది టీఎస్పీఎస్సీ, ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. -
ఈ ఇంగ్లిష్ టీచర్ సమ్థింగ్ స్పెషల్!
చెన్నై: మావి ఇంటర్నేషనల్ స్కూళ్లు అని ఊదరగొట్టే కార్పోరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా ఓ ప్రభుత్వ పాఠశాలలోని తరగతిగది రూపుదిద్దుకుంది. క్లాస్రూం అంటే ఇలా ఉండాలి అనిపించేలా.. ఇంటరాక్టీవ్ స్మార్ట్బోర్డు, సౌకర్యవంతమైన ఫర్నీచర్, పిల్లలకు నచ్చేలా ఉన్న రంగురంగుల పెయింటింగ్లు, రిఫరెన్స్ పుస్తకాలు ఇవన్నీ తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న ఓ ఇంగ్లిష్ టీచర్కు తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతకు నిలువుటద్దం ఆ వసతులు. పిల్లలకు మంచి సౌకర్యాలు ఉండాలని అభిలషించిన ఆమె.. తన నగలు అమ్మి మరీ ఆ క్లాస్రూంను తీర్చిదిద్దారు. విల్లుపురంలోని కందాడు ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులు అదృష్టవంతులు. ఎందుకంటే అక్కడ అన్నపూర్ణా మోహన్ అనే ఇంగ్లిష్ టీచర్ పనిచేస్తున్నారు. ఆ పాఠశాలలో పిల్లలు తడుముకోకుండా ఇంగ్లిష్ మాట్లాడటంలో ఆమె కృషి ఎనలేనిది. అయితే.. ఆమె అంతటితోనే తన బాధ్యత తీరిపోయిందని భావించలేదు. పిల్లలకు మంచి వసతులు ఉండాలని భావించారు. అందుకోసం సొంత ఖర్చులతో విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పరిచారు. విద్యార్థులలో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వలే తనకు కూడా సవాళ్లు ఎదురయ్యాయని తన అనుభవాల గురించి మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ వెల్లడించారు. మొదట పిల్లలతో ఇంగ్లిష్లో ఇంటరాక్ట్ అవుతుంటే వారు సరిగా స్పందించేవారు కాదని తెలిపారు. అయితే.. బోధనలో విద్యార్థులను మమేకం చేస్తూ.. స్కిట్లు తదితర పద్దతుల్లో పాఠాలను బోధించేదాన్నని గుర్తుచేశారు. తరువాత ఓసారి విద్యార్థుల ఇంగ్లిష్ సామర్థ్యాలను ఫేస్బుక్లో ఉంచగా.. మంచి స్పందన వచ్చిందని తెలిపారు. అనేక మంది ముందుకొచ్చి విద్యార్థులకు బహుమతులు పంపుతూ ప్రోత్సహించారని గుర్తుచేశారు. ఇలా అందరూ స్పందిస్తున్న తీరే.. విద్యార్థులకు మంచి క్లాస్రూం అందించే దిశగా తనను ప్రోత్సహించిందని అన్నపూర్ణ తెలిపారు. ‘కొంతమంది విదేశీయులు కూడా విద్యార్థులను ప్రోత్సహించారు. దాంతో విద్యార్థులకు సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. తరగతి గదిని అన్ని వసతులతో తీర్చిదిద్దాలని భావించాను’ అన్నారు అన్నపూర్ణ. అందుకోసం అవసరమైన డబ్బును నగలు అమ్మి సమకూర్చుకున్నారు ఆమె. ‘ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగా ఉండటం లేదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందువల్ల వారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందించే విద్యకోసం లక్షలాది రూపాయలను ప్రైవేట్లో వెచ్చిస్తున్నారు. అయితే.. కొంచెం కృషితో పేద విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించవచ్చు’ అని అంటున్నారు అన్నపూర్ణ. -
అసలు ఖాళీలెన్ని..?
♦ రాష్ట్రంలో ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యపై గందరగోళం ♦ ఒక్కో సందర్భంలో ఒక్కో లెక్క చెబుతున్న ప్రభుత్వం, అధికారులు ♦ ఈటల చెప్పినవి 24,861... ఇటీవల అసెంబ్లీలో ప్రకటించినవి 8,792 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై అంతా గందరగోళమే కనిపిస్తోంది. ప్రభుత్వం, అధికారులు ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ఖాళీ పోస్టుల లెక్కలు చెబుతున్నారు. కానీ అసలు లెక్కలపై మాత్రం స్పష్టత లేదు. రాష్ట్రంలో 2014 నవంబర్ నాటికి 24,861 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ఇటీవల 8,792 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. మరి మిగతా పోస్టులు ఏమయ్యాయి..? ఈ మూడేళ్లలో హేతుబద్ధీకరణ చేయలేదు, ఎలాంటి భర్తీ ప్రక్రియ కూడా చేపట్టలేదు. అయినా పోస్టులు ఎందుకు తగ్గిపోయాయనేది గందరగోళంగా మారింది. అనధికారికంగా హేతుబద్ధీకరించారా..? 2014 జూన్ నుంచి ఇప్పటివరకు మూడు వేల మంది వరకు ఉపాధ్యాయులు పదవీ విరమణ పొంది ఉంటారని విద్యాశాఖ అధికారుల అంచనా. అంటే 2014లో ప్రభుత్వం పేర్కొన్న 24,861 ఖాళీలకు ఇవి అదనం. కానీ ప్రస్తుతం పాఠశాలల్లో 8,792 పోస్టులను మాత్రమే భర్తీ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. అంటే రిటైర్మెంట్ల ద్వారా ఏర్పడిన 3 వేల ఖాళీలు పోగా.. అంతకుముందున్న ఖాళీ పోస్టులు 5,700 మాత్రమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులను తగ్గించారా? అంటే.. అదేమీ లేదని విద్యా శాఖ చెబుతోంది. మరి పోస్టులు ఎందుకు తగ్గాయన్న దానిపై మాత్రం సమాధానం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అనధికారికంగా హేతుబద్ధీకరణ చేసి, పోస్టులను తగ్గించి ఉండవచ్చని... రిటైరైన కొద్దీ ఆయా పోస్టులను రద్దు (సప్రెస్) చేశారేమోనని నిరుద్యోగులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా దాదాపు 4.5 లక్షల మంది ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. టీచర్ పోస్టుల సంఖ్యపై గందరగోళం ఇదీ.. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతానికి 1,07,744 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో తాత్కాలికంగా 5,23,675 పోస్టులను తెలంగాణకు కేటాయించగా.. అందులో 1,07,744 ఖాళీలున్నట్లు తేలింది. అందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 24,861, ఉన్నత విద్యాశాఖ పరిధిలో 10,592 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. – 2014 నవంబర్ 24న అసెంబ్లీలో మంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రకటన పాఠశాలల్లో మొత్తంగా 17,702 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. అందులో 1,000 వరకు హెచ్ఎం పోస్టులు, 3,869 స్కూల్ అసి స్టెంట్, 393 పీఈటీలు, 10,469 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు, ఇతర కేటగిరీల్లో మరి కొన్ని పోస్టులు ఉన్నాయి. – 2015 ఆగస్టులో విద్యాశాఖ తేల్చిన లెక్కలు పాఠశాల విద్యాశాఖలో 12,142 పోస్టులు (తెలుగు మీడియంలో 10,927 పోస్టులు, ఉర్దూ మీడియంలో 1,215 పోస్టులు) ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. – 2015 డిసెంబర్లో రాష్ట్ర కేబినెట్ ఈ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది 2016 మార్చి 31వ తేదీ నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 16,193 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఎలిమెంటరీ స్కూళ్లలో (1 నుంచి 8వ తరగతి వరకు) 13,049 పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో 3,144 పోస్టులు ఉన్నాయి. – 2016 జూలై 16న ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో సమర్పించిన నివేదికలోని వివరాలివి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 11,329 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తే ఏటా రూ.388 కోట్లు భారం పడుతుంది. అందులో తెలుగు మీడియం స్కూళ్లలో 1,750 ఎస్ఏ పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 1,069, పీఈటీలు 372, ఎస్జీటీలు 6,923, ఉర్దూ మీడియం స్కూళ్లలో 1,215 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. – 2016 నవంబర్లో ప్రభుత్వానికి విద్యాశాఖ సమర్పించిన నివేదికలోని వివరాలివి రాష్ట్రంలోని పాఠ శాలల్లో 8,792 పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. వాటిని వచ్చే ఆరు నెలల్లోగా భర్తీ చేస్తాం. – గత నెలలో అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటన ఇది -
జీన్స్, టీషర్ట్స్తో రావొద్దు.. మొబైల్ వాడొద్దు
⇔ టీచర్లకు లక్నో డీఈవో ఆదేశాలు లక్నో: విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, ఆహార్యంలో మరింత హుందాగా ఉండాలని ఉత్తరప్రదేశ్లోని లక్నో జిల్లా విద్యాధికారి టీచర్లకు సూచించారు. టీచర్లెవరూ ఇకపై టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు ధరించి పాఠశాలకు రావొద్దని ఆదేశించారు. ‘వృత్తి గౌరవం పెంచేలా ఉపాధ్యాయుల వస్త్రధారణ ఉండాలి.. అందుకే అటువంటి దుస్తులను ధరించి పాఠశాలలకు రావొద్దు' అంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో తాను మాట్లాడతానని చెప్పారు. అంతేకాకుండా పనివేళల్లో మొబైల్ ఫోన్స్ వినియోగించడం మంచిది కాదని, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అన్ని పాఠశాలలో తప్పనిసరిగా ఉదయం పూట ప్రార్థన జరిగేలా చూడాలని పేర్కొన్నారు. పాఠశాలలకు సమీపంలో పాన్మసాలా, సిగరెట్లు విక్రయించే దుకాణాలు కనిపిస్తే వెంటనే వాటిని మూసివేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు జీన్సు ధరించి రావొద్దంటూ గతేడాది హరియాణా ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. -
నాగర్కర్నూల్లో ఉపాధ్యాయురాలి దాష్టీకం
-
‘పునాది’పై నిర్లక్ష్యమా?!
పాలకుల కబుర్లకేం గానీ మన దేశంలో బడి ఎప్పటిలాగే చతికిలబడి ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక చూస్తే అర్ధమవుతుంది. లోక్సభకు సమర్పించిన ఈ నివేదికకూ... నేరాంగీకార ప్రకటనకూ తేడా లేదని ఎవరికైనా అనిపించకమానదు. ఏటా నివేదికలివ్వడం, ఫలానా లక్ష్యాలు పెట్టుకున్నట్టు ప్రకటించడం రివాజైంది. తీరా సాధిస్తున్నది మాత్రం సున్నా! కానీ ఆ నివేదికల్లో పాత లక్ష్యాల సాధనలో ఎందుకు విఫల మయ్యారో, అందుకు దారితీసిన పరిస్థితులేమిటో చెప్పరు. వాటిని ఇకపై ఎలా సరిదిద్దుకుంటారో వివరించరు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రాథమిక, సెకం డరీ పాఠశాలల్లో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈసారి విడుదలైన వార్షిక నివేదిక చెబుతున్న తీరు చూస్తే గుండె చెరువవుతుంది. ఒకపక్క పిల్లలు పనుల్లో కాక బడుల్లో ఉండాలని, అక్షరాస్యతను పెంచాలని చెప్పే పాలకులు తీరా బడుల్లో ఉపాధ్యాయ ఖాళీలను మాత్రం భర్తీ చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏడేళ్ల క్రితం ఆర్భాటంగా విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. పాఠశాల విద్యకు దూరంగా ఉంటున్న 7 కోట్ల మంది పిల్లల్ని బడిబాట పట్టించాలని, వారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత నిర్బంధ విద్య అందించాలని, ఉపాధ్యాయ–విద్యార్ధి నిష్పత్తి 1:30కి తీసుకురా వాలని, ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేయాలని ఈ చట్టం నిర్దేశించింది. తీరా ఇన్నేళ్లుగా జరుగుతున్నదేమిటి? గోడలు కూడా సరిగాలేని బడులు, కూర్చోడానికి కూడా సాధ్యంకాని తరగతి గదులు ప్రతి ఊళ్లోనూ కనిపిస్తాయి. చాలాచోట్ల కనీస వసతులైన మంచినీరు, మరుగుదొడ్డి వంటివి లేవు. క్రీడా స్థలాలు లేవు. వీటన్నిటి సంగతలా ఉంచి చాలా పాఠశాలలు ఏకోపాధ్యాయ బడుల్లా కొనసాగుతున్నాయని తాజా నివేదిక వెల్లడిస్తున్నది. ఉత్తరప్రదేశ్లోని సెకండరీ పాఠశాలల్లో సగం టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ ఏలుబడిలోని జార్ఖండ్లో 70 శాతం టీచర్ పోస్టులు ఖాళీ! బిహార్, గుజరాత్లలో మూడో వంతు టీచర్ పోస్టులు భర్తీ చేయ లేదని నివేదిక తెలిపింది. ఇందుకు భిన్నంగా గోవా, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాలల్లో చాలినంతమంది ఉపాధ్యాయులున్నారు. సిక్కింలో అయితే ప్రాథమిక, సెకండరీ పాఠశాలలు రెండింటిలోనూ అవసరమైన టీచర్లున్నారు. ఆ మూడు రాష్ట్రాలకూ సాధ్యమైనది మిగిలిన రాష్ట్రాలకు ఎందుకు అసాధ్యమవు తున్నది? ఈ నివేదిక చూస్తే అసలు రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తు న్నాయా, కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటున్నదా అనే అనుమానాలు తలెత్తు తాయి. దేశంలో 60 లక్షల టీచర్ పోస్టులుంటే ప్రాథమిక పాఠశాలల్లో 9 లక్షలు, సెకండరీ పాఠశాలల్లో లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే తప్ప అక్కడ కూడా ఖాళీల సంఖ్య తక్కువేమీ కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక పాఠశాలల్లో 19,468 పోస్టులు... తెలంగాణలో 13,049 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సెకండరీ పాఠశాలలకొస్తే ఏపీలో 5,056, తెలం గాణలో 3,144 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి జిల్లాకూ కలెక్టర్తోసహా ఉన్నతా ధికారులు, వారికింద గ్రామ స్థాయి వరకూ ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. వీరికి పాఠశాలల్లో చదువులెలా సాగుతున్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు న్నాయో ఫిర్యాదులు రావా? కనీసం ఆయా పాఠశాలల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు అందవా? వీటన్నిటిపైనా చర్చలుండవా... చర్యలుండవా? జనం సమస్యలను మించి దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏ ప్రభుత్వానికైనా ఏం ఉంటాయి? విద్య విషయంలో ప్రభుత్వాలకుండే నిర్లక్ష్య ధోరణి వల్ల సమాజానికి తీరని నష్టం జరు గుతోంది. ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థుల్లో అత్యధికులకు వివిధ పాఠ్యాం శాల్లో కనీస పరిజ్ఞానం ఉండటం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతో ఇంతో సంపాదించే కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో వారిని ప్రైవేటు పాఠశాలలకు పంపుతాయి. రెక్కాడితే తప్ప డొక్కాడని నిరుపేద కుటుం బాలు గత్యంతరం లేని స్థితిలో ప్రభుత్వ పాఠశాలలకు పంపక తప్పడం లేదు. ఈ కుటుంబాల్లో అత్యధిక భాగం అట్టడుగు వర్గాలకు చెందినవే. అంటే పాలకుల నిర్లక్ష్యం వల్ల అట్టడుగు వర్గాలవారు అధికంగా నష్టపోతున్నారు. వారు శాశ్వతంగా విద్యకు, విజ్ఞానానికి దూరమవుతున్నారు. అవకాశాలు కోల్పోతున్నారు. దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాక విద్యపై ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం మొదలెట్టాయి. శాశ్వత నియామకాలను అటకెక్కించి రకరకాల పేర్లుబెట్టి కాంట్రాక్టు టీచర్లను నియమించడం, వారికి అరకొర వేతనాలివ్వడం ప్రారంభిం చాయి. కేంద్రం సైతం విద్య కోసం రాష్ట్రాలకిచ్చే నిధుల్ని గణనీయంగా తగ్గించింది. నెలకు ఏడెనిమిది వందల జీతం ఇచ్చి ఉపాధ్యాయులను నియమించడం, ఏడాది కాగానే వారి బదులు మరొకరిని నియమించడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఇందువల్ల విద్యకు జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఉద్యోగ భద్రత లేని ఉపాధ్యాయుడు ఎన్నాళ్లని బోధనారంగాన్ని నమ్ముకుని ఉంటాడు? ప్రామాణికమైన విధానంలో బోధించగలిగిన ఉపాధ్యాయులను నియమించాలని విద్యా హక్కు చట్టం చెబుతున్నా చాలా పాఠశాలల్లో ఈ కాంట్రాక్టు టీచర్లే దిక్కు. ఉపాధ్యాయ, విద్యార్ధి నిష్పత్తి 1:30 మాటలా ఉంచి... వంద మందికి ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు కూడా ఉన్నాయి. అంతక్రితం కాంగ్రెస్ ఏలు బడిలో చదువు ఇలా అఘోరించిందనుకుంటే ఎప్పుడూ దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా ఉండలేకపోతోంది. కేంద్రమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ కలిసి నిరుపేద, అట్టడుగు వర్గాల పిల్లలకు మెరు గైన, ప్రామాణికమైన చదువు అందించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నాయి. కనీసం వచ్చే నివేదిక నాటికైనా ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. అందుకు అవసరమైన ప్రణాళిక లను సిద్ధం చేసుకోవాలి. పార్లమెంటులో నివేదికను సమర్పించి పని పూర్తయిందని చేతులు దులుపుకునే ధోరణికి స్వస్తి పలకాలి. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
- ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టిన ఉపాధ్యాయ సంఘాలు - తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన15 వేల మంది ఉపాధ్యాయులు సాక్షి, న్యూఢిల్లీ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారుు. ఈ ధర్నాలో 20 రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్)కు చెందిన సుమారు 15 వేల మంది ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ జనరల్ సెక్రటరీ సీఎన్. భారతి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పీఎఫ్ఆర్డీఏను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్ నుంచి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, వై. శ్రీనివాసులు రెడ్డి, డా.ఎం.గేయానంద్, ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు పాల్గొని సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ. వెంకటేశ్వరరావు, పి. బాబురెడ్డి ప్రసంగిస్తూ.. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. పాత పెన్షన్ విధానం ప్రకారం ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఎంత జీతం ఉందో.. అందులో సగం ఉద్యోగ విరమణ తరువాత పెన్షన్గా వచ్చేదన్నారు. అరుుతే సీపీఎస్ అమలు వల్ల ఆ పెన్షన్ రాకుండా పోతోందన్నారు. 12 ఏళ్లుగా అమలవుతున్న ఈ విధానం.. దేశంలో 40 లక్షల మంది ఉపాధ్యాయుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిందని యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. రవి పేర్కొన్నారు. ఈ ధర్నాలో ఎస్టీఎఫ్ఐ అధ్యక్షుడు అబిజిత్ ముఖర్జీ, సంఘం నేతలు ఎన్.నారాయణ, కేసీ. హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మాయిలకు జుట్టు పొడుగ్గా ఉందని..
-
అమ్మాయిలకు జుట్టు పొడుగ్గా ఉందని..
రాయ్గఢ్: చత్తీస్గఢ్లో రాయ్గఢ్ జిల్లాలోని నహర్పాలి ప్రభుత్వ పాఠశాల టీచర్ విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పుష్పేంద్ర పటేల్ అనే లెక్కల టీచర్ తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినుల జుట్టును కత్తిరించాడు. గురువారం పుష్పేంద్ర పటేల్ రెండు కత్తెరలు తీసుకుని అమ్మాయిల వెంట్రుకలను కత్తిరించాడు. స్కూలుకు వచ్చేది చదువుకునేందుకే కానీ పొడవాటి వెంట్రుకలను ప్రదర్శించడానికి కాదంటూ అమ్మాయిలపై మండిపడ్డాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బాధిత అమ్మాయిలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పుష్పేంద్ర పటేల్ను అరెస్ట్ చేశారు. -
మహిళతో అడ్డంగా దొరికిన స్కూల్ టీచర్
జాజ్పూర్: ఓ పాఠశాల ఉపాధ్యాయుడు మహిళతో అసభ్యకరరీతిలో దొరికిపోయిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. జాజ్పూర్ జిల్లా రసూల్పూర్ బ్లాక్ లోని చందాపూర్ గ్రామ ప్రాధమిక పాఠశాలలో ఉర్దూ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న నసిమ్ ఖాన్.. పాఠశాల ఆవరణలోనే అసభ్యరీతిలో ఉండగా గ్రామస్తులు పట్టుకొని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(బీఈవో) ప్రఫుల్ల కుమార్ మాట్లాడుతూ.. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎడిషనల్ బీఈవో అధికారులతో ఈ ఘటనపై విచారణ చేపట్టామని తెలిపారు. వారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు నసీమ్ ఖాన్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బింజార్పూర్కు చెందిన నసీమ్ ఖాన్.. తాను విధులు నిర్వర్తిస్తున్న చందాపూర్ గ్రామం నుంచి తన ఊరు దూరంగా ఉందన్న కారణంతో కొంతకాలంగా పాఠశాలలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కొంత కాలంగా పాఠశాల ఆవరణలో అతడు అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. -
మైనర్లపై అఘాయిత్యం.. కీచక టీచర్ అరెస్ట్
ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ చేసిన నిర్వాకం తెలిస్తే అందరూ షాక్ తింటారు. విద్యాబుద్ధులు నెర్పించాల్సిన ఉపాధ్యాయుడు మైనర్ బాలికలపై అత్యాచారాలు చేస్తూ వచ్చాడు. చివరికి ఆ చిన్నారులు జరిగిన విషయాన్ని బయటపెట్టడంతో ఆ కీచక టీచర్ కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్.ఆర్ పాండే కథనం ప్రకారం.. తులసీరామ్ (40) ఓ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు బేసిస్ లో గ్రేడ్-3 టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. స్కూల్లో చదువుకునే ముగ్గురు విద్యార్థినులపై తరచుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తొమ్మిది సంవత్సరాల వయసున్న ఇద్దరు చిన్నారులపై, పదకొండేళ్ల మరో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. ఎవరికైనా చెప్పారంటే మీ అంతుచూస్తా అని బెదిరించేవాడు. గత నెల 29న ఓ చిన్నారి టీచర్ వేధింపులను తన తల్లితండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. అదేరోజు ముగ్గురు బాధిత చిన్నారుల పేరెంట్స్ హెడ్ మాస్టర్ కు తులసీరామ్ పై ఫిర్యాదుచేశారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి చిన్నారుల పేరెంట్స్ న్యాయం చేయాలని కోరుతూ సుల్తాన్ గంజ్ పోలీసులను ఆశ్రయించి, కీచక టీచర్ పై ఫిర్యాదు చేశారు. పలుమార్లు తమపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఐపీసీ 376(2) సెక్షన్ కింద, చిన్నారులపై లైంగిక దాడుల చట్టం కింద పలు సెక్షన్లలో ఆ కీచక టీచర్ పై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. డీఈవో ఎస్.పీ త్రిపాఠి మాట్లాడుతూ.. టీచర్ తులసీరామ్ వేదింపులకు పాల్పడినట్లు రుజువైతే అతడిని జాబ్ నుంచి తొలగిస్తామన్నారు. పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయని హెడ్ మాస్టర్ పై కూడా డీఈవో ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఉపాధ్యాయునిపై నిర్భయ కేసు
బాడంగి (విజయనగరం) : విద్యార్థులను సత్ప్రవర్తన కలిగినవారుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడే నిర్భయ కేసులో ఇరుక్కున్నాడు. ఒక అమాయకురాలిని ప్రేమ పేరుతో వలలో వేసుకొని శారీరక సంబంధం పెట్టుకొని తీరా పెళ్లి విషయానికొచ్చేసరికి తప్పించుకోజూసినందుకు ఆయనపై బాడంగి పోలీస్స్టేషన్లో ఈ కేసు నమోదయింది. దీనికి సంబంధించి విజయనగరం జిల్లా బొబ్బలి సీఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం.. బాడంగి మండలం ఆనవరం గ్రామానికి చెందిన ఒక యువతి మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి హైస్కూల్లో పనిచేస్తున్న కిళ్లాడ లచ్చన్న అనే ఉపాధ్యాయునితో ప్రేమలోపడింది. మూడేళ్లుగా వారు ప్రేమించుకొంటున్నారు. శారీరక సంబంధం పెట్టుకోగా అమ్మాయి పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తేవడంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అమ్మాయి గురువారం రాత్రి పొలీస్స్టేషనులో ఫిర్యాదు చేయగా బొబ్బిలి సీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పక్కాగా పర్యవేక్షణ
పాఠశాలల పనితీరుపై సాంకేతిక నిఘా క్షేత్రస్థాయి పరిస్థితులన్నీ ట్యాబ్లలో నిక్షిప్తం అవినీతి రహిత చర్యల నిరోధానికి విద్యాశాఖ అడుగులు బాలాజీచెరువు (కాకినాడ) : ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించినా ఆశించిన ఫలితాలు రావడం లేదు.దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రత్యేక నిఘా, పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని గుర్తించిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో పర్యవేక్షించి పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాల వివరాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్లో పొందుపరచి వాటిని జిల్లా అధికారులలు పరిశీలించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు మండల విద్యాశాఖాధికారులకు ట్యాబులు పంపిణీ చేసి వారి నుంచి అమలవుతున్న కార్యక్రమాల్లో లోపాలు, సమస్యలుస వివరాలను తెలుసుకుంటున్నారు. లోపాలున్న చోట జిల్లా అధికారులు స్పందించేలా చర్యలు చేపట్టారు.పాఠశాల పనితీరు పర్యవేక్షణకు ఈ విధానం దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్యాంజలి యాప్.. విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ఇంటర్నెట్లో నిక్షిప్తం చేసేందుకు జిల్లా విద్యాశాఖ, ఏస్ఏస్ఏ సంయుక్తంగా విద్యాంజలి యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏ సమయానికి హాజరౌతున్నారు, మ«ధ్యాహ్న భోజనం అమలు, విద్యార్థుల సామర్థ్యాలు ఇందులో పొందుపరుస్తారు. జిల్లా అధికారులు ఎక్కడి నుంచైనా వాటిని సమీక్షించే అవకాశం ఉంది. ట్యాబుల్లో స్కైప్ను డౌన్లోడ్ చేసి వీడియోకాల్ ద్వారా హెచ్ఎంలతో మాట్లాడేలా చర్యలు చేపట్టారు. తద్వారా విద్యాశాఖ తీరును గాడిలో పెట్టి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని అధికారులు అడుగులు వేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో.. జిల్లాలో సర్వ శిక్షాభియాన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల హెచ్ఎంలు, కేజీబీ వీల ప్రత్యేక అధికారులు, ఆదర్శ, కేజీవీబీ ప్రత్యేక అధికారులకు ట్యాబ్లను అందజేశారు. వీరు ఎప్పటికప్పుడు వారికి అందిన సమాచారంతో సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని సరిచేయాలన్న లక్ష్యంతో పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడుతుంది మండల స్థాయి అధికారులతో పాటు ప్రత్యేక పాఠశాలల అధికారులకు ట్యాబ్లు ఇవ్వడం ద్వారా పాఠశాలల పనితీరు ఎప్పటికప్పుడు గమనించి లోపాలుంటే సరిచేయవచ్చు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు పర్యవేక్షించే పనిలేకుండా ఈ ట్యాబ్లో ఉన్న డేటా ఆధారంగా చర్యలు చేపట్టవచ్చు. - టీవీజే కుమార్. సర్వశిక్షా అభియాన్ ఇన్చార్జి పీఓ -
విధికే ‘కన్ను’కుట్టింది!
* చూపు కోల్పోయిన ఆరేళ్ల బాలుడు * పెన్సిల్ తగిలి ఎడమ కన్ను.. టీచర్ బెత్తం తగిలి కుడి కన్ను * ఏపీలోని ఒంగోలులో ఘటన ఒంగోలు: ఆరేళ్ల వయసులోనే ఆ బాలునిపై విధికి కన్ను కుట్టింది. తోటిపిల్లలతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పెన్సిల్ తగిలి గతంలో ఒక కంటి చూపు పోగా, ఇప్పుడు స్కూల్ టీచర్ ఆగ్రహానికి మరో కంటి చూపునూ కోల్పోయి అంధుడిగా మారాడు. తన బిడ్డకు చూపు తెప్పించేందుకు ఆదుకోవాలంటూ ఆ బాలుని తండ్రి జిల్లా కలెక్టర్ను కలసి విన్నవించాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో గురువారం చోటుచే సుకుంది. కంభం మండలం రావిపాడుకు చెందిన కాళ్ల గోపాల్ కుమారుడు మోహనరంగ(6) స్థానిక ఆల్ఫా పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. గతంలో పాఠశాలలో ఆడుకుంటూ ఉండగా తోటి విద్యార్థి చేతిలో పెన్సిల్ పొరపాటున రంగ ఎడమ కంటిలో గుచ్చుకుంది. దీంతో ఆ కంటిచూపు పోయింది. తాజాగా ఈ నెల 13న పాఠశాలలో బాబుపై ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు బెత్తం ప్రయోగించింది. అది కుడికంటిపై తగిలిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. వెంటనే హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి చూపు వచ్చే అవకాశం లేదని, అయినప్పటికీఈ నెల 28న మరోమారు వైద్య పరీక్షలకు తీసుకురావాలని సూచించారంటూ కలెక్టర్ సుజాతశర్మకు బాలుడి తండ్రి విన్నవించుకున్నాడు. చిన్నారిని చూసిన కలెక్టర్ దిగ్భ్రాంతి చెందారు. ఆ టీచర్ ఎవరు, యాజమాన్యం ఏం చేస్తోంది అంటూ ఆగ్రహించారు. వెంటనే సంబంధిత వ్యవహారంపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. -
‘గురుకులాలు’ ఆదర్శంగా నిలవాలి
నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరకాల : ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్న గురుకుల పాఠశాలలు దేశానికే ఆదర్శం గా నిలవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆత్మకూరు మండలానికి మంజూరైన గురుకుల పాఠశాలను మండలంలోని మల్లక్కపేట గురుకులంలో బుధవారం ఆయన ప్రా రంభించారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం మాట్లాడుతూ.. 1995–99 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేశానని చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక రా ష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు పాటుపడుతున్నామని చెప్పా రు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్తగా 319 గురుకులాలను ప్రారంభించినట్లు చెప్పారు.16 గురుకులాలనుకాలేజీలుగా అప్గ్రేడ్ చేశామన్నారు. కొత్తగా ఏర్పా టు చేసిన గురుకులాల్లో 7వేల కోట్ల ఖర్చుతో 10 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు చెప్పా రు. సాంఘిక సంక్షేమ కార్యదర్శి ప్రవీణ్కుమార్ ఎంతో కష్టపడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం పని చేస్తున్నారని అభినందించారు. నడికూడలో 15 వేల మొక్కలను నాటి సంరక్షించాలని, వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుం టే 25 లక్షల నిధులను మంజూరు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి–ప్రతాప్రెడ్డి, ఎంపీపీ నేతాని సులోచన–శ్రీనివాస్రెడ్డి, నగర పంచాయతి చైర్మన్ మార్త రాజభద్రయ్య, డీసీవో రూపాదేవి పాల్గొన్నారు. మనసున్న మహారాజు కేసీఆర్ చదువుతోపాటు సన్న బియ్యంతో విద్యార్థుల కడుపు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొని యాడారు. కేసీఆర్ మనువడు, మనుమరాలు తింటున్న సన్న బియ్యా న్ని విద్యార్ధులకు అందించిన మహామనిషి అని కొనియాడారు. రాష్ట్రంలో 319 గురుకులాలను ఏర్పాటు చేస్తే అందులో 200 గురుకులాలను కేవలం బాలికల కోసం కేటాయించడం జరిగిందన్నారు. అవకాశం కల్పిస్తే ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా ఎదుగుతారన్నారు. మన రాష్ట్రంలోనే చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మోదీ సైతం అభినందించారని చెప్పారు. ఏడాదికి 46కోట్ల మొక్కల చొప్పున ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను పెంచడం కోసం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం రూ.46వేల కోట్లతో మిషన్ భగీరథతో ఇంటింటికి సురక్షితమైన నల్లా నీళ్లు అందిస్తుందన్నారు. చెరువుల పూడికతీత కోసం ప్రారంభించిన మిషన్ కాకతీయ ప్రపం చ ప్రజల దృష్టిని ఆకర్షించిందన్నారు. ఆసరా పింఛన్ల కోసం ఏటా రూ.4600 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, రూ.17వేల కోట్లతో రుణమాఫీని అమ లు చేస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. మంత్రి వెం ట ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉదయం 4 గంటలకే..!
గరియబండ్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులంటే సాధారణంగా వారి డ్యూటీ వారు నిర్వర్తించడం చూస్తుంటాం. పాఠశాల సమయం ముగిసిన తరువాత కూడా విద్యార్థుల కోసం సమయం కేటాయించే వారు కొంచెం అరుదనే చెప్పాలి. అయితే చత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబండ్లోని ఓ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులలో మార్పు తీసుకురావాలని భావించిన స్కూల్ ప్రిన్సిపల్ జీపీ వర్మ.. తన సహఉద్యోగులతో కలిసి కొంచెం వినూత్నంగా ఆలోచించాడు. ఉదయాన్నే విద్యార్థులను చదువుకు ఉపక్రమించేలా చేస్తే మంచి ఫలితాలు రాబట్టొచ్చని భావించి.. తెల్లవారుజామున నాలుగు గంటలకే గ్రామంతో తిరుగుతూ విద్యార్థులను నిద్రలేపే కార్యక్రమం స్టార్ట్ చేశారు. విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నారు. 'తెల్లవారుజామునే టీచర్లు వచ్చి నిద్రలేపుతారు. అనంతరం గ్రామంలోని విద్యార్థులమంతా గ్రూపులుగా చదువుకుంటాం' అని విద్యార్థిని మణిప్రభ వెల్లడించింది. -
నిక్షేపంగా జీన్స్ వేసుకోవచ్చు!
పాఠశాలల్లో టీచర్లు జీన్స్ వేసుకోకూడదని తాము ఎప్పుడూ చెప్పలేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని, ఎవరైనా అలా చెప్పి ఉంటే దాన్ని వెనక్కి తీసుకుంటామని... అలా జరగనే జరగదని ఆయన చెప్పారు. అంతకుముందు ప్రాథమిక విద్య డైరెక్టర్ కార్యాలయం నుంచి జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లేటపుడు గానీ, విద్యాశాఖ కార్యాలయానికి వచ్చేటపుడు గానీ జీన్స్ ధరించకూడదని చెప్పారు. జీన్స్ వేసుకోవడం అంత బాగోదని, అందువల్ల ఫార్మల్స్ మాత్రమే వేసుకోవాలని ఆ నాలుగు లైన్ల ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంతేతప్ప అందుకు కారణాలు కూడా ఏమీ ప్రస్తావించలేదు. అయితే, సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారు కాబట్టి టీచర్లు ఇక నిక్షేపంగా జీన్సు వేసుకుని స్కూలుకు వెళ్లొచ్చన్న మాట. -
ఇంటిపని చేయని అమ్మాయిలందరిని..
జింద్: ఇంటిపని చేయలేదని విద్యార్థినులను చితక బాదిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. దీంతో విద్యార్థినులకు తీవ్ర గాయాలవడంతో వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించారు. ఆ టీచర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జింద్ జిల్లాలోని లిజ్వానా అనే గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. అందులో చదువుతున్న ఏడో తరగతి అమ్మాయిలు హోం వర్క్ పూర్తి చేయలేదని కారణంతో క్లాస్ ఉపాధ్యాయురాలు వారిని కర్రతతో చితక్కొట్టడమే కాకుండా బెంచిలపై నిల్చోబెట్టింది. దీంతో ఆ పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పిల్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. -
కొడుకు హోలీ ఆడితే.. తండ్రి తన్నులు తిన్నాడు!
కల్యాణి: హోలీ పండుగ ఓ స్కూలు టీచర్ కు చిక్కులు తెచ్చిపెట్టింది. కుమారుడు చేసిన పనికి టీచర్ ఓ పోలీస్ చేతిలో తన్నులు తినాల్సి వచ్చింది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి... నదియా జిల్లా కల్యాణిలో ఓ ప్రభుత్వ పాఠశాలలో మనోరంజన్ సస్మాల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. టీచర్ కుమారుడు హోలీ ఆడుతున్నాడు. ఈ క్రమంలో పోలీసు వాహనంపై పొరపాటుగా రంగు చల్లాడు. దీంతో ఆగ్రహించిన ఏఎస్సై సుమన్ ఘోష్ ఆ పిల్లవాడి తండ్రిని ఇందుకు బాధ్యుడిని చేశాడు. ఏడేళ్ల ఆ చిన్నారి రంగులు చల్లినందుకు టీచర్ ను ఆగ్రహానికి గురైన ఏఎస్స చితక్కొట్టాడు. పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత వదిలేయడంతో ఇంటికి వెళ్లిపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయాలకు చికిత్స తీసుకున్నాడు. తనపై ఏఎస్సై కావాలనే దురుసుగా ప్రవర్తించాడని, తనపై చెయ్యి చేసుకున్నాడని ఫిర్యాదుచేశాడు. విచారణ ప్రారంభించినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. అయితే తాను టీచర్ ను కొట్టలేదని తనకు దాడి ఘటనను ఎలాంటి సంబంధం లేదంటూ సుమన్ ఘోష్ చెప్పాడు. -
ఉపాధ్యాయురాలికి జైలు శిక్ష
తిరువొత్తియూరు: టెన్త్ విద్యార్థితో కలసి పారిపోయిన ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. నెల్లై జిల్లా తెన్కాశిలోని ప్రైవేటు పాఠశాలలో సెంగోటైకు చెందిన కేసరి కుమార్తె గోదైలక్ష్మి (25) ఉపాధ్యాయురాలు. గత సంవత్సరం అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కడయనల్లూరు మత్తుకృష్ణాపురానికి చెందిన చంద్రకుమార్ కుమారుడు శివసుందర్ పాండియన్ (16) ఆమె వద్ద ట్యూషన్కు చేరారు. వీరిద్దరు ఇంటి నుంచి పారిపోయారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తిరుపూర్ పూలవండి పట్టిలో ఉన్న ఇద్దరిని పోలీసులు విడిపించి తీసుకొచ్చారు. ఆ సమయంలో గోదైలక్ష్మి నాలుగు నెలల గర్భిణి అని తెలిసింది. కోర్టులో ఇద్దరిని హాజరు పరచి విచారణ జరిపి విద్యార్థిని అతని తల్లితో పంపించి ఉపాధ్యాయురాలిని తిరుచ్చి మహిళా జైలులో ఉంచారు. -
స్కూల్లో 'ఆశారాం చాలిసా' పఠనం..!
జైపూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన కేసులో ప్రస్తుతం ఆయన జోథ్పూర్ జైల్లో ఉన్నాడు. అయినా ఆయనను ఆరాధించడం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మానుకోలేదు. తనను తను 'దేవుడి ప్రతిరూపం'గా చెప్పుకొనే ఆశారాంను ఏకంగా పాఠశాలలో ఆరాధిస్తూ పూజలు చేస్తూ ఆ టీచర్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ధోలాదర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో మాఘరాం అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతను ప్రతిరోజూ బడిలో ప్రార్థన సమయంలో ఆశారాం బాపు ఫొటోను పెట్టి, 'ఆశారాం చాలిసా'ను పఠించేవాడు. విద్యార్థులు కూడా ప్రార్థన చేయకుండా ఈ చాలిసాను పఠించాలని సూచించేవాడు. దీనిపై తోటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుడు అభ్యంతరం పెట్టినా అతని తీరు మారలేదు. ఈ ఘటన తన దృష్టికి రావడంతో హెడ్మాస్టర్ ద్వారా ధ్రువీకరణ చేసుకొని ఆ టీచర్పై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రాథమిక విద్యాశాఖ సెక్రటరీ కేఎల్ మీనా తెలిపారు. -
వీడియోలు తీస్తూ వేధిస్తున్న కీచకటీచర్
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తన సెల్ఫోన్లు, వీడియో చిత్రీకరణ నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నానంటూ వేధింపులు నిలదీసిన సర్పంచ్, బాధితురాలి బంధువులు నక్కపల్లి: విద్యార్థిని వేధిస్తున్న ఉపాధ్యాయుడిని ఆమె బంధువులు, గ్రామస్తులు నిలదీశారు. మండలంలోని జానకయ్యపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలావున్నాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న చినతీనార్లకు చెందిన ఓ బాలికపై ఇంగ్లీష్ టీచర్ ఈశ్వరరావు కొద్దికాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. సెల్ఫోన్తో ఫొటోలు, వీడియోలు తీస్తూ నువ్వంటే నాకు ఇష్టమని చూడకుండా ఉండలేకపోతున్నానంటూ ఇబ్బంది పెడుతున్నాడు. ఉపాధ్యాయుడు కావడంతో భయపడి ఈవిషయాన్ని ఆమె ఎవరికి చెప్పలేదు. ఇతని చేష్టలు రోజురోజుకు శ్రుతిమించిపోతున్నాయి. నిన్ను చూస్తూ బైక్ నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నానని చెప్పేవాడు. అతని బర్త్డే కేక్పై బాలిక ఫొటోను డిజైన్ చేశాడని వేధిస్తున్నాడని విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. వేధిస్తాడన్న భయంతోనే ఈ విషయం ఎవరికీ చెప్పలేదని ఆమె వాపోయింది.మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆమె తండ్రి వేట నిమిత్తం పూరీ వెళ్లాడు. ఆమె తల్లి వద్ద ఉంటోంది. విద్యార్థిని వేధింపుల విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఎరిపల్లి శ్రీను, గ్రామ నాయకులు, బాధిత బాలిక బంధువులు తదితరులు పాఠశాలకు వెళ్లి వేధిస్తున్న ఉపాధ్యాయుడిని నిలదీశారు. విద్యాబుద్ధులు నేర్పుతూ కన్నపిల్లలా చూడాల్సింది పోయి ఇలా దుర్బుద్ధితో ప్రవర్తించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి బాగా చదువుతుందని దానివల్ల నువ్వంటే నాకిష్టమని చెప్పానని అంతే తప్ప మరో ఉద్దేశం లేదని ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. ఫోటోలు, వీడియోలు ఎందుకు తీశారని ప్రశ్నిస్తే పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం సందర్భంగా తీశానని తెలిపాడు. ఇలా చేయడం తప్పేనని ఒప్పుకున్నాడు. పాఠశాల హెచ్ఎం నూకరాజుతోపాటు, గ్రామస్తులు అతనిని మందలించారు. అయితే బాధితురాలు మాత్రం ఈశ్వరరావు ఈ పాఠశాలలో పనిచేస్తే తాను ఇక్కడ చదవనని చెబుతోంది. ఇటువంటి సమస్య మరే ఆడపిల్లకు రాకూడదని తక్షణమే సదరు ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
స్కూలుకు వెళ్లి టీచర్ అదృశ్యం
పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయురాలు కనిపించకుండా పోయిన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నాగేశ్వరరావు కథనం ప్రకారం... బాలసరస్వతీనగర్కు చెందిన అరవింద(27) మల్కాజిగిరి గీతానగర్లోని ప్రైవేట్ మోడల్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. ఈ నెల 7వ తేదీన పాఠశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో మంగళవారం ఆమె భర్త ముఖేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లెక్కల టీచర్ వక్రబుద్ధి.. స్కూలుకు తాళాలు
ప్రకాశం: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కర్తవ్యం మరిచి పక్కా దారి పట్టిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. స్కూల్ బాలికలకు మాయమాటలు చెప్పి లోబర్చుకుంటున్నాడు. దీనిపై ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలకు తాళాలు వేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో లెక్కల మాస్టరు తన వక్రబుద్ధిని చూపిస్తున్నాడు. ఆరు నెలల క్రితం తొమ్మిదో తరగతి బాలికను మభ్యపెట్టి తనతో తీసుకెళ్లిపోయాడు. దీంతో అప్పట్లో అతనిపై కేసు నమోదైంది. తాజాగా మరో బాలికను దసరా సెలవుల్లో తనతో పాటు చీరాలకు తీసుకువెళ్లాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన గ్రామస్థులు సోమవారం అతడు పాఠశాలకు వస్తే నిలదీయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అతడు రాలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, విద్యార్థులను బయటకు పంపి తరగతి గదులకు తాళాలు వేశారు. సదరు టీచర్ విషయమై చర్యలు తీసుకోవాలని హెచ్ఎం ఝాన్సీలక్ష్మీబాయిని కోరారు. -
కీచక టీచర్ అరెస్ట్
కొత్తూరు(శ్రీకాకుళం): విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం సిరిసివాడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈ నెల 3న ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినితో ఉపాధ్యాయుడు గవరా ఉమాపతి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీని గురించి బాలిక తల్లిందండ్రులకు చెప్పడంతో వాళ్లు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని గురువారం శ్రీకాకుళం జిల్లా కోర్టులో హాజరు పరిచారు. -
టీచర్ దెబ్బలకు ఇరిగిపోయిన బాలుడి పళ్లు
-
బడికి పంతులు లేడని..
ఆత్మకూరు రూరల్(కర్నూలు): పాఠశాలలో ఉపాధ్యాయులు లేక తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని స్కూలుతోపాటు పంచాయతీ కార్యాలయంలో జరగాల్సిన స్వాతంత్య్ర వేడుకలను ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాలివీ.. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామంలోని సంచారజాతుల విముక్తి పథకం కింద ప్రత్యేకంగా ఏర్పాటైన పాఠశాల ఉంది.ఇందులో 160 మంది విద్యార్థులకు గాను ఒకే టీచర్ ఉన్నారు. దీంతో తమ పిల్లల చదువులు ముందుకు సాగటం లేదని గ్రామస్తులు అనేక మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఎవరూ స్పందించక పోవడంతో ఇటీవల పాఠశాల నుంచి 50 మంది బాలలు వేరే చోటుకు వెళ్లిపోయారు. మిగిలిన వంద మంది విద్యార్థులకు చదువు చెప్పడం అటుంచి కనీసం వారిని అదుపు చేయడానికి కూడా అక్కడున్న టీచర్కు వీలుకావటం లేదు. ఈ వ్యవహారంతో విసిగిన సిద్దాపురం గ్రామస్తులు శనివారం పాఠశాలలో, గ్రామ సచివాలయంలోనూ జరగాల్సిన స్వాతంత్య్ర వేడుకలను బహిష్కరించారు. -
ధర్డ్ డిగ్రీ చదువులు
-
ప్రేమించలేదని కడతేర్చాడు
ముజఫర్ నగర్(యూపీ): వన్ సైడ్గానే నిండాప్రేమించి, తీరా ఆ యువతి మరో వ్యక్తితో ప్రేమలో ఉందని తెలిసి తట్టుకోలేక కడతేర్చాడో ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జావున్ పుర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో మేనెజర్గా పనిచేస్తున్న సర్దార్ అజిత్ సింగ్ టీచర్గా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఈ విషయం అమెతో చెప్పడానికి ముందే మరొకరితో ప్రేమలో ఉందని తెలిసి గొంతు నులిమి చంపాడు. అనంతరం మోర్నా గ్రామంలోని కెనాల్లో మృతదేహాన్ని విడిచి వెళ్లాడు. శనివారం గొంతు పై గాట్లతో ఉన్న టీచర్ మృతదేహాన్ని కెనాల్లో పోలీసులు గుర్తించారు.ఆ యువతి మరొకరిని ప్రేమించిన విషయం తెలియడంతో గొంతునులిమి చంపానని నిందితుడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. -
బతుకు చూపించే వాడే బడి పంతులు!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఒకప్పుడు బతకడానికి బడిపంతులు అనేవారని.. అయితే ఈరోజు బతుకు చూపించేవాడు బడిపంతులు అని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నగర శివారులోని ఎంజీఎం ఫంక్షన్ హాలులో ప్రాంతీయ విద్యా సదస్సు మంగళవారం జరిగింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల విద్యాశాఖ, ఎస్ఎస్ఏ అధికారులు, ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో ప్రధానోపాధ్యాయులు కీలకమన్నారు. కొన్ని చోట్ల ఎక్కువమంది టీచర్లు తక్కువమంది విద్యార్థులు, మరి కొన్నిచోట్ల తక్కువ మంది టీచర్లు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారన్నారు. దీనికి రేషనలైజేషన్ చేపట్టి నిష్పత్తి సమానంగా ఉండేలా చూస్తామని తెలిపారు. అంతేకాని ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తామని జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. ప్రభుత్వ విద్య అమలులో కఠినంగా, ఖచ్చితంగా వ్యవహరిస్తామన్నారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందని, అలాంటి వృత్తికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి పాఠశాలలోనూ మొక్కలు నాటాలన్నారు. పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజ మార్పు టీచర్ల చేతుల్లో ఉందన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల సాధనకు హెచ్ఎంలు ఈసారి బాగా కష్టపడ్డారన్నారు. 93 శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషమే అయినా...తక్కిన ఏడు శాతం విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుదామని ప్రశ్నించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని కోరారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు సొంతబడిగా భావించి బాధ్యతగా పని చేయాలన్నారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు మరుగుదొడ్లు కావాలని అడుగుతున్నా పట్టించుకోని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు, హెచ్ఎంలతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ విప్ యామినిబాల, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, పార్థసారథి, ఉన్నం హనుమంతరాయచౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ రమణకుమార్ పాల్గొన్నారు. -
పాఠశాలల సిబ్బందికి సెలవులు లేవు
గుంటూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది వేసవి సెలవుల్లోనూ పాఠశాలల్లో అందుబాటులో ఉండాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైనందున బడుల్లోనే ఉండి విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాలు జారీ చేయటం, పరీక్షల్లో తప్పిన వారికి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజుల వసూలు, హాల్ టికెట్ల జారీ వంటి విధులను నిర్వహించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ గురుకుల, కేజీబీవీ ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి. -
విద్యార్థిని కిడ్నాప్ చేసిన టీచర్
బండి: విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే కిడ్నాపర్ అవతారమెత్తాడు. రాజస్థాన్లోని నైన్వాల్ పట్టణంలో ప్రైవేట్ స్కూట్ టీచర్ బాదల్ మహావర్ (28).. తన దగ్గర చదువుకునే 14 ఏళ్ల విద్యార్థిని అపహరించాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత మార్చి 10న టీచర్ విద్యార్థిని అపహరించాడు. అప్పటినుంచి టీచర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. -
స్కూళ్లను పట్టించుకోని ఎంఈఓలు!
ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ పాఠశాలలను మండల విద్యాధికారులు (ఎంఈఓ) పట్టించుకోవడం లేదు. స్కూళ్లకు టీచర్లు సరిగ్గా వస్తున్నారా.. లేదా? చూడటం లేదు.. పోనీ వారు స్కూళ్లలో అందుబాటులో ఉంటున్నారా? అంటే అదీ సరిగ్గా లేదు. ఏమంటే తాను ఇన్ఛార్జి ఎంఈఓ మాత్రమేనని, మరో స్కూల్లో హెడ్ మాస్టర్నని చెబుతున్నారు. మరోవైపు స్కూళ్లలో విద్యా బోధన సరిగ్గా సాగడం లేదు. ఇంగ్లిషు బోధన అయితే మరీ అధ్వానం. ఉపాధ్యాయుల బోధనపై పర్యవేక్షణ లేదు’ ఇదీ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. మూడు వారాలుగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు సహా విద్యాశాఖ అధికారులు, అదనపు డెరైక్టర్లు ఇటీవల పాఠశాలల్లో చేసిన ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన అంశాలు. బుధవారం పాఠశాల విద్యా డెరైక్టరేట్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో దీనిపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో పాఠశాలలు, విద్యా బోధన గాడిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. ఏటా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుందని, ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలలు మరింత అధ్వానంగా తయారవుతాయని అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని భావించింది. ఇందులో భాగంగా పాఠశాలల నిర్వహణ, విద్యాబోధన, పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలపై అవసరమైతే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడవద్దని తనిఖీ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు బోధన పద్ధతుల విషయంలో ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణకు సంబంధించి చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు. -
ఎనిమిదేళ్ళ విద్యార్థినిపై లైంగిక వేధింపులు!
-
దటీజ్ కార్పొరేషన్!
నెల్లూరు(విద్య) : విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు పాఠశాలల్లో టీచర్ల సంఖ్య ఉండేలా చూడాల్సిన కార్పొరేషన్ అధికారులు అనాలోచితంగా వ్యవహరించారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు అవసరమైన చోట కాకుండా అవసరం లేని చోట వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట డిప్యుటేషన్ వేశారని విమర్శలొస్తున్నాయి. ఇటీవల కార్పొరేషన్ స్కూల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు మంత్రి నారాయణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైస్కూల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రమోషన్లు, డిప్యుటేషన్లపై తక్షణమే భర్తీచేయాలని ఆదేశాలిచ్చారు. అయితే కార్పొరేషన్లో విద్యాశాఖ చూసే అధికారులు జాబితాను రూపొందించారు. అయితే వారి అవగాహన రాహిత్యంతో జాబితాలో పలుపొరపాట్లు జరిగాయి. తప్పులు తడకగా ఉన్న జాబితాను కార్పొరేషన్ అధికారులు అలానే విడుదల చేయడంతో అనవసరమైన చోట్లకు టీచర్ల డిప్యుటేషన్లు జరిగిపోయాయి. 15 ఉన్నత పాఠశాలల్లో 6,913 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం సరాసరిన ప్రతి 30 మంది విద్యార్థులకు కనీసం ఒక్క టీచర్ ఉండేలా చూడాల్సి ఉంది. అయితే హైస్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టును గుర్తించి వారిని డిప్యుటేషన్పై పంపాల్సిన కార్పొరేషన్ అధికారులు ఆ పనిచేయకుండా ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు వేశారు. మేనేజర్, కోఆర్డినేటర్ల సమన్వయలోపం, అనుభవరాహిత్యం కలిసి కమిషనర్ను సైతం తప్పుదోవ పట్టించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడక.... నగరంలోని ఎంజీనగర్ ఉన్నత పాఠశాలలో ముగ్గురు సోషల్ టీచర్లు ఉండగా, మరో టీచర్ను డిప్యుటేషన్పై వేశారు. దీంతో అక్కడ నలుగురు టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి ఈ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ అవసరమైంది. వెంకటేశ్వరపురంలో 698 మంది విద్యార్థులు ఉంటే ఒకే ఒక సోషల్ టీచర్ ఉన్నారు. ఆర్ఎస్ఆర్ హైస్కూల్లో 493 మంది విద్యార్థులకు ఒక సోషల్ టీచరే ఉంది. బీవీఎస్ హైస్కూల్లో 444 మందికి ఒక సోషల్ టీచరే... ఇలా వెంకటేశ్వరపురం కార్పొరేషన్ పాఠశాలలో 698 మంది విద్యార్థులకు ఒక సోషల్ టీచర్ ఉండగా, ఎంజీనగర్ హైస్కూల్ 214 మందికే నలుగురు సోషల్ ఉపాధ్యాయులు ఉన్నారు. మూలాపేట రామయ్యబడిలో 185 మంది విద్యార్థులకు హిందీ టీచర్ ఒక్కరే. ఆ టీచర్ను ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేశారు. ఉపాధ్యాయులు అవసరంలేని ఆ ప్రాథమిక పాఠశాలకు అదనంగా ఇద్దరు టీచర్లను డిప్యుటేషన్పై పంపారు. ఇవి కార్పొరేషన్లో తప్పులతడకగా రూపొందించిన డిప్యుటేషన్ల జాబితాకు కొన్ని ఉదాహరణలు. హైస్కూల్లో ఖాళీలు... తెలుగు-2, లెక్కలు-4, ఫిజిక్స్-3, సోషల్-5, బయాలజీ-3 ఖాళీలు ఉన్నాయి. ప్రమోషన్లకు అర్హులైన వారు ఒక్కో సబ్జెక్టులో 3 నుంచి 5 మంది టీచర్లు ఉన్నారు. ఈ మొత్తం 18 ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తే డిప్యుటేషన్లు అవసరం లేదు. ఇలాకాకుండా డిప్యుటేషన్ల పేరుతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను హైస్కూళ్లకు పంపడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం ఉండదని విద్యావేత్తల అభిప్రాయం. వందల సంఖ్యలో విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లోని ఉపాధ్యాయులను డిప్యుటేషన్లపై హైస్కూల్కు పంపడంవల్ల ఆయా పాఠశాలలు రాబోయే రోజుల్లో నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 50 ప్రాథమిక పాఠశాలల్లో 5,169 మంది విద్యార్థులు ఉండగా 204 మంది టీచర్లకుగాను 165 మందే పనిచేస్తున్నారు. తాజాగా వెలువడిన డీఎస్సీ ద్వారా 37 తెలుగు ఎస్జీటీలు, 7 ఉర్దూ ఎస్జీటీలను నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మిగిలిన పోస్టులకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకుంటే అసలు సమస్యే ఉండదని టీచర్ల అభిప్రాయం. అలాకాకుండా ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హైస్కూల్లో క్షేత్రస్థాయిలో ఏయే సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయని తెలుసుకొని ఆయా సబ్జెక్టులకు టీచర్లను నియమిస్తే బాగుం టుందనే వారి అభిప్రాయం. ఇప్పటికే ఈ సమస్యను గుర్తించి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కేఎన్ఆర్ పాఠశాలను దత్తత తీసుకున్నారు. 10 మంది విద్యావలంటీర్లను సొంత నిధులతో ఏర్పాటు చేశారు. సిటీ పరిధిలో సిటీ ఎమ్మెల్యే 10 హైస్కూళ్లకు 20 మంది విద్యావలంటీర్లను సొంత నిధులతోఏర్పాటు చేశారు. ఇలా ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ పాఠశాలలపై శ్రద్ధ తీసుకుంటుంటే.. కార్పొరేషన్ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ కార్పొరేషన్ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కీచక టీచర్కు.. దేహశుద్ధి!
-
చర్చ్ పార్కు పాఠశాలలో టీచర్ గా దేవయాని
నటి దేవయాని అధ్యాపకురాలి వృత్తి చేపట్టారు. ఇదేదో సినిమా పాత్ర అనుకునేరు. నిజంగానే ఆమె నటనకు దూరంగా ఒక పాఠశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. పక్కింటి అమ్మాయి పాత్రలకు పెట్టింది పేరు దేవయాని. అజిత్ సరసన నటించిన కాదల్కోట్టై (తెలుగులో ప్రేమలేఖ) చిత్రంలో ప్రాచుర్యం పొందారు. సూర్యవంశం, ఫ్రెండ్స్, మరుమలర్చి, తెనాలి, వల్లరసు తదితక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రముఖ హీరోయిన్ స్థాయిని అందిపుచ్చుకున్నారు. తెలుగులోనూ సుస్వాగతం లాంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దేవయాని 2001లో దర్శకుడు రాజ్కుమార్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఇనియ, ప్రియాంక ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో బుల్లితెరపై దృష్టి సారించారు. అక్కడ రోజుకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న నటిగా తన ప్రత్యేకతను చాటుకున్న దేవయాని ప్రస్తుత వయసు 40 ఏళ్లు. ఈమె చిత్ర నిర్మాణం చేపట్టి తన భర్త దర్శకత్వంలో కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు. అలాంటిది అనూహ్యంగా నటనకు స్వస్తి చెప్పి అధ్యాపకురాలిగా ఉద్యోగం చేయడం ఆశ్చర్యకరమైన విషయమే. ప్రస్తుతం దేవయాని స్థానిక అన్నాసాలైలో గల చర్చ్పార్కు కాన్వెంట్ పాఠశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. దీని గురించి ఆమె స్పందిస్తూ ఇప్పటి పలు సినీ, టీవీ సీరియల్ అవకాశాలు వస్తున్నాయన్నారు. అయితే ఒకతరహా మూస పాత్రలు చేసి బోర్కొడుతోందని పేర్కొన్నారు. దీంతో ఏదైనా భిన్నమైన పని చేయాలని, అది ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనకు ఉపాధ్యాయరాలిగా పనిచేయాలని చిన్ననాటి నుంచి కోరికని తెలిపారు. దీంతో టీచర్ కోర్సు చదివి ఉత్తీర్ణత పొందానని చెప్పారు. అనంతరం తనపిల్లలు చదువుతున్న చర్చ్ పార్కు పాఠశాలలో అధ్యాపకురాలిగా చేరానని తెలిపారు. అక్కడి విద్యార్థులను చూస్తున్నప్పుడు తాను మళ్లీ కొత్తగా పుట్టినట్టుందన్నారు. జీతం గురించి ఆతోచించాల్సిన అవసరం లేదని ఇక్కడ చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉందని దేవయాని పేర్కొన్నారు. -
యోగా చిచ్చరపిడుగు
* రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన భవాని రామాయంపేట: ఆ విద్యార్థిని యోగాలో ఆరితేరింది. చిన్నప్పటి నుంచి యోగాసనాల పట్ల ఆసక్తి చూపిన ఆమెను పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. దాంతో పాఠశాలలో శిక్షణ పొందిన రాగి భవాని జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని పలు ఆవార్డులు కైవసం చేసుకుంది. మండలంలోని అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న భవాని ఎలాంటి ఆసనాన్నయినా అవలీలగా వేస్తుంది. ఇటీవల మెదక్ మండలం చిట్యాలలో జరిగిన 17 ఏళ్లలోపు విభాగం యోగా పోటీల్లో పాల్గొన్న ఆమె జిల్లాలో ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ప్రస్తుతం భవాని రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి మహబూబ్నగర్ వెళ్లింది. ఇటీవల జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు పాఠశాలకు వ చ్చిన సందర్భంగా ఆమె వేసిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. యోగాతోపాటు భవాని చదువులో కూడా ముందుందని ఉపాధ్యాయులు తెలిపారు. భవిష్యత్తులో ఆమె పాఠశాలకు మంచిపేరు తెస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నాను. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో యోగాలో ఉన్నత స్థానానికి ఎదుగుతాననే నమ్మకం ఉంది. - రాగి భవాని, విద్యార్థిని -
హోంవర్క్ చేయలేదని .. చితకబాదింది!
-
ఆమె వయసింకా నూటెనిమిదే!
మిల్లీగా అందరికీ సుపరిచితురాలైన ఫ్లోరెన్స్ మిల్లిసెంట్ జెన్కిన్స్... మొన్నీమధ్యే జోరుగా, హుషారుగా తన జన్మదిన వేడుకలు జరుపుకుంది. బర్త్డే జరుపుకోవడంలో వింతే మీ లేదు కానీ... మూడుపదులకే ముక్కుతూ మూలుగుతూ ఉండేవాళ్లు ఎక్కువవతున్న ఈ కాలంలో ఆమె ఏకంగా పదిపదులు కూడా దాటి, పదకొండో పదికి చేరువ కావడం వింతేకదా మరి! మరికాస్త వివరంగా చెప్పాలంటే ఆమె జరుపుకున్నది తన నూట ఎనిమిదో పుట్టినరోజును. ఈ పుట్టినరోజుకు ఆమె ఇద్దరు కుమారులు డెనిస్, అలన్లతో సహా తొమ్మిదిమంది మనుమళ్లు, పదమూడు మంది మునిమనుమలు, పదిమంది ముని ముని మనుమలు హాజరయ్యారు. స్కూల్ టీచర్గా రిటైరై అర్ధశతాబ్దానికి పైబడిన మిల్లీ దగ్గర ఎప్పుడో డెబ్భయ్ళేళ్ల క్రితం చదువుకున్న స్టూడెంట్స్ కొందరు తమ మనుమళ్లను, మనుమరాళ్లను ఊతకర్రలుగా చేసుకుని మరీ ఈ బర్త్డే పార్టీకి హాజరయ్యారు. అన్నట్లు టీచర్గా రిటైరైన తర్వాత ఆమె దాదాపు పదేళ్లకుపైగా ఓ నర్సింగ్ హోమ్లోనూ, తర్వాత ఒక క్యాంటీన్లో డిన్నర్ లేడీగానూ పని చేసింది. నల్లగౌను, దానిమీద ఎరుపు రంగు కోటును ధరించిన మిల్లీ, రాణీగారు తనకోసం ప్రత్యేకంగా పంపిన గిఫ్ట్బాక్స్ను తెరిచి, సంభ్రమాశ్చర్యాలతో కేరింతలు కొట్టి మరీ, కేకు కట్ చేసింది. కారణం... అందులో తనకిష్టమైన తెలుపు, ఎరుపు పూల గుత్తులు, ఖరీదైన చాక్లెట్లు కొన్ని డజన్ల సంఖ్యలో ఉన్నాయి మరి! వాటితోపాటు అత్యంత విలువైన దుస్తులు కూడా! తమ అత్తగారు ఎంతో కమ్మటి కంఠంతో పాటలు పాడతారని, ఆమె గొంతు అంటే తనకెంతో ఇష్టమని ఆమె కోడలు ఎల్స్పెత్ జెన్కిన్స్ ఎంతో ఇష్టంగా చెప్పింది. లండన్కు చెందిన ఈ బామ్మగారు జీసస్పై సరికొత్త కీర్తనలు రచించడమేకాదు, గానం కూడా చేస్తారట. తన ఆరోగ్యానికి, ఆయుష్షుకు అదే కారణమని ఈమె విశ్వాసం. ఈ బామ్మగారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం. -
స్కూలు టీచర్పై సామూహిక అత్యాచారం, దోపిడీ
ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లా నగ్లామధు ప్రాంతంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆమె వద్ద ఉన్న ఆభరణాలను దోచుకున్నారు. ఆమె పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. భాంగావ్ పోలీసు సర్కిల్ పరిధిలోని నగ్లా మధు ప్రాంతంలోని పాఠశాలలో పనిచేస్తున్న బాధితురాలు స్కూలుకు నడిచి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను దారికాచి ఆమె వద్ద ఉన్న బంగారు గొలుసు, 5వేల రూపాయల నగదు దోచుకోడానికి ప్రయత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో రోడ్డుపక్క పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై ఆ ముగ్గురూ అత్యాచారం చేశారని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ సింగ్ తెలిపారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న సొత్తును కూడా దోచుకున్నారు. నిందితుల్లో ఒకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని, మరో ఇద్దరు మాత్రం పారిపోయారని ఎస్పీ చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపామన్నారు. -
టీచర్పై సామూహిక అత్యాచారం
మెయిన్పురి: ఉత్తరప్రదేశ్లో నిత్యం మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ టీచర్పై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారం చేసి విలువైన వస్తువులు దోచుకెళ్లారు. యూపీలోని భోన్గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మధు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలు స్కూలుకు వెళ్తున్న సమయంలో దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె నుంచి బంగారు చైన్, ఐదు వేల రూపాయిల నగదు దోచుకున్నారు. అనంతరం పొదలచాటుకు లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. టీచర్ కేకలు విన్న స్థానికులు ఓ నిందితుడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
విద్యార్థికి టీచర్ అసభ్యకర మెస్సేజ్ లు!
ముంబై: ఓ విద్యార్థికి స్కూల్ టీచర్ పంపిన అసభ్యకర మెస్సేజ్ ల ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సెయింట్ మేరీస్ స్కూల్లో పనిచేస్తున్న పీటీ టీచర్ తన పాత విద్యార్థికి పంపిన అసభ్యకరమైన సందేశంతో స్కూల్ యాజమాన్యం అప్రమత్తమైంది. ముంబై నగరంలోని మాజ్ గాన్ ప్రాంతంలో ఉన్న సెయింట్ మేరీస్ స్కూల్లో ఒక విద్యార్థి పదో తరగతి పూర్తి చేసిన అనంతరం బయటకు వెళ్లిపోయాడు. అయితే ఆ స్కూల్ టీచర్ తో అతను తరచు మెస్సేజ్ లతో టచ్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే టీచర్ తాజాగా ఒక బూతు సందేశాన్ని ఆ విద్యార్థికి పంపించింది. ఈ విషయాన్ని గమనించిన స్కూల్ యాజమాన్యం దీనికి ఇక్కడితో ముగింపు పలకాలని భావించింది. దీంతో ఆ స్కూల్ కమిటీ సమావేశమై.. విద్యార్థిపై, టీచర్ పై చర్యలు తీసుకునేందుకు పూనుకుంది. 'ఆ విద్యార్థి మా స్కూల్లోనే పదవ తరగతి పూర్తి చేశాడు. తరువాత బయటకు వెళ్లి పై తరగతులు చదువుకుంటున్నాడు. మా పీటీ టీచర్ అతనితో చనువుగా ఉండేది. ఆ విద్యార్థి ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తరువాతం ఇద్దరు ఫోన్లలో మెస్సేజ్ లను ఇచ్చిపుచ్చకుంటున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య ఒక అసభ్యకరమైన మెస్సేజ్ ను విద్యార్థికి టీచర్ పంపినట్లు గమనించాం. ఈ అంశాన్ని మా స్కూల్ యాజమాన్యం తీవ్రం పరిగణించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాం. ఆ విద్యార్థిని జాగ్రత్తగా ఉండమని స్కూల్ నుంచి నోటీసు పంపినా.. వారి తల్లి దండ్రుల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. అందుచేత మా కమిటీ పోలీసుల ఆశ్రయించింది' అని స్కూల్ ప్రిన్సిపాల్ మరియు చైర్మన్ పింటో తెలిపారు. అయితే ఈ మెస్సేజ్ లకు కారణమైన తమ స్కూల్ టీచర్ పై చర్యలు తీసుకున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
బడిపంతులు చదువుకూ భారీగా ఫీజులు
విజయనగరం అర్బన్: భావి ఉపాధ్యాయులను తీర్చిదిద్దాల్సిన కొన్ని ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు అక్రమ వసూళ్లతో జేబులు నింపుకొంటున్నారు. ప్రాథమిక విద్యాబోధనకు బీఎడ్ విద్యార్హత అనుమతి నిరాకరిస్తూ కేవలం డీఎడ్ అభ్యర్థులకే అవకాశం ఇవ్వడం, ఎస్జీటీ పోస్టులు ఊరిస్తుండడంతో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. ఎంతైనా చెల్లించి సీట్లు పొందేందుకు అభ్యర్థులు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే డీఎడ్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. యాజమాన్య కోటా ఫీజులను ఇష్టానుసారంగా పెంచేసి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మూడేళ్లలో 27 కాలేజీలు.. ఈ మూడు సంవత్సరాల కాలంలోనే జిల్లాలో 27 ప్రైవేటు కళాశాలలు పుట్టుకొచ్చాయి. వీటిలో పూర్తి స్థాయిలో వసతులు లేనివే ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 28 డీఎడ్ కళాశాలలున్నాయి. వీటిలో ఒకటి ప్రభుత్వ కళాశాల (వేణుగోపాలపురం), మిగిలిన 27 ప్రైవేటు కళాశాలలే. ప్రభుత్వ డైట్ కళాశాలలో 100 సీట్లు ఉండగా మిగిలిన ప్రైవేటు కళాశాలల్లో ఒక్కొక్క కళాశాలలో 50 చొప్పున మొత్తం 1,350 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా కింద 1,080 సీట్లు, మేనేజ్మెంట్ కోటా కింద 270 సీట్లు ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 1,450 సీట్లకు గానూ మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించి, భర్తీ చేస్తారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలోనే తొలి ఏడాదికి జనరల్ అభ్యర్థులు రూ.12,500, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రూ. 1,500 ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు మిగిలిన మొత్తం సంక్షేమ శాఖల ద్వారా యాజమాన్యాలకు చేరుతుంది. అయితే కొన్ని కళాశాలల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి గత ఏడాది కళాశాలల్లో చేరిన విద్యార్థుల నుంచి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు బలవంతంగా వసూలు చేశారు. రూ.లక్షలకు కోటా సీట్ల విక్రయం జిల్లాలోని ప్రైవేటు డీఎడ్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో యాజమాన్యాలు దండుకోవడమే పనిగా పెట్టుకున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు. అభ్యర్థుల ఆసక్తిని ఆసరాగా చేసుకున్న యాజమాన్యాలు ఒక్కసారిగా సీటు రేటును పెంచేశాయి. గత ఏడాది తొలి విడత కౌన్సెలింగ్ సమయంలో మేనేజ్మెంట్ కోటా సీటుకు రూ.1.50 లక్షల వరకూ వసూలు చేయగా, కౌన్సెలింగ్ పూర్తయి, తరగతులు ప్రారంభమయిన తరువాత మిగిలిన మేనేజ్మెంట్ కోటా సీట్లకు డిమాండ్ పెరిగింది. మొదట వచ్చిన వారికి మంచి ధర అంటూ రూ.2. లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు వసూలు చేశారు. రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వారి సిఫారసు ఉన్న వారి నుంచి రూ.2. లక్షలు వసూలు చేస్తుండగా, ఎలాంటి సిఫారసులేని విద్యార్థుల నుంచి రూ.2.5 లక్షలు దండుకున్నారు. డిమాండ్ ఉన్న చోట రూ.30 లక్షలు కూడా వసూలు చేసినట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని రెండు విడతల్లోనే చెల్లించాలని డిమాండ్ చేయడంతో పేద విద్యార్థులు అప్పుల పాలయ్యారు. డీఎడ్ సీటుకు ఇన్ని లక్షలు ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘లక్షలు పోసి కళాశాలకు అనుమతి తెచ్చుకోవడమే కాకుండా, ఎంఈడీ చేసిన అధ్యాపకులకు వేలకు వేలు జీతాలు ఇవ్వాలి. ఇప్పటికే భవన నిర్మాణానికే లక్షలు ఖర్చు చేశాం. ఇప్పుడు ఈ విద్యార్థుల నుంచి తీసుకోకపోతే... మేమెలా బతికేది’ అంటూ కళాశాలల యాజమాన్యాలు ఎదురు ప్రశ్నిస్తున్నాయి. డీఎడ్ కళాశాలల్లో విచ్చలవిడిగా సీట్ల విక్రయాలు జరుగుతున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు కనబడడం లేదు. కళాశాల ఏర్పాటుకు నిబంధనలివే..! డీఎడ్ నిర్వహించే కాలేజీకి 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం ఉండాలి. ఇందులో ఒక సైకాలజీ ల్యాబ్, రెండు సైన్స్ ల్యాబ్లు, రెండు వేల చదరపు అడుగుల మల్టిపర్పస్ హాలు, ఫస్టియర్కు రెండు తరగతి గదులు, సెకండియర్కు నాలుగు క్లాసు రూములు, ఒక ఎస్పీడబ్ల్యూ (సోషియల్ యూజ్ఫుల్ వర్క్) ల్యాబ్, ఒక ఆటల పరికరాల గది, బాలురు, బాలికలకు ప్రత్యేక వెయిటింగ్ రూములు, మరుగుదొడ్లు, రెండు ఎకరాలలో క్రీడా మైదానం, స్టాఫ్, ప్రిన్సిపాల్, పరిపాలనా అధికారి గదులు ప్రత్యేకంగా ఉండాలి. కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి. లక్షలు సమర్పించుకున్నా పలు కళాశాలల్లో మౌలిక వసతులు మచ్చుకైనా కనిపించడం లేదు. నిబంధనలు పాటించకపోతే అనుమతులివ్వం.. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాలు నిబంధనల మేరకు జరపకపోతే సంబంధిత సీట్లకు అనుమతులివ్వబోమని ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ టికెవి సత్యనారాయణ తెలిపారు. కౌన్సెలింగ్ పూర్తయిన తరువాత కళాశాలల వారీగా యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాలు పరిశీలిస్తామన్నారు. డొనేషన్ల వసూలుపై విద్యార్థుల నుంచి ఫిర్యాదులుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
విద్యార్థిని చితకబాదిన టీచర్ అరెస్ట్
హౌరా: క్లాసులో మాట్లాడినందుకు ఎనిమిదో తరగతి విద్యార్థిని టీచర్ ఇనుప చైన్లతో విచక్షణ రహితంగా కొట్టాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అమానుషంగా ప్రవర్తించిన హిందీ టీచర్ జయప్రకాశ్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హౌరాలోని ఓ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో గురువారం ఈ సంఘటన జరిగింది. -
ఎల్కెజి విద్యార్ధిని చితకబాదిన టీచర్
-
ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్
తరగతి గదిలో తెలుగు మాట్లాడినందుకు పిల్లలను చితకబాదిన సంఘటనను ఇంకా రాజధాని వాసులు మర్చిపోకముందే కూకట్పల్లి ప్రాంతంలో అలాంటిదే మరో సంఘటన జరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వికాస్ భారతి పాఠశాలలో హోంవర్క్ చేయలేదని ఎల్కేజీ చదువుతున్న ఓ విద్యార్థిని టీచర్ చితకబాదేశారు. దాంతో ఆ చిన్నారికి కంటిమీద గాయం అయ్యింది. ముందురోజు ఇచ్చిన హోం వర్కును ఎందుకు చేయలేదంటూ టీచర్ కొట్టినట్లు విద్యార్థి, ఇతర విద్యార్థులు కూడా చెప్పారు. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలను ఇలా గాయాలయ్యేలా కొడతారా అంటూ విద్యార్థి తల్లిదండ్రులు, మరికొందరు వికాస్ భారతి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. -
ప్రాథమిక పాఠశాలల్లో 70 మంది టీచర్ల డుమ్మా
ప్రభుత్వ పాఠశాలలంటే విద్యార్థులకే కాదు.. ఉపాధ్యాయులకూ అలుసే. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 70 మంది ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా విద్యాశాఖ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో ఈ విషయం వెల్లడైంది. విద్యా శాఖాధికారులు శుక్రవారం నాడు తనిఖీలు నిర్వహించగా, 70 మంది ఉపాధ్యాయులు తమ విధులకు డుమ్మా కొట్టినట్లు తేలింది. వాళ్లందరికీ ఒక రోజు వేతనం కట్ చేస్తామని డీఈవో కేకే సింగ్ విలేకరులకు తెలిపారు. మరోసారి ఇలా విధులకు డుమ్మా కొడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోక తప్పదని టీచర్లను గట్టిగా హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. -
పెద్దల సమక్షంలో పెళ్లి... అయింది పెద్ద లొల్లి!
మండలంలోని ఇప్పలవలస గ్రామానికి చెంది న ఉపాధ్యాయుడు కొండపల్లి సత్యనారాయణ, అదే గ్రామానికి చెందిన చింత కల్యాణి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కల్యాణి కొంతకాలంగా ఒత్తిడి చేస్తోంది. ఇదిగో.. అదిగో అంటూ సత్యనారాయణ వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. దీంతో కల్యాణి బుధవారం ఆండ్ర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై పిసిని నారాయణరావు.. సత్యనారాయణను స్టేషన్కు రప్పిం చి కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరకు కల్యాణిని పెళ్లి చేసుకోవడానికి సత్యనారాయణ అంగీకరించాడు. అదే రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో మెంటాడ లో ఉన్న శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇప్పలవలస ఎంపీటీసీ సభ్యుడు చింత కాశీనాయుడు, కొండలింగాలవలస మాజీ సర్పంచ్ ఎస్.తిరుపతి, పలువురు గ్రామ పెద్దల సమక్షంలో ఇరువురికీ వివాహం జరిపించారు. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉం ది. సినిమా స్టోరీ మాదిరి అంతా ఉత్కంఠగానే సాగిం ది. ప్రేమకథ మాదిరి ప్రశాంతంగా ముగిసిందని అంతా భావించారు. మరి సినిమా స్టోరీ అంటే ఆ మాత్రం ట్విస్ట్లు ఉండాలి కదా..! ఈ కథకూ అలాంటి ట్విస్ట్ లభించింది. అది ఎలా అంటే... ఇది వరకే తనను వివాహం చేసుకున్నాడంటూ... ఈ కథలోకి తాజాగా ఓ ఉపాధ్యాయిని ప్రత్యక్షమైంది. గత మే నెల 1వ తేదీన విజయనగరంలోని నూకాలమ్మ ఆలయంలో ఉపాధ్యాయుడు సత్యనారాయణ తనను వివాహం చేసుకున్నాడంటూ మండలంలోని పోరాం గ్రామానికి చెందిన ఉపాధ్యాయిని నిమ్మకాయల వెంకటమ్మ గురువారం విజయనగరం లీగల్ సెల్లో ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో తాము తీయించుకున్న ఫొటోలను ఆధారాలుగా ఆమె చూపించారు. సత్యనారాయణ తల్లిదండ్రులు నూతనంగా ఇల్లు నిర్మించుకోవడానికి ఈ నెల 18న భూమి పూజ చేశారని, ఆ కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నానని తెలిపింది. ఇంటి స్థలం కూడా తన పేరు మీదే ఉందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తన భర్త సత్యనారాయణకు కల్యాణిని ఇచ్చి గ్రామ పెద్దలు బలవంతంగా వివాహం చేశారని తెలిపింది. తనపైన, తన భర్తపైన లేనిపోని ఆరోపణలు చేసి, కల్యాణి మోసం చేసిందని ఆరోపించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కదిలిన డీఎస్పీ.. విజయనగరం ఎస్పీ ఆదేశాల మేరకు బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహమ్మద్ శుక్రవారం ఆండ్ర పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయురాలు వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వెంకటమ్మ, కల్యాణిల నుంచి వివరాలు సేకరించామని తెలిపారు. ఇంకా విచారణ చేయాల్సి ఉందని చెప్పారు. విచార ణ పూర్తయ్యూక నివేదికను ఎస్పీకి అందిస్తామని తెలిపారు. ఆయన వెంట గజపతి నగరం సీఐ చంద్రశేఖరరావు, ఆండ్ర ఎస్సై పిసిని నారాయణరావు ఉన్నారు. -
స్కూల్ టీచర్ పై సెక్యూరిటీ గార్డు అత్యాచారం
జైపూర్:మానవ మృగాల ఆకృత్యాలకు హద్దూ అదుపు లేకుండా పోతుంది. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా కామాంధుల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ స్కూల్ టీచర్ పై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడిన ఘటన జైపూర్ లో కలకలం స్పష్టించింది. జాబ్ ప్లేస్ మెంట్ ద్వారా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నగుర్జార్.. అతనికి బాగా పరిచయం ఉన్న 22 ఏళ్ల యువతికి కాలేజీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. ఈ క్రమంలోనే ఆమెను కాలేజ్ యజమానికి పరిచయం చేస్తానని చెప్పి ఓ హోటల్ కు తీసువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు గుర్జాను మల్వీయా నగర్ లో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే చిన్నారి విద్యార్థిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ దారుణ సంఘటన ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో చోటు చేసుకుంది. చదువుకునేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థిపై అత్యాచారం చేశారు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఆ చిన్నారి బాలిక జరిగిన విషయాన్ని తన సంరక్షకులకు వెల్లడించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అనసూయ ప్రసాద్ తీవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా అనసూయ ప్రసాద్ను గురువారం అరెస్ట్ చేసినట్లు కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు విధించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు నాలుగో తరగతి చదువుతుందని పోలీసులు వెల్లడించారు. -
మానవ మృగం
కడప కార్పొరేషన్/ చింతకొమ్మదిన్నె, న్యూస్లైన్ : దైవం పట్ల భయభక్తులు పెంపొందించాల్సిన పాఠశాల ఉపాధ్యాయుడు కామాంధుడయ్యాడు. పదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఏడునెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నా పాఠశాల యాజమాన్యం గుర్తించలేదు. శుక్రవారం బయటపడ్డాక అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకునే యత్నం చేసింది. వివరాలిలా ఉన్నాయి. కడప నగర శివార్లలోని శాటిలైట్ టౌన్షిప్కు చెందిన రహమతుల్లాఖాన్, యాస్మిన్ దంపతులకు ఇద్దరు కుమారులు. వారిరువురిని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలేటిపల్లె సమీపంలోని పాఠశాలలో చేర్చారు. వీరిలో పెద్ద పిల్లాడిపై ముక్రం అనే ఉపాధ్యాయుడు ఏడు మాసాలుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విషయం గుర్తించిన అతని తమ్ముడు తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటికి పొక్కింది. దీన్ని బయటికి రాకుండా చేసేందుకు పాఠశాల పెద్దలు శతవిధాల ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. చివరికి వారే అత్యాచారానికి పాల్పడిన ముక్రంను పోలీసుస్టేషన్లో అప్పగించారు. బయటకు చెప్పొద్దని డబ్బులు ఇవ్వబోయారు మా అబ్బాయిని ముక్రం అనే అతను లోపలికి రమ్మని పిలిచి ముద్దులు పెట్టేవాడట.. గుడ్డలు ఊడదీసి, నూనె పట్టించి లైంగిక దాడి చేసేవాడు. ఏడు నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నా మదరసా వారు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని బయటికి చెప్పొద్దని మాకు డబ్బులు ఇవ్వబోయారు. - రహమతుల్లాఖాన్, యాస్మిన్, బాలుడి తల్లిదండ్రులు కేసు నమోదు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లైంగిక దాడికి పాల్పడిన ముక్రంతోపాటు పాఠశాల యాజమాన్యంపై సీకే దిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.