విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే కిడ్నాపర్ అవతారమెత్తాడు.
బండి: విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే కిడ్నాపర్ అవతారమెత్తాడు. రాజస్థాన్లోని నైన్వాల్ పట్టణంలో ప్రైవేట్ స్కూట్ టీచర్ బాదల్ మహావర్ (28).. తన దగ్గర చదువుకునే 14 ఏళ్ల విద్యార్థిని అపహరించాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత మార్చి 10న టీచర్ విద్యార్థిని అపహరించాడు. అప్పటినుంచి టీచర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు.