- ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టిన ఉపాధ్యాయ సంఘాలు
- తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన15 వేల మంది ఉపాధ్యాయులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారుు. ఈ ధర్నాలో 20 రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్)కు చెందిన సుమారు 15 వేల మంది ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ జనరల్ సెక్రటరీ సీఎన్. భారతి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పీఎఫ్ఆర్డీఏను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్ నుంచి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, వై. శ్రీనివాసులు రెడ్డి, డా.ఎం.గేయానంద్, ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు పాల్గొని సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ. వెంకటేశ్వరరావు, పి. బాబురెడ్డి ప్రసంగిస్తూ.. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
పాత పెన్షన్ విధానం ప్రకారం ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఎంత జీతం ఉందో.. అందులో సగం ఉద్యోగ విరమణ తరువాత పెన్షన్గా వచ్చేదన్నారు. అరుుతే సీపీఎస్ అమలు వల్ల ఆ పెన్షన్ రాకుండా పోతోందన్నారు. 12 ఏళ్లుగా అమలవుతున్న ఈ విధానం.. దేశంలో 40 లక్షల మంది ఉపాధ్యాయుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిందని యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. రవి పేర్కొన్నారు. ఈ ధర్నాలో ఎస్టీఎఫ్ఐ అధ్యక్షుడు అబిజిత్ ముఖర్జీ, సంఘం నేతలు ఎన్.నారాయణ, కేసీ. హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
Published Wed, Nov 30 2016 12:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement